పంట ఉత్పత్తుల విలువ పెంపుపై దృష్టి

తెలంగాణలో వరి, పత్తి వంటి ప్రధాన పంటల స్థానంలో చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, నూనె గింజల అధికోత్పత్తిని సాధించడం, ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఎగుమతి అవకాశాల పెంపుదలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. వ్యవసాయంలో కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతకు పెద్దపీట వేస్తామని తెలిపింది. కలెక్టర్ల సదస్సులో ఆ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్ౘ్ారు. “వరి ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. పత్తి సాగు అధికమే. కేంద్రీకృత పంటల విధానం సమస్యాత్మకంగా ఉంది. దాని స్థానంలో వైవిధ్యీకరణను, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తాం. బియ్యం, నూనెగింజలు, పండ్లు, కూరగాయల శుద్ధి ద్వారా పంట ఉత్పత్తులకు విలువల పెంపుపై దృష్టి పెట్టాం. ఫార్మ్ టు ఫోర్క్ నినాదంతో బియ్యం, మాంసం, చేపలు, మామిడి పండ్ల ఎగుమతులకు ఊతమిస్తాం. సహజ సాగు విస్తీర్ణం పెంచుతాం. 99 రోజుల ప్రణాళికలో.. రాబోయే 30 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలు, విత్తన నిల్వల పంపిణీ పూర్తి చేస్తాం. 60 రోజులలోపు సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులను విస్తరిస్తాం. మూడు నెలల లోపు ప్రాసెసింగ్ యూనిట్లకు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలు పూర్తి చేస్తాం” అని వివరించారు.

Read More

అగ్రివర్సిటీలో మార్చి 8, 9 తేదీలలో మెగా రైతు మేళా

ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్ౙాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 9 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దీనిని ప్రారంభిస్తారు. వ్యవసాయరంగంలో మహిళా రైతుల సాధికారత, భూసార పరి రక్షణ, సేంద్రియ వ్యవసాయం, పంటల మార్పిడి, ఆధునిక సాంకేతికత వినియోగం, వ్యవసాయానుబంధ రంగాల బలోపేతం తదితర అంశాలపై చర్చతోపాటు ప్రదర్శన నిర్వహిస్తామని విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. మేళాలో ఉత్తమ మహిళా రైతులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

Read More

విత్తనోత్పత్తి క్షేత్రాలను రక్షించాలి

తెలంగాణాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాలను రక్షించాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో 8 చోట్ల 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్స్ ద్వారా గతంలో వివిధ రకాల విత్తనోత్పత్తి జరిగేది. కానీ గత కొన్నేళ్లుగా ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు కమిషన్ తన నివేదికలో వివరించింది. ఇవాళ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్, గోపాల్ రెడ్డి.. సీడ్ ఫార్మ్స్ భూములపై రిపోర్ట్‌ను అందజేశారు. గత నెలలో కమిషన్ కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సమయంలో మాల్తుమ్మెదలో 700 ఎకరాలకుపైగా వున్న సీడ్ ఫార్మ్ అన్యాక్రాంతం అయ్యే స్థితిలో ఉన్నట్లు అక్కడి స్థానిక రైతులు కమిషన్ దృష్టికి తెచ్చారని, వెంటనే కమిషన్ ఆ స్థలాన్ని పరిశీలించినట్లు సీఎస్‌కు వివరించారు. సీడ్ ఫార్మ్స్‌పై ఈనెల 2న కమిషన్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో కమిషన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో మిగతా చోట్ల కూడా విత్తనోత్పత్తి క్షేత్రాల భూములు ఆగమౌతున్నట్లు కమిషన్ గుర్తించింది. అంతేకాదు భూ భారతిలో కొన్ని చోట్ల భూములు ఎక్కకపోవడంపై సీరియస్ అయ్యింది. ఈ విషయాలని సైతం ఇవాళ సీఎస్ రామకృష్ణారావుకు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్ రెడ్డి, సునీల్ వివరించారు. వెంటనే ఆ భూములను కాపాడాలని, ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరింది.

Read More

రెండు మూడు నెలలు ముందుకు ఖరీఫ్ సాగు

అన్ని రిజర్వాయర్లలో నీరు అందుబాటులో ఉందని, ముందస్తు సాగు చేస్తే తుపాన్ల నుంచి తప్పించుకోవచ్చని, ఖరీఫ్ సీజన్‌ను రెండు, మూడు నెలలు ముందుకు తెస్తున్నామని, దీనిపై రైతులకు శాసనసభ్యులు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలివీ.. “క్లస్టర్ బేస్డ్ విధానంలో ఉద్యానపంటల సాగుకు ముందుకెళ్తున్నాం. వివిధ పంటల సాగుకు అనుగుణంగా జిల్లాలను క్లస్టర్లుగా విభజించి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. వ్యవసాయం నుంచి ఉద్యానసాగు వైపు రైతులు మళ్లితే లాభాలొస్తాయి. ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు గతంలో ఇచ్చినట్లే డ్రిప్‌లు, స్ప్రింక్లర్లను రాయితీపై అందిస్తాం. గతేడాది వ్యవసాయ యాంత్రీకరణకు రూ.61 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది రూ.137 కోట్లు కేటాయించాం అని అన్నారు.

Read More

రసాయన రహిత మొక్కల పెరుగుదలకు పరిశోధనలు జరగాలి

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ (ఎన్ఎస్ఐపీ హెచ్ఎం) ఆధ్వర్యంలో ‘స్థిర వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి మొక్కల ఆరోగ్య నిర్వహణలో ఆవిష్కరణలు’ అనే అంశంపై జాతీయ సదస్సు గురువారం ప్రారంభమయింది. ఎన్ఐపీ హెచ్ఎం డైరెక్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్, ఐకార్ ఏడీజీ పూనం జస్రోరియా, సలహాదారు జేపీ సింగ్, మాజీ వీసీ ఎన్.పురి, మొక్కల సంరక్షణ సంస్థ అధ్యక్షుడు శరత్ బాబు, ఎంటమాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎకలాజికల్ సొసైటీ, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీర్స్, ఇండియన్ ఫైటోపాథాలజికల్ సొసైటీల శాస్త్రవేత్తలు, అధికారులు, అగ్రి-టెక్ ఆవిష్కర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్సింగ్, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రసాయనాల వాడకం వల్ల వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఇది మొక్కల సహజ ఎదుగుదలను దెబ్బతీస్తోందని, పంట ఉత్పత్తుల ఎగుమతులకు విఘాతం కలుగుతోందని తెలిపారు. సహజ విధానాల్లో సాగు ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని, రసాయన రహిత మొక్కల పెరుగుదల కోసం విస్తృత పరిశోధనలు జరగాలని అన్నారు. అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు రావాలని.. ఇందుకు శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఒక తాటిపైకి రావాలన్నారు. సహజ విధానాల్లో సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వాలని, జీవ ఎరువులు అందుబాటులోకి తేవాలని, మొక్కల ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

Read More

వచ్చే ఖరీఫ్ లో ఎల్ నినో ప్రభావం

సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఎల్నినో కారణంగా వచ్చే ఖరీఫ్ లో నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఆదేశించింది. ఎల్నినో పరిస్థితుల్ని అంచనా వేసి, అందుకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దీనిపై అధికారులతో చర్చించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు సన్నద్ధంగా ఉండాలని, రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సాగుపై సూచనలు చేయాలని ఆదేశించారు. అయితే దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఏప్రిల్లో రుతుపవనాలపై ఐఎండీ నివేదిక విడుదల చేయనుంది.
మే నుంచి జులై మధ్య లేదా ఆగస్టులో ఎల్నినో వచ్చే అవకాశం 50% నుంచి 61% పైనే ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అక్టోబరు వరకూ ఇది కొనసాగొచ్చని చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరంగా సున్నిత రాష్ట్రం. వర్షాలపై ఆధారపడి అధిక శాతం పంటలు సాగవుతాయి. ఎలి నినో ఏర్పడితే రుతుపవనాలు బలహీనపడతాయి. ఫలితంగా వర్షపాతం తగ్గుతుంది. పొడికాలాలు పెరుగుతాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వర్షాధార పంటల ఉత్పత్తి తగ్గుతుంది. సూక్ష్మసేద్యం ద్వారా ఉద్యాన రైతులు కొంతమేర బయటపడొచ్చు.

Read More

రైతులు, కూలీల అనుసంధానించడానికి ఫోన్ నెం.

రైతులను, కూలీలను సులువుగా అనుసంధానించడానికి వినూత్న పరిష్కారం చూపించారు కడియాల ధనేష్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన ధనేష్ వాట్సప్ బ్లూ కనెక్ట్ పేరుతో చాట్ బాట్‌ను రూపొందించారు. దీనిని ఉపయోగించాలంటే ముందుగా 6281685487 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. వాట్సప్ చాట్ నంబర్ ఓపెన్ చేయగానే బ్లూ కనెక్ట్ చాట్‌బాట్ ఆహ్వానం పలుకుతుంది. హాయ్ అని పెట్టగానే పని ఇవ్వాలనుకుంటున్నారా (రైతు) లేదా పని కోరుతున్నారా (కార్మికుడు) అని అడుగుతుంది. ఎంపికకు అనుగుణంగా తెలుగులోనే ప్రశ్నలు వరుసగా వస్తాయి. వాటికి సమాధానాలు ఇస్తే మనకు కావాల్సిన వారితో అనుసంధానం చేస్తుంది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా రైతులు తమకు పది కి.మీ. పరిధిలో పనులకు అందుబాటులో ఉన్న కూలీలను సంప్రదించవచ్ౘ్ు. ఈ చాట్‌బాట్‌లోనే వాతావరణ, ప్రభుత్వ పథకాల సమాచారమూ అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యమని ధనేష్ తెలిపారు.

త్వరలోనే మరిన్ని గ్రామాలకు బ్లూ కనెక్ట్ రూపకర్త ధనేష్ 2023లో మెకానికల్ సబ్ౙెక్ట్‌లో బీటెక్ పూర్తిచేశారు. అప్పటి నుంచి చిన్న, చిన్న ఉద్యోగాలు చేసి కొంత నగదు కూడబెట్టారు. ప్రస్తుతం ఆ నగదుతోనే ఇలాంటి వాట్సప్ చాట్‌బాట్‌లు రూపొందిస్తున్నారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్-2026లో సోషల్ ఇంపాక్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో బ్లూ కనెక్ట్ ప్రాజెక్టుకు అవార్డునూ అందుకున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ చాట్‌బాట్‌ను భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు విస్తరించాలనేది తన లక్ష్యమని ధనేష్ చెప్పారు.

Read More

కూరగాయపంటలకు తెగుళ్ళ బెడద ఎక్కువగా ఉంటుంది

కూరగాయ పంటలకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటోందని.. రైతులు అప్రమత్తంగా ఉంటూ.. వాటి నివారణకు కృషి చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించారు. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ కూరగాయల పరిశోధన కేంద్రంలో ‘అఖిల భారత సమన్వయ పథకం’ 44వ వార్షిక సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, ఐకార్ ఏడీజీ సుధాకర్ పాండే, వారణాసి భారతీయ కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్‌కుమార్, బెంగళూరులోని ఐఐహెచఆర్ డైరెక్టర్ టీకే బెహరా, ఎన్‌బీపీజీఆర్ డైరెక్టర్ జీపీ సింగ్, ఎనఐఆర్‌సీఏ డైరెక్టర్ శేషు మాధవ్, మాజీ వీసీ లావాండే, ఇతర శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు.

Read More

కూరగాయల సాగుపై 800 మంది రైతులకు శిక్షణ

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి రైతులకు ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా శిక్షణ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగును పెద్దఎత్తున పెంచుతామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో.. కూరగాయల పంటలపై అఖిలభారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్‌లో భాగంగా తెలంగాణలో ఉద్యాన రంగాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగు.. లక్ష ఎకరాలకు పడిపోయిందని, వెంటనే ఈ విస్తీర్ణం పెరగాలన్నారు. విశ్వవిద్యాలయానికి మిరప, ఔషధ మొక్కల ఏఐసీఆర్పీ కేంద్రాలను మంజూరు చేయాలని ఆయన ఐకార్‌ను కోరారు. సమావేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుధాకర్ పాండే, భారత కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ రాజేశ్‌కుమార్, దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read More

రైతుకు మేలు చేసే గొల్లభామ

పురుగు మందుల వాడకం పెరగడం వల్ల అంతరించిపోతన్న గొల్లభామ (మిడత) అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కనిపించింది. దీని శాస్త్రీయనామం మాంటెడ అని.. దాని ముందరి కాళ్లు ప్రార్థన చేస్తున్నట్లు ఉండటంతో ‘ప్రేయింగ్ మాంటిస’ అని పిలుస్తారని అనకాపల్లి వ్యవసాయ సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ తెలిపారు. పంటలకు చీడపీడలు కలిగించే పురుగులను తినడం ద్వారా పరోక్షంగా అన్నదాతలకు సాయపడతాయన్నారు. గొల్లభామలు సాధారణంగా పచ్ౘ్రంగులో ఉంటాయని, ఇవి మాత్రం పరిసరాలు ఎలా ఉంటే ఆ రంగులో కలిసిపోతాయన్నారు.

Read More