లక్ష్యానికి ఆమడ దూరంలో ఆయిల్‌పామ్‌ సాగు

ఆయిల్‌పామ్‌ పంటను పెద్ద ఎత్తున సాగు చేయిస్తామని, రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని, పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయిల్‌ పామ్‌ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. 2024-25లో లక్ష ఎకరాల లక్ష్యాన్ని కంపెనీలకు నిర్దేశిస్తే కంపెనీలు కేవలం 12,488 ఎకరాల్లోనే ఆయిల్‌ పామ్‌ పంటను వేయించాయి. లక్ష్యసాధన కోసం ప్రభుత్వం కంపెనీలకు సహకరిస్తున్నప్పటికీ కంపెనీల నిర్లక్ష్యం కొనసాగుతుంది. కంపెనీల పనితీరులో మార్పు రాకపోతే ఒప్పందాలను రద్దు చేసి ఇతరులకు ఇస్తామని వ్యవసాయశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంపెనీలను హెచ్చరించారు.

Read More

ఈ రోజు నుంచి అనంతపురంలో టమాట సేకరణ

టమాట ధరలు తగ్గుతున్న నేపథ్యంలో, ధరల మద్దతు పథకం కింద టమాట రైతులని ఆదుకునేందుకు గాను ఈ రోజు నుంచి అనంతపురం మార్కెట్‌లో టమాట సేకరణ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సేకరించిన టమాటాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లలో అమ్మేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. టమాట ధరల తగ్గుదలపై మార్కెటింగ్‌ శాఖ అధికారులు, జిల్లా సంయుక్త కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More

రైతు రుణమాఫీ కాని రైతుల వివరాలు నమోదుకు యాప్‌

అర్హులై ఉండి రేషన్‌ కార్డు లేక, ఇతర కారణాల వలన రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ‘రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌’ ను తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ యాప్‌ను అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్‌, మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణ మాఫీ వర్తించని రైతుల ఇళ్ళకు వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం సేకరించి యాప్‌లో నమోదు చేయాలనే మార్గదర్శకాలను వ్యవసాయశాఖ జారీ చేసింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Read More

ప్రభుత్వ పరిహారాలు అందాలంటే ఈ-పంట నమోదు తప్పనిసరి

అన్నదాతలకు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఆదుకోవాలన్నా, పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నా, మద్దతు ధర లభించాలన్నా ఈ-పంట సమాచారం తప్పనిసరి కాబట్టి రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ, ఉద్యానాధికారుల వద్ద నమోదు చేసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ అధికారులు రైతులకు తెలియచేశారు. 2024-25 ఖరీఫ్‌ సీజనుకు సంబంధించి రైతులు సాగు చేసిన పంటల సమాచారాన్ని వీఏఏలు, వీహెచ్‌ఏలు మరో ఇరవై రోజులలో నమోదు చేయాలి. గడువు మీరితే యాప్‌లో సమాచారం స్వీకరించక సాగుదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Read More

పోలవరానికి త్వరగా నిధులివ్వండి

పోలవరం ఆలస్యమైతే మరో సీజన్‌ కోల్పోతాము కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరారు. ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంథ్రేఖర్‌, రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి పోలవరంపై సుమారు 50 నిమిషాలు కూలంకషంగా చర్చించారు.

Read More

రుణ మాఫీ కాని వారి కోసం స్పెషల్‌ డ్రైవ్‌

రుణమాఫీకి అన్ని అర్హతలు ఉండి… మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రేషన్‌ కార్డులు లేకపోవడం, ఆధార్‌ కార్డుల్లో తప్పలుండడం, బ్యాంకు, ఆధార్‌ వివరాల్లో తేడాలుండడం, పట్టాదారు పాస్‌ పుస్తకాలు లేకపోవడం, అసలు – వడ్డీ లెక్కల్లో తేడాలు ఉండడం కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించి, స్పెషల్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపి ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అధికారులు రైతుల ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలని, అవసరమైన చర్యల గురించి రైతులకు వివరించాలని డైరెక్టర్‌ గోపి ఆదేశాలు జారీచేశారు.

Read More

చీడపీడల నివారణకు కొత్త యాప్‌

పంటలను ఆశిస్తున్న చీడపీడలను గుర్తించి త్వరితగతిన నివారణ సలహాలు, సూచనలు అందించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ DPPQS, ICAR శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్‌ పెస్ట్‌ సర్వైలెన్స్‌ సిస్టమ్‌ (NPSS) మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆడిటోరియంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేతులమీదుగా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. రైతులు ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌ లోని స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తమ పంటపొలాల్లో చీడపీడలను ఫొటోలు తీసి NPSS యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వెంటనే ఆ తెగుళ్ళను గుర్తించటంతోపాటు సమగ్ర సస్యరక్షణ సూచనలు రైతులకు అందుతాయి. దేశవ్యాప్తంగా చీడపీడల సమాచారం ఫరీదాబాద్‌లోని DPPQS కేంద్ర కార్యాలయంలో నిక్షిప్తం చేసి ఉండటం వల్ల ఏ ప్రాంతంలోని చీడపీడల గురించి అడిగినా వెంటనే సూచనలు అందుతాయి.

Read More

రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు

2014 నుండి 2019 వ సంవత్సరం వరకు ట్రాక్టర్లు, పవర్‌ స్ప్రేయర్లు, టార్పాలిన్లు మరియు వివిధ రకాల యంత్ర పరికరాలను రైతులకు రాయితీపై అందించడం వలన యాంత్రీకరణలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. మరలా తిరిగి రాయితీలను పునరుద్ధరించి రైతులను ప్రోత్సహించటానికి గాను వ్యక్తిగత రాయితీపై యంత్ర పరికరాలను అందివ్వాలని వ్యవసాయశాఖా మంత్రి అచ్చెం నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చే పరికరాల్లో కృత్రిమ మేథనూ జోడించాల్సి ఉంది. ఇప్పటికే ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వరి రైతులకు రాయితీపై టార్పాలిన్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు.

Read More

రేపు మూడో విడత రుణమాఫీకి సిద్ధమైన సర్కార్‌

తెలంగాణా ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి చేసిన వాగ్ధానాలకు అనుగుణంగా ఇప్పటికే రెండు విడతల రుణమాఫీని అమలు చేసింది. లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రేపు నిధులను విడుదల చేయనుంది. మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఖమ్మం జిల్లా వైరా మండలంలో ప్రారంభించి, అర్హులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమచేయనుంది. జులై 18న మొదటి విడత రుణమాఫీ, జూలై 30న రెండో విడత రుణమాఫీ, రేపు మూడో విడత రుణమాఫీ చేసి కేవలం నెల రోజులలో తాము చేసిన వాగ్ధానాన్ని తెలంగాణా ప్రభుత్వం నిలబెట్టుకొంటుంది.

Read More

రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్‌ డ్రైవ్‌

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన వాగ్ధానం ప్రకారం అర్హులైన రైతులందరికి ఇప్పటికే రెండు దఫాలుగా రుణమాఫీ చేసింది. అర్హత ఉండి కొన్నిరకాల సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More