కలెక్టరేట్‌లో సేంద్రియ కూరగాయల స్టాల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌.టి.ఆర్‌. జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వారి కోసం అదే ఆవరణలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రసాయన పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో రైతులు పండించిన కూరగాయలతో స్టాల్‌ ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు కావడంతో ప్రజలు, అధికారులు వాటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు

Read More

పార్లమెంటు క్యాంటీన్‌లో రాగి ఇడ్లీ, జొన్నల ఉప్మా

పార్లమెంటును సందర్శించే వారికి పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించేలా కొత్త మెనూ తయారైంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సూచనలతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకువస్తున్నారు. కొత్త మెనూలో రాగి ఇడ్లీ, జొన్నల ఉప్మా, మూంగాల్‌ చిల్లా, కాల్చిన చేప వంటి రకరకాల వంటలను ఉంచారు. చిరుధాన్యాలతో తయారు చేసిన భోజనం, పీచు పదార్థాలు అధికంగా ఉండే సలాడ్లు, ప్రొటీన్‌లతో నిండిన సూప్‌లను మెనూలో ఉంచారు. ఈ ఆహారాన్ని ఎంపీలకు మాత్రమే కాకుండా అధికారులకు, పార్లమెంటు సందర్శకులకు సైతం అందించనున్నారు.

Read More