నేల ఆరోగ్యం ఉద్యాన పంటల ద్వారానే పరిరక్షించబడుతుంది. కాబట్టి తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యానవన పంటలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ఉద్యాన కళాశాలలో ‘నేల ఆరోగ్య పరిరక్షణ- ప్రకృతి వ్యవసాయం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మృత్తిక శాస్త్రవేత్త, ఐకార్ ప్రదర్శన శాస్త్రవేత్త బ్రజేంద్ర పర్మార్ ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

5 May, 2026
