మినుములో సకాలంలో సస్యరక్షణతో అధిక దిగుబడులు

ఆంధ్రప్రదేశ్‌లో మినుమును అన్ని కాలాల్లో ఏటా 10.02 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ 4.25 లక్షల టన్నుల దిగుబడి చేస్తున్నారు. ఈ సంవత్సరం లోటు వర్షపాతం కారణంగా రబీ కాలం మినుము పంట సాగు ఆలస్యం అవుతుంది. పంట వేశాక లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత వలన రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా వైరస్‌ తెగుళ్ళు అయినటువంటి పల్లాకు తెగులు, మొవ్వు కుళ్ళు తెగులు మరియు బొబ్బర తెగులు పంటను ఆశించడానికి అనుకూల వాతావరణం ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని మినుము పంటలో సమగ్ర సస్యరక్షణ పద్దతులను తెలుసుకొని ముందు నుంచి తగిన చర్యలు చేపట్టి అధిక దిగుబడిని పొందవచ్చు.

మినుము పంటను ఆశించు పురుగులు – వాటి నివారణ చర్యలు

1. చిత్త పురుగులు ( Flee Beetles):

  • పైరు రెండు ఆకుల థలో ఉన్నప్పుడు ఈ పురుగులు పంటను ఆశిస్తాయి.
  • ఆకుల అడుగు భాగము నుంచి తినడం వలన చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతాయి. 

2. మారుక మచ్చల పురుగు:

  • పంట పూత, పిందే థలో ఉన్నప్పుడు ఈ పురుగు పంటను ఆశిస్తుంది.
  • పూత థలో పూలన్నీ గూడు చేసుకొని లోపల ఉంటూ లోపలి పదార్థాలను తింటాది.
  • కాయ థలో కాయలన్నీ గూడు చేసి కాయలను రంధ్రం చేసుకొని లోపలి గింజలను తింటాది.

నివారణ చర్యలు: పంట పూమొగ్గ థలో 5 మి.లీ వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన తల్లి పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు, అంతేగాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగలి చనిపోతాయి. 

3. పొగాకు లద్దె పురుగు:

  • పిల్ల పురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు తెల్లగా జల్లెడ లాగ మారిపోతాయి.
  • గొంగళి పురుగులు ఆకులని రంద్రాలు చేసి పువ్వులను, పిందెలను తినడం ద్వారా పంట నష్టం వాటిల్లుతుంది.

పొగాకు లద్దె పురుగు నివారణ చర్యలు:

  • గుడ్ల సమూహము, మొదటి థ పిల్ల పురుగులు ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. 
  • పురుగు ఉదృతి గమనించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి.
  • ఆముదం పంటను ఎర పంటగా ఎకరాకు 50-100 మొక్కల చొప్పున వేసుకోవాలి. లద్దె పురుగులు ఆశించిన ఆముదం మొక్కలను నాశనం చేయాలి.
  • లద్దె పురుగులు నివారణకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. 

4. తామర పురుగు:

  • తామర పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి.
  • ఇవి మోవ్వుకుళ్లు మరియు ఆకు ముడత తెగులు కలుగచేసే వైరస్‌కి వాహకంగా ఉంటూ తెగులును వ్యాపింప చేస్తాయి.

5. తెల్లదోమ:

దీ ఆకుల నుంచి రసాన్ని పీల్చే ఈ తెల్ల దోమ పల్లాకు తెగులు కలుగ చేసే వైరస్‌కు వాహకంగా ఉంటూ పల్లాకు తెగులు వ్యాప్తికి దోహద పడుతుంది.

మినుము పంటను ఆశించు తెగుళ్ళు – వాటి నివారణ చర్యలు

1. పల్లాకు తెగులు:

  • మొదటగా తెగులు సోకిన ఆకులపైన చిన్నని లేత పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. క్రమేణా ఈ మచ్చలు పెద్దవిగా అయిపోయి ఆకు అంతా పసుపు రంగులోకి మారిపోతుంది.
  • తొలి థలోనే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పైరు మొత్తం పసుపురంగులోకి మారి పూత మరియు పిందే ఏర్పడకుండా ఆకులు వాడిపోయి ఎండి రాలిపోతాయి. 
  • పంటను పూత మరియు పిందె థలో ఈ తెగులు ఆశిస్తే మొక్క తక్కువ పూతను కలిగిఉండి కాయలు పసుపురంగులోకి మారి వంకరలుగా తిరిగి గింజలు లేకుండా తాలు కాయలుగా మారిపోతాయి.
  • బెమీసియ టబాసి అనే తెల్లదోమ వైరస్‌ వాహకంగా ఉంటూ తెగులు సోకిన కలుపు మొక్కలు మరియు ఇతర పంటల నుంచి మినుము పంటకు వ్యాపింపచేసి తీవ్ర నష్టాన్ని కలుగచేస్తాది. 

యాజమాన్యం: 

  • పల్లాకు తెగులును తట్టుకొనే TBG104, PU31, LBG787, LBG904, VBN8 రకాలు సాగు చేసుకోవాలి.
  • పంటను విత్తుకొనే ఒక రోజు ముందు విత్తన శుద్ధి చేస్తే పంట తొలి థలో వైరస్‌ ను వ్యాపింపచేసే తెల్లదోమ బారి నుండి కాపాడవచ్చు.
  • ఎకరాకు 15 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చాలి.
  • తెగులు సోకిన మొక్కలను మరియు కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి.
  • వైరస్‌కు ఎలాంటి మందులు లేవుకావున వైరస్‌ వాహకం అయినటువంటి తెల్లదోమను నివారించాలి. 

2. ఆకుముడత, మొవ్వుకుళ్ళు తెగులు:

  • ఈ తెగులు లక్షణాలు ఆకుల ఈనెలు, కాండం మరియు మొవ్వుల మీద గమనించవచ్చు.
  • తెగులు సోకిన మొక్కలోని ఆకుల అడుగుభాగంలో ఈనెలు క్షీణించడం ద్వారా ఎరుపు/గోధుమ రంగులో మారిపోయి క్రమేణా ఆకుల తొడిమలకు మరియు కాండంకు వ్యాపిస్తుంది. 
  • తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు వెనుకకు ముడుచుకుపోయి రాలిపోవడం జరుగుతుంది. 
  • తొలి థలోనే ఈ తెగులు ఆశిస్తే మొక్కల తలలు మాడిపోయి గిడసబారి ఎండిపోతాయి. 
  • ఈ తెగులు పంట ముదురు థలో ఆశిస్తే తక్కువ కాయలను కలిగిఉండి కాయలు క్షీణించి దిగుబడి తగ్గుతుంది.
  • ఈ వైరస్‌లు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు తామరపురుగుల ద్వారా వ్యాపిస్తాయి.     

యాజమాన్యం 

  • పొలం గట్ల మీద మరియు పంటపొలంలో కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామను పీకి తగలపెట్టాలి.
  • ఎకరాకు 15 నీలం రంగు జిగురు అట్టలు అమర్చాలి.  

3. సీతాఫలం తెగులు / బొబ్బర తెగులు

  • తెగులు ఆశించిన మొక్కలలో ఆకులు పెద్దవిగా అయిపోయి ఆకులపై ఉబ్బెత్తుగా అయి మడతలు పడుతాయి ఇవి చూడటానికి సీతాఫలం కాయలాగా అగుపిస్తాయి కావున దీనిని సీతాఫలం తెగులు అంటారు. 
  • ముదురు ఆకులలో ఈ ముడతలు ఎక్కువగా ఉండి ఆకు మందంగా తయారవుతాది. 
  • తెగులు సోకిన మొక్కలలో పూత ఆలస్యంగా వచ్చి పూల మొగ్గలు చిన్నవిగా ఉండి కాయలు ఏర్పడవు.
  • పెనుబంక, తెల్ల దోమల ద్వారా తెగులు సోకిన మొక్కల నుంచి ఆరోగ్యకరమైన మొక్కలకు వ్యాపింప చేస్తుంది. 

యాజమాన్యం: ఈ తెగులు ఎక్కువగా విత్తనం ద్వారా వ్యాపిస్తుంది కావున ఆరోగ్యకరమైన వైరస్‌ లేని మొక్కల నుంచి సేకరించిన విత్తనాన్ని ఎంచుకొని విత్తుకోవాలి 

వైరస్‌ తెగుళ్ళు సమగ్ర సస్యరక్షణ:

  • ఈ ముడురకాల వైరస్‌ తెగుళ్ళు రసం పీల్చు పురుగులు అనగా తెల్లదోమ, తామరపురుగు మరియు పెనుబంక ద్వారా వ్యాపిస్తాయి కావున వీటిని నివారిస్తే వైరస్‌ తెగుళ్ళును నివారించగలము.
  • రసం పీల్చు పురుగుల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. 
  • పొలం లోపల మరియు గట్లమీద కలుపుమొక్కలు పీకి తగలబెట్టాలి.
  • వైరస్‌ తెగులు సోకిన మొక్కలను పెరికేసి తప్పనిసరిగా కాల్చివేయాలి.
  • దీ పొలం చుట్టూ మొక్కజొన్న కాని జొన్న కాని లేదా సజ్జలను నాలుగు వరుసలలో రక్షణ పంటగా వేసుకుంటే రసంపీల్చే పురుగులను పంటలోపలికి రాకుండా నివారించవచ్చు.
  • ఒక ఎకరా పొలంలో కనీసం 15 చొప్పున పసుపు, నీలం మరియు తెలుపు రంగు జిగురు అట్టలను అమర్చితే రసం పీల్చే పురుగులను కొంతవరకు నివారించవచ్చు మరియు వాటి ఉధృతిని అంచనావేసి రసాయనిక మందులను పిచికారి చేయవచ్చు.
  • విత్తిన 20 రోజులకు 5 మీ.లీ. వేపనూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు పంటను ఆశించకుండా నివారించవచ్చు మరియు ఆప్పటికే పంటలో ఉన్న గ్రుడ్లును నాశనం చేయవచ్చు.  

4. సర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు 

  • తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి.
  • అనుకూల వాతావరణ పరిస్థితులలో అనగా గాలిలో అదిక తేమ శాతం, అధిక వర్షాలు, అధిక మొక్కల సాంద్రత ఉన్నప్పుడు చిన్న మచ్చలు కలిసిపోయి పెద్దవిగా మారి మచ్చల అంచులు ముదురు గోధుమరంగులో, మచ్చ లోపలి భాగం తెలుపు రంగులో మారిపోతాయి.
  • తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఎండి రాలిపోతాయి.  

5. కొరినోస్పోరా ఆకు మచ్చ తెగులు

  • పూతథలో ఆకులపైన చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడుతాయి. 
  • అవి క్రమేణా పెద్దవిగా మారి మచ్చలోపలి భాగం కుళ్లిపోయి రంధ్రాలుగా మారుతాయి, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఎండి రాలిపోతాయి.   

6. బూడిద తెగులు:

  • గాలిలో అధిక తేమ శాతం, మబ్బులతో కూడిన వాతావరణం గల రబీ సీజన్‌లో బూడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటది.
  • విత్తిన 30-35 రోజులలో ముదురు ఆకుల పైభాగాన చిన్నని బూడిద వంటి తెలుపు మచ్చలు ఏర్పడి క్రమేణ పెద్దవిగా మారి ఆకు అడుగుభాగాన, కొమ్మలు మరియు కాయలను వ్యాపిస్తాయి. 
  • తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు అంతా తెలుపురంగు బూడిదతో కప్పబడి క్రమేణా పసుపు రంగులోకి మారి ఆకులన్నీ రాలిపోతాయి.

గమనిక: మినుము పంటను ఆశించే వివిధ రకాల చీడపీడలు, తెగుళ్ళ నివారణకు సరైన చర్యలు చేపట్టి నివారించుకోవాలి.

డా. డి. విజయ్‌ కుమార్‌ నాయక్‌ ఐఖఐ (సస్యరక్షణ విభాగం); డా. కే. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఐఖఐ (సేద్య విభాగం); డా. ఎస్‌. లోకేష్‌ బాబు ఐఖఐ (విస్తరణ విభాగం); డా. ఆర్‌.సుజాత ఐఖఐ (గృహ విభాగం); హరి సాదు ఐఖఐ (మత్స్య విభాగం); డా. జి.ఎల్‌. శివజ్యోతి, సమన్వయ కర్త, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు. ఫోన్‌ : 99485 42942

Read More

శ్రమించాలి…మార్కెటింగ్‌లో తెలివి చూపాలి

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచంతో పాటు మన దేశంలో కూడా అనేకమంది కరోనాతో అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు. కరోనా బారినపడి ఆరోగ్యాలను చెడగొట్టుకున్నవారు, మరణించిన వారి విషయాలను పక్కన పెడితే చాలామంది కరోనా వలన ఉపాధి కోల్పోయారు. తాము చేస్తున్న ఉద్యోగ, వ్యాపార సమస్యల వలన ఉపాధిని కోల్పోయి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల వైపు అడుగులు వేశారు. కరోనా సమయంలో అన్ని రంగాలు ఆగినా కాని వ్యవసాయ రంగం ఆగలేదు కాబట్టి ఎలాంటి విపత్తులు సంభవించినా కాని ఆగని రంగం వ్యవసాయం అని పరోక్షంగా అర్థం అయ్యింది. అందువలననే చాలామంది వ్యవసాయ రంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇదేకోవకు చెందుతాడు నల్లగొండ జిల్లా, తిరుమలగిరి సాగర్‌ మండలం, ఎర్ర చెరువు తండాకు చెందిన రామావతు బాలకృష్ణ.

బాలకృష్ణది వ్యవసాయ నేపథ్యం. వారి పెద్దలు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ, పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం లాంటివి కొనసాగిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ వ్యవసాయ రంగానికి దూరం జరిగి ఎంటెక్‌ పూర్తి చేసి 2015వ సంవత్సరంలో విప్రో సంస్థలో రేడియో ఫ్రీక్వెన్సీ విభాగంలో ఇంజనీరుగా ఉద్యోగం సంపాయించి అందులో కొనసాగుతున్నాడు. ఉద్యోగంలో సరైన తృప్తి లేకపోవడముతో పాటు సమయ పాలన కూడా సక్రమంగా లేకపోవడం, ఎక్కువ పని గంటలు, రాత్రి పూట కూడా పని చేయవలసిన పరిస్థితులను ఎదుర్కోలేక ఉద్యోగం నుంచి బయటపడాలని ఆలోచించే సమములో కరోనా రావడము జరిగింది. కరోనా వలన ఇంటి వద్దనే కొన్ని రోజులు గడపవలసి వచ్చింది. ఆ సమయములో సొంత పొలంలో పంటల సాగుపై శ్రద్ధ పెట్టి తన స్వయం ఉపాధిగా ఉద్యోగం కంటే వ్యవసాయమే సరైన దారి అని నిర్ణయించుకుని వ్యవసాయంలో అడుగుపెట్టాడు. తన చదువుకు న్యాయం చేకూరాలంటే తోటి రైతులకు భిన్నంగా పంటల సాగు చేయాలనే తలంపుతో సేంద్రియ సాగుపై అవగాహన తెచ్చుకొని తాను పండించే పంటలలో సేంద్రియ సాగు పద్ధతులు అమలు పరచాలని నిర్ణయం తీసుకున్నాడు. సేంద్రియ సాగులో అత్యంత ముఖ్యమైన వనరు అయినటువంటి మన దేశీయ జాతి ఆవులను వేరే వారి నుండి దానంగా పొంది వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం మూడు ఆవులు మరియు మూడు ఎద్దులు కలిపి మొత్తం 6 పశువులను బాలకృష్ణ పోషిస్తున్నాడు.

సేంద్రియ సాగులో బాలకృష్ణకి 4 సంవత్సరాల అనుభవం ఉంది. తన అనుభవంలో మిరప, ప్రత్తి, కంది, పెసర, వేరుశనగ పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పండించాడు. ఇంకా పండిస్తూనే ఉన్నాడు. తన సేంద్రియ సాగు అనుభవంలో ఎకరానికి మిరప 12 క్వింటాళ్లు, ప్రత్తి 8 క్వింటాళ్లు, వేరుశనగ 10 క్వింటాళ్లు, పెసలు 5 క్వింటాళ్లు అధిక దిగుబడిని సాధించాడు. ఈ సంవత్సరమే కంది పంట సాగు మొదలు పెట్టారు. ప్రస్తుతం మిరప ఎకరంన్నరలో, కంది రెండు ఎకరాలలో, ప్రత్తి మూడు ఎకరాలలో సాగులో ఉంది. వీరు సాగు చేసే పంటలకు రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి గొర్ల ఎరువు, ఆవుల ఎరువు మిశ్రమానికి వివిధ రకాల జీవన ఎరువులు, జీవశిలీంద్ర నాశినులు, వేపపిండి, ఆముదపు పిండి లాంటివి కలిపి దుక్కిలో అందిస్తుంటాడు. పంట మార్పిడి తప్పనిసరిగా చేస్తుంటాడు. ఈమెళకువలతో పాటు పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ, ఎలాంటి విష రసాయనాలు అందించకుండా తమ పంటల సాగుని కొనసాగిస్తున్నాడు. 

మిరప: ఎకరంన్నరలో మిరప పంట సాగులో ఉంది. గత నాలుగు సంవత్సరాల నుంచి మిరప పంటను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఎకరంన్నరకు గాను 9093 మరియు సూరజ్‌ రకాలను ఎంపిక చేసుకుని విత్తనాన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసికుని, నారు పోయించాడు. 45 రోజులు పెరిగిన నారుని బీజామృతంలో వేర్లను ముంచి ప్రధాన పొలంలో నాటించాడు. దుక్కిలో 4 ట్రక్కుల పైన పేర్కొన్న ఎరువును అందించాడు. మొక్క నాటిన 20 రోజుల నుంచి ప్రతి 15-20 రోజులకు ఎకరానికి 200 లీటర్లకు తగ్గకుండా ద్రవజీవామృతాన్ని నేలకు అందిస్తుంటాడు. అదేవిధంగా అవకాశాన్ని బట్టి వేస్ట్‌డికంపోజర్‌ ద్రావణాన్ని కూడా పైరుకు అందిస్తుంటాడు. చీడపీడల నివారణకు వేప గింజల కషాయం, అగ్నాస్త్రం, థపర్ణి కషాయం, ఎగ్‌ఎమైనో యాసిడ్‌, ఫిస్‌ ఎమైనోయాసిడ్‌ లాంటివి ఉపయోగిస్తుంటాడు. అవసరాన్ని బట్టి మొలకల ద్రావణాన్ని కూడా సొంతంగా తయారు చేసుకొని పంటపై పిచికారి చేస్తుంటాడు. పంచగవ్యను భూమికి అందించటంతో పాటు పంటపై కూడా పిచికారి చేస్తుంటాడు. ఈ పద్ధతులు పాటిస్తూ గత సంవత్సరం ఎకరానికి 1200 కిలోల దిగుబడి సాధించి అందులో 800 కిలోల వరకు కిలో ఎండుమిరప కాయలు 350 నుంచి 400 రూపాయలు, కారం 450 నుంచి 500 రూపాయల చొప్పున సుమారు 800 కిలోల వరకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేశాడు. 400 కిలోలు కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసి అవసరమైనపుడు అమ్మకం చేస్తున్నాడు. 

మిరపతో పాటు ప్రత్తి, కంది పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. అవకాశం ఉంటే రబీలో పెసర మరియు వేరుశనగ పంటలను సాగు చేయాలనే ఆలోచలో ఉన్నాడు. వేరే వారు దానంగా అందించిన పశువులను పోషిస్తూ వాటి ద్వారా వచ్చిన పాలను సొంతానికి ఉపయోగించుకుంటూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో ఉపయోగిస్తున్నాడు. శారీరకంగా శ్రమిస్తూ, ఆరోగ్యకరమయిన పంటలు పండిస్తూ, తెలివిగా మార్కెటింగ్‌ చేసుకుంటే సేంద్రియ సాగులో ఫలితం తప్పనిసరిగా ఉంటుందని బాలకృష్ణ ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 99127 37380 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

అవకాశాలను అందిపుచ్చుకోగలిగితే సేంద్రియ సాగులో విజయం తథ్యం

మనది వ్యవసాయక దేశం అయినప్పటికీ, ఎక్కువమంది ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై అధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నా కూడా రైతులందరూ ఆర్థికంగా విజయం సాధించగలుగుతున్నారా? అని అడిగితే సమాధానం లేదు అని వస్తుంది. వివిధ రకాల కారణాల వలన ఎక్కువమంది రైతులు తమ పంటల సాగులో దిగుబడులు అయితే సాధించగలుగుతున్నారు కాని ఆర్థికంగా లాభాలు ఆర్జించలేకపోతున్నారు. తమ పంటల సాగుని లాభాల బాటలో నడిపించుకోవడానికి కొంతమంది రైతులు సేంద్రియ బాట పడుతున్నారు. సేంద్రియ బాటపట్టిన రైతులందరూ లాభాలు ఆర్జించగలుగుతున్నారా? అంటే సమాధానం లేదు అని వస్తుంది. రసాయనిక వ్యవసాయంతో పోల్చితే సేంద్రియ సాగులో అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అశ్రద్ధ చేయకుండా సద్వినియోగం చేసుకోగలిగితే సేంద్రియ సాగులో విజయం తథ్యం అని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా, ఉంగుటూరు గ్రామానికి చెందిన  గద్దె వెంకటరత్నం (రత్నాజి).

రత్నాజీది వ్యవసాయ నేపధ్యం. తోటి రైతుల లాగానే తమ పంటల సాగులో రసాయనాలు కూడా వినియోగిస్తూ సాగుని కొనసాగిస్తుండగా 2006వ సంవత్సరములో తమ ప్రక్క పొలంలో గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోశాల పరిధిలో భూపతిరాజు రామకృష్ణంరాజు గారు గో-ఆధారిత వ్యవసాయం మొదలు పెట్టి రత్నాజీ గారిని కూడా అడగడము జరిగింది. గో-ఆధారిత వ్యవసాయంతో కాలుష్యం తగ్గుతుందని గ్రహించిన రత్నాజీ 2008 వ సంవత్సరం నుంచి తాను పండించే పంటలను గో-ఆధారిత వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం మొదలు పెట్టాడు. ఇందుకుగాను మొత్తం 9 దేశీయ జాతి ఆవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తమ పంటల సాగులో వినియోగిస్తున్నాడు. తమ సొంత పొలం 9 ఎకరాలతో పాటు కొంత పొలాన్ని కౌలుకి తీసుకుని వరి పంటతో పాటు ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు.

ప్రస్తుతం కుజూ పటాలియా, తులసిబోసో, పిఎల్‌ఏ 1100 మొదలగు రకాలు సాగులో ఉన్నాయి. విత్తనాన్ని బీజామృతంతో విత్తనశుద్ధి చేయడముతో పాటు నారును కూడా బీజామృతంలో ముంచి బీహారు కూలీల చేత నాటించారు. దుక్కిలో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల విత్తనాలను ఎకరానికి 18 నుంచి 20 కిలోల విత్తనాలను పచ్చిరొట్టగా చల్లి అవి పెరిగి పూత వచ్చే సమయంలో ఆపచ్చిరొట్టను రోటావేటరు సహాయంతో భూమిలో కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల ఘనజీవామృతం అందించి బీహారు కూలీల సహాయంతో నారు నాటించారు. ఈ పద్ధతిలో కాలిబాటలు ఉండడముతో పాటు మొక్కలకు గాలి వెలుతురు బాగా అందుతాయి కాబట్టి చీడపీడల ప్రభావం చాలా తక్కువగా ఉండడము రత్నాజీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దుక్కిలో పచ్చిరొట్ట మరియు ఘనజీవామృతం అందిస్తూ వస్తూండడము వలన తమ భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి మొక్కలు బాగా రోగనిరోధక శక్తితో పెరుగుతున్నాయి. దానికి తోడు జీవవైవిధ్యాన్ని కాపాడటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి రత్నాజీగారి పొలంలో మిత్ర పురుగుల నిష్పత్తి అనుకూలంగా ఉండడమ వలన చీడపీడల ప్రభావం చాలా తక్కువగా ఉండటము రత్నాజీ గమనించాడు. రెండు సంవత్సరాల క్రితం పంటపై ఆశించే చీడపీడల నివారణకు వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాల పిచికారి అవసరముండేది. కాని గత రెండు సంవత్సరాల నుంచి చీడపీడల కొరకు ఏవిధమైన చర్యలు చేపట్టనవసరం పడటము లేదు. నారు నాటడం, నేలకు జీవన ఎరువులు, జీవ శిలీంద్రనాశినులు, జీవ కీటకనాశినులు కలిపిన ఘనజీవామృతం, ద్రవజీవామృతం లాంటివి క్రమం తప్పకుండా అందిస్తూ ఉన్నారు. అయినా కాని ఎకరానికి మన పురాతన వరి వంగడాలు అయితే 25 నుంచి 30 బస్తాలు, పిఎల్‌ రకం ఎకరానికి 44 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు.

తమ పంటల సాగులో పెట్టుబడులు తగ్గించుకోవటానికి వివిధ రకాల జీవన ఎరువులు, జీవ శిలీంద్ర నాశినులు, జీవకీటక నాశనులు ఎన్‌ఐపిహెచ్‌ఎం నుంచి మదర్‌ కల్చర్‌ సేకరించి తానే సొంతంగా ఇంటి దగ్గరే వాటిని అభివృద్ధి పరచుకొని పంటల సాగులో వినియోగిస్తున్నాడు. జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నీమాస్త్రం, అగ్నాస్త్రం, థపర్ణికషాయం లాంటి వాటిని సొంతంగా తయారు చేసుకుంటూ అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటున్నాడు. వచ్చిన వడ్ల దిగుబడిని ఒక సంవత్సరంపాటు నిల్వ ఉంచి పాతబడిన తరువాత బియ్యం పట్టించి కిలో బియ్యం 70/-లకు అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు. మార్కెట్‌లో ధర ఇంకా అధికంగా ఉన్నా కాని అందరికీ అందుబాటులో ధర ఉండాలన్న లక్ష్యంతో కిలో 70/-ల చొప్పున మాత్రమే అమ్మకం చేస్తున్నాడు. 75 కిలోల వడ్ల బస్తాను మరపట్టించి 56 కిలోల ముడిబియ్యాన్ని పొందుతూ కిలో రూ. 70/- చొప్పున అమ్మకం చేస్తూ బస్తా వడ్ల నుంచి రూ. 3,920/-లు ఆదాయం పొందుతున్నాడు.

ఎకరంన్నర పొలంలో ఇండోనేషియా మోడల్‌ సమీకృత వ్యవసాయాన్ని చేస్తున్నాడు. 70 సెంట్లలో వరి సాగు చేస్తూ దాని ప్రక్కనే 5 మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు కందకం త్రవ్వి అందులో నీటిని నింపి కొరమేను, శీలావతి, కట్ల, రూప్‌చంద్‌ లాంటి చేపలను పెంచుతూ దాని ప్రక్కనే ఇంకో 40 సెంట్లలో వివిధ రకాల పండ్ల మొక్కలు, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు ఇంటికి అవసరమైన పసుపు, అల్లం లాంటి పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. రాబోవు రోజులలో ఇంటికి అవసరమైన ఔషధ మొక్కలను కూడా సాగు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం ఈ ఎకరంన్నర సమీకృత వ్యవసాయం నుంచి మూడున్నర లక్షల ఆదాయం పొందడం జరిగింది. 

తాము సాగు చేసే వరి పొలంలో అజొల్లాకూడా దానంతట అదే పెరుగుతూ ఉంటుంది. అజొల్లా వలన వరిపైరులో కలుపు సమస్య తగ్గడంతో పాటు గాలిలోని నత్రజని మొక్కలకు అందుతుంది కాబట్టి పంట ఏపుగా పెరుగుతుంది. పశువులకు దాణాగా అజొల్లాను అందించడంతో పాటు చేపలకు కూడా అజొల్లాను ఆహారంగా అందిస్తున్నాడు. మిగతా వారు పెంచే చేపలతో పోల్చితే తాము పెంచే చేపలను కిలోకు 30 నుంచి 40 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మినా కూడా వినియోగదారులు తాము పెంచే చేపలను కొనుగోలు చేయడం రత్నాజీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

సేంద్రియ సాగులో అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను అమలుపరుస్తూ వచ్చిన దిగుబడిని అదేవిధంగా అమ్మకం చేయకుండా విలువజోడించి మంచి ధరకు వినియోగదారులకు నేరుగా అమ్మకం చేయడంతో పాటు సమీకృత వ్యవసాయ పద్ధతులను కూడా అమలు పరుస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసకోగలిగితే సేంద్రియ సాగు విజయం తధ్యం అని రత్నాజీ నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9948796638 కి ఫోను చేసి తెలుసుకోగలరు.  

Read More

సమగ్ర సస్యరక్షణతోనే ఆరోగ్యకరమైన దిగుబడులు

రసాయనిక వ్యవసాయం వలన జరిగిన, జరుగుతున్న అనర్థాల నుండి బయట పడటానికి సేంద్రియ సాగు పద్ధతులను నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు ప్రచారం చేయటం జరిగింది. ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అనేకమంది సేంద్రియ సాగు పద్ధతుల గురించి వివరిస్తున్నాకాని, సుభాష్‌పాలేకర్‌ గారు చెబుతున్న జీరోబడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి ఎక్కువమంది రైతు లోగిళ్ళకు చేరిందనుకోవచ్చు. సేంద్రియ సాగు పై బాగా అవగాహన వచ్చిన తరువాత కొత్తగా సేంద్రియ సాగు చేపట్టేవారు కానీ, అప్పటికే రసాయనిక వ్యవసాయం చేస్తూ తమ సాగుని సేంద్రియంలోకి మార్చుకుంటున్నవారు కాని ఎక్కువగా సుభాష్‌ పాలేకర్‌ గారి జీరోబడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతులకు ప్రభావితం అయ్యారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కేవలం సుభాష్‌ పాలేకర్‌ గారు ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటల సాగు చేస్తున్న రైతులు కాలం గడిచే కొలది వివిధ రకాల కారణాల వలన సుభాష్‌ పాలేకర్‌ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు తోడు మిగతా సేంద్రియ సాగు పద్ధతులను కూడా జోడించి రసాయనరహిత వ్యవసాయాన్ని చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందిన ప్రగడ రాంబాబు కూడా సుభాష్‌ పాలేకర్‌ గారు చెపుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ప్రభావితమయ్యి తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియ సాగులోకి మార్చాడు. 

రాంబాబుది వ్యవసాయ నేపథ్యం. వివిధ రకాల పంటల సాగులో రాంబాబుకు 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అందరిలాగానే రసాయనాలు వినియోగిస్తూ పంటలు సాగు చేస్తున్న సందర్భంలో స్నేహితుల ద్వారా సుభాష్‌ పాలేకర్‌ గారు ప్రచారం చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని, తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చాలని తలంచి మెల్లమెల్లగా రసాయనాలు తగ్గిస్తూ సేంద్రియ పద్దతులను అమలు పరస్తూ 4 సంవత్సరాలు మిశ్రమ సేద్యం చేసి, సేంద్రియ సాగు గురించి, సేంద్రియ సాగులో అమలు పరచవలసిన పద్ధతుల గురించి పూర్తి అవగాహన వచ్చిన తరువాత తన పంటల సాగుని 6 సంవత్సరాల క్రితం పూర్తిగా సేంద్రియంలోకి మార్చి గత 6 సంవత్సరాల నుంచి తనకున్న 4 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నాడు.

సొంత భూమి 4 ఎకరాలలో శాశ్వత పందిర్లు ఏర్పాటు చేశాడు. 141/2þ141/2 అడుగుల దూరంలో రాతి స్థంభాలు ఏర్పాటు చేసుకుని, జి.ఐ. వైరుతో పందిరి ఏర్పాటు చేసుకున్నాడు. 4 ఎకరాల భూమిని వివిధ భాగాలుగా చేసుకుని 15 నుంచి 20 రకాల కూరగాయలు మరియు కొన్నిరకాల ఆకుకూరలు సీజన్‌ను బట్టి సాగు చేస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు వినియోగదారులకు, సాధ్యమైనన్ని ఎక్కువ రకాల కూరగాయలు, ఆకుకూరలు అందించడానికి వీలుగా తన పొలాన్ని ప్రణాళిక ప్రకారం సాగుకి సిద్ధం చేస్తుంటాడు. సేంద్రియ సాగులో పంట మార్పిడి మరియు అంతర, మిశ్రమ పంటలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి రాంబాబు తప్పనిసరిగా ఈ మెళకువలు పాటిస్తుంటాడు. అందులో భాగంగా గట్ల వెంబడి, పందిరికి, పందిరికి మధ్య పోటీ ఇచ్చే స్థంభాలకు కూడా అవకాశం ఉన్న కూరగాయలు పండిస్తుంటాడు. పంట మార్పిడిలో భాగంగా సంవత్సరంలో రెండు పంటలు కూరగాయల పంటలు పండిస్తూ మూడవ పంటగా వరి లేదా మొక్కజొన్న లేదా అపరాల పంటలు సాగు చేస్తుంటాడు.

18 రకాల పచ్చిరొట్ట విత్తనాలను పచ్చిరొట్టగా వేసి పూత రాక ముందు రోటోవేటరు సహాయంతో భూమిలో కలియదున్నడముతో పాటు గొర్రెల ఎరువు, సొంత పశువుల ఎరువును దుక్కిలో అందిస్తుంటాడు. అవకాశం ఉన్నప్పుడు భూమి ఖాళీగా ఉన్నప్పుడు గొర్రెల మందలను లేదా పశువుల మందను కట్టిస్తుంటాడు. సేంద్రియ సాగులోకి మారిన మొదటలో దుక్కిలో ఘనజీవామృతం తప్పనిసరిగా అందిస్తుంటాడు. కాని ప్రస్తుతం ఘనజీవామృతాన్ని దుక్కిలో అందించకుండా పశువుల ఎరువుపై ద్రవ జీవామృతం చల్లి ఆ ఎరువును దుక్కిలో వేస్తుంటాడు. పంట వేసిన తరువాత క్రమం తప్పకుండా భూమికి జీవామృతాన్ని, సొతంగా తయారు చేసుకున్న జీవన ఎరువులు, జీవశిలీంద్రనాశనులను వెంచర్‌ ద్వారా అందిస్తుంటాడు. సమగ్ర సస్యరక్షణలో భాగంగా సరిహద్దుపంటలుగా బెండ లాంటి కూరగాయలను, ఎర పంటలుగా బంతి లాంటి పంటలను సాగు చేస్తుంటాడు. రసం పీల్చు పురుగుల నియంత్రణకు పసుపు మరియు బులుగు రంగు జిగురు అట్టలు, కాయతొలుచు పురుగు, ఆకుతొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు లాంటి చీడపీడల నివారణకు లింగాకర్షక బుట్టలు, తీగజాతి కూరగాయలలో వచ్చే ఫ్రూట్‌ ఫ్లై నివారణకు ఫ్రూట్‌ ఫ్లై ట్రాప్స్‌ ఏర్పాటు చేస్తుంటాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చీడపీడల ప్రభావం ఉంటే నీమాస్త్రం, థపర్ణి కషాయం, పంచగవ్య, వేపగింజల ద్రావణం లాంటివి ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్నాడు.

సేంద్రియ సాగులో దిగుబడి సాధించడము ఒక పరీక్ష అయితే పొందిన ఆరోగ్యకరమైన దిగుబడిని ఆశాజనకమయిన ధరలకు అమ్మటం మరో పెద్ద పరీక్ష. సేంద్రియ పద్ధతులతో పండించిన కూరగాయలు మరియు ఆకుకూరలకు మామూలు మార్కెట్‌లో సాధారణ ధరే పలుకుతుంది కాని ప్రత్యేక ధరకు అమ్మకం చేయలేక పోతున్నారు. దానిని గ్రహించిన రాంబాబు తన చుట్టు ప్రక్కల ప్రాంతాలలో తన సాగు పద్ధతుల గురించి ప్రచారం చేయడం జరిగింది. తన సాగు పద్ధతులను చూడటానికి అనేకమంది వినియోగదారులు ప్రత్యక్షంగా రాంబాబు పొలాన్ని సందర్శించి నమ్మకం కుదిరిన తరువాత రాంబాబు దగ్గర కూరగాయలు మరియు ఆకుకూరలు కొని వాటి రుచి చూసిన తరువాత మరలా మరలా కొనుగోలు చేస్తుండడము మొదలయ్యింది. ఈ విధంగా 800 కుటుంబాలకు అవసరమయిన కూరగాయలను అందించగలిగే స్థాయికి రాంబాబు ఎదిగాడు. 8 వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి 800 కుటుంబాలకు, రోజు కొన్ని కుటుంబాలు చొప్పున వారంలో అన్ని కుటుంబాలకు వారానికి సరిపోను కూరగాయలు నేరుగా ఇంటి వద్దకు చేరవేస్తున్నాడు. ప్రస్తుతం 14 రకాల కూరగాయలు సాగులో ఉన్నాయి. గత సంవత్సరం శీతాకాలంలో 22 రకాలకు పైగా కూరగాయలు మరియు ఆకుకూరలను నేరుగా వినియోగదారులకు అందించగలిగాడు. సాధ్యమయినంతవరకు తాను పండిస్తూ, తాను పండించ లేనివి తోటి సేంద్రియ రైతుల వద్ద నుంచి సేకరించి తోటి రైతులకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు.

పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ తమ భూమిని కాపాడుకుంటూ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఒక మంచి ఉద్యోగంలో పొందే జీతానికి తగ్గకుండా ఒకరి కింద పని చేయకుండా సొంతంగా సంపాదించుకుంటున్నాడు. మరిన్ని వివరాలు 98487 57411కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More

మనసుంటే మార్గాలుంటాయి

రసాయనిక వ్యవసాయం వలన జరిగిన, జరుగుతున్న అనర్థాల నుండి బయటపడటానికి అనేకమంది రైతులు సేంద్రియ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. సేంద్రియ సాగు బాగా వెలుగులోకి వచ్చిన తరువాత అప్పటికే పంటలు సాగు చేస్తూ రసాయనిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతులు సేంద్రియం వైపు అడుగులు వేయడంతో పాటు, కొంతమంది ఉద్యోగ, వ్యాపార రంగాల నుండి కొత్తగా వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. వ్యవసాయ అనుభవం ఉండి సాగు పద్ధతులు మార్చుకున్న వారి విషయంలో పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి వారు కేవలం వారి సాగు పద్ధతులను మాత్రం మార్చుకున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటే కొత్త విధానాలను కొనసాగిస్తారు. అనుకూలంగా లేకుంటే మరలా పాత విధానాలవైపు అడుగులు వేయగలరు. కాని ఉద్యోగ వ్యాపార రంగాల నుంచి వ్యవసాయంలో కొత్తగా అడుగు పెట్టిన వారి విషయంలో అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ రెండు వర్గాలలో ఉద్యోగ రంగం నుంచి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వచ్చిన వారి విషయంలో ప్రత్యేకత అవసరం. తాము చేస్తున్న ఉద్యోగాన్ని వదలి, వచ్చే ఆదాయాన్ని వదలి శారీరక శ్రమ పెద్దగా అవసరం లేకుండా కేవలం ఎ.సి. (సాఫ్ట్‌వేర్‌ రంగం) గదులకు, కుర్చీలకే పరిమితమయిన జీవనశైలి నుంచి పూర్తిగా శారీరక శ్రమ ఉండి, చెమటలు కక్కే నిండు వేసవిలో పనిచేయవలసిన జీవన శైలికి మారవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి వారి విషయంలో తప్పనిసరిగా ప్రత్యేకత ఉంటుంది. ఇవన్నీ అధిగమించగలిగితే వాటన్నికంటే అతి పెద్ద సమస్య ఇంట్లోని పెద్దలు, మహిళలు. ప్రస్తుత సమాజాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో స్థిరపడ్డ మహిళలలో 99 శాతం పైగా మహిళలు వ్యవసాయం అంటే విముఖత చూపుతున్నారు. అతి తక్కువ మంది మహిళలు మాత్రమే వ్యవసాయ రంగం అంటే వ్యతిరేకత లేకుండా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిగత సమస్యలను ఎదుర్కోగలమనే నమ్మకంతో ఇటీవలకాలంలో అనేకమంది ఉద్యోగ రంగం నుండి ప్రత్యేకంగా సాప్ట్‌వేర్‌ ఉద్యోగ రంగం నుండి సేంద్రియ సాగువైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. సేంద్రియ సాగువైపు అడుగులు వేసిన వారు వివిధ రకాల కారణాల వలన తమ సాగుని లాభల బాటలో నడిపించుకోలేక వెనుతిరిగి పోతున్నారు. అతితక్కువ మంది మాత్రమే వివిధ రకాల ఒడిదుడుకులను తట్టుకుని, సమయానుకూలంగా తమ సాగు పద్ధతులను మార్చుకుంటూ, పంటల సాగుని లాభాల బాట పట్టించడానికి అవసరమయిన అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటూ మనసు ఉంటే మార్గాలు అనేకం ఉంటాయనే సూక్తిని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. ఇదే కోవకు చెందుతాడు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన చండ్ర వెంకటేశ్వరరావు.

వెంకటేశ్వరరావుది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని అందరిలాగానే వీరు కూడా ఉన్నత చదువులు చదివి వ్యవసాయ రంగానికి దూరం జరిగి ఉద్యోగరంగంలో ప్రవేశించి మంచి ఉద్యోగం, మంచి జీతంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో కొనసాగుతున్నా కూడా ఆరోగ్యసమస్యలు ఎదురవ్వడంతో తమ ప్రస్తుత జీవన శైలి గురించి పరిశీలించుకొని అనారోగ్య సమస్యల నుండి బయట పడాలంటే జీవనశైలిని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి ఆరోగ్యకరమైన జీవనశైలికి సేంద్రియ సాగే సరైన దారి అని నమ్మి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా కూడా వారి సలహాలను ప్రక్కకు నెట్టి మంచి జీతం అందిస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులోకి అడుగు పెట్టడం జరిగింది.

వెంకటేశ్వరరావు వ్యవసాయ నేపథ్యంకి చెందినప్పటికి వ్యవసాయంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భాలు లేవు కాబట్టి చేస్తున్న ఉద్యోగాన్ని, ఏసి గదులను వదలి ఎండలో, మట్టితో పనిచేయడానికి సిద్దం అయ్యాడు కాబట్టి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. కాబట్టే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాని ఎదుర్కొని మెల్లమెల్లగానే ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడు. వ్యవసాయంలో శారరీక శ్రమ ఎక్కువ అనే విషయం తెలిసిందే. సేంద్రియ సాగులో శారీరక శ్రమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వరరావు సేంద్రియ సాగులో అడుగు పెట్టినప్పుడు సుభాష్‌ పాలేకర్‌ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కాబట్టి అవే పద్ధతులతో సేంద్రియ సాగులో అడుగుపెట్టి వరి మరియు వివిధ రకాల కూరగాయలు సాగు చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో కేవలం సుభాస్‌ పాలేకర్‌ గారి పద్ధతులు మాత్రమే పాటించినట్లయితే తగిన ఫలితాలు రావడం లేదని తన అనుభవంతో తెలుసుకున్న వెంకటేశ్వరరావు సుభాష్‌ పాలేకర్‌ గారి పద్ధతులకు తోడు వేరే సేంద్రియ పద్ధతలను కూడా తన సాగులో అమలు చేయడం మొదలు పెట్టి సమయానుకూలంగా కొత్త కొత్త సేంద్రియ పద్ధతులను కూడా తెలుసుకుంటూ, తన సాగులో అమలుపరుస్తూ, ఏ ఒక్క సేంద్రియ పద్ధతిని గుడ్డిగా నమ్మకుండా అవకాశం ఉన్న వివిధ రకాల సేంద్రియ పద్ధతులను పాటిస్తూ వరి, కూరగాయలు, చెరకు లాంటి పంటలు పండిస్తున్నాడు.

వివిధ రకాల కారణాల వలన సేంద్రియ సాగులో అడుగుపెట్టిన మొదటలో తన సాగులో ఆశించిన లాభాలు రాకపోవడముతో, సాగుని లాభాల బాట పట్టించడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు సొంత మార్కెటింగ్‌ వ్యవస్థలతోనే సేంద్రియ సాగును లాభాల బాట పట్టించగలను అని నమ్మి కోదాడలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం దుకాణం ఏర్పాటు చేసి తాను పండించిన ఉత్పత్తులతో పాటు తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా అమ్మకం చేయడం మొదలు పెట్టాడు. అయినా కాని ఆశించిన మొత్తంలో ఫలితాలు రాకపోవడముతో నూనె గానుగను ఏర్పాటు చేసి గానుగ నూనెను తీసి నేరుగా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాడు. కోదాడ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అనేకమంది యువతకు గానుగ నూనె తీసే పద్ధతిపై శిక్షణ అందించి యువతకు స్వయం ఉపాధి మార్గం చూపించడంలో వెంకటేశ్వరరావు తనవంతు పాత్రను పోషించాడు. వీటన్నింటికి తోడు చెరకు రసం గురించి సర్వే చేసి చెరకు పండించి, చెరకు నుండి రసం తీసి అమ్మగలిగితే మంచి లాభం ఉంటుందని తెలుసుకుని సేంద్రియ పద్ధతిలో చెరకు పండిస్తూ ఆ చెరకును తానే సొంతంగా చెరకు రసం తీసి అమ్మకం చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు.

చేస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో అడుగు పెట్టి విష రసాయన రహిత వ్యవసాయాన్ని విజయవంతం చేస్తున్నాడు. ప్రస్తుతం వరి, చెరకు, వివిధ రకాల కూరగాయల సాగులో ఉన్నాయి. ఈ రోజు ఈ స్థాయికి రావడానికి వెంకటేశ్వరరావు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. పంటలను చీడపీడల నుంచి కాపాడుకుంటూ మంచి దిగుబడులు సాధించడానికి మార్గాలు అన్వేషిస్తూ, అమలుపరుస్తూ, పంట దిగుబడులను అదేవిధంగా అమ్మకుండా విలువ జోడింపుకు సంబంధించిన మార్గాలను అన్వేషిస్తూ, అమలు పరుస్తూ ముందుకు సాగుతూ మనసు ఉంటే మార్గాలు తప్పనిసరిగా ఉంటాయని వెంకటేశ్వరరావు నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9652111343కి ఫోను చేసి తెలుసుకోగలరు.  

వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

ప్రకృతి, సేందియ్ర వ్యవసాయంలో తెగుళ్లు, పురుగుల జీవ నియంత్రణ మందులు

ట్రైకోడెర్మావిరిడి (శిలీంద్రము)

పంటలకు హానీ చేసే శిలీంద్రాలను నాశనం చేసి, పంటలను తెగుళ్ళు రాకుండా కాపాడును.

వాడే పద్ధతి: 100 కిలోల సేంద్రియ ఎరువు, అరకిలో నల్లబెల్లం, 1 కిలో ట్రైకోడెర్మావిరిడి, 5 కిలోల వేపపిండి, చెట్టు నీడన గానీ, పాకలో గానీ, పొరలు పొరలుగా ఎరువు, వేపపిండి, ట్రైకోడెర్మావిరిడి వేస్తూ బెల్లపు నీరు చిలకరించి, గుట్టలో తగిన తేమ ఉండేటట్లు చూడాలి. గుట్టపైన తడిపిన గోనె సంచి కప్పి నాలుగు రోజులుంచితే ఎరువంతయు బూజు పట్టినట్లు అగును. చేలో తేమ ఉన్నప్పుడు ఈ ఎరువు వేరు వ్యవస్థ దగ్గరగా, సాయంత్రపు సమయంలో చల్లాలి. పండ్లతోటలలో సంవత్సరానికి కనీసం రెండుసార్లు, ఇతర పంటలకు ఒకసారి చల్లాలి. అవసరమైతే మోతాదు పెంచుకోవచ్చును. చెట్లు/మొక్కల మొదళ్లలో 1 శాతం శిలీంద్రం కలిపిన నీరు పోయాలి.

విత్తనశుద్ధి: 10 గ్రా. ట్రైకోడెర్మావిరిడి, 10 మి.లీ. నీటిలో పేస్టుగా చేసి విత్తనాలకు పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి. పసుపు దుంపలు, చెరకు ముచ్చెలు, నారు వగైరాలకు అరకిలో శిలీంద్రం 50 లీటర్లు నీటిలో కలిపి అందులో అరగంట ఉంచి నాటాలి.

నివారించు తెగుళ్లు: ఎండుతెగులు, వేరు, నారుకుళ్లు తెగులు, మాగుడు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లు, దుంపకుళ్లు, పొడ తెగుళ్లు నివారణకు అన్ని పంటలకు వాడుకోవచ్చు.

సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ (బ్యాక్టీరియా)

వాడే పద్ధతి: పైన ట్రైకోడెర్మావిరిడి భూమికి వెదజల్లే పద్ధతి దీనికి కూడా పాటించాలి. పంటపై పిచికారీ చేసినప్పుడు 1 కిలో, 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కానీ రెండు రోజుల ముందు 1 కిలో నల్లబెల్లం, 2 లీటర్ల నీటిలో కలిపి తయారు చేసిన పానకంలో 1 కిలో సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ నానవేసి, పిచికారి చేసిన మంచి ఫలితాలుంటాయి.

విత్తనశుద్ధి: 10 గ్రాములు, కిలో విత్తనానికి, దుంపలు, చెరకు ముచ్చెలు, నారు వగైరాలకు అరకిలో సూడోమోనాస్‌ 50 లీటర్ల నీరు కలిపిన ద్రావణంలో అరగంట ఉంచి విత్తాలి.

నివారించే తెగుళ్లు: ఎండు తెగులు, అగ్గితెగులు, నారుకుళ్లు, ఆకుమచ్చ, పొడతెగులు వగైరాలు పంచగవ్యలో కలిపి సాయంత్రం సమయంలో పిచికారీ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి.

బవేరియా బాసియానా (శిలీంద్రం)

అన్ని పంటలపై వచ్చే శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, గొంగళి పురుగు, కాయతొలిచే పురుగు, కొమ్మ, కాండం తొలిచే పురుగులపై సమర్ధవంతంగా పనిచేసే శిలీంద్రము, పంచగవ్యలో కలిపి వాడినప్పుడు దీని సామర్థ్యం బాగా పెరిగింది.

వాడే పద్ధతి: మొక్క పెరిగే థలో 2 కిలోల బవేరియా బాసియానా 100 లీటర్ల నీటిలో కలిపి, దానికి 3 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి. మొక్కల అన్ని భాగాలు తడిచేటట్లు పిచికారీ చేయాలి. వంగలో మొక్క పెరిగే థలో 2 సార్లు పిచికారీ చేసిన కొమ్మ, కాయ తొలిచే పురుగులు రాలేదు. ప్రస్తుతం చాలా మంది వంగరైతులు వాడుతున్న మందు బవేరియా బాసియానా 2 కిలోలు మరియు 3 లీటర్ల పంచగవ్య సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి.

వర్టిసీలియం లెకానీ (శిలీంద్రం)

అన్ని పంటలపై వచ్చే పేనుబంక, నల్లి, తెల్లదోమ, రసం పీల్చే పురుగులపై సమర్ధవంతంగా పనిచేయును. పంచగవ్యలో కలిపి వాడినప్పుడు సామర్థ్యం పెరిగినది.

వాడే విధానం: 2 కిలోల వర్టిసీలియం లెకాని 3 లీటర్లు పంచగవ్య, 100 లీటర్ల నీటిలో కలిపి సామర్థ్యం పెంచి సాయంత్రం సమయంలో పైరంతా తడిచేటట్లు పిచికారీ చేయాలి. మొదటి సారి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

మెటారైజియం (శిలీంద్రం)

చెదలు, చీమలు, దోమలు, వేరుపురుగు, ఈగలు వగైరా సమర్థవంతంగా నివారించే శిలీంద్రం.

వాడే పద్ధతి: ట్రైకోడెర్మా విరిడిలాగా 100 కిలోల కంపోస్టు, 5 కిలోల వేపపిండి, అర కిలో బెల్లపు నీరు, 2 కిలోల మెటారైజిమ్‌ కలిపి చేలో తగు తేమ ఉన్నప్పుడు భూమిపై వెదజల్లాలి. 2 కిలోల మెటారైజిమ్‌, 100 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయవచ్చు. మొదటి సారి వాడినప్పుడు వారంలో రెండుసార్లు పిచికారీ చేసిన మంచి ఫలితాలు వచ్చును. పంచగవ్యలో కలిపి పైరుపై చల్లవచ్చును.

ట్రైకోడెర్మా హార్జియానమ్‌ (శిలీంద్రం)

ట్రైకోడెర్మా విరిడి భూమిలోపల వాడితే ఇది భూమిపైన కాయకుళ్ళు రాకుండా వాడే శిలీంద్రం. దీనిని కూడా అరకిలో బెల్లం పానకంలో 2 కిలోల ట్రైకోడెర్మా హార్జియానమ్‌ 48 గంటలు నానబెట్టి వాడిన మంచి ఫలితాలు వచ్చును.

డా. ఎన్‌. కృష్ణ ప్రియ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌, ఊటుకూర్‌, కడప.

Read More

పట్టుదలతో పట్టు సాగు

గతాన్ని ఒక్కసారి గమనించినట్లయితే రైతు కుటుంబానికి చెందిన వారిలో చాలామంది ఉన్నత చదువులు చదివి వ్యవసాయ రంగాన్ని వీడి ఉద్యోగ, వ్యాపార రంగాలకు వలసలు వెళ్ళారు. ఇంకా వెళుతున్నారు. కాబట్టే వ్యవసాయ రంగం మీద ఆధారపడే జనాభా తగ్గుతూ వస్తుంది. కాని రెండోవైపు పరిశీలించినట్లయితే అంతకు మునుపే వ్యవసాయరంగాన్ని వీడి ఉద్యోగ, వ్యాపార రంగాలకు వలసలు వెళ్ళినవారిలో కొంతమంది ఆర్థికంగా బలపడిన తరువాత తిరిగి వ్యవసాయరంగం వైపు తమ అడుగులు వేస్తున్నారు. దాని పర్యవసానమే ఇటీవల కాలంలో ఉద్యోగ రంగం నుండి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ రంగం నుండి వ్యవసాయరంగం వైపు అదీను సేంద్రియ వ్యవసాయ రంగం వైపు కొంతమంది అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. నల్లగొండ జిల్లా, కనగల్లు మండలం నరసింహపురం గ్రామానికి చెందిన జల్లా పుండరీకం ఇదే దారిలో నడిచి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలోకి అడుగు పెట్టాడు.

వ్యవసాయ నేపథ్యానికి చెందిన పుండరీకర ఉన్నత చదువులు చదివి ఉద్యోగ రంగంలో ప్రవేశించి 20 నుంచి 25 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో పలు దేశాలతో పాటు మన దేశంలోని ప్రముఖ నగరాలలో కూడా తన ఉద్యోగ సేవలు అందించవలసి వచ్చింది. మంచి జీతంతో విలాసవంతమైన సౌకర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఏదో అసంతృప్తి మనసులో కలిగి తమ అసంతృప్తికి సరైన పరిష్కారం వ్యవసాయరంగం అని తెలిసి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయంలో అడుగు పెట్టడం జరిగింది. తమ అంతిమ లక్ష్యం వ్యవసాయం అని గ్రహించి వెంటనే తమకు అనుకూలమైన పంట, అంటే అప్పటి వరకు మట్టి వాసనకు దూరంగా ఎసి గదులకు పరిమితమై ఉద్యోగాలు చేశారు కాబట్టి అలాంటి సౌకర్యాలను వదలి నేరుగా మట్టిలో కాలుపెట్టి 365 రోజులు శారీరక శ్రమ చేయడం కొంత ఇబ్బందిగా ఉండవచ్చు అని భావించి తమకు అనుకూలమైన పంటల కొరకు పరిశీలించి, పరిశోధించి తమ జీవన శైలికి అనుకూలమైన పంట మల్బరీ తోట పెంపకం, దానికి అనుసంధానంగా పట్టు పురుగుల పెంపకం సరైనదారి అని నమ్మి 2015వ సంవత్సరములో అటువైపు అడుగులు వేశారు. పట్టు పురుగుల పెంపకంలో రెండు విభాగాలు ఉంటాయి. అవి మల్బరీ తోట పెంపకం మరియు పట్టు పురుగుల పెంపకం. ఈ రెండింటి గురించి పుండరీకం అందించిన వివరాలు…

మల్బరీసాగు: మల్బరీలో అనేక రకాలు ఉన్నా కాని పట్టుపురుగుల పెంపకానికి అనువైన రకాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని మార్పులు చేసి మంచి రకాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. సంబంధిత శాస్త్రవేత్తలు అభివృద్ధిపరచిన విక్టరి1 (ఙ1) రకాన్ని నాటుకోవడం జరిగింది. తన ఈ ఎనిమిది సంవత్సరాల అనుభవంలో లైనుకి, లైనుకి మరియు మొక్కకు, మొక్కకు 4þ4 లేక 3þ3 అడుగుల దూరం అనుకూలంగా ఉంటుంది.

ఈ రెండింటిలో కూడా 4þ4 బాగా ఉంటుంది. ఎందుకంటే మల్బరి మొక్క ఒకసారి నాటుకుంటే 20 సంవత్సరాలకు పైబడి దిగుబడిని ఇస్తుంది కాబట్టి అందుకు అనుకూలంగా నాటుకోవలసి ఉంటుంది. నాటిన తరువాత క్రమం తప్పకుండా ప్రూనింగ్‌ చేయవలసి ఉంటుంది. మొక్క పెరిగే క్రమంలో 8 అంగుళాలు పెరిగిన తరువాత మొక్కను ప్రూనింగ్‌ చేసినట్లయితే రెండు లేదా మూడు కొమ్మలు పక్కన రావడము జరుగుతుంది. పక్కకొమ్మలను మూడు అంగుళాలు పెరిగిన తరువాత మరలా ప్రూనింగ్‌ చేయాలి. మరలా పక్కకొమ్మలను మూడు అంగుళాలు పెరిగిన తరువాత మరలా ప్రూనింగ్‌ చేయాలి. వచ్చిన కొమ్మలను మరలా ప్రూనింగ్‌ చేయాలి. ఈ విధంగా ప్రూనింగ్‌ చేసుకుంటూపోతే మూడు నుంచి నాలుగు నెలల్లో 25 నుంచి 30 కొమ్మలుపైగా వచ్చి కోతకు సిద్ధం అవుతుంది. మొక్క వయస్సు పెరిగేకొలది మొక్క యొక్క వేరు వ్యవస్థ కూడా భూమిలో బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి భూమిలోని పోషకాలను సక్రమంగా వినియోగించుకొని మొక్క ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేసిన మల్బరి తోటలో లభించే మల్బరి ఆకుతో 200 నుంచి 250 ఈఓఉ (డిసీజ్‌ ఫ్రీ లార్వా) (ంశ్రీజూ ఈఓఉ= 500 లార్వాలు)లను పెంచవచ్చు. మల్బరి ఆకును సున్నితమైన పట్టుపురుగులకు ఆహారంగా ఇస్తాము కాబట్టి మల్బరి సాగుకు ఎలాంటి విష రసాయనాలు ఉపయోగించకూడదు. నికోటిన్‌ కలిగిన పుగాకు పదార్థాలను కూడా ఉపయోగించకూడదు. సేంద్రియ సాగులో వినియోగించే జీవ సంబంధిత కీటకనాశనులు, ఉదాహరణకు బవేరియా బాసియానా లాంటివి కూడా ఉపయోగించకూడదు కాబట్టి తాను వేపగింజల కషాయం, జీవామృతం, వేస్ట్‌డికంపోజరులను మాత్రమే మల్బరి సాగుకు ఉపయోగిస్తున్నాని, ఈ పద్ధతిలో మొత్తం 4 ఎకరాలలో మల్బరి సాగును పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నానని పుండరీకర వివరించాడు.

పట్టు పురుగుల పెంపకం: పట్టు పురుగుల పెంపకానికి షెడ్‌ తప్పనిసరి కాబట్టి తాను 100 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పులతో 2500 చదరపు అడుగుల షెడ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ముందుచూపుతో పెద్ద షెడ్‌ను ఏర్పాటు చేసుకున్నాను కాని ప్రభుత్వ సబ్సిడీ పొందాలంటే 50 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పు అంటే 1000 చదరపు అడుగుల షెడ్‌ సరిపోతుంది. రెండున్నర ఎకరాలను ఒక యూనిట్‌గా సమకూర్చి ప్రభుత్వం వారు సబ్సిడీని అందచేస్తున్నారు. 1000 అడుగుల షెడ్‌ మరియు ఇతర సామాగ్రితో పాటు మల్బరి మొక్కలు, మొక్కలు నాటడానికి అయ్యే ఖర్చులు అన్నీ కలిపి ఒక యూనిట్‌ ధర 7,20,000/-గా నిర్ణయించి అందులో 50% అంటే రు. 3,60,000/- సబ్సిడీని అందిస్తున్నారు.

ప్రస్తుతం తన షెడ్‌లో 200 ఈఓఉ లు ఉన్నాయి. పట్టుపురుగుల పెంపకంలో 5 థలు ఉంటాయి. ప్రభుత్వ పరిశోధన సంస్థ వారు జనిటికల్లి మోడిఫైడ్‌ ఈఓఉ లను ఉత్పత్తి చేస్తున్నారు. కోళ్ళ పరిశ్రమలో ఉన్నట్టే ఇందులో కూడా హచరీస్‌ ఉంటాయి. గుడ్డు థ నుండి మొదటి రెండు థలు చాకీ సెంటర్‌ వాళ్లు నిర్వహిస్తుంటారు. చాకీ సెంటర్‌ వాళ్ళు 6 నుంచి 8 రోజులు పురుగు లార్వాలను పోషించి రైతులకు అందిస్తుంటారు. రైతుల దగ్గర పట్టు పురుగులు ఉండేది కేవలం 22 రోజులు మాత్రమే. రైతు దగ్గరకు వచ్చిన తరువాత మొదట 14 రోజులు అంటే 3వ థ 14 రోజులు మల్బరి ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా ఇవ్వవలసి ఉంటుంది. 14వ రోజు నుంచి 16 రోజుల మధ్య పట్టు పురుగులు స్పిన్నింగ్‌కి వస్తాయి. స్పిన్నింగ్‌ 4 రోజులు ప్రక్రియ ఉంటుంది. స్పిన్నింగ్‌ పూర్తి అవగానే కకూన్‌ తయారవుతుంది. కకూన్‌ తయారయిన వెంటనే మార్కెట్‌ చేయవలసి ఉంటుంది. దేశం మొత్తం కకూన్‌ కొనుగోలు చేసే మార్కెట్లు ఉన్నాయి కాబట్టి రైతుకు అనుకూలమైన స్థలంలో కకూన్‌లను అమ్ముకోవచ్చు. మార్కెట్‌లో అమ్మిన ధరకు సంబంధం లేకుండా కిలోకు 75/- తెలంగాణ ప్రభుత్వం, కిలోకు 50/-లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనంగా అందచేస్తుంది. ఏ మార్కెట్‌లో అమ్మినా కాని ఆ మార్కెట్‌లో అమ్మిన రసీదును చూపించి అదనపు ధరను పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న పంట 200 ఈఓఉ కి సంబంధించింది. కకూన్స్‌ని ఇటీవలే అమ్మకం చేశాను. 200 ఈఓఉ లకు గాను 120 కిలోలు మంచివి, 20 కిలోల జాలీవి కలిపి మొత్తం 140 కిలోల దిగుబడి పొందడం జరిగింది. మంచి కకూన్స్‌ని కిలో 495/-లు, జాలీ కకూన్స్‌కి కిలో 150/- ధర లభించింది. అదనంగా మొత్తం 140 కిలోలకు తెలంగాణ ప్రభుత్వం కిలోకు 75/- ల చొప్పున ఇవ్వడం జరిగిందని పుండరీకం వివరించాడు. పట్టు పురుగులు చాలా సున్నితమయినవి కాబట్టి షెడ్‌లో ఉష్ణోగ్రతలు మరియు తేమశాతాలను నియంత్రించవలసి ఉంటుంది. మొదటిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కాని రెండు మూడు పంటలు తీసిన తరువాత అనుభవం పెరుగుతుంది కాబట్టి ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి రైతులు నిరభ్యంతరంగా పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు అని పుండరీకం వివరించాడు. మరిన్ని వివరాలు 94907 54201 కి ఫోను చేసి తెలుసుకోవచ్చు.

కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయరంగం, అదీను సేంద్రియ వ్యవసాయరంగంలో కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువగా అవసరం పడుతుంది. ప్రస్తుత సమాజాన్ని గమనించినట్లయితే వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టడానికి మహిళలు వెనుకంజ వేస్తున్నారు. కుటుంబంలోని మగవారికి వ్యవసాయరంగం అంటే మక్కువ ఉన్నా కాని ఆ కుటుంబంలోని మహిళలు వ్యతిరేకంగా ఉండటం వలన చాలామంది మగవారు వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. కొంతమంది మగవారు తమ కుటుంబంలో మహిళల ఇష్టాన్ని పెడచెవిని పెట్టి తాము వ్యవసాయ రంగంలో దిగి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నా కూడా తమ పంటల సాగుని కొనసాగిస్తున్నారు. పుండరీకరకి ఇలాంటి బాధలు ఏమీ లేవు. పుండరీకం ఉద్యోగం వదలి వ్యవసాయరంగంలో అడుగు పెట్టాలన్న నిర్ణయాన్ని తన అర్థాంగి జ్యోతి ఆనందంగా అంగీకరించింది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుండరీకం పట్టుపురుగుల పెంపకంలో అడుగుపెట్టగలిగాడు. ఈ రంగంలో అడుగు పెట్టిన తరువాత వీరి అనుభవంలో తెలిసిన విషయం ఏమిటంటే పట్టుపురుగుల పెంపకంలో విజయం సాధించాలంటే కుటుంబసభ్యులు అందరు కలసి ప్రత్యక్షంగా పనిచేయవలసి ఉంటుందని గ్రహించారు. అందుకు అనుకుగుణంగా ప్రతిరోజు జ్యోతి పొలానికి వచ్చి పట్టు పురుగులకు మల్బరీ ఆకులను ఆహారంగా అందించడము, కూలీల చేత పని చేయించడం లాంటి విషయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి తాను ఇంతకాలం ఈ రంగంలో కొనసాగగలిగాను. లేకుంటే ఈ రంగంలో కొనసాగటం కష్టంగానే ఉండేది. తన ఈ విజయంలో తన అర్థాంగి జ్యోతి పాత్ర చాలా ఉంది, తాను సహకారం అందించడము వలననే పట్టుపురుగుల పెంపకంలో కొనసాగ గలుగుతున్నానని వివరిస్తూ, సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి తన అర్థాంగి జ్యోతికి పుండరీకం కృతజ్ఞతలు తెలియజేశారు. 

పట్టుదల తప్పనిసరి

ఏరంగంలోనైనా విజయం సాధించాలంటే పట్టుదల తప్పనిసరి అనే విషయం అందరికి తెలిసిందే. కాని మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయరంగంలో పట్టుదల పరిమాణం చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయరంగం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడుతుంది. వ్యవసాయరంగం విజయంలో మన పాత్ర కంటే ప్రకృతి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నించినా కాని ప్రకృతి అనుకూలించనట్లయితే ఫలితాలు ప్రతికూలంగా వస్తాయి. కాబట్టే వ్యవసాయరంగంలో పట్టుదల పరిమాణం చాలా ఎక్కువ అవసరముంటుంది. పట్టుపురుగుల పెంపకం గురించి ఆలోచిస్తే మల్బరి మొక్కల పెంపకం, పట్టుపురుగుల పెంపకం రెండూ కూడా ప్రకృతి మీద ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. మనం ఎంత ప్రయత్నించినా కూడా ప్రకృతి అనుకూలించనట్లయితే రైతులు నష్టపోవలసి వస్తుంది. పట్టుపురుగులు చాలా సున్నితమయినవి. అతిజాగ్రత్తలు తీసుకుని వీటిని పెంచవలసి ఉంటుంది. సరైన అవగాహన లేకుండా పట్టు పురుగుల పెంపకం చేపట్టినట్లయితే ఫలితాలు ప్రతికూలంగా ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టే చాలామంది పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి కొనసాగించలేక వెనుదిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో పుండరీకర అన్నీ ఆలోచించి పట్టుపురుగుల పెంపకం రంగంలోకి అడుగుపెట్టాడు. ముందుగానే అన్ని రకాలుగా పరిశీలించి, పరిశోధించి, అనేకమంది పట్టు పురుగుల పెంపకం చేసే రైతులను కలసి, అనేకమంది శాస్త్రవేత్తలు, అధికారులను కలసి వారి అభిప్రాయాలను సేకరించి ఈ రంగంలో అడుగుపెట్టి ఎదురయ్యే అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ గత 8 సంవత్సరాల నుంచి పట్టుపురుగుల పెంపకాన్ని పట్టుదలతో కొనసాగిస్తున్నాడు.

Read More

నవంబర్‌ నెలలో సేద్యపు పనులు

ఆంధ్రప్రదేశ్‌లో 26కి గాను 20కి పైగా జిల్లాల్లో కరువు విపరీతంగా ఉంది. నిండిన జలాశయాలు లేనిచోట, తెలంగాణాలో కూడా వర్షాలు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు నీరులేక కాలువ నీటితో పంటలు పెట్టలేదు. వర్షాకాలపు పంటలు పండక రైతులు బాగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ (స్వాతి కడరోజులు, విశాఖ, అనూరాధ కార్తెలు)లో వివిధ పంటలలో చేయవలసిన పనుల గురించి…

కొత్తిమీర/ధనియాలు: అధిక ధనియాలు మరియు కొత్తిమీర దిగుబడులు సాధించడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తుట వాతావరణ రీత్యా అనుకూలం. ఒత్తుగా ఉన్న మొక్కలను పీకి కొత్తిమీరగా అమ్మవచ్చు. బిపి, షుగరు, మూత్ర పిండాల రోగాలు, కొలెస్ట్రాల్‌ సమస్యలు తగ్గడానికి మంచిదని కొత్తిమీర వినియోగం అన్ని కాలాలలోనూ పెరుగుతున్నది. ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మంచి విత్తనదిగుబడికి అనుకూలమైన రకాలు: హిస్సార్‌ సురభి, గుజరాత్‌ ధనియా, సింపోస్‌-33, ధనియాల ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. 

జొన్న: ఇప్పుడు జొన్న తినే వాళ్లు పెరుగుతున్నారు. సరిపడినంత పంట మార్కెట్లో లేక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాదు రీటైల్‌ మార్కెట్లలో మంచి క్వాలిటీ జొన్న పిండి ధర కిలోకు రూ. 90. పూర్వం జొన్న రకాలు తక్కువ దిగుబడినిచ్చేవి (10-12 క్వి/ఎ.). ఇప్పుడు 20-25 క్వి/ఎ. అంతకంటే ఎక్కువ దిగుబడి నిచ్చే రకాలు అందుబాటులోకొచ్చాయి. ఉదా: పర్భనిశక్తి (ఐ.సి.ఎస్‌.ఆర్‌-14001): గింజ దిగుబడి నీటి ఆధారంగా 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. రెండు తెలుగు రాష్ట్రాలలోను, మహారాష్ట్రలోనూ పండించవచ్చు. ఐరన్‌, జింకు, ప్రోటీన్లు ఎక్కువ. తెల్లగింజ రకం. చలికాలం/యాసంగిలో (నవంబర్‌లో కూడా) విత్తవచ్చు. నీటి సౌకర్యముండాలి. ఐ.సి.ఎస్‌.హెచ్‌-14002: హైబ్రిడ్‌. తెల్లగింజ. చలికాలం/యాసంగిలో విత్తవచ్చు. నీటి ఆధారంగా గింజ దిగుబడి 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. నీటి ఆధారంతో ఈ నెలలో విత్తవచ్చు. ఐరన్‌, జింక్‌ ఎక్కువ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహారాష్ట్రలోనూ విత్తుటకుపయోగం. చొప్ప దిగుబడి కూడా ఎక్కువ. ఎన్‌.టి.జె-5: గింజ దిగుబడి నల్ల నేలల్లో 20-25 క్వి/ఎ. తేలిక నేలల్లో 14-16 క్వి/ఎ. జొన్న మద్ధతు ధర: హైబ్రిడ్‌: రూ. 3180/క్వి. మల్దండి: రూ. 3225/క్వి. జొన్నను నీటి సౌకర్యంతో ఈనెలలో విత్తవచ్చు.

మొక్కజొన్న: అత్యధిక దిగుబడులు సాధించాలంటే విత్తడానికి అనుకూలమైన సమయం అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు. ఈ సమయంలో విత్తడానికి సిఫారస్‌ చేయబడిన ప్రైవేటు హైబ్రిడ్‌లు: 100-120 రోజులవి: 900 ఎం. గోల్డ్‌, ఎన్‌.కె-6240. 90-100 రోజులవి: కోహినూర్‌, ప్రభల్‌. 90 రోజులలోపువి: పయనీర్‌-3342, ఎం.ఎం.హెచ్‌-133. తీపిమొక్కజొన్న కాంపోజిట్‌లు (రైతు పండించిన విత్తనాలను తిరిగి విత్తుకోవచ్చు): ప్రియ, మాధురి, విన్‌ఆరంజ్‌, అల్మోరా. తీపిమొక్కజొన్న హైబ్రిడ్లు (రైతు పండించిన విత్తనాలు తిరిగి విత్తితే దిగుబడి బాగా పడిపోతుంది): షుగర్‌-75, బ్రైట్‌ జీన్‌. తీపిమొక్కజొన్న గింజలలో చక్కెర 20-24 శాతం ఉంటుంది. బేబీకార్న్‌కు అనువైన కాంపోజిట్‌లు: మాధురి తీపి మొక్కజొన్న, హిమ్‌-129, హిమ్‌-123, వి.ఎల్‌-42. బేబికార్న్‌కు అనువైన హైబ్రిడ్లు: హిమ్‌-128, ప్రకాశ్‌, హెచ్‌.ఎం-4. పేలాల రకాలు: అంబర్‌ పాప్‌కార్న్‌, పెర్ల్‌ పాప్‌కార్న్‌, వి.ఎల్‌. అల్మోరా పాప్‌కార్న్‌. క్వాలిటీ ప్రోటీన్‌ రకాలు: ఇందులో రెట్టింపు లైసిన్‌ మరియు ట్రిప్టోఫిన్‌ అనే అమైనోఆమ్లాలుంటాయి. అంబర్‌శక్తి, హెచ్‌.క్యు.పి.ఎం-7, వివేక్‌ క్యు.పి.ఎం-9. పశుగ్రాస రకాలు: ఎ.పి.ఎఫ్‌.ఎం-8, గంగ-5, విజయ కాంపోజిట్‌. వరిమాగాణుల్లో మొక్కజొన్న: దుక్కి దున్నే ఖర్చు మిగులుతుంది. నెలరోజుల పంటకాలం కలిసొస్తుంది. బరువైన తేమను నిలుపుకొనే నేలల్లోనే ఈ పద్ధతి పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుండి జనవరి మొదటి వారం వరకు, రాయలసీమ, తెలంగాణలలో నవంబరు నుండి డిశంబరు వరకు విత్తవచ్చు. ఆ తర్వాత విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. మొక్కజొన్న మద్ధతు ధర: రూ. 2090/క్వి.

శనగ: ఈ పంట మద్ధతు ధర రూ. 5335/క్వి. మద్ధతు ధర కంటే, మార్కెట్‌ ధర అధికంగా ఉంది. ఈ పంట అధిక దిగుబడికి ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 15 నుండి నవంబరు 15 లోగా విత్తాలి. తెలంగాణాలో అక్టోబరు మొదటి నుండి నవంబరు 15 లోగా విత్తాలి. అత్యధిక దిగుబడులనిచ్చే ఎండుతెగులును తట్టుకునే రకాలు: నంద్యాలగ్రామ్‌-857 (ఎన్‌.బిఇ.జి-857): దేశవాళీరకం. దిగుబడి 1-2 నీటి తడులతో 12-14 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. 90-105 రోజుల పంట. తమిళనాడు, కర్ణాటకల్లో కూడా సాగు చేయడానికి అనుకూలం. నంద్యాల గ్రామ్‌-452 (ఎన్‌.బిఇ.జి.-452): దేశవాళి రకం. దిగుబడి 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. ధీర (ఎన్‌.బిఇ.జి-47): దేశవాళీ రకం. 90-105 రోజులు. దిగుబడి 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. యంత్రంతో కోయడానికి అనుకూలం. నంద్యాల గ్రామ్‌-119 (ఎన్‌.బిఇ.జి-119): కాబూలీ రకం. లావు గింజ. 90-100 రోజులు. దిగుబడి 1-2 నీటి తడులతో 10 క్వి/ఎ. వర్షాధారంగా 6-8 క్వి/ఎ.

పెసర: వరి తర్వాత వేసే పెసర పంటను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: టి.ఎం-96-2: గింజ లావుగా మెరుస్తూ ఉంటుంది. అధిక తేమను బూడిద తెగులును తట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అనుకూలం. డబ్లు.జి.జి.-37(ఏకశిల): తెలంగాణకు అనుకూలం. గింజలు పచ్చగా మెరుస్తుంటాయి. ఎల్లోమొజాయిక్‌ తెగులును తట్టుకుంటాయి. దిగుబడి 5-6 క్వి/ఎ. ఎల్‌.జి.జి-407: ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలం. మెరుపుగింజ. మధ్యస్థలావుగింజ. పల్లాకు, నల్లమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది. బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి: 5- క్వి/ఎ. పెసర మద్దతు ధర: రూ. 8558/క్వి. 

మినుము: వరి తర్వాత పంట పెట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ నెలలో మినుము విత్తవచ్చు. అనుకూలమైన పల్లాకు తెగులును తట్టుకునే మధ్యస్థ లావు గింజ గల పాలిష్‌ రకాలు: టి.బి.జి-104: దిగుబడి: 8-9 క్వి/ఎ. 70-75 రోజులు. జి.బి.జి-1: దిగుబడి: 8-9 క్వి/ఎ. 70-75 రోజులు. మినుము మద్ధతు ధర రూ. 6950/క్వి. మార్కెట్‌ ధర మద్ధతు ధర కంటే ఎక్కువగా ఉంది.

వరి: సన్నబియ్యానికి భారతదేశంలోను, ప్రపంచమంతా మస్తు గిరాకీ ఉంది. ఎంత పండించినా మంచి రేటుకు అమ్ముకునేందుకు అవకాశమున్నా ఉపయోగించుకోవడం లేదు. ఉదాహరణకు అమెరికాలో సన్నబియ్యం రెండు రెట్లు ఎక్కువ ధర పెట్టినా సూపర్‌ మార్కెట్‌లలో సరిగా దొరకడం లేదు. కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు బియ్యాన్ని పంచుదామంటే వారికి బియ్యం లభ్యం కాలేదు. తెలంగాణలో బియ్యం నిల్వలు మూలుగుతున్నాయి. దీనికదనంగా ఖరీఫ్‌ పంట చేతికొస్తున్నది. దాన్ని ప్రొక్యూర్‌ చేసి నిల్వ చేయడానికి స్థలం దొరకడం కష్టయ్యే పరిస్థితులు. ఈ విరుద్ధ పరిస్థితులన్నీ సులభంగా అధిగమించవచ్చు. రైతులు ఇంకొంత ఎక్కువ ఆదాయం పొందడానికి, ప్రపంచ మరియు భారతదేశ ప్రజలకు మంచి బియ్యం సులభంగా అనుకూలమైన ధరల్లో లభించేందుకు, రాజకీయ నాయకుల ఆలోచనా విధానంలో మార్పులు రావాలి. సన్నబియ్యాన్ని పండించడాన్ని బాగా ప్రోత్సహించాలి. ఎక్కడికయినా పంపించుకునే హక్కు రైతులకు, ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. మన దేశ స్ట్రాటజిక్‌ అవసరాలకు మించి ఉన్న సరుకునంతా ఎగుమతి చేసుకోవడానికి ఫ్రీగా పర్మిషన్‌ ఉండాలి. రైతులు, వినియోగదారులు దీనివలన లాభపడతారు. వీలయినంతవరకు కంట్రోల్స్‌ తీసివేయడం మంచిదని నా అభిప్రాయం. విదేశీ మారక ద్రవ్యం కూడా ఎక్కువగా సంపాదించవచ్చు. ఖరీఫ్‌ పంట కోతలు నవంబరులో ఎక్కువగా ఉంటాయి. వరి తయారైన వెంటనే కోసి, తుపాన్ల వలన కలిగే నష్టాల నుండి కాపాడాలి. వరి మద్ధతు ధర సాధారణ రకాలకు రూ 2185/క్వి. ఏ గ్రేడ్‌ రకాలకు రూ. 2203/క్వి. వర్షాభావ పరిస్థితుల వలన రిజర్వాయర్లలో నీరులేనిచోట, రబీలో వరి పంట వేయలేకపోతే ఆరుతడి పంటలు కూరగాయలు, పూలు, పశుగ్రాసాలు పండించాలి. చలికాలం/యాసంగిలో, అత్యధిక దిగుబడికి డిశంబరు రెండవ పక్షం నుండి, జనవరి మొదటి వారంలోపు వరినారు పోయడం అనుకూలం. చలికాలపు పంట కడథలో నీటి లభ్యత కష్టమయ్యే పరిస్థితులుంటేగాని, రబీ పంట తర్వాత అపరాలు, కూరగాయలు పండించాలంటే గాని నవంబరులో నారు పోయవచ్చు. ఈ నారు చలి తీవ్రత వలన మెల్లగా ఎదుగుతుంది. పంటకాలం 10-12 రోజులు ఎక్కువవుతుంది. దిగుబడి కూడా సుమారు 15 శాతం వరకు తగ్గుతుంది. మీ ప్రాంతంలో పండించగల్గిన మంచి ధర వచ్చే సన్నగింజ రకాలను సాగు చేసి మంచి ధరల కోసం ప్రభుత్వాలపై ఆధారపడడం తగ్గించుకోండి.

గోధుమ: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నవంబరు 15 లోగా విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: రవ్వకు: ఎం.ఏ.సి.ఎస్‌-2846. 120-130 రోజులు. దిగుబడి: 12 క్వి/ఎ. చపాతీకి: ఎం.ఏ.సి.ఎస్‌-2496. 110-125 రోజులు. దిగుబడి: 15 క్వి/ఎ. బ్రెడ్‌ తయారీకి: డి.డబ్ల్యు.ఆర్‌-162. 126-134 రోజులు. దిగుబడి: 15 క్వి./ఎ.

రాగి: ఆంధ్రప్రదేశ్‌లో రబీ పంటగా నవంబరు-డిశంబరు నెలల్లో విత్తవచ్చు. నారు పెంచి కూడా నాటవచ్చు. రాగి మద్ధతు ధర: రూ. 3846/క్వి. అన్ని కాలాలలోను (ఖరీఫ్‌, రబీ, వేసవి) పండించడానికి అనుకూలంగా ఉండి, అగ్గితెగులును తట్టుకుని, అధిక దిగుబడినిచ్చే రకాలు: ఇంద్రావతి: 14-15 క్వి/ఎ. పాముపొడ తెగులును కూడా తట్టుకుంటుంది. కాల్షియం, ఐరన్‌, జింక్‌ ఎక్కువ. 115-120 రోజుల పంట. సువర్ణముఖి: 14-15 క్వి/ఎ. 105-110 రోజులు. పంట చివరి థలో వచ్చు బెట్టను తట్టుకుంటుంది. వరి మాగాణుల్లోనూ సాగుకు అనుకూలం. తిరుమల: 14-15 క్వి/ఎ. 115-120 రోజులు. గింజ నాణ్యత ఎక్కువ. చొప్ప దిగుబడి కూడా ఎక్కువ.

ప్రత్తి: నవంబరులో మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంది. ప్రత్తి మద్దతు ధర మీడియమ్‌ స్టేపుల్‌ రూ. 6620/క్వి. లాంగ్‌ స్టేపుల్‌ రూ. 7020/క్వి. పంట ఖర్చులు పెరుగుతున్నందున ఈ ధరతో రైతులు సంతృప్తి చెందడం లేదు. మార్కెట్‌ ధరలు కూడా 7000-8000 మధ్యనే ఉన్నాయి. ఇప్పటికే రైతులు ప్రత్తి పండించడం తగ్గించారు. ధరలు బాగుంటేనే వచ్చే సీజన్‌లో ప్రత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. లేకుంటే విస్తీర్ణాన్ని తగ్గించే అవకాశముంది. దిగుబడి తగ్గవచ్చు. దిగుమతి చేసుకున్న ప్రత్తి ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కలుపుకుంటే, మన రైతులకిచ్చే దానికంటే ధర బాగా ఎక్కువవుతుంది. అందువలన మద్ధతు ధర పెంచి మన రైతులకు మేలు చేసి దేశ అవసరాలకు కావలసినంత ప్రత్తి ఇక్కడే పండించుకునేటట్లు చేయాలి. పంట ఎక్కువగా పండితే ఎగుమతి చేయాలి.

కంది: నవంబర్‌ నెలలో ఈ పంటపై ముఖ్యంగా మారుకా మచ్చల పురుగు, కాయతొలుచు పురుగు, కాయఈగ ఆశించే అవకాశముంది. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కంది మద్ధతు ధర: రూ. 7000/క్వి.

బఠాణి: ఈ పంటను నవంబరు 15 వరకు విత్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణ రకాల కంటే దాదాపు రెట్టింపు గింజ దిగుబడినిచ్చే రకం: పంత్‌ అనుపమ (ఐ.పి-3), కాయకు 7 గింజలు. పచ్చికాయ దిగుబడి: 100క్వి/ఎ. 

ఉల్లి: నవంబరులో నారుపోసి డిశంబరులో నాటవచ్చు. అనువైన రకాలు: అర్కనికేతన్‌ : ఎరుపుగడ్డలు, ఘాటు ఎక్కువ. దిగుబడి: 132 క్వి/ఎ. అర్క ప్రగతి: గుండ్రని ఎరుపు గడ్డలు. దిగుబడి: 130 క్వి/ఎ.

కీరదోస: కీరదోసను సాలాడ్‌గా వాడడం ఎక్కువయినందున చలికాలంలో కూడా ధర తగ్గడం లేదు. పాలీహౌస్‌లలో ఈ పంట సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు.

పూలు: కార్తీక సోమవారాలలోను, కార్తీక పౌర్ణమిరోజు నోములు, పూజలున్నందున పూలకు మంచి గిరాకీ ఉంటుంది. దీపావళికి కూడా పూల వినియోగమెక్కువ. పూజలెక్కువగా ఉండే రోజులకు 2-3 రోజుల ముందునుండే పూలను కొని ప్రిజ్‌లలో పెట్టుకునే అలవాటుంటుంది. దీనిని గమనించి పూలను తెంపడం, మార్కెట్‌కు తరలించడం పండుగకు 2-3 రోజుల నుండి పండుగ రోజులోపల పూర్తి చేయాలి. ధరలు అప్పుడే ఎక్కువగా ఉంటాయి.

పశుగ్రాస పంటలు: ఈ నెలలో విత్తదగిన పశుగ్రాస పంటలు: మొక్కజొన్న, జొన్న, జనుము, లూసర్న్‌, ఓట్స్‌్‌, అలసంద, పిల్లిపెసర.

గెనుసుగడ్డ/చిలగడదుంప: నవంబరులో తీగలను నాటవచ్చు.

పూలు: పాలీహౌస్‌లలో కార్నేషన్‌, గులాబీ సాగు ఈనెలలో చేపట్టవచ్చు. గులాబీ, మల్లె, జెర్బెరా, చామంతి పూల మొక్కలను ఈ నెలలో నాటవచ్చు.

మిరప: రబీ పంటగా అక్టోబరు, నవంబరు నెలల్లో నారుపోసి, 6 వారాల నారును నాటవచ్చు. మంచి రకాలు: ఎల్‌.సి.ఏ-625, ఎల్‌.సి.ఏ-620, ఎల్‌.సి.ఏ-436, ఎల్‌.సి.ఏ-424, కాశీఅభ.

క్యాబేజి, కాలీఫ్లవర్‌, క్యారెట్‌: నవంబర్‌లో నాటవచ్చు.

విలువలు – రైతు ప్రజా సంఘాలు: ప్రజాజీవితంలో విలువలను పెంచి ప్రజల అభివృద్ధి రాజకీయాలకతీతంగా జరిపేందుకు సహాయపడగల రైతు ప్రజా సంఘాల ఏర్పాటుకు సహకరిద్దాం. నీతి, న్యాయం, ధర్మం, నిలబెట్టాలంటే అభివృద్ధిలో అందరూ కులమతాలకతీతంగా ఉత్సాహంగా పాల్గొనేందుకు రైతు ప్రజాసంఘాలను అన్ని ఆవాస ప్రాంతాల్లో ప్రోత్సహిద్దాం.

Read More

స్వయం ఉపాధిగా సేంద్రియ ఎరువులు, కషాయాలు

మనది అధిక జనాభా కలిగిన దేశం. మన దేశం అధిక జనాభాలో చైనాను దాటి ఇటీవలే ప్రథమ స్థానానికి ఎగబాకింది. జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూంది. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చూపించే అంత మొత్తంలో పరిశ్రమలు లేదా వ్యవసాయేతర మార్గాలు రాగలవా? అంటే సమాధానం ప్రశ్నార్థకమే. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకే ఉందనే విషయం అక్షర సత్యం. ఈ విషయాన్ని అనేకమంది రైతులు నిరూపించారు. ఇంకా నిరూపిస్తూనే ఉన్నారు. ఈ కోవలో చేరింది శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలం, రామన్నపేటకు చెందిన వరలక్ష్మి.

వరలక్ష్మిది వ్యవసాయ నేపథ్యం. వారికి కేవలం అర ఎకరం పొలం మాత్రమే ఉంది. అర ఎకరం పొలంలో వరి పంట సాగు చేస్తూ జీవితాలను కొనసాగిస్తుండగా సుభాష్‌పాలేకర్‌ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి వినడం జరిగింది. ఈ పద్ధతుల గురించి ఇంకా ఎక్కువ అవగాహన కలిగించుకునేందుకు గాను వరలక్ష్మి బావగారు గుంటూరులో ఏర్పాటు చేసిన సుభాష్‌ పాలేకర్‌ గారి అవగాహనా సదస్సుకు హాజరయ్యి అన్ని విషయాలను కక్షుణ్ణంగా తెలుసుకుని తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ, భూమి ఆరోగ్యం కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సక్రమమైనవి అని తెలుసుకుని ఈ వ్యవసాయ పద్ధతిని తమ జీవనోపాధిగా మలుచుకోవాలని నిర్ణయించుకుని 2018వ సంవత్సరంలో 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటల సాగు మొదలు పెట్టారు.

అక్టోబర్‌ 14, 2023న కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతులమీదుగా ‘రైతునేస్తం పురస్కారం’ అందుకుంటున్న శ్రీమతి పనస వరల/. చిత్రంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, శ్రీమతి ముప్పవరపు రాధ, రైతునేస్తం ఛైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు

5 ఎకరాలలో మొదటి పంటగా వరి పంటని సాగు చేస్తుంటారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు ఎకరానికి 30 కిలోల వివిధ రకాల విత్తనాలను పిఎమ్‌డిఎస్‌ (ప్రీమాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ పద్ధతి) పద్ధతిలో చల్లి అవి పూతకు వచ్చే సమయంలో భూమిలో కలియదున్ని వరి సాగు మొదలు పెడతారు. ప్రస్తుతం 5 ఎకరాలలో స్వర్ణ రకం వరి సాగులో ఉంది. ఈ రకానికి చీడపీడల బెడద తక్కువగా ఉండడంతో పాటు ఆహారంగా తినడానికి కూడా బాగా ఉంటాయి కాబట్టి ఈ రకాన్ని ఎంచుకున్నారు. 5 ఎకరాలకు గాను ఒక ఎకరంలో లైను నాటు పద్ధతి, మిగతా 4 ఎకరాలలో మామూలు నాట్లు వేసే పద్ధతిని పాటించి వరి నారుని నాటించారు. నారు నాటే ముందు కూడా పశువుల ఎరువు మరియు ఘనజీవామృతంను దమ్ములో అందించారు. నారు నాటిన తరువాత క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని అందిస్తూ వస్తుంటారు. చీడపీడల నివారణకు గాను కాలి బాటలు తీయడం, పక్షి స్థారాలు ఏర్పాటు చేయడం, పసుపు రంగు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేస్తుంటారు. గట్లపై ఎర పంటలుగా బంతి లాంటి పంటలు కూడా సాగు చేస్తుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చీడపీడలు ఆశించినట్లయితే నీమాస్త్రం, అగ్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, జిల్లేడు కషాయం లాంటి వాటిని పిచికారి చేస్తుంటారు.

మామూలు నారు నాటే పద్ధతితో పోల్చుకుంటే లైనులో నారు నాటే పద్ధతిలో మొక్కలకు గాలి, వెలుతురు సక్రమంగా అందించడం వలన చీడపీడల బెడద తక్కువగా ఉండడం, దుబ్బు బాగా చేసి, ఎక్కువ పిలకలు రావడం, వచ్చిన అన్ని పిలకలు వెన్ను వేయడం వారు ప్రత్యక్షంగా చూశారు. పిలకలు ఎక్కువగా రావడము వలన దిగుబడి ఎకరానికి 3 బస్తాల వరకు పెరగడముతో పాటు, కోత సులభంగా ఉండడము, కోత కోసిన తరువాత వాటిని ప్రక్కకు పడవేసినప్పుడు అవి దుబ్బుల మీద పడడం జరిగి వర్షం లాంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా వడ్లు పాడవకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయని వరలక్ష్మి అంటున్నారు.

వరి పంట అయిన తరువాత రబీ సీజనులో మినుము, పెసర లాంటి అపరాల పంటలు, గోరుచిక్కుడు లాంటి కూరగాయ పంటలు వేస్తుంటారు. గట్ల మీద వివిధ రకాల ఆకుకూరలు, వంగ, బెండ, టమాట, బీర, కాకర లాంటి కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. గట్ల మీద వేసిన కూరగాయలను సొంతానికి ఉపయోగించుకుని మిగిలిన వాటిని నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తుంటారు. వాటి మీద వచ్చిన ఆదాయం వరి మరియు అపరాల పంటలకు పెట్టుబడిగా సరిపోతుంది. కాబట్టి వరి మరియు అపరాల పంటలలో వచ్చిన దిగుబడి మొత్తం నికర ఆదాయంగా మిగులుతుందని వరలక్ష్మి అన్నారు.

ఎకరానికి 22 నుండి 25 బస్తాల వడ్లను పండించి, వడ్లను అదేవిధంగా అమ్మకుండా కొన్ని రోజులు నిల్వ ఉంచి పాతవి అయిన తరువాత బియ్యం పట్టించి 25 కిలోల బస్తాను 1400/-ల చొప్పున నేరుగా వినియోగదారులకు అమ్ముతూ వస్తున్నారు. అపరాలు అయిన పెసర, మినుములను కూడా అదేవిధంగా అమ్మకుండా వాటిని పప్పు పట్టించి నేరుగా వినియోగదారులకు ఆశాజనకమైన ధరలకు అమ్మకం చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నామని వరలక్ష్మి తెలియజేశారు.

వారి గ్రామంలో ఎన్‌పియం షాపు ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా తమ పంట ఉత్పత్తులను అమ్మకం చేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల ఎరువులు, కషాయాలు, ద్రావణాలను తోటి రైతులకు అమ్మకం చేసి ఆదాయం గడిస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారం ఉండి, అందుబాటులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా ఉపయోగించుకోగలిగితే స్వయం ఉపాధిగా ప్రకృతి వ్యవసాయం సరైనదారి అని వరలక్ష్మి కుటుంబం నిరూపిస్తున్నారు. మరిన్ని వివరాలు 9390307751 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

– వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

కూరగాయలకు స్థిరంగా పెరుగుతున్న గిరాకీ

మానవుల ఆహారంలో గత కొన్ని థాబ్దాల్లో చాలా మార్పులు సంభవించాయి. గింజధాన్యాలు, పప్పుధాన్యాల ప్రాముఖ్యత కొంత తగ్గుతుండగా పండ్లు, కూరగాయలు, వంటనూనెలు, పాలు, గ్రుడ్లు, మాంసం వంటి అనుబంధ పదార్థాల వాటా క్రమేపీ పెరుగుతున్నది. సాంప్రదాయ పంటల సాగు గిట్టుబాటుగా లేకపోవటం వల్ల ఉద్యానవన పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి అనుబంధ వ్యాపకాలవైపు పెట్టుబడులు మళ్ళుతున్నాయి. నీటివసతితోపాటు శ్రామికుల లభ్యత పష్కలంగా ఉన్న ప్రాంతాల్లో కూరగాయల సాగు వాణిజ్యస్థాయిలో జరుగుతున్నది. 1951లో దేశంలో 28.4 లక్షల హెక్టార్లలో కూరగాయల్ని సాగు చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. హెక్టారుకి 5.8 టన్నుల దిగుబడితో 165 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తయ్యాయి. తలసరి కూరగాయల ఉత్పత్తి, లభ్యత రోజుకి 88 గ్రాములు మాత్రమే. 2021-22లో కూరగాయల సాగు 113.5 లక్షల హెక్టార్లలో జరగ్గా హెక్టారుకి 18 టన్నుల సగటు దిగుబడితో 2048 లక్షల టన్నులు ఉత్పత్తయినట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ఏడు థాబ్దాల కాలంలో కూరగాయల విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగింది. హెక్టారు దిగుబడి 2.72 రెట్లు పెరిగింది. ఉత్పత్తి 11 రెట్లు పెరిగినందువల్ల తలసరి లభ్యత రోజుకి 400 గ్రాములకు ఎగబాకింది. 2021లో ప్రపంచంలో ఉత్పత్తయిన 1150 మిలియన్‌ టన్నుల్లో భారతదేశం వాటా సుమారు 18 శాతంగా ఉంది. అల్లం, బెండకాయల ఉత్పత్తిలో భారత్‌కు ప్రథమ స్థానం ఉండగా, బంగాళాదుంప, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్‌, కాబేజీ, వంకాయ వంటి అనేక కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచింది. దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు 2021-22లో 6986 కోట్ల రూపాయల విలువైన తాజా కూరగాయల్ని, దాదాపు ఎనిమిదివేలకోట్ల రూపాయల విలువైన శుద్ధి చేసిన కూరగాయల్ని ఎగుమతి చేయడం జరిగింది. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, మిశ్రమ కూరగాయల్ని శుద్ధి చేసి, ఎగుమతి చేస్తున్నది. పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు కూరగాయల ఉత్పత్తిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తూ, సగానికి పైగా కూరగాయల్ని పండిస్తున్నాయి. ప్రపంచ సగటు దిగుబడితో పోలిస్తే ఆలుగడ్డ, కాలీఫ్లవర్‌ల విషయంలోనే భారతదేశపు సగటు దిగుబడి ఎక్కువ. కాబేజీ, వంగ, బెండ, ఉల్లిగడ్డ, టమాటాల దిగుబడి ప్రపంచ సగటు దిగుబడితో పోలిస్తే దేశంలో తక్కువగానే ఉంది. మొత్తం కూరగాయల సగటు దిగుబడి ప్రపంచ సగటు దిగుబడితో పోలిస్తే తక్కువగానే ఉంది. 

ముఖ్యమైన కూరగాయలు

మొత్తం కూరగాయల ఉత్పత్తిలో 28.9 శాతం వాటాతో ఆలుగడ్డదే అగ్రస్థానం. 11.3 శాతం వాటాతో టమాట రెండవ స్థానంలోనూ, 10.3 శాతం వాటాతో ఉల్లిగడ్డ మూడవ స్థానంలో నిలిచాయి. 8.1 శాతం వాటాతో వంకాయ, 5.5 శాతం వాటాతో కర్రపెండలం, 5.4 శాతం వాటాతో కాబేజి, 4.6 శాతం వాటాతో కాలీఫ్లవర్‌, 3.9 శాతం వాటాతో బెండకాయ, 2.4 శాతం వాటాతో బఠానీ, 0.8 శాతం వాటాతో చిలగడదుంపలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన కూరగాయలన్నింటికీ కలిపి 18.8 శాతం వాటా ఉంది. 1961లో దేశంలో 3.75 లక్షల హెక్టార్లలోనే బంగాళాదుంపను సాగు చేయగా, 7.25 టన్ను సగటు దిగుబడితో 27.19 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. 2022-23 సంవత్సరంలో దేశంలో బంగాళాదుంప సాగు 23.5 లక్షల హెక్టార్లకు పెరిగింది. బంగాళా దుంప విస్తీర్ణం 6.27 రెట్లు పెరగటం ఒక విశేషమైతే, ఉత్పత్తి సుమారుగా 22 రెట్లు పెరిగి 597.4 లక్షల టన్నులకు చేరింది. ఉత్పాదకత కూడా 3.5 రెట్లు పెరిగి హెక్టారుకి 25.4 టన్నులకు చేరింది. బంగాళాదుంప ఉత్పత్తి 22 రెట్లు పెరగటం కూరగాయల ఉత్పత్తి వేగంగా పుంజుకోవటానికి దోహదపడింది. ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రాలు ఆలుగడ్డ ఉత్పత్తిలో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 1961లో టమాటా కేవలం 50 వేల హెక్టార్లలో మాత్రమే సాగయింది. హెక్టారుకి 9 టన్నుల చొప్పున దిగుబడి 4.64 లక్షల టన్నులే. 2022-23లో టమాట సాగు 19.28 రెట్లు పెరిగి 8.64 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దిగుబడి కూడా 2.65 రెట్లు పెరిగి 23.87 టన్నులకు చేరింది. ఉత్పత్తి 44.4 రెట్లు పెరిగి 206.2 లక్షల టన్నులకు చేరింది. ఇంత విరివిగా ఉత్పత్తి పెరగటంతో టమాట సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు టమాట ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. మరో ముఖ్యమైన పంట ఉల్లిగడ్డను కూడా 1961లో కేవలం 1.2 లక్షల హెక్టార్లలోనే సాగు చేశారు. హెక్టారుకి 10 టన్నుల దిగుబడితో కేవలం 12 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు ఉత్పత్తయ్యాయి. 2022-23 సంవత్సరంలో ఉల్లిసాగు విస్తీర్ణం 4.83 రెట్లు పెరిగి 5.8 లక్షల హెక్టార్లకు విస్తరించింది. సగటు దిగుబడి 53.45 టన్నులకు చేరటం ద్వారా 7.48 రెట్ల వృద్దిని నమోదు చేసింది. ఫలితంగా ఉల్లి ఉత్పత్తి 310.1 లక్షల టన్నులకు పెరిగి 25.84 రెట్లకు చేరింది. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు ఉల్లి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచాయి. టమాట ఉత్పత్తి 62 సంవత్సరాల్లో 44 రెట్లు, ఉల్లి ఉత్పత్తి 26 రెట్లు, ఆలుగడ్డ ఉత్పత్తి 22 రెట్లు పెరగటం కూరగాయల ఉత్పత్తిని పెంచటానికి దోహదపడ్డాయి. ఈ మూడు రకాల కూరగాయలు దేశమంతటా వినిమయదారుల ఆదరణను చూరగొని, లభ్యతమైతున్నాయి. వీటి ధరలు తగ్గినప్పుడు రైతులు, పెరిగినప్పుడు వినిమయదారులు గగ్గోలు పెడుతుంటారు. ప్రభుత్వాలు కూడా వీటి ఎగుమతుల్ని నియంత్రించడం ద్వారా ధరల్ని అదుపులో ఉంచే ప్రయత్నాలను చేస్తుంటాయి. వంగతోటల సాగు 1961లో 1.50 లక్షల హెక్టార్లలో జరిగి, హెక్టారుకి 7 టన్నుల దిగుబడితో 9.9 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. 2022-23లో వంగతోటల సాగు 7.6 లక్షల హెక్టార్లకు విస్తరించింది. మొత్తం ఉత్పత్తి 126.1 లక్షల టన్నులకు పెరిగి, 16.59 టన్నుల సగటు దిగుబడిని దేశం సాధించింది. దిగుబడి 2.37 రెట్లుకి చేరుకోవడం, విస్తీర్ణం 5.07 రెట్లు పెరగటం వల్ల ఉత్పత్తి 12.74 రెట్లు పెరిగింది. పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, బీహార్‌లు వంకాయ ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా వంకాయ ఉత్పత్తి గణనీయమైన స్థాయిలోనే ఉంది. కర్రపెండలాన్ని కూడా కూరగాయల్లో లెక్కించినా, దానిని వరి బియ్యానికి ప్రత్యామ్నాయంగానే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నారు. కేబేజి ఉత్పత్తి 1961లో 2.88 లక్షల టన్నులు మాత్రమే. 2022-23లో అది 9.95 లక్షల టన్నులకు పెరిగింది. పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సాలు ఈ కూరగాయను అధికంగా పండిస్తున్నాయి. కాలీఫ్లవర్‌ ఉత్పత్తి 1961లో 4.13 లక్షల టన్నులుంటే, 2023కి అది 8.8 లక్షల టన్నులకు పెరిగింది. పశ్చిమబెంగాల్‌, బీహార్‌, హర్యానా, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఈ కూరగాయను ఎక్కువగా పండిస్తున్నాయి. బెండకాయల ఉత్పత్తి 1961లో 7.75 లక్షల టన్నులుండగా, 2022-23లో 33.24 లక్షల టన్నులకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా రాష్ట్రాలు ఈ కూరగాయను ఎక్కువగా పండిస్తున్నాయి. ఇలాగే బఠానీ, చిలగడదుంప, తీగ పంటలైన బీర, సొర, పొట్ల, కాకర, దొండ, బీన్స్‌, చిక్కుడు వంటి కూరగాయల ఉత్పత్తిలో కూడా ఎంతో కొంత వృద్ధి ఉండటం వల్లనే, దేశం కూరగాయల లభ్యత విషయంలో స్వయం సమృద్ధిని కలిగి ఉంది. ఐతే జనాభా పెరుగుదల సంవత్సరానికి 1.5 శాతం ఉండగా, కూరగాయలకు గిరాకీ సంవత్సరానికి మూడు శాతం కన్నా ఎక్కువగా పెరుగుతూ ఉండటం వల్ల కూరగాయల విస్తీర్ణంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతున్నా సరిపోవటం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల సాగు

కూరగాయల సాగు, ఉత్పత్తి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు కొంత వెనకబడే ఉన్నాయి. 2017లో భారత ప్రభుత్వం ప్రచురించిన స్టాటిస్టికల్‌ ఇయర్‌ బుక్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2.44 లక్షల హెక్టార్లలో కూరగాయల సాగు జరిగింది. 28.54 టన్నుల హెక్టారు దిగుబడితో 69.81 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తయి, దేశంలోని రాష్ట్రాలలో పదవ స్థానంలో నిలిచింది. తెలంగాణాలో 1.39 లక్షల హెక్టార్లలో కూరగాయల్ని పండించారు. 19.78 టన్నుల సగటు దిగుబడితో 27.54 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తయి, దేశంలోని రాష్ట్రాలలో 15వ స్థానంలో నిలిచింది. తెలంగాణా ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం కూరగాయల తలసరి లభ్యత రోజుకి 250 గ్రాములు మాత్రమే. జాతీయ పోషక విలువల అధ్యయన సంస్థ ప్రకారం రోజుకి 32.5 గ్రాములు అవసరం. దానితో పోలిస్తే 23 శాతం కొరత ఉన్నట్లు అర్థమౌతున్నది. టమాట, వంగ, కాబేజి, కాలీఫ్లవర్‌, దోస, కారట్‌, ముల్లంగి పంటల్లో తెలంగాణ కొంత మిగులు కలిగి ఉంటే, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, కాకర, బీర, పచ్చిమిర్చి, బెండ, సొర, బీన్స్‌, కాప్సికం, చేమ, కందలతో పాటు ఇతర కూరగాయల విషయంలో కొరతను ఎదుర్కుంటున్నది. కూరగాయల ఉత్పత్తిని పెంచటానికి ‘పంటకాలనీ’లను ప్రోత్సహిస్తామని ఉద్యానవన శాఖ కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో 36.5 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2017 కి అది 27.34 లక్షల టన్నులకు తగ్గగా తాజా అంచనాల ప్రకారం 2022-23లో 13.05 లక్షల టన్నులకు మరింత తగ్గింది. కూరగాయల భారీ దిగుమతులపై రాష్ట్రంలోని నగరాలన్నీ ఆధారపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ పండ్ల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానానికి చేరుకున్నది. 7.5 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలుండగా 180 లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తయినట్లు అంచనా వేశారు. కాని కూరగాయల ఉత్పత్తి మాత్రం 64.46 లక్షల టన్నులకే పరిమితమై, తొమ్మిదవ స్థానంలో నిలిచింది. 2020-21లో ఆంధ్రప్రదేశ్‌లో కూరగాయల సాగు 2.64 లక్షల హెక్టార్లలో జరిగి, 75.38 లక్షల టన్నులు ఉత్పత్తయినట్లు రాష్ట్ర ఉద్యాన వన శాఖ ప్రకటించింది. కానీ తర్వాతి రెండు సంవత్సరాల్లో కూరగాయల ఉత్పత్తి 2020-21 స్థాయిని అధిగమించలేదు. టమాట, మిర్చి, కాప్సికం, బెండ, వంగ, కొన్ని ఆకుకూరల విషయంలో మిగులు ఉత్పత్తి ఉన్నా, ఇతర కూరగాయల విషయంలో కొరత ఉంది. పండ్లు, చేపలు, రొయ్యలు, గ్రుడ్ల వంటి ఉత్పత్తుల విషయంలో అగ్రస్థానంలో ఉన్నా కూరగాయల విషయంలో దేశంలో 9, 10 స్థానాల్లోనే నిలుస్తున్నది. కూరగాయల తలసరి లభ్యత జాతీయ సగటుకి సమీపంలోనే తారసలాడుతున్నది.

సాగు లాభదాయకత

కూరగాయల సాగు విస్తీర్ణంలో పెరుగుదల కనిపిస్తుందంటే వాటి సాగు లాభదాయకంగా ఉందనే విషయం స్పష్టమౌతున్నది. వరి పంటలో నికరాదాయం హెక్టారుకి 50 నుండి 60 వేల రూపాయల ఆదాయం నికరంగా లభిస్తుండగా, కూరగాయల పంటల నుండి హెక్టారుకి ఒక లక్షల రూపాయల నుండి లక్షన్నర రూపాయల వరకు నికరాదాయం లభించే అవకాశముంది. పలు అధ్యయనాలు ఈ విషయాన్ని  స్పష్టం చేసాయి. అయితే ప్రతి సీజన్‌లోనూ ఇది జరుగుతుందని చెప్పలేము. వర్షాబావం, అధిక వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు, కొన్నిసార్లు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. మార్కెట్‌లో కూరగాయ ధరలు ఒక్కోసారి పతనమై, ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంటుంది. కానీ నాలుగైదు సీజన్‌ల సగటు ఆదాయాలను లెక్కిస్తే సాంప్రదాయంగా పండించే గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలతో పోలిస్తే కూరగాయ పంటల ద్వారా రెట్టింపు ఆదాయం లభిస్తుందనే అవగాహన కలుగుతుంది. కూరగాయల ధరల సూచీ సాంప్రదాయ పంటల ధరలతో పోలిస్తే వేగంగా పెరిగింది. 2012లో 100గా ఉన్న కూరగాయల ధరల సూచీ 2023 ఆగస్టు నాటికి 250కి పెరిగింది. 2012లో వడ్ల మద్దతు ధర క్వింటాలుకి రూ. 1250గా ఉండగా, అది 2023కి రూ. 2183 కి పెరిగింది.

11 సంవత్సరాల వ్యవధిలో వరి మద్దతు ధర 75 శాతం పెరిగింది. ఇదే సమయంలో కూరగాయల ధరల సూచీ 150 శాతం పెరిగింది. ప్రజల ఆహార అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా కూరగాయలకు గిరాకీ స్థిరంగా పెరుగుతున్నది. కూరగాయల సాగు కూడా అనేక కొత్త పుంతలు తొక్కుతున్నది. ఎత్తైన బెడ్‌లు తయారు చేయటం, వాటిపై ప్లాస్టిక్‌ షీట్‌లను పరచడం, బిందు, తుంపర సేద్యాల ద్వారా నీరు సరఫరా చేస్తూ, మొక్కలకు అవసరమైనప్పుడు కర్రల ఊతాన్నందిస్తూ, పందిళ్ళపై పాకించటానికి వేర్వేరు పదార్థాలను వాడుతూ, సూక్ష్మపోషక పదార్థాలను అందిస్తూ అనేక మెరుగైన సేద్యపు పద్ధతులను వాడుతున్నారు. వీటన్నిటికీ అదనపు పెట్టుబడిని పెడుతున్నారు. అనేక కూరగాయల్లో సంకర రకాలను వాడుతున్నారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కలను అధిక ధరకు కొనుగోలు చేసి, సమయాన్ని ఆదా చేస్తున్నారు. ఈ చర్యలన్నీ దిగుబడులను పెంచటానికి ఉపయోగపడుతున్నాయి. అధునాతనమైన షేడ్‌నెట్‌లు, గ్రీన్‌హౌస్‌లను కూడా కొందరు వినియోగిస్తున్నారు. కూరగాయల సాగులో వ్యవసాయం పెట్టుబడి సాంద్రత కల్గిన వాణిజ్యంగా మారుతున్నది. కొందరు దిగుబడి తగ్గినా సేంద్రియ పద్ధతుల్లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన కూరగాయల్ని పండిస్తున్నారు. సేంద్రియ కూరగాయలకు మార్కెట్‌ గిరాకీ క్రమేపీ పెరుగుతున్నది. రసాయనిక ఎరువుల్ని, పురుగుమందుల్ని ఎక్కువగా వాడకుండా ‘బాధ్యతాయుత’ వ్యవసాయం చేస్తున్న రైతులు, సేంద్రియ కూరగాయలకు ఎక్కువ ధరను చెల్లించటానికి సిద్ధపడుతున్న వినిమయదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నారు. శాఖాహారం, వీగన్‌ ఉద్యమాలు కూడా ప్రపంచమంతటిలాగానే భారతదేశంలో కూడా బలపడుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ కూరగాయలకు మరింత గిరాకీని పెంచేలా ఉన్నాయి. కూరగాయల సాగు మరింత విస్తీర్ణాన్ని ఇతర పంటల నుండి ఆకర్షించవచ్చు. కూగరాయల ఎగుమతి అవకాశాలు కూడా భవిష్యత్‌లో మరింత పెరగవచ్చు. ఇప్పటికి కేవలం మూడు శాతం కూరగాయలనే శుద్ధి చేసి, విలువను జోడిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడుతున్న ప్రవాస భారతీయుల సంఖ్య పెరిగే కొద్దీ తాజా కూరగాయలు, శుద్ధి చేసిన కూరగాయలకు ఎగుమతి అవకాశాలు పెరగవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూరగాయల సాగుకి ప్రోత్సాహకాలనందించి స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తాయని ఆశిద్దాము. 

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ ఞ కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More