వరి ధాన్య సేకరణ, తరలింపు, నిల్వలో ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ ఇంఛార్జి ఎండీ ఉదయ్‌ కుమార్‌ మరియు ఆగ్రోస్‌ ఎండీ రాములుతో సమావేశం నిర్వహించి, వరి కొనుగోళ్ళు, వరి సేకరణ, తరలింపు మరియు నిల్వలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవలసిన తక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచాలని, కోతలు మరియు సెంటర్లకు వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ మరియు మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ రైతులకు కొనుగోళ్ళలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆగ్రోస్‌ ఎండీ రాములుని ఆదేశించారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గోదాముల నిల్వ సామర్థ్యము, ప్రస్తుతం ప్రాంతాల వారీగా అందుబాటులో ఉన్న గోదాముల నిల్వ సామర్ధ్యం, వెంటవెంటనే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్కెటింగ్‌ మరియు వేర్‌ హౌసింగ్‌ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. తరుచూ సివిల్‌ సప్లై అధికారులతో సమన్వయం చేసుకొంటూ వారికి వివరాలు అందచేస్తూ ధాన్యం తరలింపులో వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుతము 29.537 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్ధ్యము అందుబాటులో ఉందని, కొనుగోళ్ళకు తగ్గట్లుగా నిల్వ సామర్ధ్యాన్ని అందుబాటులోకి తెచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Read More

సోయాబీన్‌ సేకరణలో దేశంలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ జాయింట్‌ సెక్రటరీ గారు సోయాబీన్‌ ఉత్పత్తి చేసే రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో, ఇప్పటిదాకా జరిగిన సోయాబీన్‌ సేకరణ గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్యామ్యూల్‌ మాట్లాడుతూ, ఇప్పటిదాకా రైతుల వద్ద నుంచి మద్ధతు ధరకు సోయాను సేకరించిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని, సేకరణలో సాంప్రదాయ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రాలను కూడా అధిగమించిందని తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 47 సెంటర్ల ద్వారా సోయా సేకరణ జరుగుతుందని, రూ. 4892 మద్ధతు ధర చెల్లిస్తూ, ఇప్పటికి 118.64 కోట్ల విలువగల 24,252 మెట్రిక్‌ టన్నుల సోయా చిక్కుడును, 1464 మంది రైతుల నుండి సేకరించినట్లు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంత్రి తుమ్మల ఆదేశాలతో గతంలో ఉన్న ఎకరా పరిమితి 6.5 క్వింటాళ్ళ నుండి 10 క్వింటాళ్ళకు పెంచడం జరిగిందని, మన రాష్ట్రం నుండి సమీక్షలో పాల్గొన్న మార్క్‌ఫెడ్‌ అధికారులు తెలిపారు.

Read More

వ్యవసాయ యాంత్రీకరణ పథక పునరుద్ధరణకు కసరత్తు

  • జిల్లా స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలకు ఆదేశాలు
  • ఆయా ప్రాంతాలలో ఉన్న డిమాండ్‌ను బట్టి ఎంపిక చేసిన పనిముట్లు/యంత్రాల సరఫరా
    త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరుతెన్నులపై వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావు, వ్యవసాయ డైరెక్టర్‌ గోపి, ఐఏఎస్‌ మరియు సహకార సంస్థల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశం నిర్వహించారు.
    వ్యవసాయమంత్రి తుమ్మల ఆదేశాలతో ఈ యాసంగి నుండి రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను, సబ్సిడీపై సరఫరా చేయడానికి, ప్రణాళిక సిద్దంచేసామని అందులో భాగంగా జిల్లాల వారీగా ఎక్కువ డిమాండ్‌ ఉన్న పనిముట్లను, యంత్ర పరికరాల జాబితా సిద్దం చేసినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి తెలియజేశారు. అంతేగాక మంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లాల వారీగా యంత్ర పరికరాలు మరియు పనిముట్లు తయారీ దారుల సంస్థల సహకారంతో మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతులలో అవగాహన పెంపొందించే విధంగా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా యంత్రాంగం ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నామని తెలియజేశారు.
    ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రోటవేటర్స్‌, ఎమ్‌.బి నాగళ్ళు, కల్టివేటర్స్‌, తైవాన్‌ స్ట్రేయర్లు, బేలర్స్‌, పవర్‌ వీడర్స్‌, మొక్కజొన్న వొలుచు యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్‌ డ్రోన్లు మున్నగువాటిని ప్రతిపాదించినట్లు తెలియజేశారు. రైతులకు అవగాహన కొరకు ఎగ్జిబిషన్లను ప్రభావవంతంగా నిర్వహించాలని, ఎగ్జిబిషన్‌ ఏర్పాటుకు కావాల్సిన నిధులు కూడా సమకూర్చుకోవాలని, అలాగే సంబంధిత గౌరవమంత్రి వర్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి రైతులందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లా స్థాయిలో స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించారు.
    వ్యవసాయశాఖ వారు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి, ఇది ఆరంభం మాత్రమేనని, వ్యవసాయయాంత్రీకరణ నిరంతర కార్యక్రమము అని, అందుకని ఎక్కడా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్టంగా నిబంధనలు రూపొందించి, రైతులకు ఈ సీజన్‌ లోనే యంత్రాలను, పనిముట్లను అందచేయాలని, జిల్లా స్థాయి ఎగ్జిబిషన్‌లను కూడా వెంటనే ఏర్పాటుచేయాలని, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వారందరినీ ఈ ఎగ్జిబిషన్‌లో భాగస్వామ్యం చేయాలని కోరారు.
    ఎగ్జిబిషన్‌ సమాచారం అన్ని ప్రసారమాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, రైతులను పెద్దఎత్తున పాల్గొనేటట్లు చేయాల్సిందిగా సూచించారు.
Read More

రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై ‘ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటినెన్స్‌ యాక్టు(ఎస్మా)’ను ప్రయోగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అక్కడక్కడ రైతులను ఇబ్బబందులకు గురి చేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావడంతో సోమవారం ఆయన అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడినా, రైతులను గందరగోళానికి గురి చేసినా, వేధించినా కఠినంగా వ్యవహరించాలని నిర్ధేశించారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.

Read More

40 శాతం రాయతీపై డ్రోన్లు

రైతులకు ఈ ఏడాది వ్యక్తిగత యంత్రపరికరాలు ఇవ్వాలని.. డ్రోన్ల వినియోగం పెంచాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు కేటాయించింది. రూ87.50 కోట్లతో 875 యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి 40% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్నారు. డ్రోన్ల సాంకేతికతను ప్రోత్సహించేందుకురూ.35 కోట్లు, ఆర్‌కేవీవై పథకాలకు రూ.1,061 కోట్లు కేటాయించారు.
2024-25 ఏడాదిలో 4.50 లక్షల మట్టి నమూనాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీనికి రూ. 18.35 కోట్లు కేటాయించారు. డ్రై కెమిస్ట్రీ విధానంలో చేపట్టనున్న ఈ పరీక్షలకు రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ వినియోగించనున్నారు. ఆల్ఫా స్ప్రెక్ట్రోస్కోపి ద్వారా మట్టి నమూనాలను స్ప్రెక్టల్‌ లైబ్రరీలో భద్రపరుస్తారు. వాటి ఆధారంగా తర్వాత ఉపగ్రహ చిత్రాలతో మట్టి నమూనాలను విశ్లేషించి, రియల్‌టైమ్‌లో కృత్రిమ మేథ ద్వారా ఫలితాలు రాబడతారు.

Read More

ప్రకృతి వ్యవసాయంకు రూ. 422.96 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో అగ్రికల్చర్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు. కేటాయింపులు ఇలా….
రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు
భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు
విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు
ప్రకృతి వ్యవసాయంకు రూ.422.96 కోట్లు
డిజిటల్‌ వ్యవసాయంకు రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు
వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు
రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ రూ.44.03 కోట్లు
పంటల బీమా పథకానికి రూ.1,023 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.8,564.37 కోట్లు
ఉద్యావన శాఖ రూ.3469.47 కోట్లు
పట్టుపరిశ్రమ రూ.108.4429 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్‌ రూ.314.80 కోట్లు
సహకార శాఖ రూ.308.26 కోట్లు
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంకు రూ.507.038 కోట్లు
ఉద్యాన విశ్వవిద్యాలయంకు రూ.102.227 కోట్లు
శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయంకు రూ.171.72 కోట్లు
మత్స్య విశ్వవిద్యాలయంకు రూ.38 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ.1,095.71 కోట్లు
మత్స్య రంగం అభివృద్ధి కోసం రూ.521.34 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.7241.30 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానంకు రూ.5,150 కోట్లు
ఎన్టీఆర్‌ జలసిరికి రూ.50 కోట్లు
నీరుపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,637.03 కోట్లు

Read More

తెలంగాణలో పత్తి జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె

తెలంగాణలో పత్తి జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సీఎండీ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్‌ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా, కష్టాలు పడకుండా మరియు పత్తిని తక్కువ ధరలకు విక్రయించవలసిన అవసరం లేకుండా చర్యలు వెంటనే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకమని మంత్రి తెలిపారు.

Read More

మిల్లర్లు రానిచోట ధాన్యాన్ని గోదాములకు పంపండి! నిల్వ, సీఎంఆర్‌ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందిఉపసంఘం సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ధాన్యం సేకరణను రాష్ట్రవ్యాప్తంగా వేగవంతం చేయాలని, మిల్లర్లు సహకరించని చోట ధాన్యాన్ని నేరుగా గోదాములకు తరలించాలని తెలంగాణా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం రాత్రి సివిల్‌ సప్లైస్‌ భవన్‌లో సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, నేరుగా … ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ… ”రానున్న 10-15 రోజులు కీలకమైనవి. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలి. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములను సిద్ధం చేశాం. మిల్లర్లు సహకరించనిచోట ధాన్యాన్ని నేరుగా గోదాములకు తరలించండి. ధాన్యం నిల్వకు, కస్టమ్‌ మిల్లింగ్‌కు అయ్యే అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో మిల్లర్లకు 100% బ్యాంకు గ్యారంటీ నిబంధన ఉండగా… తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి 10 శాతమే పెట్టిందన్న విషయాన్ని రైస్‌మిల్లర్ల సంఘం అధ్యకక్షులు… మిల్లర్లకు తెలియజేయాలి. ఒకవేళ మనవద్ద మిల్లింగ్‌ సామర్థ్యానికి మించి కొనుగోళ్లు జరిగితే… మిగులు ధాన్యాన్ని కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు పంపించొచ్చు” అని సూచించారు. మిల్లర్లతో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ను ఆదేశించారు.

Read More

న్యూజిలాండ్‌లో ఉద్యాన సాగుపై ఎమ్మెల్యేల అధ్యయనం

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాపట్ల జిల్లా పర్చూరు, బాపట్ల ఎమ్మేల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్రవర్మ అక్కడి ఉద్యాన సాగుపై అధ్యయనం చేశారు. ఈ మేరకు ఏలూరి క్యాంప్‌ కార్యాలయం వెల్లడించింది. ”అక్కడి రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో తెగుళ్ల నివారణకు అవలంబించే విధానాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఎందరో యువ రైతులు భిన్న సాగు పద్ధతులు పాటిస్తూ అద్భుత ఫలసాయం సాధిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ విధానాలు జలవనరుల సంరక్షణ, కివి, యాపిల్‌, స్ట్రాబెర్రీ వంటి పంటలను వారు సందర్శించారు. అనంతరం న్యూజిలాండ్‌ విద్యుత్తు శాఖ మంత్రి సిమియన్‌ బ్రౌన్‌తో ఏలూరి, వేగేశన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విద్యుత్తు వినియోగం, నిర్వహణ, నిర్మాణ పనులు వంటి అంశాలను మంత్రి ద్వారా తెలుసుకున్నారు. అంతకముందు న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి క్రిస్టోఫర్‌ లక్సన్‌తోనూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు” అని పేర్కొంది. ఎమ్మెల్యేలతో పాటు ప్రవాసాంధ్రులు దిలీప్‌ మద్దుకూరి, జితేంద్ర నిమ్మగడ్డ, అశోక్‌ గోరంట్ల ఉన్నట్లు చెప్పింది.

Read More

ఎం.ఎస్‌. స్వామినాథన్‌ అవార్డుకు బాపట్ల శాస్త్రవేత్త ఎంపిక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త బడ్డుపల్లి మారుతీ ప్రసన్న జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక టాస్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. పురస్కారం కింద ఆయనకు రూ. లక్ష నగదు అందజేయనున్నారు. దిల్లీకి చెందిన ట్రస్టు ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ (టాస్‌) ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలకు ఏటా ఎం.ఎస్‌. స్వామినాథన్‌ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ప్రభు చేతుల మీదుగా దిల్లీలో డిసెంబరు 20న మారుతీ ప్రసన్న పురస్కారం అందుకోనున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి అయిన ప్రసన్న ప్రస్తుతం కెన్యాలోని నైరోబీలో అంతర్జాతీయ మొక్కజొన్న పరిశోధనా కేంద్రం విబాగాధిపతిగా సేవలు అందిస్తున్నారు. గతంలో మెక్సికోలో ఇదే పరిశోధనా కేంద్రం సంచాలకుడిగా పనిచేశారు. ఉత్తర అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మొక్కజొన్న దిగుబడులు పెంచడంలో ఆయన విశేష కృషి చేశారు. 1965 ఆగస్టు 31న బాపట్లలో జన్మించిన మారుతీ ప్రసన్న స్థానిక ఏజీ కళాశాలలో ఏజీ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులు చదివారు. దిల్లీలోని భారతీయ కృషి అనుసంధాన పరిషత్‌లో పీహెచ్‌డీ చేశారు. 1991లో అదే సంస్థకు చెందిన ఐఏఆర్‌ఐలో జన్యు శాస్త్రవేత్తగా చేరి రెండు థాబ్దాల పాటు సేవలు అందించారు. మొక్కజొన్నపై విశిష్ట పరిశోధనలు చేశారు. ఉత్తమ పరిశోధనలకు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

Read More