మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు సాగులో మార్పులు చేసుకోవాలి

ప్రపంచమంతా ఆహారపు అలవాట్లు మారి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. ఇందుకు అనుగుణంగా సాగులో మార్పులకు సిద్ధమవ్వాలి. ‘రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలి. తద్వారా ఆదాయం పెరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ దేశానికి అన్నపూర్ణగా ఉన్నాయి. పంజాబ్‌లో పురుగుమందుల వాడకం పెరగడంతో క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం పంజాబ్‌ నుంచి దిల్లీకి రోజూ రెండు రైళ్లలో వెళుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పదేళ్ల కిందటే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాను. ఇప్పుడు దానికి సాంకేతికతను జోడించి, అభివృద్ధి చేస్తాం’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అని చెప్పారు. ‘ఆధునిక రాజ్యాంగ సంస్థలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో కృషి చేసిన రైతు కుంచాల రామకృష్ణ, శాస్త్రవేత్త కుర్రా శ్రీనివాసబాబులను సన్మానించారు. ఎన్జీ రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మాధవి, రామాంజనేయులు, ఎన్జీరంగా కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read More

ఎర్రచందనం రైతులకు రూ.3 కోట్లు

‘యాక్సెస్‌ అండ్‌ బెనిఫిట్‌ షేరింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌’ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం పండిస్తున్న 198 మంది రైతులతోపాటు ఆంధ్ర యూనివర్సిటీకి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నట్లు జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బిఏ) ప్రకటించింది. ఎర్రచందనం పరిమాణాన్ని బట్టి ఇందులో ఒక్కో రైతుకు రూ. 33 వేల నుంచి రూ. 22 లక్షల దాకా అందుతుందని తెలిపింది. జీవవైవిధ్య సంరక్షణ కోసం గతంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక అటవీ శాఖలు, ఆంధ్రప్రదేశ్‌ జీవవైవిధ్య మండళ్లకు రూ.48 కోట్లు, తమిళనాడు రైతులకు రూ.55 లక్షలు విడుదల చేసినట్లు ఎన్‌.బి.ఏ. వెల్లడించింది. ప్రస్తుతం ఏపీకి విడుదల చేసిన రూ. 3 కోట్ల మొత్తం చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని 48 గ్రామాల్లో ఉన్న 198 మంది రైతులకు వెళ్తుందని తెలిపింది.

Read More

అమెరికాలో జొన్న ఉత్పత్తి హెక్టారుకు 11 టన్నులు

మన దేశంలో దాణా కొరత పశుసంపద వృద్ధికి విఘాతంగా మారిందని, విధానపరమైన సమగ్ర కార్యాచరణ లేకపోవడం వల్లే పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలు ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని భారత సమ్మిళిత పశుదాణా తయారీదారుల సంఘం (సీఎల్‌ఎఫ్‌ఎంఏ) అధ్యకక్షుడు దివ్యకుమార్‌ గులాటీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో జొన్న హెక్టార్‌కు 11 టన్నులు పండుతుంటే మన దేశంలో కేవలం 3 టన్నులే ఉందని.. అక్కడ జన్యుమార్పిడి విత్తనాల వినియోగం వల్ల ఉత్పత్తి పెరుగుతోందని మనదేశంలో దానిని చేపట్టడం లేదని, దేశంలో దాణా అవసరాల దృష్ట్యా పలు పంటల ఉత్పాదకతను పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆ రంగాలను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగిన సంఘం 66వ వార్షిక సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పశుసంపద, దాణా ఉత్పత్తి ఇతర అంశాల గురించి వివరించారు.
దాణా అవసరాల్లో 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం.
మన దేశం పశుసంపదకు నిలయం. వ్యవసాయ జీడీపీలో మూడో వంతు వాటా పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలదే. దేశంలో ఏటా 60 మిలియన్‌ టన్నుల దాణాను వాడుతున్నాం. అందులో 22 మిలియన్‌ టన్నులు మొక్కజొన్నలే. ప్రస్తుతం దేశీయ దాణా అవసరాల్లో సగం మాత్రమే దేశం ఉత్పత్తి చేస్తున్నందున ఇతర దేశాల నుంచి 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది పాడి, పౌల్ట్రీ, మత్స్య రైతులకు, ఉత్పత్తిదారులకు భారంగా మారుతోంది.
ఉత్పాదకతనైనా పెంచాలి
వరి లాంటి పంటలు అవసరానికి మించి సాగవుతున్నాయి, కానీ దాణా అవసరాల దృష్ట్యా మొక్కజొన్న, సోయా, నూనెగింజల విస్తీర్ణం, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా ఆ మేరకు కృషి జరగడం లేదు. జొన్న, సోయా వంటి పంటలను ఎంత పండించినా కొనుగోలుకు ఆస్కారం ఉంది. విస్తీర్ణం పెంచకపోయినా ఉత్పాదకతను పెంచాలని అభ్యర్థిస్తున్నాం. అమెరికాలో మాదిరిగా జన్యుమార్పిడి వద్దనుకుంటే ఉత్పత్తిని పెంచే కొత్త వంగడాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి దృష్టి సారించాలని కోరారు.

Read More

పంటలలో తెగుళ్ల ఉధృతి నమోదు ఏవోలు చేయాలి





ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంటల్లో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు వారంలో ఒకరోజు పర్యటించి, తెగుళ్ళ వివరాలను యాప్‌లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు సూచించారు. ఈ-పంట, డిజిటల్‌ అప్లికేషన్లపై వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ‘ఇప్పటి వరకు 4,41,167 ఎకరాల్లో 1,65,843 మంది రైతులకు సంబంధించి పంటలను ఈ- క్రాప్‌లో నమోదు చేశాం. బహువార్షిక ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని వెల్లడించారు. ఉద్యాన పంటల నమోదు సమయంలో పంటల రకాలను పేర్కొనాలని ఆ శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు వివరించారు.

Read More

కలెక్టరేట్‌లో సేంద్రియ కూరగాయల స్టాల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌.టి.ఆర్‌. జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వారి కోసం అదే ఆవరణలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రసాయన పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో రైతులు పండించిన కూరగాయలతో స్టాల్‌ ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు కావడంతో ప్రజలు, అధికారులు వాటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు

Read More

జూరాల గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న కృష్ణా ప్రవాహం

మే నెలలోనే.. బిరబిరా కృష్ణమ్మ తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు

నిండు వేసవిలో అరుదైన దృశ్యం. ఎండిపోయి ఎడారిలా మారిన కృష్ణానది ఉరకలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక- తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది. జూరాల ఎగువ ప్రాజెక్టు కర్ణాటకలోని నారాయణపూర్‌కు ప్రవాహమేదీ లేదు. సాధారణంగా జూన్‌, తరువాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది. దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావడం అరుదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది. 16వ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి 90 వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్లు తెరిచి 82,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు (1045 అడుగులు). ఒకే నీటి సంవత్సరంలో(2024 జూన్‌- 2025 మే) మధ్య నైరుతి రుతుపవనాలతో గేట్లు ఎత్తడం అరుదైన విషయం.

Read More

మామిడిలో భారీగా కార్బైడ్‌ వినియోగం

నాణ్యత పరీక్ష ఫలితాల ఆధారంగా చర్యలు: మంత్రి తుమ్మల

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా మామిడికాయలను మగ్గబెట్టేందుకు వ్యాపారులు హానికరమైన కార్బైడ్‌తోపాటు మోతాదుకు మించి ఎథిలీన్‌ సాచెట్లను వినియోగిస్తున్నట్లు తేలింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్కెటింగ్‌, ఆహారభద్రత విభాగం అధికారులు మంగళవారం 110 నమూనాలను సేకరించి, నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా కార్బైడ్‌ ప్యాకెట్లతోపాటు ఎథిలిన్‌ సాచెట్లనూ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జాంబాగ్‌, గడ్డి అన్నారం, బాటసింగారం, వరంగల్‌, జగిత్యాల తదితర మార్కెట్లలోని వ్యాపారులు తెచ్చిన పండ్లను తనిఖీ చేశారు. పలువురు కార్బైడ్‌ వాడిన పండ్లతో, మరికొందరు ఎథిలీన్‌ సాచెట్లతో దొరికారు. దాంతో అధికారులు వారి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ”సీజన్‌ ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం అన్ని మార్కెట్లతోపాటు పండ్ల విక్రయ ప్రాంతాల్లో మామిడి పండ్లను తనిఖీ చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే లైసెన్సుల రద్దుతోపాటు కేసులు నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.

Read More

పోలవరం-బనకచర్లకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలి: చంద్రబాబు

పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించేలా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఏర్పాట్లపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ఏయే అనుమతులు కావాలో అవి పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులకు సూచించారు.

Read More

ఆయిల్‌పామ్‌ సాగు పెరగాలి

తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగు మరింత పెంచాలని కేంద్ర వ్యవసాయ కార్యదర్శి దేవేశ్‌ చతుర్వేది సూచించారు. దేశవ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ సాగుపై ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఉద్యాన సంచాలకులు యాస్మిన్‌ బాషా ఇందులో పాల్గొని రాష్ట్ర ప్రగతిని వివరించారు. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ ఆయిల్‌ పామ్‌ పథకం కింద 2021-22 నుంచి ఇప్పటివరకు 39,515 ఎకరాల్లో 11,685 మంది రైతులు సాగు చేపట్టి.. రూ.103 కోట్ల రాయితీలు పొందారని తెలిపారు.

Read More

వరి కంటే ఆ పంటలే లాభదాయకం

జనరల్‌ నేచర్‌ అధ్యయనంలో వెల్లడి

వరి కంటే చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న పంటల సాగు లాభదాయకమని జనరల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలో మార్పులు, వర్షాభావం, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో వరి ఉత్పత్తి ప్రభావితం అవుతోందని.. ఇది భవిష్యత్తులో ఆహారభద్రతకు సమస్యగా మారే ప్రమాదమున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించింది. వరి నుంచి ఇతర పంటలకు మారిన అన్నదాతలు 11% లాభాలు గడించినట్లు అధ్యయనం వెల్లడించింది. వరి, జొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్నలకు సంబంధించిన గణాంకాలను ఇక్రిశాట్‌ నుంచి పొందినట్లు పేర్కొంది. అధ్యయన బృందంలో భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ అసోసియేట్‌ ప్రొ. అశ్విని ఛాత్రే తదితరులున్నారు.

Read More
  • 1
  • 2