రైతులకు అందుబాటులో విస్తృత సమాచారం

కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రాంతీయ భాషలలో వివరాలు తెలియచేసి, అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందుకు సంబంధించి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అందించిన వివరాలు…

  • వ్యవసాయ విద్యను బలోపేతం చేసేందుకు రూ. 2,291 కోట్లతో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తారు. వ్యవసాయ విద్యలో ప్రకృతిసాగు, వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే వంగడాలను రూపొందించే విధానాలకు చేయూతనిస్తారు.
  • ఆహారం, పశువుల దాణాలకు పనికొచ్చే పంటల జన్యు మూలాలను మెరుగుపరుస్తారు. పప్పుదినుసులు, నూనెగింజల పంటలు మరింత దిగుబడినిచ్చేలా మెరుగుపరుస్తారు. పురుగులు, చీడపీడల నివారణపై పరిశోధనలు నిర్వహిస్తారు.
  • పాడి పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, వాటి ఉత్పాదకత పెంచేందుకు వీలుగా పశువుల ఆరోగ్య నిర్వహణ, పశువైద్య విద్యకి ప్రాధాన్యమిస్తారు.
  • ఉద్యాన పంటల సాగును సుస్థిరంగా మార్చేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వాతావరణానికి తట్టుకొని నిలబడగలిగే పంటలను ప్రోత్సహిస్తారు. కూరగాయలు, పూలు, పండ్లు, పుట్టగొడుగుల సాగుకు చేయూతనిస్తారు.
  • కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడం ద్వారా స్థానిక భాషల్లో రైతులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. వీటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను అందుబాటులో ఉంచుతారు.
  • దేశవ్యాప్తంగా ఉన్న సహజ వ్యవసాయ వనరులను పరిరక్షిస్తారు. దాని కింద రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, భూగర్భ జలాలను సంరక్షిస్తారు.
  • డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ పథకం కింద రైతుల వివరాలు నమోదు చేస్తారు. భూముల పట్టాల రిజిస్ట్రీని నిర్వహిస్తారు. సాగు చేసిన పంటల వివరాలు, జియో స్పేషియల్‌ డేటా, కరవులు, వరదల పర్యవేక్షణ, వాతావరణ/శాటిలైట్‌ డేటా, భూగర్భ జలాలు, ఉపరితల జలాల లభ్యత సమాచారాన్ని సేకరించి రైతులకు అందుబాటులో ఉంచుతారు. పంట భూముల స్థితిగతులు, దిగుబడుల అంచనాలు, పంట రుణాలు, ఏఐ, బిగ్‌డేటా లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొనుగోలుదారులతో రైతులను అనుసంధానం చేయడం, మొబైల్‌ ఫోన్ల ద్వారా రైతులకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. ఆధార్‌ తరహాలో 11 కోట్ల మంది రైతులకి డిజిటల్‌ గుర్తింపునిస్తారు.
Read More

వరద నీటిని ఒడిసి పట్టుకుందాం

భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద నీటిని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి, నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఆ నీటిని వీలైనంత వరకు ఎత్తిపోయాలని, రోజుకు ఒక టి.ఎం.సి తగ్గకుండా నంది, గాయత్రి పంప్‌ హౌస్‌ల ద్వారా లిఫ్ట్‌ చేసి రిజర్వాయర్లను నింపాలని మంత్రి సూచించారు. మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్‌, మల్లన్న సాగర్‌ వరకు జలాశయాల్లోకి కూడా నీటిని ఎత్తిపోయాలని మంత్రి ఆదేశించారు.

Read More

వ్యవసాయ సిబ్బంది సెలవులు పెట్టొద్దు

రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల నేపథ్యంలో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని, రైతులకు అండగా నిలవాలని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు కోరారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ కాల్‌సెంటర్లను కొనసాగించాలని, పశువులు మృత్యువాత పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read More

జలాశయాల్లో గణనీయంగా పెరిగిన నీటినిల్వలు

దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే రిజర్వాయర్లలో నీటి నిల్వలు 126 శాతం అధికంగా నమోదైనట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. పదేళ్ళ సగటుతో పోల్చితే నీటి నిల్వ స్థాయిలు 119 శాతం పెరిగినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 29 వరకు రిజర్వాయర్లలో నీటిమట్టం 144.333 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) వద్ద ఉందని, మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 80 శాతం అని సీడబ్ల్యూసీ పేర్కొంది. 20 జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు ఉన్న 155 జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 180.852 బీసీఎంలు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో కూడిన దక్షిణాదిలోని 43 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. వీటిల్లో మొత్తం 44.771 బీసీఎంల నిల్వ ఉన్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. ఈ జలాశయాల్లో 49 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇక సాదారణ నిల్వల స్థాయి 63 శాతమే.

Read More

నేటి నుంచి పెసల కొనుగోళ్లు

తెలంగాణలో పెసలును మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు శుక్రవారం నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏడు జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్‌, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్‌, కామారెడ్డి జిల్లాలలో వీటిని ప్రారంభిస్తామన్నారు. గురువారం సచివాలయంలో ఆయన పెసర సాగుపై సమీక్ష నిర్వహించారు. మార్క్‌ఫెడ్‌ ఎండీ వి. శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ”రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 64,175 ఎకరాలలో ఈ పంట సాగయింది. మొత్తం 17,841 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా. పెసర సాగు అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో తొలివిడతగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. కేంద్రం నిర్దేశించిన విధంగా క్వింటాలుకు రూ. 8,682 మద్ధతు ధరతో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తుంది. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించి పంటకు మద్దతు ధర పొందాలి” అని మంత్రి కోరారు.

Read More

చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతో జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ చిన్ననీటి వనరుల విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులను సమీపంలోని నదులు, రిజర్వాయర్ల జలాలతో నింపేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Read More

రైతుల నుంచి పత్తికొనుగోలు చేస్తేనే సెస్‌ తొలగిస్తాం

రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తేనే సెస్‌ తొలగిస్తామని స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ వ్యాపారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జౌళి శాఖామంత్రి సవిత స్పష్టం చేశారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తి పంటను కొనుగోలు చేయాలని కోరుతూ సీసీఐ, కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. పత్తి దిగుబడుల పెంపు, వ్యర్థాల నిర్వహణ, నూతన వంగడాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లర్లు, అచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో తగిన చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టం చేశారు.

Read More

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తూంది. కానీ ఆ వ్యయాన్ని తగ్గించేందుకు రైతులు కూడా పీయం కుసుమ్‌ యోజన కింద సౌర విద్యుత్‌ మోటార్లను ఏర్పాటు చేసుకుని, సౌర పంపు సెట్లను ప్రోత్సహించాలని, రైతులు సుస్థిర అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. సేంద్రియ వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని, లేదంటే మితిమీరి వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల భూమి నిస్సారమయ్యే ప్రమాదం ఉందని హనుమకొండ కలక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా గవర్నర్‌ అన్నారు.

Read More

సాగునీటి సంఘాలకు జవసత్వాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వనరులవారీగా నీటి వినియోగదారుల సంఘాలకు త్వరలోనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్నికలు జరగకపోవడంతో పూడికతీత పనులు, మరమ్మత్తులు, కాలువ గట్ల బలోపేతం వంటి క్షేత్రస్థాయి ముఖ్యమైన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే నీటి తీరువా వసూలు కూడా ఆగిపోయింది. ఇప్పుడు సాగునీటి సంఘాలకు తిరిగి ఊపిరిలూదడం ద్వారా నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించి, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.

Read More

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రధాని, ఆర్థికమంత్రి, జలశక్తి మంత్రులతో పలు దఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చల అనంతరం ఇవాళ్టి క్యాబినెట్‌ భేటీలో కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అలాగే పెండింగ్‌ నిధులనూ త్వరలోనే ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.

Read More