19 నుంచి రుతుపవనాల తిరోగమనం

దేశ వ్యవసాయరంగానికి ఆయువుపట్టైన నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 19-25 మధ్య నుంచి ప్రారంభం కావచ్చని జాతీయ వాతావరణ విభాగం గురువారం వెల్లడించింది. దేశ వాయవ్య ప్రదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనానికి అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. సాధారణంగా జూన్‌ 1న దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు జులై 8 నాటికి దేశమంతటా విస్తరించి వర్షాలను అందిస్తాయి. తిరిగి సెప్టెంబర్‌ 17 నుంచి తిరోగమిస్తూ అక్టోబరు 15 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. ఈసారి నైరుతి రుతుపవన కాలంలో దేశంలో 836.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 772.5 మి.మీ. కంటే ఎనిమిది శాతం ఎక్కువ. అయినప్పటికీ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 16 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు దేశ వాయవ్య (4 శాతం) మధ్య (19 శాతం), దక్షిణాది (25 శాతం) ప్రాంతాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురిశాయి.

Read More

5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం

ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 19 జిల్లాలలో 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 3 లక్షల మంది రైతులు రూ. 1244 కోట్ల మేర నష్టపోయారు. వరదల కారణంగా 2.03 లక్షల మంది రైతులకు చెందిన 4.6 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిని రూ. 1104 కోట్ల విలువైన 4.80 లక్షల టన్నుల దాన్యం ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులకు అదనపు సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Read More

ధరణి స్థానంలో… భూమాత

తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి, ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకురావడం, భూముల రీసర్వే, ల్యాండ్‌ టైటిల్‌ అమలు, అధికారలకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు, భూ వినియోగపాలసీ, భూముల రీసర్వే చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భూధార్‌ కార్డుల అందజేత వంటి పలు సిఫార్సులతో ధరణి కమిటీ ముసాయిదా నివేదికను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది.

Read More

నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ. పది వేలు ఇస్తాం

ఇటీవల సంభవించిన వరదల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. వరి పంట సాగు చేసి వరదల వలన పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు అందిస్తాము కాబట్టి రైతులు అధైర్యపడవద్దు అని ఆయన కోరారు. ఇందుకు సంబంధించి ఏలూరు సీ.ఆర్‌. రెడ్డి కాలేజ్‌ ఆడిటోరియంలో వరద బాధితులు, వరదలకు నష్టపోయిన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నెల 17వ తేదీ లోపు నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Read More

తెల్ల బంగారానికి రికార్డు ధర

గతవారం రోజులుగా నిలకడగా ఉన్న పత్తి ధరలు ఈ రోజు అమాంతంగా పెరిగి క్వింటాలుకు రూ. 7800/- అయ్యింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకి రూ. 7800/-ల చొప్పున పత్తిని కొనుగోలు చేశారు. ఈ రోజు 131 క్వింటాళ్ళ విడి పత్తిని రైతులు జమ్మికుంట మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ. 7400/-, గరిష్ట ధర రూ. 7800/-లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి గింజలకు, పత్తి బేళ్లకు గిరాకీ పెరిగిన కారణంగానే పత్తి ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Read More

రైతులకు వచ్చే నెల నుంచి ఆధార్‌ తరహా ఐడి కార్డులు!

కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు శుభవార్త అందించింది. రైతులకు ఆధార్‌ తరహాలో ఐడి కార్డులను జారీ చేయాలంటూ కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయరంగాన్ని డిజిటలైజ్‌ చేసే లక్ష్యంతో అక్టోబర్‌ నెల నుంచి వీటిని జారీ చేయనున్నారు. దానిని పైలెట్‌ ప్రాజెక్టుగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలలో అమలు చేయడం జరిగింది. మరో 19 రాష్ట్రాలలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రాష్ట్రాలు కూడా అంగీకరించాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ స్కీములు, కనీస మద్దతు ధరకు పంటల అమ్మకం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు వంటి వాడకాలలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Read More

నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం

భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతిరైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వర్షాల కారణంగా ముంపుకు గురైన పంటలను మంత్రి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి, ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా వ్యవసాయ, ఆక్వా రంగాలకు తీవ్ర నష్టం జరిగిందని ఈనెల 10లోగా పంట నష్టం లెక్కించి, అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారని మంత్రి అన్నారు. ఈ క్రాప్‌తో సంబంధం లేకుండా పంట నష్టం జరిగిన ప్రతిరైతును ఆదుకుంటామని మంత్రి అన్నారు.

Read More

అర్హులైనా రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం

రైతు రుణమాఫీ గురించి ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతలలో రెండులక్షల రూపాయల వరకు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అర్హులైనా రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి, త్వరలోనే వారికి కూడా రుణమాఫీ వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇకపోతే రైతుబంధు విషయంలో ప్రజలకు ఇప్పటికీ అపోహలు ఉన్నాయి కాబట్టి పంటలు సాగు చేసిన రైతులకు, కౌలు రైతులకు, సాగులో ఉన్న భూమికీ రైతుబంధు పథకం వర్తింపజేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేశారు.

Read More

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం 3300 కోట్లు

ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వరద సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. గత రెండు రోజులుగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తోపాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.

Read More

వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయ సామర్థ్యాలు

దేశంలో పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహార భద్రతను కల్పిస్తూ… మారుతున్న వాతావరణాలకు అనుగుణంగా పరివర్తన చెందే సామర్థ్యాలను భారత్‌ వ్యవసాయ రంగం కలిగి ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ఫైజ్‌ అహ్మద్‌ కిద్వాయ్‌ అన్నారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో రెండు రోజుల పాటు సమున్నతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమున్నతి ఎఫ్‌పీఓ (రైతు ఉత్పత్తుల సంఘం)-2024 సదస్సును మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మన శీతోష్ణస్థితి మార్పులను తట్టుకోగలిగే సాగు కోసం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సమగ్ర వ్యవసాయ రంగానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాబార్డ్‌ సీజీఎం భవాని శంకర్‌ మాట్లాడుతూ… దేశంలో సుస్థిర వ్యవసాయ విధానాలు పాటించేలా చేసేందుకు, భారతీయ వ్యవసాయ క్షేత్రాల నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను విపణిలోకి తీసుకెళ్లడం, సుస్థిర, శీతోష్ణస్థితి అనుకూల ఎఫ్‌పీఓల నిబంధనలపై నాబార్డ్‌ పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్‌ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎన్‌ఏఎఫ్‌పీఓ)తో కలిసి సమున్నతి ‘భారత్‌ ఎఫ్‌పీఓ ఫైండర్‌’…. జాతీయ వేదికను ప్రారంభించారు. భారత్‌ ఎఫ్‌పీఓ ఫైండర్‌ సుస్థిర వ్యవసాయానికి ఎంతో తోడ్పడుతుందని సమున్నతి వ్యవస్థాపకుడు, సీఈఓ అనిల్‌ కుమార్‌శర్మ, డైరెక్టర్‌ ప్రవేశ్‌ శర్మ చెప్పారు.

Read More