వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం 47% నుంచి 194% పెంపు

వరదల వలన పంట నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పెట్టుబడి సాయాన్ని గణనీయంగా పెంచింది. వ్యవసాయ, ఉద్యాన పంటలకు గతంతో పోలిస్తే పెట్టుబడి సాయం భారీగా పెరిగింది.
వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం (హెక్టారుకు రూపాయల్లో)
పంట ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ప్రకటించిన పెరుగుదల
ఎస్‌డీఆర్‌ఎ సాయం శాతం
ప్రకారం
వరి, వేరుశనగ, పత్తి, చెరకు 17,000 25,000 47.05
చిరుధాన్యాలు, నువ్వులు, ఆముదం, జూట్‌ 8,500 15,000 76.47
మినుము, పెసర, కంది, సోయా,
పొద్దుతిరుగుడు, పొగాకు 10,000 15,000 50.0
మొక్కజొన్న 12,500 15,000 20.0
అరటి 25,000 35,000 40.0
పసుపు, మిరప, కంద 17,000 35,000 105.88
ఉల్లి, టమాట, బొప్పాయి,
కూరగాయలు, పూలు, నర్సరీలు 17,000 25,000 47.05
జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ,
సపోట, జీడి, డ్రాగన్‌ 22,500 35,000 55.55
కొత్తిమీర 8,500 25,000 194.11
కర్రపెండలం 8,500 10,000 17.65
ఆయిల్‌పామ్‌ 22,500 చెట్టుకు
రూ. 1,500
కొబ్బరి 1,000 1,500 50

Read More

దసరా రోజున రైతు భరోసా

తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని దసరా పండుగ రోజున ప్రారంభించి… అదేరోజున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు కలిపి రు. 15 వేలు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్కొంది. అందులో భాగంగా తొలి విడత కింద రూ. 7,500/-లు దసరా రోజున రైతుల ఖాతాలలో పడనున్నాయి. రైతు భరోసాను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే వర్తింప చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక ఎన్ని ఎకరాలలోపు సాయం అందించాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

Read More

రైతులను అప్రమత్తం చేసేందుకు ఏనుగుల సంచారంపై ఏఐ

ఏనుగులు మందలుగా విరుచుకుపడి పంటల్ని సర్వనాశనం చేయడం, మనుషుల్ని తొక్కి చంపడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఏనుగులు దాడిచేసి పంటలను నాశనం చేశాక వాటిని తరమడం కంటే వాటి రాకను ముందే గుర్తించి అప్రమత్తమైతే చాలావరకు నష్టాన్ని నివారించగలుగుతాం. ఈ దిశగా కేరళలోని అమృత యూనివర్సిటీ ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌’ని ఉపయోగించి ‘అమృత ఎలిఫెంట్‌ వాచ్‌ టెక్నాలజీ’ని రూపొందించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జీపీఏఐ సదస్సులో దానికి సంబంధించిన త్రీడీ నమూనాను ప్రదర్శించింది.
ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తారు. రాత్రిపూట పనిచేసేందుకు వీలుగా ఇన్‌ఫ్రారెడ్‌ సపోర్ట్‌ ఉన్న కెమెరాలు వాడతారు. వాటిలోని సెన్సర్లు కెమెరా పరిధిలోకి వచ్చే జంతువుల కదలికల్ని గుర్తిస్తాయి. అవి ఏనుగులయితే అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఎటువైపు వెళ్తున్నాయి? వంటి వివరాలన్నీ కొన్ని సెకన్ల వ్యవధిలోనే విశ్లేషించి మెసేజ్‌ రూపంలో స్థానికులకు, రైతులకు మొబైల్‌ ఫోన్లలో పంపిస్తాయి. ఏనుగుల ఫోటోలు, వీడియోలు 5-10 సెకన్లలో అటవీశాఖ అధికారులకు చేరతాయి. కాబట్టి అవసరమైన చర్యలు వెంటనే తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి.

Read More

వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్ము

ఈ ఖరీఫ్‌ సీజనులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాటు చేస్తున్నామని, కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తామని పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ సంబంధిత అధికారులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో అన్నారు. అక్టోబరు 1 నుంచి ధాన్యం సేకరణ మొదలవుతుంది కాబట్టి రవాణాకు ఇబ్బంది లేకుండా అధిక సంఖ్యలో లారీలు, పూర్తి స్థాయిలో గోతాలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

Read More

సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌

ఈ ఖరీఫ్‌ సీజను నుంచే తెలంగాణా రాష్ట్రంలో సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500/-లు బోనస్‌ ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు ఈసారి సన్న వడ్లు భారీగా వస్తాయని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు నుంచి జనవరి వరకు రైతుల నుంచి సన్నవడ్లు కేంద్రాలకు రానున్నాయి. సుమారు 50 లక్షల టన్నుల సన్నవడ్లు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు.

Read More

మహిళా సాధికారతే లక్ష్యంగా ‘శ్వేత విప్లవం 2.0’

భారత పాడి పరిశ్రమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు ‘శ్వేత విప్లవం 2.0’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆవిష్కరించారు. మహిళా సాధికారత, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా దానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. 67,930 ప్రైమరీ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీల కంప్యూటీకరణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలను విడుదల చేశారు. శ్వేత విప్లవం 2.0 కింద రాబోయే ఐదేళ్ళలో డెయిరీ కో-ఆపరేటివ్‌ సొసైటీల ద్వారా పాల సేకరణ 50 శాతం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు నిధులు సమకూరుస్తుంది.

Read More

వాతావరణ శాఖ ఆధునికీకరణ

వాతావరణ సమాచారాన్ని మరింత పక్కాగా అందించాలనే లక్ష్యంతో 2,600 కోట్ల రూపాయలతో రూపొందించిన ‘మిషన్‌ మౌసం’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలియచేశారు. వాతావరణ, సముద్ర అధ్యయన విభాగం 75వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న మహాపాత్ర విలేకరులతో అన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ప్రకృతి విపత్తు సంభవించినా వెంటనే తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రస్తుతం పనిచేస్తున్న 39 రాడార్లకు తోడు మరో 50 డాప్లర్‌ వెదర్‌ రాడార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, మచిలీపట్నంలలో కూడా కొత్త రాడార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Read More

అర్బన్‌ అగ్రికల్చర్‌ సుస్థిర అభివృద్ధికి దోహదం

ఈ నెల 22, 23 తేదీల్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కీలక శిఖరాగ్ర సభ ‘ఫూచర్‌ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్‌ అగ్రికల్చర్‌ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ గ్రోనింగెన్‌ (నెదర్లాండ్స్‌)కు చెందిన డాక్టర్‌ ప్రజల్‌ ప్రధాన్‌ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఒక అధ్యయనం నిర్వహించింది. నగరాలు, నగర పరిసర ప్రాంతాల్లో ఇళ్ళపైన, ఖాళీ స్థలాలలో చేపట్టే వ్యవసాయ కార్యకలాపాలనే అర్బన్‌ అగ్రికల్చర్‌గా చెప్పవచ్చు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ళు, చేపల పెంపకం.. వంటి కార్యకలాపాలన్నీ ఈ అర్బన్‌ అగ్రికల్చర్‌ కోవలోకే వస్తాయి. ‘అర్బన్‌ అగ్రికల్చర్‌’ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. కాని ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్‌ అగ్రికల్చర్‌ పద్ధతులను పాటించగలిగినప్పుడే దాని ప్రయోజనాలు ఒనగూడతాయని డాక్టర్‌ ప్రజల్‌ ప్రధాన్‌ స్పష్టం చేశారు. అర్బన్‌ అగ్రికల్చర్‌ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించడంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు సుస్థిరత ఎలా ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపించింది అని డాక్టర్‌ ప్రధాన్‌ వివరించారు.

Read More

5 లక్షల మంది రైతులకు సాయం

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమం ‘పరివర్తన్‌’లో భాగంగా, చిన్న రైతులకు సాయం చేసేందుకు ప్రైవేట్‌ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ సిద్ధం అయ్యింది. వార్షిక ఆదాయం రూ. 60,000 కంటే తక్కువగా ఉన్న 5 లక్షల మంది చిన్న రైతుల ఆదాయం పెరిగే కార్యక్రమాలను 2025వ సంవత్సరంలోగా చేపట్టాలని బ్యాంకు నిర్ణయించింది. నిరర్ధకంగా ఉన్న 2 లక్షల ఎకరాలను వ్యవసాయానికి అనువుగా మార్చడం ఇందులో ప్రధానమైనది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే కార్యక్రమాలను చేపడతామని, 25000 మందికి ఉపకార వేతనాలు అందిస్తామని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు.

Read More

ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరలు రద్దు

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతం ఇచ్చి రైతులు ఆదాయం పెరిగేందుకు వీలుగా ఉల్లి మరియు బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించినట్లు కేంద్ర పేర్కొంది.

Read More