ఔషధ మొక్క…. శతావరి

శతావరి ఆకురాల్చే అడవులలో తరుచుగా చెట్ల క్రింద పెరుగుతూ కనబడుతుంది. ముళ్ళ పొదలు లేదా ఇతర పొదల మీద ప్రాకుతూ బహువార్షికంగా పెరిగే ముళ్ళ తీగ. ఆకులు సూదులలా ఉంటాయి. చిన్న, చిన్న కొమ్మలు గుంపులుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా 0.2 సెం.మీ. పొడవు కలిగి ఆకుల మొదళ్ళ నుండి గుత్తులుగా ఏర్పడతాయి. కాడలు కలిసి ఉంటాయి. పండ్లు గుండ్రంగా 0.4þ0.4 సెం.మీ. పరిమాణం కలిగి ఎర్రగా ఉంటాయి. వేర్లు సుమారు 100 వరకు ఉండి కండ కలిగి గుత్తులుగా తయారవుతాయి.

సాధారణ నామం : సీతమ్మజడ / ఆస్పరాగస్/పిల్లితీగలు / పిల్లిపీచర గడ్డలు / చందమామగడ్డలు శాస్త్రీయ నామం : ఆస్పరాగస్ రెసిమోసస్ కుటుంబం: లిలియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో స్టిరాయిడ్లు, గ్లెåకోసైడ్స్ (ఆస్పరాగోసైడ్స్), బిట్టర్ గ్లెåకోసైడ్, ఆస్పరాజిన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దుంపలలో పిండిపదార్థం, మ్యూసిలేజ్ కూడా ఉంటాయి.
  • దీనిని బలవర్థకంగా, మూత్రం సులువుగా జారీ చేయడానికి ఉపయోగిస్తారు. వీర్యాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. తేనెతో తాజావేరు రసాన్ని కలిపి అజీర్ణ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల వ్యాధుల చికిత్సకు వాడే తైలాలలో దీనిని ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • శతావరి ఆకు మిథనాల్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీ. పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (నుస్రా అండ్ హరూన్, 2016).
  • శతావరి ఆకుల నీటి, అసిటోన్, ఇథనాల్ ద్రావణాలు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్లడ్‌సుగర్, ట్రైహలోస్‌పై విష ప్రభావాన్ని చూపాయి (గంగ, ఆమె అనుచరులు, 2017)
  • శతావరి ఆకుల ఇథనాల్ ద్రావణం బాసిల్లస్ ప్యుమిలిస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కెరిచియాకోలి, సూడోమోనాస్ ఈరూజినోసా, ప్రోటియస్‌వుల్గారిస్, స్టెఫైలోకోకసఆరియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కాండిడా ఆల్బికాన్స్ పెరుగుదలను అరికట్టింది (బిట్టు అండ్ కుమార్, 2010).
  • శతావరి ఆకుల ద్రావణం ఈడెసఈజిప్టీపై మస్క్యిటోసైడల్ ప్రభావాన్ని చూపింది. 65% వికర్షక చర్యను ప్రదర్శించింది (కండాగిల్ అండ్ సోమవర్షి, 2016).
  • శతావరి వేరు ద్రావణాలు పర్యావరణహిత పద్ధతిలో అనోఫిలస్ స్టెఫెన్సీ, ఈడిస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటస్ దోమలను వికర్షక చర్య ద్వారా నివారించాయి (గోవింద రాజన్ అండ్ శివశంకర్, 2015)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పొటాష్‌కు పొగాకు ద్రావణం

మొక్కల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే పొటాషియంను అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారుచేసే ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగకరం.

పొగాకు కాడలను ముక్కలుగా చేసుకుని ఒక కిలో కాడలకు ఏడు లీటర్ల నీటిని కలిపి ఏడు రోజుల పాటు నానబెట్టాలి. దీనివల్ల నీటిలో కరిగే పొటాష్ తయారవుతుంది. అరటి పండు ద్వారా కూడా పొటాష్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

లీటర్ నీటికి మూడుశాతం ద్రావణాన్ని కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పొటాష్‌తో పాటు తెగుళ్ల బెడద తగ్గుతుంది.

Read More

ఇటుకల కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.

Read More

ఎల్ నినో పరిస్థితులలో పంటల సాగుకు సూచనలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ప్రపంచ స్థాయిలో వచ్చే ఒక సహజ వాతావరణ మార్పు. ఇది ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చి, 9 నుండి 12 నెలల పాటు ఉంటుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షాలు తగ్గి, ఎండలు మరియు కరువు పరిస్థితులు ఏర్పడతాయి. 2026 ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావం ఆగస్టు వరకే ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుత అంచనాల ప్రకారం ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం వుంది. ప్రస్తుత 2026–27 కాలంలో ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావం 2027 ఖరీఫ్ సీజన్ వరకు కొనసాగి వ్యవసాయం, తాగునీరు మరియు గ్రామీణ జీవనోపాధిని దెబ్బతీయవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 16 జూలై 26 నాటికీ సాధారణ వర్షపాతము 170 మి.మి.గాను 86 మి.మి నమోదు అయింది. అంటే దాదాపు 50 శాతము లోటు వర్షపాతము నమోదు అయింది. ముక్యముగా కోనసీమ, తూర్పు, పచ్చిమ గోదావరి మరియు అన్నమయ్య జిల్లాలలో దాదాపుగా 65 శాతము భారి లోటు వర్షపాతము నమోదు అయింది. అన్ని ప్రధాన జలాశయాలలో కలిపి 290.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది, గత ఏడాది ఇదే సమయానికి (8-7-26) ఈ నిల్వ 524.56 టీఎంసీలుగా ఉండేది.అంటే 55 శాతము తక్కువగా ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం వల్ల సాగునీటి ఇబ్బందులు రావచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఖరిఫ్ లో సాధారణ సాగు ౩౦.84 లక్షల హెక్టార్లుకు గాను 6.7 లక్షల హెక్టార్లు అంటే 22 శాతం మాత్రమే సాగు అయింది. ప్రస్తుతానికి వరి 2.2 లక్షల హెక్టార్లు, ప్రత్తి 1.63 లక్షల హెక్టార్లు, కంది 70400 హెక్టార్లు, వేరుసెనగ 43000 హెక్టార్లు, మొక్కజొన్న 40700 హెక్టార్లు సాగు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లాలకుగాను, కర్నూల్, శ్రీకాకుళం, తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలు తప్ప మిగిలిన 25 జిల్లాలలో 25 శాతము కన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు అయింది.

పంటలపై ప్రభావం (దిగుబడి నష్టాలు):
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు 11% తగ్గే అవకాశం ఉందని, ముఖ్యంగా వర్షాధార పంటలకు 15- 20% నష్టం వాటిల్లవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య వ్యవసాయోత్పత్తి తగ్గుదల క్రింది విధంగా పంటల వారీగా అంచనా వేసినట్లు తెలియజేశారు.

పంట ప్రభావ అంచనా / దిగుబడి తగ్గుదల
మొక్కజొన్న 30% నుండి 35% వరకు తగ్గుదల
సజ్జ 25% నుండి 30% తగ్గుదల
వరి 10% నుండి 20% తగ్గుదల
పప్పుధాన్యాలు 15% నుండి 18% తగ్గుదల
వేరుశెనగ / పత్తి / చెరకు తీవ్రమైన నీటి కొరత వల్ల నాణ్యత, దిగుబడి దెబ్బతింటుంది (వేరుశెనగ పూర్తిగా నష్టపోవచ్చు)
జొన్న, రాగి కరువును తట్టుకోగలవు కాబట్టి వీటికి ప్రమాదం తక్కువ

ప్రస్తుతము సాగు చేసిన పంటల్లో సూచనలు

  • బోరు బావుల క్రింద సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి పంటలకు నీటి వినియోగాన్ని ఆదా చేసేందుకు వరుస విడిచి వరుసకు నీటిపారుదల అందించాలి.
  • కంది మరియు ఆముదంలో మొక్కల సాంద్రత తక్కువ చేయించడం వలన ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఆముదం మరియు కంది పంటలలో ఎక్కువ వత్తుగా ఉన్న మొక్కలను తొలగించి వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తిన 30 మరియు 60 రోజులకు గుంటకతో గాని, గొర్రుతో గాని అంతర కృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటుగా నేలలో తేమను రక్షించుకోవచ్చు.
  • లోతు తక్కువ గల ఎర్ర గరప నేలల్లో పంట మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత ప్రతి రెండు సాళ్ళ మధ్య కట్టె నాగలి గానీ లేదా బోదె నాగలి గానీ నడిపినట్లు అయితే పొలమంతా బోదెలు-కాలువలు లాగా తయారు అవుతాయి. బోదెలు చేయడం వలన మొక్కల మొదళ్లకు తగినంత మట్టి సమకూరుతుంది. ఇలా బోదెలు -కాలువలు చేయడం వలన వర్షపు నీరు సాళ్లలో నిలబడి భూమిలోనికి ఇంకి పోతుంది, తద్వారా ఎక్కువ నీరు భూమి లోనికి ఇంకడం వలన భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి పంట మొక్కలకు అందించడం వలన దిగుబడి పెరుగుతుంది.
  • పంట వేసిన తరువాత వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టు లేదా పంట అవశేషాలతో మల్చింగ్ (ఆచ్చాదన) చేయడం వలన భూమిలో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉండటం ద్వారా పంట బెట్టకు గురి కాకుండా ఉంటుంది. అలాగే కలుపు సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి కనుక నేలలో తేమ శాతాన్ని రక్షించుకోవచ్చు.
  • మెట్ట ప్రాంతాల్లో పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు నీటి కుంటలలో నిలువ చేసిన నీటిని, పంట కాలంలో ఎర్ర నేలల్లో పదిరోజులకు, నల్లరేగడి నేలల్లో 15 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, స్ప్రింకర్ల ద్వారా 20 మి.మీ.ఎర్ర నేలల్లో, 40 మి.మీ.నల్లరేగడి నేలల్లో అందించగలిగితే 20-30% దిగుబడి పెరుగుతుంది. చివరి దశలో బెట్ట వస్తే (కంది, ఆముదం వంటి దూర వరస పంటలకు) నీటి ట్యాంకర్ల ద్వారా రక్షక తడులు (Protective Irrigation) ఇవ్వాలి.

వరి సాగు లో వర్షాభావ పరిస్థితులు లేదా సాగునీటి కొరత ఉంటే సూచనలు

  • పొలంలో నిరంతరం నీరు నిల్వ ఉంచకుండా ప్రత్యామ్నాయ తడి-పొడి (AWD) పద్ధతి పిలక దశలో, పై పాటుగా ఎరువులు వేసినప్పుడు అనుసరించాలి. కాలువల ద్వారా అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించాలి. పొలాల గట్లను బలపరచి నీటి నష్టాన్ని తగ్గించాలి. పొలంలో పగుళ్లు రాకుండా తగిన తేమను నిలుపుకోవాలి.
  • నీటి లబ్యత తక్కువగా ఉన్న యెడల, మురుగు నీటి నాణ్యతను పరీక్షించుకొని లవణ సాంద్రత 2 దేసిమేన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాగునీరుగా ఉపయోగించాలి.
  • వరి దిగుబడి తగ్గే అవకాశం ఉన్న జిల్లాల్లో, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు లో దమ్ము చేసి చదును, చేసిన పొలంలో మండె కట్టిన విత్తనాన్ని వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ పద్దతి లేదా SRI సాగు పాటించాలి.
  • తక్కువ కాలం మరియు బెట్టను తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి.
  • ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పుడు మెట్ట ప్రాంతాలు మరియు బోరు బావుల క్రింద స్వల్ప వ్యవధి రకాలైన MTU1121, MTU1293, MTU1290 మరియు MTU1426 సాగు చేయాలి. తక్కువ వయస్సు (20–25 రోజుల) నారును ఉపయోగించాలి.
  • చాడు నేలలకు: ఇంద్ర,, MCM 103, MCM 125, MTU 1290, MTU 1293
  • నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్ లో చ॥మీ॥ కు 33 కుదుళ్ళు ఉండేలా చూడాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేట్లు నాటాలి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ళ సంఖ్యను నిర్ధారించాలి. దీర్గకాలిక, మద్యకాలిక మరియు స్వల్ప కాలిక రకాలు నాటినపుడు ఒక చధరపు మీటరుకు 33 కుదుళ్లు ఉండాలి.
  • నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు.
  • ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులలో, ఉన్న నీటిని జీవ తడులకు వాడుకోవాలి.
  • నీరు తక్కువగా ఉన్నపుడు వరి పైరు మూన తిరిగిన దశ నుండి పిలకల దశ వరకు ఆరుతడిలాగా నీటి తడులు పెడుతూ మరియు నీరు బయటకు పోకుండా పొలం గట్టును దృడంగా చేసుకోవాలి.
  • అధిక ఉషోగ్రతలకు చౌడు భూముల్లో సాగు చేసే వరి పంటకు తరచు మంచి నీరు మార్చుకోవటం వలన చౌడు తీవ్రతను తగించుకోవచ్చు .
  • పంటలో గనుక జింక్ లోపం వచ్చినటైతే ఒక లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ (0.2%) కలపి పిచికారి చేసి నివారించుకోవాలి. జింక్ లోపం తీవ్రతను బట్టి 5 రోజుల కాలంలో రెండవ పిచికారి చేయాలి.
  • ఇనుము ధాతు లోపము నివారణకు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మఉప్పు కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని (10 గ్రాముల అన్నభేది) వాడాలి.

ఎల్‌నినో / బెట్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు:
వర్షాలు సకాలములో లేని యెడల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.

  • ఆగష్టు మాసములో : తేలికపాటి నేలలు : జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద మేత జొన్న, ఉలవలు
  • భరువైన నేలలు: ఆముదము, జొన్న, కొర్ర , సజ్జ , పెసర , అలసంద, కంది ఉలవలు
  • ప్రస్తుత పరిస్థితుల్లో వరి, మొక్కజొన్న పంటల సాగును సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది.
  • ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ పంట కాలం గల మినుములు, కొర్రలు, సజ్జలు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.

పండ్ల తోటలను (చీని, మామిడి లో) తీవ్ర కరువు సమయంలో చెట్లను కాపాడుకునే అత్యవసర పద్ధతులు:

  • పాదులలో అచ్ఛాధన (మల్చింగ్) చేసుకొని నీటి ఆవిరిని అరికట్టాలి. నేల ఆరోగ్యాన్ని పెంపొందించాలి.
  • ఎండ తీవ్రతలేని సాయంత్రం సమయంలోనే పండ్ల తోటలకు సాధారణ తడిగానీ, లేదా ట్యాంకర్ల ద్వారా రక్షకతడిగానీ ఇవ్వాలి.
  • చెట్టు పాదులో ఒక వారం ఒక సగభాగం, మరుసటి వారం ఇంకో సగభాగంలో నీరు పెట్టడం ద్వారా నీటిని ఆదాచేయవచ్చును. ఇది పార్షియల్ డ్రై రూట్ జోన్ తడి పద్ధతి అంటారు.
    • 1:1 నిష్పత్తిలో బంకమట్టి + సున్నం కలిపి కాండానికి పూస్తే చెట్లు ఎండకు ఎండిపోవడాన్ని తగ్గించవచ్చు.
    • పచ్చిరొట్ట పంటలు వేసుకొని, నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచవచ్చు.
    • చెరువు మట్టిని వేసి నేలలో తేమను నిలిపే గుణాన్ని పెంచవచ్చు.
    • చెట్టు ఎండిపోతున్నప్పుడు బాగా ఎండిపోతున్న చెట్ల కొమ్మలన్నీ నరికి, ఒక్క ప్రధాన కొమ్మనే ఉంచాలి. ఈ పద్ధతి చెట్టు నీటి అవసరాన్ని తగ్గించి బ్రతికిస్తుంది. దీనిని డీ-హార్నింగ్ (De-horning) అంటారు.
    • పంట కోత అనంతరము కొమ్మలు కత్తిరించి, ఆ వ్యర్థాలను ముక్కలు చేసి, పాదుల్లోనే మల్చింగ్ గా వేయాలి. దీనివల్ల నేల తేమ ఆవిరి బాగా తగ్గుతుంది. ముఖ్యంగా చీడపీడలకు గురైన కొమ్మలను పూర్తిగా కత్తిరించాలి.
    • చెట్టుకు 40-50 కేజీల సేంద్రియ ఎరువు (పశువుల/గొర్రెల/కోళ్ల వ్యర్థాలు) వేయాలి. పండ్ల చెట్ల మధ్య వరుసల పచ్చిరొట్ట పంటలు వేసి 50% పూత దశలో భూమిలో దున్నాలి.
    • మొక్కల వేగవంతమైన పెరుగుదలకు మరియు పోషకాల లభ్యతకు తోడ్పడే పి.ఎస్.బి (PSB – ఫాస్ఫో బ్యాక్టీరియా) వంటి జీవన ఎరువులను వినియోగించాలి.
    • ఉద్యాన పంటలకు అత్యంత కీలకమైన పూత మరియు పిందె దశల్లో నీటి కొరత రాకుండా తగినంత నీరు కచ్చితంగా అందించాలి.

ఆకుకూరలు, కూరగాయలు:
• పొలంలో వర్షపు నీరు పొర్లిపోకుండా, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా బోర్‌వెల్ రీఛార్జ్ పిట్ (ఇంకుడు గుంత) ఏర్పాటు ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచవచ్చు.
• తక్కువ నీరు & స్వల్ప కాలపరిమితి గల కూరగాయ పంటలను వేసుకోవాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే టొమాటో, మిర్చిలకు బదులు గోరుచిక్కుడు, చిక్కుడు, అలసంద. చిలగడదుంప, చామదుంప, కంద, ముల్లంగి, బీట్‌రూట్ , క్యారెట్ (కరుడ రకాలు: 80-90 రోజులు) వేసుకోవలెను.
• వివిధ రకాల ఆకుకూరలు తక్కువ కాలంలో పండుతాయి. కొత్తిమీర, గోంగూరలు డ్రిప్ + మైక్రో జెట్స్ ద్వారా తక్కువ నీటితో సాగు చేయవచ్చును.

ఆయిల్ పామ్ పంటల్లో:

  • రక్షక నీటి పారుదల మరియు తేమ సంరక్షణ చర్యలను చేపట్టండి. నేలలో తేమను కాపాడటానికి మరియు నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి, ఎండిన ఆకులు, ఖాళీ పండ్ల గుత్తులు లేదా సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించి నేరుగా నేలలోనే మల్చింగ్ చేయండి.
  • అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగినంత నీటిపారుదల లేకుండా అధికంగా ఎరువులు వేయడం మానుకోండి.
  • వేసవిలో ఆకులను ఎక్కువగా కత్తిరించడాన్ని నివారించండి, ఎందుకంటే చెట్టు పైభాగం (canopy) తగ్గడం వల్ల వేడి ఒత్తిడి పెరగవచ్చు. ప్రతి చెట్టుకు కనీసం 35–40 పని చేసే ఆకులు ఉండేలా చూసుకోండి. పశు సంరక్షణకు సూచనలు
  • సన్నకారు రైతులు ఉలవలు వేసుకుని 10 నుంచి 15 పొట్టేలు పిల్లలు మేపుకుంటే ఒక్కొక్క పొట్టేలుపై పది నుంచి పదిహేను వేల రూపాయల ఆదాయం వస్తుంది.
  • దాణా తక్కువ ధరలో దొరుకుతుందని ఎక్కువగా పశువులకు ఇవ్వడం జరుగుతుంది. దీని వలన పాల దిగుబడి బాగా వచ్చినా పశువుల జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గి చనిపోతాయి. కావున ఈ పద్దతిని ఆచరించకుండా చూడాలి.
  • Co F31, Australian Red Napier వంటి గడ్డి రకాలు తక్కువ నీటితో పండించవచ్చును. తద్వారా పచ్చి మేత కొరత తగ్గించవచ్చును.
  • పాడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పాదకత పెరగడానికి వాటి ఆహారంలో క్రమం తప్పకుండా మినరల్ మిక్స్ (ఖనిజ లవణాల మిశ్రమం) అందించాలి అని తెలపడము అయినది.
  • అవసరమైన టీకాలను, సరైన సమయంలో ఇవ్వాలి.

రైతులందరూ వాతావరణ భీమా WBCIS (Weather Based Crop Insurance Scheme) మరియు ప్రధానమంత్రి పంటల భీమా PMFBY (Pradhan Mantri Fasal Bima Yojana) పథకాలలో తప్పనిసరిగా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించి, నీటి పొదుపు: నీటి వినియోగంలో జాగ్రత్త వహించాలి. భూమిలో తేమ ఆరిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

డా . బి. సహదేవ రెడ్డి, డా. పి.వి. రమేష్ బాబు, డా . య౦ .గిరిజా రాణి మరియు
డా . సి.హెచ్. శ్రీనివాస్, సహ పరిశోధన సంచాలకులు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, మారుటేరు. Ph: 9866787072

Read More

శాస్త్రీయ పద్ధతుల ద్వారా పశువుల ఎంపిక

రైతు సోదరులు, పశుపోషణలో సరైన జంతువులను ఎంపిక చేసుకోవడం అనేది లాభనష్టాలను శాసించే అత్యంత ముఖ్యమైన నిర్ణయం. నాణ్యమైన, ఆరోగ్యకరమైన పశువులను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసుకోవాలి.

  1. పాడి పశువుల ఎంపిక (ఆవులు మరియు గేదెలు)
    పాడి పరిశ్రమలో అధిక పాల దిగుబడి మరియు నిరంతర ఆదాయం కోసం ఆవులు, గేదెలను ఎంచుకునేటప్పుడు ఈ క్రింది శారీరక, ఉత్పాదక లక్షణాలను గమనించాలి:

ఆ. శారీరక నిర్మాణం (Body Conformation)
• త్రిభుజాకార శరీరం (Wedge Shape): మంచి పాడి పశువు వెనుక భాగం వెడల్పుగా, ముందు భాగం (తల మరియు మెడ) సన్నగా ఉండి, పక్క నుండి చూస్తే త్రిభుజాకారంలా కనిపించాలి. ఇది పాలు ఇచ్చే సామర్థ్యానికి ప్రతీక.
• చర్మం మరియు కళ్లు: చర్మం పల్చగా, మెరుస్తూ, పట్టుకుంటే వదిలేసేలా వదులుగా ఉండాలి. కళ్లు చురుగ్గా, స్పష్టంగా ఉండాలి.
• వెన్నెముక మరియు కాళ్లు: వెన్నెముక నిటారుగా ఉండాలి. కాళ్లు బలంగా, నిలబడే పద్ధతి సరిగ్గా ఉండి, గిట్టలు ఎలాంటి పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.

బి. పొదుగు మరియు చనుమొనల లక్షణాలు (Udder and Teats)
• పొదుగు పరిమాణం: పొదుగు పెద్దదిగా, వెనుక కాళ్ల మధ్య భాగంలో బాగా అమర్చబడి ఉండాలి. పాలు పితికిన తర్వాత పొదుగు పూర్తిగా ముడుచుకుపోవాలి (ఇది పొదుగులో కొవ్వు తక్కువగా, పాల గ్రంథులు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది).
• పాల నరాలు (Milk Veins): పొదుగు ముందరి భాగం నుండి పొట్ట కింది వరకు సాగే పాల నరాలు లావుగా, వంకరలు తిరిగి స్పష్టంగా కనిపించాలి.
• చనుమొనలు: నాలుగు చనుమొనలు సమానమైన పొడవు, లావు కలిగి, ఒకదానికొకటి సమాన దూరంలో చతురస్రాకారంలో అమరి ఉండాలి. పొదుగు గట్టిగా ఉండకూడదు (పొదుగు వాపు వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకోవాలి).

సి. వయస్సు మరియు ఈత (Age and Lactation)
• ఈత: మొదటి లేదా రెండవ ఈతలో ఉన్న పశువులను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.
• వయస్సు నిర్ధారణ: పశువు నోటిలోని పళ్లను చూసి వయస్సును శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు. 4 నుండి 6 శాశ్వత పళ్లు (దాదాపు 3 నుండి 5 సంవత్సరాల వయస్సు) ఉన్న పశువులు కొనుగోలుకు అనువైనవి.

డి. ఇతర ముఖ్యాంశాలు
• వీలైతే పశువును కొనేముందు వరుసగా మూడు పూటల పాలు పితికి చూసి, సగటు పాల దిగుబడిని లెక్కించాలి.
• తెలంగాణ వాతావరణానికి గేదెలలో ముర్రా (Murrah) లేదా స్థానిక గ్రేడెడ్ ముర్రా, ఆవులలో జెర్సీ క్రాస్ (Jersey Cross), హెచ్.ఎఫ్ క్రాస్ (HF Cross) లేదా దేశవాళీ జాతులైన గిర్ (Gir), సాహివాల్ (Sahiwal) అనుకూలమైనవి.

  1. గొర్రెలు మరియు మేకల ఎంపిక (Sheep and Goat Selection)
    మాంసం ఉత్పత్తి మరియు పిల్లల ద్వారా లాభాలు పొందడానికి జీవాల ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరం.

ఆ. పోతు జీవాల ఎంపిక (Breeding Rams / Bucks)
మంద అభివృద్ధి అంతా పోతు జీవం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని ఎంపిక అత్యంత కీలకం.
• లక్షణాలు: పోతు జీవం చురుగ్గా, పొడవుగా, ఎత్తైన శరీరంతో, వెడల్పాటి ఛాతి కలిగి ఉండాలి.
• ప్రజనన అవయవాలు: రెండు వృషణాలు (Testicles) సమాన పరిమాణంలో, బాగా అభివృద్ధి చెంది, కిందికి వేలాడుతూ ఉండాలి. వృషణాలలో ఎలాంటి వాపులు లేదా గడ్డలు ఉండకూడదు.
• వయస్సు: 1 నుండి 1.5 సంవత్సరాల వయస్సు (రెండు పళ్ల ప్రాయం) ఉన్న పోతులను మాత్రమే ప్రజననం (దాటించడం) కోసం వాడాలి.

బి. ఆడ జీవాల ఎంపిక (Ewes / Does)
• శరీర రూపురేఖలు: ఆడ జీవాల వెనుక భాగం వెడల్పుగా ఉండాలి, ఇది సులభంగా ఈనడానికి తోడ్పడుతుంది. నోరు, దవడలు సరిగ్గా అమరి ఉండి మేతను సులభంగా నమలగలగాలి.
• సంతానోత్పత్తి చరిత్ర: త్వరగా ఎదకు వచ్చేవి, తక్కువ వ్యవధిలో ఈనేవి మరియు ఒకే ఈతలో రెండు పిల్లలను (ముఖ్యంగా మేకలలో) కనే హిస్టరీ ఉన్న తల్లుల నుండి వచ్చిన పిల్లలను ఎంచుకోవాలి.
• పొదుగు ఆరోగ్యం: పొదుగును తాకి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. చనుమొనలు మూసుకుపోయి ఉండకూడదు.

సి. వయస్సు మరియు జాతులు
• వయస్సు: 1 నుండి 2 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ జీవాలు మొదటి ఈతకు సిద్ధంగా ఉంటాయి.
• తెలంగాణకు అనువైన జాతులు:
o గొర్రెలు: నెల్లూరు (జోడిపి, బ్రౌన్), నల్లగొండ స్థానిక జాతులు.
o మేకలు: మహబూబ్‌నగర్ లోకల్, ఉస్మానాబాదీ, తలచ్చేరి/బీటల్ క్రాస్ జాతులు.

  1. పెరటి కోళ్ల ఎంపిక (Backyard Poultry Selection)
    తక్కువ పెట్టుబడితో ఇళ్ల వద్ద, పెరట్లో కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం మరియు పోషకాహారం పొందవచ్చు.

ఆ. పిల్లల (Chicks) మరియు పెరిగే కోళ్ల ఎంపిక
• చురుకుదనం: కోడిపిల్లలు చురుగ్గా కదులుతూ, శబ్దాలకు త్వరగా స్పందిస్తూ ఉండాలి. కళ్లు ప్రకాశవంతంగా, గుండ్రంగా ఉండాలి.
• శరీర నాణ్యత: పొట్ట భాగం మెత్తగా ఉండాలి (సరిగ్గా కరగని సొన వల్ల పొట్ట గట్టిగా ఉండకూడదు). ఈకలు పొడిగా, శుభ్రంగా ఉండాలి. కాళ్లు బలంగా, నిటారుగా ఉండి ఎలాంటి వైకల్యాలు ఉండకూడదు.
• నాభి (Navel): పిల్లల నాభి భాగం పూర్తిగా ఎండిపోయి, మూసుకుపోయి ఉండాలి. తడి నాభి ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

బి. గుడ్లు పెట్టే కోళ్ల ఎంపిక (Layers)
• కలగిరి (Comb) మరియు గడ్డం (Wattles): గుడ్లు పెట్టే కోడి యొక్క కలగిరి/శిఖ పెద్దదిగా, ఎర్రగా, వెచ్చగా మరియు మెరుస్తూ ఉంటుంది. గుడ్లు పెట్టని కోళ్లలో ఇది చిన్నదిగా, తెల్లగా మారుతుంది.
• శరీర సామర్థ్యం (Pelvic Bones): కోడి వెనుక భాగంలోని తుంటి ఎముకల (Pelvic bones) మధ్య కనీసం 2 నుండి 3 వేళ్ల వెడల్పు స్థలం ఉండాలి. అలాగే తుంటి ఎముకకు, రొమ్ము ఎముక చివరి భాగానికి (Keel bone) మధ్య 3 నుండి 4 వేళ్ల ఖాళీ ఉంటే అది ఎక్కువ గుడ్లు పెట్టే మంచి కోడి అని అర్థం.
• గుభ్రం (Vent): గుడ్లు పెట్టే కోడి యొక్క గుభ్రం (మల విసర్జన ద్వారం) వెడల్పుగా, తేమగా మరియు గుండ్రంగా ఉంటుంది.

సి. మాంసం కోళ్ల ఎంపిక (Broilers/Cockerels)
• తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే సామర్థ్యం, వెడల్పాటి రొమ్ము భాగం మరియు బలమైన తొడలు ఉన్న కోళ్లను మాంసం కోసం ఎంచుకోవాలి.

డి. తెలంగాణకు అనువైన పెరటి కోళ్ల రకాలు
• రాజశ్రీ (Rajasri), వనరాజ (Vanaraja), గ్రామప్రియ (Gramapriya) మరియు స్థానిక నాటు కోళ్లు పెరటి పెంపకానికి, తెలంగాణ వాతావరణానికి ఎంతో అనుకూలమైనవి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి, తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి.

రైతులకు సాధారణ ఆరోగ్య సూత్రాలు (Health Check-list)
ఏ జంతువు లేదా పక్షిని కొనుగోలు చేసినా ఈ క్రింది ఉమ్మడి ఆరోగ్య లక్షణాలను తప్పక గమనించాలి:

  1. ఆకలి మరియు నెమరు: జంతువు మేతను బాగా తింటూ, చురుగ్గా నెమరు వేస్తూ ఉండాలి.
  2. మలమూత్ర విసర్జన: పేడ లేదా విసర్జితాలు సాధారణ రంగు, గట్టిదనం కలిగి ఉండాలి (సారగా/డయేరియా ఉండకూడదు).
  3. కళ్ల నుండి నీరు: కళ్లు, ముక్కు మరియు నోటి నుండి ఎలాంటి అసాధారణ జిగట స్రావాలు కారకూడదు.
  4. టీకాల రికార్డు: కొనుగోలు చేసే ముందే సదరు పశువులకు/జీవాలకు సకాలంలో టీకాలు (FMD, PPR, గాలికుంటు, పిడుగు రోగం, కోళ్లలో ఆర్‌.డి.వి వంటివి) వేశారో లేదో కనుక్కోవాలి.
    ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులను పాటించి పశుసంపదను ఎంపిక చేసుకుంటే పశుపోషణలో నష్టాలు రాకుండా నివారించవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్: 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే ట్రైకోడెర్మా విరిడె ద్రావణం

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని రైతులే సులభంగా తయారు చేసుకునే పద్ధతిని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని 100 మి.లీ. సీసాల్లో నింపి వ్యవసాయ కార్యాలయాల ద్వారా రైతులందరికీ రూ. 20 కి. అందించనున్నారు. ఈ ఒక్కసీసా రూ. 40 వేల విలువైన 200కి. ట్రైకోడెర్మా విరిడె పొడితో సమానంగా పనిచేస్తుంది.

తయారీకి కావలసిన పదార్థాలు :

  • 200 లీ. నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ లేదా సిమెంటు తొట్టి
  • 200 లీ. నీరు * 2 కి. బెల్లం
  • ట్రైకోడెర్మా విరిడె కల్చర్ (చిక్కని ద్రావణం) – 100 మి.లీ. సీసా

తయారీ పద్ధతి : నీడలో ఉంచిన డ్రమ్ములో 200 లీ. నీరు పోయాలి. 2 కిలోల బెల్లాన్ని పొడి చేసి నీటిలో వేసి కలిసేలా త్రిప్పాలి. సీసాలోని ట్రైకోడెర్మా విరిడె చిక్కని ద్రావణాన్ని బెల్లం కలిపిన నీటిలో పోసి కలియత్రిప్పాలి. డ్రమ్ముపైన మూత ఉంచాలి. ఉదయం, సాయంత్రం కర్రతో ఒక నిమిషం కలియత్రిప్పాలి. దీనిలో ట్రైకోడెర్మా విరిడె శిలీంద్రం విపరీతంగా పెరుగుతుంది. 4, 5 రోజులకు ద్రావణం వాడటానికి సిద్ధమౌతుంది.

ప్రతిసారి కొత్త సీసాలను కొనవలసిన అవసరం లేదు. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కలిపాక అందులో నుంచి 2 లీటర్ల ద్రావణాన్ని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ద్రావణం తయారు చేసుకునేటపుడు 2 కిలోల బెల్లంతో పాటు 200 లీటర్ల నీటిలో కలిపితే రెండు రోజుల్లో మళ్ళీ సిద్ధమౌతుంది. బెల్లం రంగులో వుండే నీరు 2 రోజులకు తెల్లగా మారుతుంది. ఈ ద్రావణం రెండేళ్ళు నిల్వ ఉంటుంది. వెంటనే ప్రభావం చూపుతుంది. తయారు చేసుకున్న 5 లీటర్ల ద్రావణాన్ని ఒక క్యాన్‌లో పోసి మూత పెట్టుకోవాలి. 200 లీ. నీటిలో 2 కిలోల బెల్లంతోపాటు ఈ 5 లీటర్ల ద్రావణం కలపాలి. రెండురోజుల్లో మళ్ళీ వాడుకోవచ్చు. 15 రోజులకొకసారి పిచికారి, నెలకోసారి సాగునీరు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వాలి.

ప్రయోజనాలు : విత్తనశుద్ధి : విత్తుకునే అరగంట ముందు విత్తనాలను ట్రైకోడెర్మా విరిడె ద్రావణంలో ముంచి తీయాలి. నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళడానికి : ఈ ద్రావణాన్ని పిచికారి చేస్తే పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది.

కంపోస్టు తయారీలో : చెట్ల నీడలో ప్లాస్టిక్ షీట్ పరచి దానిపై పంట వ్యర్థాలను పొరలా వేయాలి. 10 లీ. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఇలా 4Ð7 పొరల వరకు వేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేయాలి. ప్రతి 7 రోజులకోసారి కంపోస్టుని తిరగెయ్యాలి. 60 శాతం తేమ ఉండేలా చూడాలి. 40 రోజులకు కంపోస్టు సిద్ధమౌతుంది.

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కర్ణాటక, కేరళ రాష్ట్రాల సేంద్రియ రైతులు పంటలు, తోటల్లో వాడుతున్నారు. దీనిని 1:1 నిష్పత్తిలో కలిపి 15 రోజులకోసారి ఎకరా పంటపై పిచికారి చేయాలి. పంటకు నెలకోసారి కాలువల ద్వారా సాగు నీటితో కలిపి పారించాలి లేదా డ్రిప్ / స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వవచ్చు. జీవామృతం ఇచ్చిన రోజునే ఈ ద్రావణాన్ని యిచ్చినా ఫర్వాలేదు. కానీ వేర్వేరుగా ఇవ్వాలి. భూమిలో నివసించే శిలీంద్రాల ద్వారా కలిగే మాగుడు తెగులు, వేరుకుళ్లు, ఎండు తెగుళ్లను సమర్దవంతంగా అరికడుతుంది.
Read More

వండని వంట… పచ్చిమిర్చి పచ్చడి

పచ్చిమిర్చిని కూరల్లో కారం కోసం వాడతాం కదా. కానీ, ఒక కూరగాయగా కూడా వాడుకోవచ్చు.

పచ్చిమిర్చిని తింటే, కడుపులో మంట వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రకృతి ఆహారంలో, ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చిమంచిదని చెప్తారు. ఎందుకంటే పచ్చిమిర్చి ఎండిన తర్వాత, దానికి కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని పచ్చిమిర్చి మంచిదని చెప్తారు.

సరే ఆ సంగతి వదిలేసి, పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సులభంగా తయారు చేయవచ్చు.

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, వాటికి సరిపడా చింతపండు, ఉప్పు, ఇంగువ.
నీటిలో కడిగి శుభ్రం చేసి, తేమ లేకుండా తుడిచిన పచ్చిమిర్చిని, ఉప్పును రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి దంచి, కొంచెం దంచిన తర్వాత, దానికి చింతపండు కలిపి దంచుకోవాలి. కావలసిన వారు జీలకర్ర వేసుకోవచ్చు.

ఆఖరున ఇంగువ కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇది అన్నం లోకి, రొట్టెలు, టిఫిన్స్ అన్నింటిలోకీ బాగుంటుంది.

ఆ పచ్చడికి కొత్తిమీర కలిపి చేస్తే , ‘పచ్చిమిర్చి కొత్తిమీర’ పచ్చడి అవుతుంది.

పచ్చిమిర్చి, ఉప్పు, ఇంగువ మాత్రమే కలిపి చేస్తే, అది ‘పచ్చిమిర్చి కారం’ అవుతుంది.

ఈ పచ్చడికి ఉల్లిపాయ కలిపి చేస్తే, ఉల్లిపాయ పచ్చడి అవుతుంది. ఎల్లిపాయ అయినా వేసుకోవచ్చు.
ఒకే విధానంతో రకరకాల పచ్ౘ్ళ్లు చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… నల్లఈశ్వరి

సాధా రణ నామం: సర్పెంట్‌రూట్ ప్లాంట్
శాస్త్రీయ నామం: అరిస్టొలోకియా ఇండిక
కుటుంబం: అరిస్టోలోకియేసి

నల్లఈశ్వరి 5-6 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక తీగ. ఆకులు కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఇవి తమలపాకు వాసన కలిగి దాదాపు దీర్ఘచతురస్రాకారంలో చివరి భాగంలో కొంచెం వెడల్పుగా, సూది లాంటి కొనగలిగి ఉంటాయి. పూవుల ఆకర్షణ పత్రావళి ఆకుపచ్చ ఛాయ గల వంగపండు రంగుతో చిన్న ఈగల వంటి కీటకాలు లోపలికి వెళితే బయటకు రావడానికి వీలు లేకుండా నూగు అమర్ౘ్బడిన గొట్టం లాంటి బోను వలే ఉంటుంది. కాయలు గుండ్రంగా ఉండి బద్ధలైతే ఉట్టి (తిరగబడిన గొడుగు) ఆకారంలో ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొక్కలోని అన్ని భాగాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. దీనిలో అరిస్టొలోకిక్ ఆమ్లాలు, ఆవిరయ్యే నూనె, టానిన్లు ఉంటాయి.
  • దీనిని పాము, పురుగుల కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
  • జ్వరం, గాయాలు, గుండెజబ్బులు, బొల్లి, కుష్టు, చర్మవ్యాధులు, మూర్ఛ, మానసిక వ్యాధుల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
  • దీని కషాయాన్ని వ్రణములు, ఉబ్బసం, బ్రాంకైటిస్ వ్యాదులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • నల్లఈశ్వరి మిథనాల్ ద్రావణాలు క్యూలెక్స్ జెలిడస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను అత్యధికంగా చంపాయి. (కామరాజ్, అతని అనుచరులు, 2010).
  • అరస్టొలోకియా ఆకు ఇథైల్ ఎసిటేట్ ద్రావణం (5%) స్పోడోప్టెరా లిటూరపై అధిక యాంటిఫీడెంట్ చర్య (56.06%), తినడాన్ని అరికట్టడానికి లీథల్ కాన్‌సెంట్రేషన్ (3.69%), లార్విసైడల్ (40.66%), పూపిసైడల్ (28%), మొత్తం చావు (68.66%), పొడిగించబడిన లార్వల్ ప్యూపల్ సమయం (12.04 -13.08 రోజులు) నమోదు చేసింది (బాస్కర్, అతని అనుచరులు, 2011).
  • అరిస్టొలోకియా బీటికా మిథనాల్ ద్రావణం ట్రైబోలియం కాస్టానియంపై మంచి కీటకనాశక చర్యను ప్రదర్శించింది (జ్బిలో, అతని అనుచరులు, 2006).
  • అరిస్టొలోకియా బ్రాక్టియోలేట కాయల హెక్సేన్ ద్రావణం (5%) జొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే ఖాప్రాబీటిల్, ట్రోగోడెర్మా గ్రానేరియం నుండి గింజలను కాపాడాయి (ఎలామిన్ అండ్ సత్తి, 2012).
  • నల్ల ఈశ్వరి మిథనాలిన్ ద్రావణంలో అరిస్టొలోకిక్ యాసిడ్, అరిస్టోలోకిక్ యాసిడ్ అనే రెండు మిశ్రమాలున్నాయి. అరిస్టోలోకిన్ యాసిడ్ అనోఫెలెస్ స్టెఫెన్సి లార్వాలపై అరిస్టాలోకిక్ యాసిడ్ కన్నా అధిక విషచర్యను ప్రదర్శించింది (ప్రదీప్ వెంకటరామన్, ఆమె అనుచరులు, 2015).
  • అరిస్టొలోకియా ఎలిగాన్స్, అరిస్టొలోకియా టగల ఆకుల ద్రావణాలు క్యాబేజి పంట నాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టిల్లాపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి (కాస్సి, 1983).
  • నల్లఈశ్వరి ఆకుల క్రూడ్ ద్రావణం మరియు ఆకుల నీటి ద్రావణం నుండి సంకలనం చేసిన సిల్వర్ నానోపార్టికల్స్ హెలికోవర్పా ఆర్మిజరా 3వ దశ లార్వాలపై గరిష్ట యాంటిఫీడెంట్ మరియు లార్విసైడల్ చర్యలను ప్రదర్శించాయి. (శివ అండ్ సంతోష్ కుమార్, 2015).అరిస్టొలోకియా టగల యాంటిఫీడెంట్ లక్షణాలు నమోదు చేయబడ్డాయి. (కాస్సి, 1983).
  • అరిస్టొలోకియా టగల డైమండ్ బ్యాక్‌మాత్, ప్లుటెల్లా క్ౙెåలోస్టెల్లాపై కీటకనాశక లక్షణాలను చూపాయి (మొరాల్లోరెసెసస్, 1985).
  • అరిస్టొలోకియా టగల స్పోడోప్టెరా లిటూరపై వికర్షక, యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల దశలపై ఈ ప్రభావాలు ప్రస్పుటంగా కనిపించాయి. (లిట్ అండ్ రెజెసస్, 1990).
  • ఈ మొక్క క్రూడ్ ద్రావణం ఆసియాటిక్ మొక్కజొన్న కాండంతొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫర్నకాలిసీని నివారించింది (లిట్ అండ్ రెజెసస్, 1989).
  • ఈ మొక్క ద్రావణం డైమండ్ బ్యాక్ మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాపై విష చర్యను ప్రదర్శించింది (లిట్ అండ్ రెజెసస్, 1999)
  • ఈ మొక్క ఆకుల 5% ఇథైల్ అసిటేట్ ద్రావణం యాంటిఫీడెంట్, ఫీడింగ్ డిటరెంట్, లార్విసైడల్, ప్యూపిసైడల్, పూర్తిచావు, లార్వల్‌ప్యూపల్ సమయం పొడిగించబడటం వంటి చర్యలను ప్రదర్శించింది (భాస్కర్, అతని అనుచరులు, 2011)
  • నల్లఈశ్వరి ఆకుల ఆల్కహాల్ ద్రావణం (5%) 100% ప్రొడీనియాలిటూర, 3% ఆకుల ద్రావణం 100% యూప్రోక్టిస్ ఫ్రటర్నా; 3% ఆకులు, కాండాలు, లేదా కాయల ద్రావణం, 20% ఆకులు, కాండాల పొడి ద్రావణం 48% మామిడి తేనె మంచు పురుగు (హాపర్) పిల్ల పురుగులను చంపాయి. (పుట్ట రుద్రయ్య అండ్ సుబ్రమణ్యం, 1955Ð1956)
  • ఈశ్వరి వేరు ద్రావణం స్పోడోప్టెరా లిటూరపై గుడ్డు పెట్టకుండా నిరోధించే చర్యను ప్రదర్శించింది (అరివోలి అండ్ టెన్నిసస్, 2013).
  • ఈస్టర్న్ ఘాట్స్‌లోని ఎత్నిక్ కమ్యూనిటీలు నల్లఈశ్వరి ఆకుల ద్రావణాన్ని పురుగుల నివారణలో ఉపయోగించేవారు (శివరాజ్, అతని అనుచరులు, 2017).
  • అరిస్టొలోకియా బ్రాక్టియేట కంకిపొడిని వేరుశనగ పిండితో కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ఎలుకల బొరియల దగ్గర ఉంచి ఎలుకలను నివారించవచ్చు (పటేల్, గుప్తా, అతని అనుచరులు, 1991).
  • పురుగుల యాజమాన్యానికి నల్లఈశ్వరి సిల్వర్ నానోపార్టికల్స్‌ని సిఫారసు చేశారు (యశుర్ అండ్ రాణి, 2015).
  • అరిస్టొలోకియా రింజెస్ వేరు పదార్థం వేర్‌హౌస్‌మాత్, ఎఫెస్టియా కౌటెల్లా పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించింది (ఐన్, అతని అనుచరులు, 2013).
  • నల్లఈశ్వరి ఆకుల నీటి ద్రావణం వరి పంటలో కాండం కుళ్ళు కలిగించే శిలీంద్రం, స్ల్కీరోషియం ఒరైజె పెరుగుదలనరికట్టింది (వెంకటేశ్వర్లు, అతని అనుచరులు, 2013). నేలవేము, జిల్లేడు, యూకలిప్టస్ 2% ఆకుల ద్రావణం రసాయన శిలీంద్రనాశనుల కన్నా అధిక సమర్ధవంతంగా కాండం కుళ్ళు తెగులును నివారించింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… తెల్లగన్నేరు

సాధారణ నామం : కొండగన్నేరు / విసాగ్ని
శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా వెనెనేట; కుటుంబం: అపోసైనేసి

తెల్లగన్నేరు సుమారు 6 మీ. ఎత్తు వరకు పెరిగే చిన్న లేదా మధ్య రకం చెట్టు. చెట్టు బెరడు బూడిద రంగుతో కూడిన గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. వేరు చిక్కటి పసుపు రంగులో ఉండి గట్టిగా కర్రలాగా ఉంటుంది. ప్రతి కణుపు వద్ద 3-6 ఆకులు చుట్టూ అమరి ఉంటాయి. ఆకులు పలుచగా, బళ్ళెం ఆకారంలో ఉండి, అంచులు అలల్లాగా ఉంటాయి. ఆకు కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. అనేక ఈనెలు దగ్గర దగ్గరగా, సమాంతరంగా ఉండి ఆకుల చివర్ల నుండి పుట్టిన సన్నని దారంలాంటి ఈనెలతో కలపబడి ఉంటాయి. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. కాయలు కాడ కలిగి రెండు చివర్లు కొనదేలి ఉంటాయి. అనేక విత్తనాలు బల్లపరుపుగా, రెండు చివర్లలో వెంట్రుకలు కలిగి ఉంటాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • తెల్లగన్నేరు వేర్లు, పండ్లు ఔషధాల తయారీలో ఉపయోగించబడుతున్నాయి.
  • వీటిలో ఇండోల్ ఆల్కలాయిడ్స్ అధికంగాను, ఆల్‌స్టోవినైన్, వినినాటైన్, రిసర్పెåన్ మొదలైన రసాయనాలు ఉంటాయి.
  • వేర్లను చర్మవ్యాధులు, కుష్టు, చెవిపోటుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వీటిని పాము కాటు, ఇతర విషపు పురుగుల కాట్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
  • మూర్ఛ రోగం, ఆయాసం, జ్వరం మొదలగు వాటి చికిత్సకు, పుండ్లు, సిఫిలిస్, పిచ్చి వంటి జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఆల్‌స్టోనియా బూనీ ఆకులు మరియు కాండం బెరడు ద్రావణాలు గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియాకెలామిస్టిస్ లార్వాలపై విషపూరిత చర్యను, పెరుగుదలనరికట్టే చర్యను ప్రదర్శించాయి. వీటిని గులాబి రంగు కాండంతొలుచు పురుగు నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (ఆయిజయాన్‌గ్బె, అతని అనుచరులు, 2007).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ కాండం బెరడు మరియు ఆకుల నీటి ద్రావణాలు, పాక్షికంగా శుద్ధి చేసిన ద్రావణాలు లిమ్నేయ అక్యూమినేట (నత్త)పై మొల్లస్కిసైడల్ మరియు యాంటికోలినెస్టరేజ్ చర్యలను ప్రదర్శించాయి. కాండం బెరడు ద్రావణాలు ఆకు ద్రావణాల కన్నా బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించాయి. (సింగ్ అండ్ ఇసంగ్, 2003).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ మొక్క అసిటోన్ లేటెక్స్ ద్రావణాలు లాబియో రోహిత (చేప)పై నీటి ద్రావణాలకన్నా 23 రెట్లు అధిక విషపూరిత చర్యను ప్రదర్శించాయి (సింగ్ అండ్ సింగ్, 2010).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ ఆకుద్రావణాలు ఈడెస్ ఆల్బోపిక్టస్ 3వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి.
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ క్లోరోఫాం, ఇథనాల్, నీటి ద్రావణాలు బాక్టీరిసైడైల్, ఫంగిసైడల్, యాంతెల్మింటిక్ చర్యలను ప్రదర్శించాయి. బాసిల్లస్ సీరియస్, క్లెబ్సియెల్లా న్యుమోనియె, ఎస్కెరిచియా కోలి, ఫిగెల్లా డీసెంట్రియేపై బాక్టీరిసైడల్ చర్యను ప్రదర్శించింది. రైజోపస్ ఒరైజె, క్లాడోస్పోరియం హెర్పారమ్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, రైజోపస్ ఒరైజెపై ఫంగిసైడల్ చర్యను ప్రదర్శించింది.
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ 100% ఆకుల ద్రావణాన్ని 15 రోజుల వయసు పార్థినియం మొక్కలపై 5 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే, మొదటి పిచికారి చేసిన 15 రోజుల తర్వాత వేర్లు మరియు కాండం జీవపదార్థం గణనీయంగా తగ్గింది. ఆకుల నీటి ద్రావణంలో ఉన్న కలుపు నాశక పదార్థాలు పార్థినియం నివారణకుపయోగిస్తాయి (జావైద్, అతని అనుచరులు, 2010).
  • ఆల్‌స్టోనియా స్కాలారిస్ ఆకు ఎసిటోన్ ద్రావణం చెదపురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించింది (సోహైల్ అహ్మద్, అతని అనుచరులు)
  • ఆల్‌స్టోనియాస్కాలారిస్ ఇథనాల్ ద్రావణం స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

పురుగులు, తెగుళ్ళ నివారణకు మ్యాజిక్ కంపోస్టు

కావలసిన పదార్థాలు
పశువుల పేడ : 1 కిలో
పశువుల మూత్రం : 1 లీటరు
వేప ఆకులు, కానుగ ఆకులు, జిల్లేడు ఆకులు : 1 కిలో (ఒక్కొక్కటి)
బెల్లం : 50 గ్రా.

తయారు చేసే విధానం : ఒక కుండ తీసుకొని పైన చెప్పిన చెట్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండలో వేసి దానికి పశువుల పేడ, మూత్రం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుండను బట్టతో కప్పి ఉంచి వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. వారం రోజుల తరువాత దానిలోని మిశ్రమాన్ని వడపోసి దానికి నీటిని కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి.

  • చిన్న మొక్కలకు ఒక భాగం మిశ్రమానికి 60-70 రెట్ల నీటిని కలిపి, పెద్ద మొక్కలకైతే 30-40 రెట్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి.
  • ఈ కషాయాన్ని విత్తనశుద్ధికి కూడా ఉపయోగించవచ్చు.
  • పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
  • చెదలు సమస్యగా ఉన్నచోట మ్యాజిక్ కంపోస్టు తయారీలో ఆముదం లేదా సీతాఫలం ఆకులు కలిపి తయారు చెయ్యాలి.

పంటల ఎదుగుదలకు మిశ్రమం :
పశువుల పేడ : 100 కిలోలు
పశువుల మూత్రం : 100 లీటర్లు
వేరుశనగ చెక్క (పిండి) : 100 కిలోలు

పై మూడు పదార్థాలను ఒక పాలిథిన్ పట్టాపై వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక ఎకరం పొలానికి సరిపోతుంది. మిశ్రమాన్ని పొలంలో సమంగా పడేలా చల్లుకోవాలి. దీనిని వాడటం వలన పంటలకు కావలసిన పోషక పదార్థాలు లభించి పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనిని అన్ని పంటలలోనూ వాడుకోవచ్చు.

Read More
  • 1
  • 2