ప్రకృతి వ్యవసాయంతో రైతుల జీవితాల్లో మార్పు

ప్రకృతి వ్యవసాయం చిన్న, సన్నకారు రైతుల జీవితాలను మారుస్తోందని, రైతుల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరింతగా విస్తరిస్తున్నట్లు రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్‌ టి. విజయకుమార్‌ అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై సంపూర్ణ అవగాహన కోసం నీతి ఆయోగ్‌ గౌరవ సభ్యులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమేష్‌చంద్‌ నేతృత్వంలో ఎనిమిదిమంది సభ్యులతో కూడిన బృందం గురువారం ఏలూరు, కృష్ణాజిల్లాల్లో పర్యటించింది. తొలుత కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ శిక్షణా భవనంలో విజయకుమార్‌ బృంద సభ్యులకు ఏపీసీఎన్‌ఎఫ్‌ గురించి పవర్‌ పాయింట్‌ ప్రెజెటేషన్‌ ద్వారా వివరించారు. రాష్ట్రంలో 2016లో 40 వేల మంది రైతులతో మొదలైన ప్రకృతి వ్యవసాయం ఇప్పటికి 10 లక్షల మంది రైతుల వరకు చేరుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శనీయమని నీతి ఆయోగ్‌ గౌరవ సభ్యులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమేష్‌ చంద్‌ ప్రశంసించారు. వ్యవసాయ, రైతుసంక్షేమ మంత్రిత్వశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేయడానికి మరిన్ని పరిశోధనలు చేయాలన్నారు.

Read More

ఖరీఫ్‌ ధాన్యాన్ని మిల్లులకు కేటాయించవద్దు

తెలంగాణా రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ సారి మిల్లర్లకు కేటాయించవద్దని పౌరసరఫరాల సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇచ్చే ధాన్యంలో తేమ నిబంధనను 17 నుంచి 14 శాతానికి తగ్గించాలని, సన్న బియ్యం మిల్లింగులో 67% బియ్యం రావని నిబంధనలు మార్చాలని, సన్న బియ్యం సరఫరాలో క్వింటాలుకు రు. 300 పరిహారం.. కస్టోడియన్‌ మిల్లింగ్‌, రవాణా ఛార్జీలు పెంచాలని కొంతమంది మిల్లర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కారం కానిదే ధాన్యాన్ని మిల్లింగ్‌కు తీసుకోమని కొంతమంది మిల్లర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ శాఖల, సంస్థల పరిధిలోని గోదాములలో నిల్వ చేయాలని పౌర సరఫరాల శాఖ చేసిన ప్రతిపాదనను తెలంగాణ వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిసింది. తాజాపరిణామాల నేపథ్యంలో ధాన్యం నిల్వ చేసే విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరిపారు. పౌర సరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి డిఎస్‌ చౌహాన్‌ కూడా మంత్రి తుమ్మలతో మాట్లాడారు.

Read More

భారీ వర్షాల వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం నేరుగా రైతుల ఖాతాలకు

తెలంగాణాలో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్‌ 6 వరకు కురిసిన భారీ నుండి అతిభారీ వర్షాల వలన రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలో 79,574 ఎకరాలలో పంటనష్టం సంబవించినట్లు అధికారులు నిర్ధారించగా, దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రిగారి ఆదేశాలతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే పంటనష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ. 79.57 కోట్ల నిధులు విడుదలయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. అత్యధికంగా పంటనష్టం ఖమ్మం జిల్లాలో (28,407 ఎకరాలు), తరువాత మహబూబాబాద్‌ (14,669), సూర్యాపేట (9,828 ఎకరాలు)లలో సంభవించినట్లు, మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు నిర్ధారించారు. పంటనష్ట పరిహారం ఎకరానికి 10 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాలలోనే జమ అయ్యేటట్లు అధికారులు ఏర్పాటు చేసినట్టు మంత్రివర్యులు తెలియజేశారు.

వ.సం.   జిల్లా  విస్తీర్ణం  రైతుల సంఖ్య ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపాయల్లో
        ఎకరాలు- గుంటల       ఎకరానికి రూ.10,000/-    
                చొప్పున
1   ఖమ్మం   28407.04    27242   28,40,71,000
2   మహబూబాబాద్‌ 14669.22    18406   14,66,95,500
3   సూర్యాపేట   9828.22     10339   9,82,85,500
4   సంగారెడ్డి  3288.34     2881    3,28,88,500
5   ఆదిలాబాద్‌  3096.03     2041    3,09,60,750
6   ఆసీఫాబాద్‌  2692.11     1371    2,69,22,750
7   బి.కొత్తగూడెం   2656.15     2148    2,65,63,750
8   నాగర్‌ కర్నూల్‌ 2290.31     2380    2,29,07,750
9   వనపర్తి 1986.31     2386    1,98,67,750
10  జోగులాంబ గద్వాల్‌   1800.19     1389    1,80,04,750
11  వికారాబాద్‌ 1512.32     1378    1,51,28,000
12  నారాయణపేట   1239.33     1060    1,23,98,250
13  రంగారెడ్డి  1194.23     909     1,19,45,750
14  నిజామాబాద్‌ 863.32  676     86,38,000
15  మహబూబ్‌ నగర్‌   766.00  912     76,60,000
16  సిద్దిపేట   727.24  877     72,76,000
17  మంచిర్యాల్‌ 598.02  447     59,80,500
18  కామారెడ్డి  480.26  493     48,06,500
19  నల్గొండ 413.12  454     41,33,000
20  వరంగల్‌ 283.34  480     28,38,500
21  జయశంకర్‌ భూపాలపల్లి 183.15  161     18,33,750
22  మెదక్‌  157.12  238     15,73,000
23  ములుగు  113.02  147     11,30,500
24  పెద్దపల్లి  108.36  82  10,89,000
25  జగిత్యాల    77.01   136     7,70,250
26  జనగామ   67.36   46  6,79,000
27  రాజన్నసిరిసిల్ల     49.37   119     4,99,250
28  కరీంనగర్‌   19.23   18  1,95,750
     మొత్తం  79574.12    79216   79,57,43,000
Read More

పప్పుల రైతులకు తిప్పలే!

పప్పుధాన్యాలు పండించే రైతులకు తిప్పలు తప్పడం లేదు. పప్పుదినుసుల నిల్వకు తగిన వసతులు, మార్కెటింగ్‌ సౌకర్యాలు లేకపోవడంతో పప్పుధాన్యాలు పండించే రైతులు నష్టపోతున్నారని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఒక నివేదికను విడుదల చేసింది. పప్పుదినుసుల సాగులో స్వయం సమృద్ధిని సాధించేందుకు అవకాశాలున్నా కూడా ప్రభుత్వాలు తగిన కృషి చేయడం లేదు కాబట్టే ఇప్పటికి కూడా మనం దిగుమతుల మీద ఆధారపడుతున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. పంటల మార్పిడి ద్వారా పప్పుదినుసులను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని, గిడ్డంగులతో పాటు ఇతర నిల్వ సౌకర్యాలు కల్పించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్‌ సదుపాయాలు ఉండాలని, సాగులో కొత్తవంగడాలను, స్వల్పకాలిక రకాలను ప్రోత్సహించాలని ఆ నివేదికలో పేర్కొంది. వీటితో పాటు అవసరమైన చర్యలు పొందుపరిచిన నివేదికలోని విషయాలను రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) వెల్లడించింది.

Read More

అన్నదాతకు దక్కుతుంది 33 శాతమే

అనేక ఆటుపోట్లను తట్టుకొని సాగు చేస్తున్న రైతులకు రూపాయిలో మూడోవంతు కూడా దక్కడం లేదని ఆర్‌బిఐకి నిపుణుల బృందం నివేదిక అందించింది. కూరగాయల ద్రవ్యోల్బణంపై.. రైతు నుంచి రిటైలర్‌ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిపుణుల బృందం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) కోసం అధ్యయనం చేసింది. రైతు నుంచి వ్యవసాయ మార్కెట్‌లో దిగుబడులు కొనుగోలు చేసే ట్రేడర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు, రిటెయిలర్ల కమీషన్లు, రవాణా, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, నిల్వ ఛార్జీల రూపంలో ఖర్చులు ఎక్కువ అయ్యి ధరలు పెరిగి.. వినియోగదారునిపై భారం పడుతుంది. రైతు చేతికి దిగుబడి వచ్చినప్పటి నుంచి వినియోగదారుడిని చేరే వరకు అవసరమైన వాల్యూ చెయిన్‌ సరిగా లేకపోవడంతో దళారులు దోచుకోవడానికి అవకాశం ఏర్పడిందని నివేదిక వెల్లడించింది. ఇలాంటి పరిణామాల వలన అటు రైతూ, ఇటు వినియోగదారూ ఇద్దరూ నష్టాలే ఎదుర్కొంటున్నారు. కాబట్టి సరఫరా వ్యవస్థలోపాలను సరిచేయాలని సూచించారు.

Read More

రైతుల ఖాతాలలోకి రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన పీయం మోడి

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 18వ విడత నిధులను, మహారాష్ట్రలోని వాషిమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలలో 20 వేల కోట్లు పంపిణీ చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌ ద్వారా నిధులను జమ చేశారు. అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయి. www.pmkisan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయగానే కొన్ని ఆఫ్షన్లు కనిపిస్తాయి. ఇందులో బెనిఫిషరీ లిస్ట్‌ కూడా ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్‌ చేస్తే ఆ గ్రామంలోని లబ్దిదారుల జాబితా వస్తుంది. ఆ జాబితాలో పేరు ఉందంటే ఆ రైతు బ్యాంకు ఖాతాలో 2000 రూపాయల డబ్బులు జమ అవుతాయి.

Read More

రైతుల కోసం కేంద్రం కొత్త పథకాలు

రైతుల ఆదాయం, ఆహార భద్రతను మెరుగు పరిచేందుకు కేంద్రం పీయం రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, కృషోన్నత యోజన పథకాలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. అందుకోసం 1,01,321 కోట్ల రూపాయలు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించినట్లు మంత్రి పేర్కొన్నారు. పీయం-ఆర్‌కేవీవైలో భాగంగా నేల సారం, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీకరణ… వంటి వివిధ చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని నిర్ణయించాం అని మంత్రి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో దేశానికి స్వావలంబన చేకూర్చేందుకు ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌’ ఏర్పాటుకు రూ. 10,103 కోట్లు కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ఈ మిషన్‌ ద్వారా రానున్న ఏడేళ్ళలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం అని మంత్రి అన్నారు. ఈ మిషన్‌లో భాగంగా నూనెగింజల సాగును 40 లక్షల హెక్టార్లకు విస్తరించనున్నాం అని మంత్రి చెప్పారు.

Read More

నాబార్డ్‌ తెలంగాణ సీజీఎంగా బి. ఉదయ్‌ భాస్కర్‌

శ్రీ బి ఉదయ్‌ భాస్కర్‌ 01 అక్టోబర్‌ 2024న నాబార్డ్‌, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం యొక్క చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (CGM)గా బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ ఉదయ్‌ భాస్కర్‌కు డెవలప్మెంట్‌ బ్యాంకింగ్‌లో 31 సంవత్సరాల గొప్ప అనుభవం ఉంది. ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ANGRAU)లో వ్యవసాయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేశారు.
1993లో కర్ణాటక రాష్ట్రంలో నాబార్డ్‌లో చేరిన శ్రీ ఉదయ్‌ భాస్కర్‌ జార్ఖండ్‌, కర్ణాటక, APలోని ప్రాంతీయ కార్యాలయాలు మరియు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన నాబార్డ్‌లో గ్రామీణ మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌, రీఫైనాన్స్‌, క్రెడిట్‌ ప్లానింగ్‌, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రాజెక్టులు, MSME సెక్టార్‌, గ్రామీణ సహకార సంస్థల అభివృద్ధి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, తదితర రంగాలలో వివిధ రకాలైన పోర్ట్‌ఫోలియోలను వివిధ ఉన్నత స్థానాల్లో నిర్వహించారు.
ఆయన నాబార్డ్‌, వరంగల్‌ (పూర్వం AP) లో జిల్లా అభివృద్ధి అధికారిగా (DDM) కూడా పనిచేశారు. జిల్లాలో వాటర్‌షెడ్‌ మరియు గిరిజన అభివృద్ధి ప్రాజెక్టుల అమలు, గ్రామీణ జీవనోపాధి కార్యక్రమాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOs) స్థాపన మరియు అభివృద్ధి, గ్రామీణ వ్యవస్థాపకత అభివృద్ధి, SHG- బ్యాంక్‌ లింకేజ్‌ ప్రోగ్రామ్‌ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలు, ఆర్ధిక సమ్మేళనం, మొదలైన అనేక కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు.

Read More

అతి భారీ వర్షాలు కురిసే రోజులు పెరుగుతున్నాయ్‌

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్‌లో అనేక అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈసీజన్‌లో 108 శాతం వర్షపాతం నమోదు అయ్యింది. సీజన్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (24 గంటల వ్యవధిలో 11.5 నుంచి 20.45 సెం.మీ.) కురిసిన సందర్భాలు 2,632, అత్యంత భారీ వర్షాలు, కుంభవృష్టి (20.45 సెం.మీ. కంటే ఎక్కువ) కురిసిన సందర్భాలు 473 వరకూ ఉన్నాయి. గత ఐదేళ్ళతో పోలిస్తే ఈ సంఖ్య క్రమేపి పెరుగుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు జులై, ఆగస్టు నెలల్లో కురుస్తున్నాయి. గడచిన ఐదేళ్ళుగా పరిశీలిస్తే పశ్చిమ తీరం, ఈశాన్య తూర్పు, ఉత్తర భారతంలో వర్షాల తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది కేరళ నుంచి గుజరాత్‌ వరకు పశ్చిమ తీరం, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఒడిస్సా, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయ వంటి చోట్ల వర్ష బీభత్సం కనిపించింది. దానికి వాతావరణంలో మార్పు ఒక్కటే కారణమని చెప్పలేమని, అక్కడ స్థానిక పరిస్థితులు, పట్టణీకరణ, భారీ ఎత్తున నిర్మాణాలు, పరిశ్రమలు, వాహన కాలుష్యం వంటివి కూడా కారణాలుగా చెప్పవచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగాధిపతి ఆచార్య సునీత అన్నారు. అయితే వర్షాల తీవ్రత పెరగడంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె చెప్పారు.

Read More

రూ. 17,043 కు పెరిగిన పామాయిల్ గెలల ధర

పామాయిల్ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో, ముడిపామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ఆదుకొనేవిధంగా చర్యలను తీసుకోవాలని ఇటీవల తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారిని కోరిన విషయం తెలిసిందే.
ఇందుకనుగుణంగా, కేంద్రప్రభుత్వం ఇటీవల ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనివలన ముడిపామాయిల్ గెలల ధర రూ. 14,392 నుండి అమాంతం రూ. 2651 పెరిగి ప్రస్తుతం రూ. 17,043 చేరుకుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి. దీనివలన రైతులకు ఈ నెలలో అదనంగా రూ. 12 కోట్లు లబ్ధి చేకూరనుంది.
గతంలో ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశ పడడమే కాకుండా, కొత్తగా ఆయిల్ పామ్ వైపు సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుంది.. ఈ ధరల పెరుగుదల వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
పామ్ ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల విదేశిమారక ద్రవ్యం ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించడం వలన దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు ప్రయోజనం పొందుతారని, అంతేకాకుండా గెలల ధరల పెరుగుదల వలన నూతనంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడనుందని మంత్రివర్యులు పేర్కొన్నారు.


తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.23 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావడమైందన్నారు.
పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు పామాయిల్ సాగు వైపు చూసే అవకాశం ఉందని, కావునా ఆయిల్ పాం కంపెనీలు ఇందుకోసం సన్నద్ధం కావాలని మంత్రిగారు కోరారు. పామ్ ఆయిల్ సాగు చేయాలనుకునే రైతుల కోసం పామాయిల్ మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
పామాయిల్ రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేలలా కృషి చేస్తుందని, ఈ సందర్భంగా మంత్రివర్యులు పేర్కొన్నారు.

Read More