ఈ ఏడాది ఎల్ నినో కారణంగా వర్షాలు తక్కువగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఖరీఫ్ పంట నష్టాలను తగ్గించేందుకు కేంద్రం నడుం బిగించి వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పంటలు వాతావరణ పరిశీలన సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసింది. రాబోవు అనావృష్టి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న దానికి సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసింది. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, ఆహార భద్రత, ఎరువుల లభ్యత వంటి అంశాలపై అంతర్ మంత్రిత్వశాఖల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వల్ప, మధ్యకాలిక పంటలకు ప్రాధాన్యం ఇస్తూ విత్తన నిల్వలను నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

3 Jun, 2026
