వ్యవసాయ కోర్సుల ప్రవేశాలలో ప్రైవేటు సంస్థల మాయాజాలం లో పడొద్దు – వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులతి

తెలంగాణా రాష్ట్రం లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కదానికే ఏ గ్రేడ్ తో కూడిన ఐకార్ గుర్తింపు ఉందని ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య స్పష్టం చేశారు.విద్యార్థులు, తల్లితండ్రుల ప్రయోజనార్ధం ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపారు. గుర్తింపులేని ప్రైవేటు కళాశాలల తో PJTAU కు ఎలాంటి సంబధం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లో సీట్లు ఇప్పిస్తామని ప్రచారం చేసుకునే దళారుల మాటలు విద్యార్థులు , వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోవద్దని తెలిపారు. అలాంటి వ్యక్తులు, సంస్థలతో విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధం, భాగస్వామ్యం లేదని వివరించారు. ప్రవేశాల సమయం లో అప్రమత్తం గా ఉండాలని విద్యార్థులు, తల్లితండ్రులకి ఆయన సూచించారు. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ప్రత్యేక కోటాలో ఫీజులు భారీగా తగ్గించడమే కాకుండా… సీట్లు కూడా పెంచామని.. పెంచిన సీట్లను కౌన్సెలింగ్ ద్వారా ప్రతిభ ఆధారం గానే PJTAU రెగ్యులర్, ప్రత్యేక కోటా లో ప్రవేశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఎటువంటి మధ్య దళారీలు, కన్సల్టెంట్ ల పైన ఆధార పడవద్దని, వారి మాయ మాటలని నమ్మ వద్దని ఉపకులపతి మరోసారి సూచించారు. ఇతర అనధికారిక వెబ్ సైట్ లలో లభ్యం అయ్యే సమాచారానికి విశ్వవిద్యాలయానికి సంబంధం లేదని తెలిపారు. పెంచిన ప్రత్యేక కోటాసీట్ల భర్తీ కోసం ప్రస్తుతం ఆన్లైన్ లో దరఖాస్తులు నవంబర్1 వ తేదీ వరకు స్వీకరిస్తున్నామని.. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ప్రవేశాలకి సంబంధించిన సమాచారం కొరకు తల్లితండ్రులు, విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్ www.pjtsau.edu.in మాత్రమే చూడవలసింది గా ఉప కులపతి జానయ్య సూచించారు.

Read More

మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌ అధికారులతో పంటల కొనుగోళ్ళపై మంత్రి తుమ్మల సమీక్ష

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు మార్క్‌ ఫెడ్‌, మార్కెటింగ్‌ అధికారులతో ధాన్యపు కొనుగోళ్ళు, పత్తి కొనుగోళ్ళు, ఇతర పంటల కొనుగోళ్ళ మీద పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముందుగా మార్క్‌ఫెడ్‌ అధికారులతో సమావేశమై ఖరీఫ్‌ కొనుగోళ్ళపై ఆరా తీశారు. మార్క్‌ ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ, పెసర కొనుగోళ్ళు పూర్తి కావచ్చాయని, ఇప్పటికే 8.03 కోట్లు విలువ గల 924.85 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశామని, ఇంకా ఒకట్రెండు మార్కెట్లలో మాత్రమే పెసరు పంట వస్తుందని, అంతేకాకుండా 35.86 కోట్లు వెచ్చించి 4,793 రైతుల వద్ద నుండి 7330.50 మెట్రిక్‌ టన్నలు సోయాచిక్కుడు కొనుగోలు చేశామని, ఇంకా 50,000 టన్నులు వచ్చే మార్కెట్లకు అవకాశాముందని మార్కెఫెడ్‌ అధికారులు మంత్రికి తెలియజేశారు. పంట కొనుగోలు పూర్తి కాగానే, ఎక్కడ ఏ మార్కెట్లలో ఎక్కువ రేటు ఉందో విచారించి, డిస్పోసల్‌ చేసేవిధంగా ప్రణాళిక చేసుకోవల్సిందిగా, తద్వారా మార్క్‌ఫెడ్‌ ఆదాయం పెంచే విధంగా చూడాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఎరువుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ప్రతియేటా మార్క్‌ఫెడ్‌కు నిర్వహణ ఖర్చులు, రవాణా ఖర్చులను సహేతుక పద్దతుల ద్వారా నిర్వహించి, ప్రతి ఏటా పెరిగే ఖర్చుల భారాన్ని తగ్గించే విధంగా ప్రయత్నించాలని, రైతులకు ఇబ్బంది రాకుండా వచ్చే యాసంగిలో కూడా ఎరువుల సరఫరా సక్రమంగా అయ్యేటట్లు చూడాలని మంత్రి ఆదేశించారు.
ఆ తరువాత రాష్ట్రంలో పత్తి కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాలపై మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ మరియు మార్కెటింగ్‌ అధికారులతో సమీక్షించారు పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించేందుకు మరియు రైతులకు అవసరమైన మద్దతు ధర అందించేందుకు మంత్రి పలు సూచనలు చేశారు. పత్తి MSP కొనుగోలుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలపై రైతులకు మార్కెట్‌ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద నిరంతరము అవగాహన కల్పించాలని, మార్కెటింగ్‌ అధికారులు, ఉన్నతాధికారులు నిరంతరము ఆయా మార్కెట్‌యార్డులలో, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పత్తి రైతులు తేమ విషయంలో పడుతున్న ఇబ్బందులను CMD, CCI గారితో మాట్లాడి వారి దృష్టికి తీసుకెళ్లాలని, పత్తిలో తేమశాతం ఎక్కువ ఉన్నా కూడా CCI వారే కొనుగోలు చేసేలా చూడాలన్నారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పత్తి రైతులకు అవసరమైన మద్దతు అందించి, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా ధాన్యపు కొనుగోలు ఆరంభమైనందున, అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైనంత మేర టార్ఫలిన్‌ అందుబాటులో ఉంచాలని, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు, సన్నబియ్యం నిర్ధారణ చేసే పరికరాలు ప్రతీ కొనుగోలు కేంద్రానికి చేరాయా లేదా అనేది చూసుకోవాల్సిందిగా అడిషనల్‌ డైరెక్టర్లు, జాయింట్‌ డైరెక్టర్లను ఆదేశించారు.

Read More

వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ద్వారా పత్తి రైతుల సౌకర్యార్థం వాట్స్‌ యాప్‌ సేవలు ప్రారంభం – మంత్రి తుమ్మల

8897281111 వాట్స్‌ యాప్‌ నెంబర్‌ ద్వారా పత్తి కొనుగోలు సంబంధిత సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమైందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని వాట్స్‌ యాప్‌ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు.
8897281111 అనే వాట్స్‌ యాప్‌ నెంబర్‌ ద్వారా పత్తి రైతులు, పత్తి కొనుగోలు సంబంధిత సేవలు అంటే రైతు పత్తి అమ్మకం, అర్హత, అమ్మకాల వివరాలు, చెల్లింపు స్థితి, ్పు్పు| సెంటర్‌లలో వేచి ఉండే సమయం, కొనుగోలు వివరాలు వంటి అంశాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్స్‌ యాప్‌ చాట్‌ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు కలుగుతుందని మంత్రి తెలిపారు.
పింజ రకము (BB MODE) ఒక క్వింటాలుకు రూ.7521/- , (పింజ పొడువు (మి. మీ) 29.5 నుండి 30.5, మైక్రోనీర్‌ విలువ 3.5 నుండి 4.3)గా, పింజ రకము (BB SPL) ఒక క్వింటాలుకు రూ. 7471/- (పింజ పొడువు (మి. మీ) 29.01 నుండి 29.49, మైక్రోనీర్‌ విలువ 3.6 నుండి 4.8)గా, పింజ రకము (MECH) ఒక క్వింటాలుకు రూ 7421/- పింజ పొడువు (మి. మీ) 27.05 నుండి 28.5, మైక్రోనీర్‌ విలువ 3.5 నుండి 4.7 గా పత్తికి కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
పత్తిలో తేమ శాతము 12% మించకుండా ఉండి, 8% నుండి 12% మద్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుంది. తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర లభిస్తుంది. కావున రైతులు తమ పత్తిని పూర్తిగా ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉందని నిర్దారించుకున్న తర్వాతనే ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాల వద్ద అమ్ముకోవాలని మంత్రి సూచించారు.
ఈ పత్తి సీజన్‌లో రైతులు వారి పత్తిని సులభంగా విక్రయించేందుకు మార్కెటింగ్‌ శాఖ అన్నీ రకాల ఏర్పాట్లు చేస్తుందని, రైతులందరూ మార్కెటింగ్‌ శాఖ తీసుకొచ్చిన వాట్స్‌ యాప్‌ చాట్‌ ఉపయోగించి ఎలాంటి ప్రయాసలు పడకుండా పత్తిని అమ్ముకోవాలని మంత్రి రైతులను కోరారు. అలాగే రైతులకు ఎటువంటి ఫిర్యాదులున్నా కూడా ఈ వాట్సాప్‌ చాట్‌ ద్వారా తెలియపరిస్తే, మార్కెటింగ్‌ శాఖ వారు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని మంత్రి తెలియజేశారు.

Read More

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పశుగణన1.50 కోట్ల కుటుంబాల నుంచి వివరాల సేకరణఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా నమోదు

పశుగణన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 21వ అఖిల భారత పశుగణనలో భాగంగా అక్టోబరు 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రంలోని 1.50 కోట్ల కుటుంబాలకు చెందిన పశువుల వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. వ్యవసాయ పరికరాల వివరాలనూ సేకరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, భూమిలేని కుటుంబాలకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న పశుసంవర్ధక రంగాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే నిధులు, పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌, డైరెక్టర్‌ దామోదరనాయుడు పేర్కొన్నారు. జిల్లాల పశుసంవర్థక అధికారులతో గురువారం వారు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు భాగస్వామ్యంతో కేంద్రం రూపొందించిన యాప్‌ ఆధారంగా పశుగణన నిర్వహిస్తారని వివరించారు.
ప్రధానంగా గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, కోళ్లు, పకక్షులతో సహా 16 రకాల పెంపుడు జంతువుల సమాచారం సేకరిస్తారు. 17,244 గ్రామాలు, పట్టణాల్లోని 3,929 వార్డుల్లో గృహ, గృహేతర వ్యక్తుల నుంచి వివరాలు తీసుకుంటారు. 5,390 మంది సిబ్బంది, 1,237 మంది పర్యవేక్షకులు, 45 మంది స్క్రూటినీ అధికారులు, ఇతర సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. వీరికి ట్రావెలింగ్‌ కిట్లు, 60 వేల వాల్‌పోస్టర్లు, 1.50 కోట్ల గృహస్టిక్కర్లు, 8 వేల ఐడీ కార్డులు అందించారు. పశుగణన పూర్తి అయిన ఇంటి తలుపుపై స్టిక్కర్‌ వేస్తారు.

Read More

వరుసగా మూడో రోజు కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్యటన

తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియా దేశ వ్యవసాయ శాఖా మంత్రి వర్యులు మహ్మద్‌ బిన్‌ సాబుతో వారి కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణాలో అగ్రి ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ నెలకొల్పడానికి మరియు పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా కోరారు. ఫెల్డా చైర్మన్‌ అహ్మద్‌ షాబేరి చీక్‌ మరియు ప్రతినిధులతో సమావేశమై ఆయిల్‌ పామ్‌ రంగంలో వారు సాధించిన ప్రగతిని, తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ పామ్‌ రైతులకు ప్రయోజకరంగా వుండే పద్ధతులపై చర్చించారు. మలేషియాలో భారత హై కమిషనర్‌ బి.ఎన్‌. రెడ్డి గారి ఆహ్వానం మేరకు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యాంత్రీకరణకు సంబంధించి తెనాసియా ప్రైవేట్‌ లిమిటేడ్‌ (Palmpro) కంపెనీని సందర్శించి, వివిధ రకాల యంత్రాలు, పనిముట్లు, వాటి పనివిధానంను పరిశీలించారు.

Read More

వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా నిలుపుదాం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో అత్యుత్తమ పది సంస్థలలో నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య పిలుపునిచ్చారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం 37వ ర్యాంకులో ఉందని రానున్న మూడేళ్లలో విశ్వవిద్యాలయం పది లోపు ర్యాంక్‌ సాధించాలని ఆయన సూచించారు. ఈ మధ్యనే ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన ఆల్దాస్‌ జానయ్య ఈరోజు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉద్యోగులు, విద్యార్థులతో సమావేశం అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉప కులపతి సహా ఇప్పటికి తాను 15 బాధ్యతలు చేపట్టానని వివరించారు.
తనకు ఈ అవకాశం కల్పించిన కులపతి, రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రికి జానయ్య ధన్యవాదములు తెలిపారు. సమష్టి కృషితో విశ్వవిద్యాలయాన్ని ముందుకి తీసుకెళదామని పిలుపునిచ్చారు. జనవరిలోగా విశ్వవిద్యాలయ అధికారుల పదవులని భర్తీ చేస్తామన్నారు. సాంకేతిక అర్హత లేకపోయినా కొన్ని ప్రయివేటు సంస్థలు వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు చేపట్టడం దురదృష్టం అన్నారు. సామాన్యులకి వ్యవసాయ విద్యని అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రత్యేక కోటా సీట్లు భారీగా పెంచి, ఫీజులు సగానికి తగ్గించామని వివరించారు. విశ్వవిద్యాలయంలోని ఖాళీలని ప్రభుత్వ విధానాలకి అనుగుణంగా భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని జానయ్య తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటుమన్నారు. తనకి ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని, విశ్వవిద్యాలయం చట్టం తనకు బైబిల్‌ అని స్పష్టం చేశారు. తాను పూర్తి ప్రజాస్వామిక విధానాలని అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకుంటానని వివరించారు. ఇదే మాతృక విశ్వవిద్యాలయం అని, త్వరలోనే వజ్రోత్సవం (Diamond Jubilee) నిర్వహిస్తామని జానయ్య ప్రకటించారు. టాసా అధ్యక్షులు ప్రొఫెసర్‌ బి. విద్యాసాగర్‌, బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి అమృత రెడ్డి, విద్యార్థుల ప్రతినిధులు పూజ, బాలకోటి, పూర్వ విద్యార్థుల ప్రతినిధి కవిరాజ్‌లు ప్రసంగించారు. జానయ్యని అభినందించారు. ఆయన సారధ్యంలో విశ్వవిద్యాలయం అభివృద్ధిలో సాగాలని, తమ అంశాలని సానుకూలంగా పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

మలేషియా పర్యటనలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు FGV కంపెనీ పరిశీలన

మలేషియా పర్యటనలో భాగంగా తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు FGV కంపెనీ వారి సీడ్‌ గార్డెను, నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్దతులతో నడపబడుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించి, అక్కడ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. FGV కంపెనీ నుండి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే Seedlings ను చాలా వరకు తెప్పించడం జరిగిందని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే స్వంతముగా సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, దానికి FGV కంపెనీ వారు సహాయ సహకారాలు అందజేయాలని కోరగా, దానికి కంపెనీ ప్రతినిధులు తప్పకుండా రాష్ట్ర భాగస్వామ్యంతో పని చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలియజేశారు. తర్వాత FGV కంపెనీ వారి రిఫైనరీ కర్మాగారాన్ని సందర్శించి అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. రిఫైనింగ్‌ సమయములో కంపెనీ వారు తీసుకొనే జాగ్రత్తలు, వివిధ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గల డిమాండ్‌ గురించి సోదాహరణంగా మంత్రి వర్యులతో పాటు అధ్యయన బృందానికి తెలియజేశారు.

Read More

2027 నాటికి పోలవరం సాగునీటి ప్రాజక్టు పూర్తి కావాలి : చంద్రబాబు

పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు, జల వనరుల శాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెలగపూడి, సచివాలయంలో బుధవారం జల వనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజనీరు నరసింహమూర్తి, మేఘా, బావర్‌ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. 1,396.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్‌వాల్‌ డిజైన్లను ఆప్రై సంస్థ… పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, విదేశీ నిపుణుల ప్యానెల్‌కు అందజేసిందని అధికారులు ఆయనకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నిపుణుల ప్యానెల్‌.. డిజైన్లపై వర్క్‌షాపు నిర్వహించి చర్చిస్తుందని, ఆ డిజైన్లను వచ్చే నెల 24 నాటికి ఆమోదిస్తామని వివరించారు. కొత్త వాల్‌కు రూ. 960.34 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జలసంఘం ఆమోదించిందని, దానిని 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థలు వెల్లడించాయి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులను 2025 నవంబరులో ప్రారంభించి 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నాయి. భూసేకరణ సహా కీలకమైన పనులన్నీ 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

Read More

ఆయిల్‌పామ్‌ సాగు గురించి మలేషియాలో మంత్రి తుమ్మల, అధికారుల అధ్యయనం

ఆయిల్‌ పామ్‌ విస్తరణావకాశాలు మరియు ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఆయిల్‌ పామ్‌ ఉత్పాదకాలు మున్నగువాటి గురించి శాస్త్రీయ అధ్యయనానికి తెలంగాణా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు గారు, డైరెక్టర్‌, ఉద్యానశాఖ మరియు ఎండీ ఆయిల్‌ ఫెడ్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా గారు మరియు వారి బృందం మలేషియా పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియా ప్లాంటేషన్‌ మరియు కమోడిటీస్‌ మంత్రి వర్యులు శ్రీ జోహరి అబ్దుల్‌ ఘని గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మన మంత్రివర్యులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వము ఆయిల్‌ పామ్‌ సాగుకోసం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రస్తుత పరిస్థితి మరియు రానున్న రోజుల్లో ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ అభివృద్దికి గల అవకాశాలు వివరించి, ఆయిల్‌ పామ్‌ సాగులో అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉన్న మలేషియా నుంచి సహకారం అందించగలరని కోరారు. మలేషియా మంత్రి వర్యులు మాట్లాడుతూ, 143 కోట్ల జనాభా గల దేశానికి ఆహారం అందించడం చాలా గొప్ప విషయమని, ప్రపంచ దేశాలు అన్నీ భారతదేశం ఆ దిశలో అవలంబిస్తున్న విధివిధానాలను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పామ్‌ఆయిల్‌ వృద్దికి తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఆ దిశలో త్వరలోనే వారి బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని తెలియజేసారు. పర్యటనలో భాగంగా మంత్రివర్యులు MATRAOE చైర్మన్‌ డాటో సెరి రీజల్‌ మెరికన్‌ గారిని కలిసి మలేషియాతో వ్యవసాయపరంగా గల వ్యాపార అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ గారు ఇండియాతో వ్యాపారాభివృద్ధికి తమదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది, వ్యాపార పరంగానే కాక ఇండియాతో తమకు సామాజికంగా, చారిత్రకంగా కూడా బంధము ఉన్నదని తెలియజేస్తూ, Broken Riceకు తమ దేశంలో అత్యంత డిమాండ్‌ ఉందని తెలియజేయగా, మన రాష్ట్రం నుండి Broken Rice సరఫరాకు గల అవకాశాలను పరిశీలించి త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. వెంటనే మంత్రివర్యులు HACA MD శ్రీ చంథ్రేఖర్‌ రెడ్డి గారిని టెలిఫోన్‌లో సంప్రదించి మన రాష్ట్రంలో Broken Rice ఎగుమతి చేయడానికి, దానికి సంబంధించిన Economicsను పరిశీలించి, మన వరి రైతులకు అదనపు ప్రయోజనం కలిగితే, వచ్చే యాసంగి కల్లా ఎగుమతి చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సాయంత్రం పర్యటనలో భాగంగా మలేషియా పామ్‌ ఆయిల్‌ బోర్డును సందర్శించి, పామ్‌ ఆయిల్‌ రంగంలో వాళ్ళ అనుభవాలను MPOB చైర్మన్‌ డా. అహ్మద్‌ పర్వేజ్‌ గులామ్‌ ఖాదీర్‌ గారు పర్యటన బృందంతో పంచుకున్నారు. MPOB ఆయిల్‌ పామ్‌ సాగులో ఒక నూతన ఒరవడిని సృష్టించిందని, అంతేగాక ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు వచ్చే ప్రాంతాలలో పంట విస్తరణకు కావాల్సిన సాంకేతిక సహాయం అందిస్తుందని మంత్రివర్యులకు తెలియజేశారు.

Read More

రైతులకు ఖర్చు తగ్గించే డ్రోన్లు కావాలి

రైతులకు మరింత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్‌లను అందించాలని డ్రోన్‌ల తయారీదారులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఒకే దఫాలో ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీతో పాటు పైరు ఎదుగుదలను పరీక్షించేలా డ్రోన్‌ల సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నారు. దాని వల్ల రైతులకు ఖర్చు తగ్గుతుందని నిన్న జరిగిన డ్రోన్‌ల సమ్మిట్‌లో ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా పాల్గొన్నారు.

Read More