చెరకు రైతుకు కేసీపీ తీపి కబురు

టన్ను ధర రూ. 3,576/-
కేసీపీ చక్కెర కర్మాగారం 2024-2025 సీజన్‌కు చెరకు ధర టన్నుకు రూ. 3,576/-గా ప్రకటించింది. కర్మాగార ఆవరణలో శుక్రవారం యూనిట్‌ హెడ్‌ యలమంచిలి సీతారామదాస్‌ అధ్యక్షతన చెరకు రైతు సంఘం నేతలతో జరిగిన సమావేశంలో చెరకు గానుగాడు ప్రస్తుత సీజన్‌కు ధర సబ్సిడీతో కలిసి రూ. 3,576/-గా ప్రకటించారు. యాంత్రీకరణకు అనువుగా సాగు చేసిన రైతులకు టన్నుకు రూ. 3,676/- సబ్సిడీతో కలిపి చెల్లించనున్నట్లు సీతారామదాస్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబరులో అకాల వర్షాలు, వరదలకు నష్టపోయిన రైతులకు సంఘం విన్నపం మేరకు రూ. 40.89 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. రానున్న సీజన్‌కు ఈ సంవత్సరం నవంబరు నుంచి 2025 ఫిబ్రవరి వరకు నాటే చెరకు తోటలకు ఎకరానికి రూ. 10,000/- సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలిపారు. సబ్సిడీతో పాటు సంప్రదాయ పద్ధతుల్లో నాటిన తోటలకు టన్నుకు రూ. 400/- లేదా యాంత్రీకరణ అనువుగా వేసిన తోటలకు టన్నుకు రూ. 500/- సబ్సిడీగా ప్రకటించారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని విరివిగా చెరకు సాగు చేసి తోడ్పడాలని కోరారు.

Read More

పంట వేసిన రైతులకే రైతు భరోసా

పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రబీ నుండి రైతులకు రూ.7,500 ఇస్తామని మంత్రి తెలియచేసారు. పంటల బీమాకు సంబంధించి ప్రతి రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని కూడా చెప్పారు.

Read More

మిద్దెతోటలకు ప్రోత్సాహం

ఉద్యానశాఖ సంచాలకురాలు యాస్మీన్‌ బాషా

తెలంగాణలో మిద్దెతోటల సాగుకు అన్నివిధాలా ప్రోత్సహం అందిస్తున్నామని రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకురాలు షేక్‌ యాస్మీన్‌ బాషా తెలిపారు. సిక్కిం రాష్ట్ర ఉద్యానశాఖ అదనపు సంచాలకుడు బిజు పెరియార్‌ గురువారం తమ బృందంతో కలిసి తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా మిద్దెతోటల పెంపకాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన యాస్మీన్‌ బాషతో సమావేశమై మిద్దెతోటల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తోటల సాగుకు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తూ పెంపకందారుల అనుమానాలను నివృత్తి చేస్తున్నామన్నారు.

Read More

పాడి రైతులకు మెరుగైన సేవలందిస్తాం

పశుసంవర్థకశాఖ కొత్త డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పశుపోషణ లాభదాయకంగా చేయడానికి చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ నూతన డైరెక్టర్‌ టి. దామోదర్‌నాయుడు చెప్పారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దామోదర్‌నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాడి రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.

Read More

ఉద్యాన, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్‌ఛాన్సలర్లు

జయశంకర్‌ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకి ప్రొ|| అల్దాస్‌ జానయ్య గారిని, కొండాలక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి ప్రొ|| రాజి రెడ్డి గారిని వైస్‌ఛాన్సలర్లుగా రాష్ట్ర గరవ్నర్‌ నియమించారు.

Read More

ఆరు పంటలకు మద్దతు ధర పెంపు

దీపావళి పండుగ ముంగిట ప్రధాని మోదీ కర్షకులకు తీపి కబురు చెప్పారు. ఆరు రబీ పంటలకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పంటల మద్దతు ధరలను ఉత్పాదక వ్యయం కన్నా 5 రెట్లు అధికంగా ఉండేలా చూస్తామన్న హామీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గోధుమ, శనగ, మసూర్‌ దాల్‌, ఆవాలు, బార్లీ, కుసుమ పంటల మద్దతు ధరలను పెంచింది. వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే 2025-26 మార్కెటింగ్‌ ఏడాది కోసం ఈ ధరలను నిర్ణయించింది.


Read More

ఏఐతో ఆరోగ్య సంరక్షణ … వ్యవసాయాభివృద్ధి…

దిల్లీ, కాన్పుర్‌, రోపార్‌లలో ఉత్కృష్ట కేంద్రాల ప్రారంభం


కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం.. సుస్థిర నగరాల అభివృద్ధి కోసం కేంద్ర విద్యాశాఖ భారీ కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు దిల్లీ, కాన్పుర్‌, రోపార్‌లలో ఉత్కృష్ట కేంద్రాల (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌)ను వర్చువల్‌ పద్ధతిలో మంగళవారం ప్రారంభించింది. దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఈ కేంద్రాలు సూచించిన పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించనున్నాయి. ఇందులో భాగంగా పరిశోధనలు, అంకుర సంస్థలకు తోడ్పాటు కోసం వచ్చే నాలుగేళ్లలో రూ. 990 కోట్లు ఖర్చుచేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పంజాబ్‌, హరియాణా సహా రైతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయం లాభసాటిగా మార్చే పరిశోధనలను ఐఐటీ రోపార్‌ ఉత్కృష్ట కేంద్రం పర్యవేక్షించనుంది.

Read More

సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు

కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్‌పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్‌ఐపిహెచ్‌ఎం 3 నెలల సర్టిఫికెట్‌ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.
నూటికి నూరు శాతం రసాయనాలు లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్‌ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్‌ఐపిహెచ్‌ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 థలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపిహెచ్‌ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్‌ఐపిహెచ్‌ఎంలో 10 రోజుల తుది థ శిక్షణ ఉంటాయి.
ఇంటర్‌ లేదా టెన్త్‌ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ, పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500./-లు శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ. 305/-లు అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్‌ 22 లోగా పోస్టు/మెయిల్‌ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్‌ డా.కె. దామోదరాచారి (9542638020)ని సంప్రదించవచ్చు.
అడ్రస్‌:
To
The Director, Plant Health Management,
National Institute of Plant Health Management (NIPHM),
Rajendranagar, Hyderabad – 500 030
mail: dirphmniphm-ap@nic.in or asomicroniphm2019@gmail.com

Read More

వక్క సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతం

నిపుణులతో చర్చించి సాగుపై నిర్ణయం : మంత్రి తుమ్మల
ఏలూరు జిల్లా కామవరపుకోటలో మంత్రి తుమ్మల పర్యటన
వక్క పంట సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతమని, నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పంట రైతన్నలకు సిరులు కురిపిస్తుందని, తెలంగాణలో సైతం సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపు కోటలో ఆదివారం వాణిజ్య పంట అయిన వక్క సాగును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ పంట సాగు చేస్తున్న రైతులతో సాగు పద్ధతులు,ఆ దాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో దీని విస్తరణ అవకాశాలపై నిపుణులతో చర్చించారు. వక్క సాగుకు అనుకూల నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి వినియోగం తదితర అంశాలపై నిపుణులతో చర్చించి సాగును ప్రోత్సహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Read More

తుపాన్ల కాలం… అప్రమత్తత అవసరం

బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు పొంచి ఉంది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పటానికి పరిస్థితులు అనుకూలించి అవి క్రమేపి వాయుగుండాలు, తుపాన్లుగా మారుతాయి. పంటలు చేతికొచ్చే సమయాల్లో తుపాన్లు వస్తే పంటలు నష్టపోవలసి వస్తుంది. కాబట్టి రైతులు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ కోరింది.అక్టోబరు-డిసెంబరు మధ్యలో రాష్ట్రంపై ప్రభావం చూపిన కొన్ని తుపాన్లుసంవత్సరం తీరం దాటిన ప్రాంతం ప్రభావితమైన జిల్లాలు2014 అక్టోబరు (హుద్‌హుద్‌) విశాఖపట్నం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం2016 డిసెంబరు (వార్ధా) చెన్నై సమీపంలో నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప2018 అక్టోబరు (తిత్లీ) పలాస సమీపంలో శ్రీకాకుళం, విజయనగరం2018 డిసెంబరు (పెతాయ్‌) కాకినాడ సమీపంలో కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి2021 సెప్టెంబరు (గులాబ్‌) కళింగపట్నం విశాఖ, విజయగనరం, శ్రీకాకుళం2022 డిసెంబరు (మాండౌస్‌) మహాబలిపురం సమీపంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప2023 డిసెంబరు (మిచౌంగ్‌) బాపట్ల చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు

Read More