ఆంధ్రా రైస్‌మాన్‌గా పేరొందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. పాలడుగు సత్యనారాయణ ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ (ఇంఛార్జి)గా నియమితులయ్యారు. ప్రస్తుతం వీరు వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులుగా పనిచేస్తూ ఉన్నారు. వీరు 1983 బ్యాచ్ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి. వీరి కృషితో 40కు పైగా అధిక దిగుబడినిచ్చే రకాలు వరి పంటలో రావటం జరిగింది. దేశంలో దాదాపు 7 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో వీరు అభివృద్ధి చేసిన వంగడాలు సాగులో ఉండటం వీరి ప్రత్యేకత. వీరికి డా. ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారంతో పాటు 2012లో రైతునేస్తం పురస్కారం, మరెన్నో ఇతర పురస్కారాలు లభించాయి. వీరి మార్గదర్శనంలో విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని, రైతుల హృదయ స్పందన కావాలని, ఆ ప్రయత్నంలో విజయవంతం కావాలనీ మనఃపూర్వకముగా ‘రైతునేస్తం’ కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తోంది.