తెలంగాణాలో ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు అంగీకరించకపోయినా అధికారులు, రైతు సంఘ ప్రతినిధులు పట్టుబట్టడంతో ఆయిల్పామ్ ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్- నూనె దిగుమతి శాతం) 20.01 శాతానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్లో వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గెలల నుంచి వచ్చే నూనె దిగుమతిపై 20.01 శాతం, గింజల బరువుపై 10.08 శాతం ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో టీజీ ఆయిల్ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ, ఉద్యానశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా, సంయుక్త సంచాలకులు సరోజ, ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి, రైతు సంఘ ప్రతినిధులు ఆలపాటి రామచంద్రప్రసాద్, మహేశ్, బండి భాస్కర్, ప్రభాకరవర్మ, జ్యోత్స్న పలువురు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గెలలు, గింజలపై నుంచే కాక.. కెర్నల్ ఆయిల్పై కూడా రైతులకు వాటా చెల్లించాలని రైతు సంఘం ప్రతినిధులు అధికారులను కోరారు. నూతన ఓఈఆర్ 20.01 శాతం 2025 నవంబరు 1 నుంచి.. 2026 అక్టోబరు 31 క వరకు అమలులో ఉంటుందని, ఈ రేటు దేశంలోనే అత్యధికమని టీజీ ఆయిల్ ఫెడ్ జీఎం సుధాకర్రెడ్డి తెలిపారు.

27 Nov, 2025
