రామచంద్రయ్య హర్యానా నుండి లారీలలో దిగుమతి చేసుకున్న ఎనిమిది గేదెలలో రెండు మార్గమధ్యంలోనే గర్భస్రావాలకు గురికాగా, మిగిలిన వాటి నుంచి క్షీణించిన పాల ఉత్పత్తి పునరుద్ధరించడానికి ఎంతో సమయం, శ్రమ, ఖర్చు చేయవలసి వచ్చింది. వెంకట్రామయ్య పాడి గేదె దూడ చనిపోయిందనే దిగులుతో పాలివ్వడం మాని వేసింది. యజమాని చనిపోయిన వారం రోజులకే దిగులుతో సుబ్బారావుగారి పెంపుడు కుక్క కూడా చనిపోయింది. అదేవిధంగా మావటి చనిపోయినందున ఒక దేవాలయ ఏనుగు కూడా మరణించింది. మరోచోట మావటి యొక్క క్రూరత్వాన్ని, నిర్దయ, నిర్లక్ష్యాలను భరించలేక ఒక ఏనుగు నగరమంతా బీభత్సం సృష్టించింది. ఇటువంటి ఎన్నో దురదృష్టకర సంఘటనలకు మూగజీవాలు భరించలేని మానసిక, శారీరక వత్తిళ్లే కారణమని మనమంతా తెలుసుకోవాలి. ఈ వత్తిళ్లకు కారణాలను సకాలంలో గుర్తించి వాటిని తొలగించటం లేదా ప్రత్యామ్నాయ ఉపశమన మార్గాలను పాటించకపోతే తీవ్రమైన కష్టనష్టాలను యజమానులు ఎదుర్కోవలసి ఉంటుంది.
శరీరం తాను సహజంగా భరించగలిగిన అసౌకర్యానికి, ఇబ్బందులకు, ఆకలి, దాహాలకు ప్రయాణాలకు, నడక, వాతావరణ – యాజమాన్య – వసతి నిర్వహణాలోపాల బాధలకు గురైనప్పుడు అవి మానసికంగా, భౌతికంగా, హార్మోన్ల పరంగా ఎదుర్కొనే మార్పుల వల్ల కలిగే ఎదురయ్యే సమస్యల సముదాయమే వత్తిడి! లైంగిక సుఖానికి దూరమైన జంతువులలో కూడా వత్తిడి లక్షణాలను ప్రదర్శించడం ఏనుగులు, ఆంబోతులలో ఎక్కువగా గమనించవచ్చు. సహజ లేదా కృత్రిమ సంపర్కాలకు ముందు ఆ తర్వాత ఎక్కువ నడక వల్ల జరిగే వత్తిడి వల్ల కూడా గర్భాలు నిలిచే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. దాదాపు అన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా జంతువులపై వత్తిడి పెరుగుతుంది. వత్తిడి లక్షణాలు:
ఉత్పత్తి క్షీణించడం, ఆయాసం, వగర్పు, మూలుగుట, గురక, భయం, వణుకుట, ఇతర పశువులు – మనుషుల నుండి దూరంగా వెళ్ళిపోవుట, సహజమైన విధేయత అణకువలు క్షీణించటం, దాడి చేయటం వంటి అనేక లక్షణాలను వత్తిళ్ళకు గురైన జంతువులు ప్రదర్శిస్తాయి. ప్రతికూలతలను తట్టుకోలేని పరిస్థితులలో మెదడులోని హైపోథలామస్, మరియు పిట్యుటరీ గ్రంథుల వల్ల ప్రేరణ పొందిన థైరాయిడ్ మరియు అడ్రినల్ గ్రంథులు విడుదల చేసే థైరాక్సిన్ మరియూ కార్టికోస్టెరాయిడ్స్ ప్రభావంతోనే వివిధ వత్తిడి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో పాలు కుడవటం మానని దూడల వల్ల కలిగే మాతృత్వ స్పందనలకు కారణమయ్యే ప్రొలాక్టిన్ అనే హార్మోనువల్ల కూడా ఎదకు రావటం ఆలస్యం కావచ్చు. గేదెలలో చెమట గ్రంథులు చాలా తక్కువగా ఉండటం, వాటి నల్లని చర్మం వాతావరణ వేడిని ఎక్కువగా గ్రహించటం వల్ల అవి త్వరగా వడగాడ్పులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాతావరణ తాపం పెరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే హైపోథలామస్ గ్రంథి కూడా తన నియంత్రణ శక్తిని కోల్పోవుట వల్ల పశువు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. వత్తిడి సమయంలో శరీరంలో విడుదలయ్యే కొన్ని స్రావాలను గుర్తించుట ద్వారా వత్తిడి స్థాయిల్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. జంతువులలో వత్తిడిని తగ్గించే మార్గాలు
* జంతువుల పట్ల ప్రేమ ఆదర-అభిమానాలను పెంచుకుని వాటి మానసిక, శారీరక ఆహార, లైంగిక అవసరాలను సకాలంలో తీర్చే ఏర్పాట్లు చేయాలి.
* పోషకాహార అవసరాలను తీర్చే విధంగా నాణ్యమైన పుష్టివంతమైన శాస్త్రీయ మేతల్ని అందించాలి. ఎల్లప్పుడూ చల్లని త్రాగునీటిని సమృద్ధిగా అందుబాటులో ఉంచాలి.
* సంతతి నుండి సహ జంతువుల నుండి లభించవలసిన సామాజిక జీవనానికి అంతరాయాలు కలిగించరాదు.
* చల్లని, సుఖవంతమైన, శుభ్రమైన వసతిని వీలైతే చెట్ల నీడన, పచ్చని వాతావరణంలో ఏర్పాటు చేయాలి.
* శబ్దాలు, రణగొణ ధ్వనుల చికాకుకు వీలైనంత మేరకు నివారించాలి.* పొగలు, దుమ్ము, ధూళీలు, రసాయన కాలుష్యాలకు పశువుల్ని దూరంగా ఉంచాలి.
* విశ్రాంతికి, నిద్రకు రోజుకు కనీసం 5-6 గంటల విరామంతోపాటు, అవసరమైన నడక ఈత వంటి వ్యాయామ సదుపాయం కూడా ఉండాలి. సహజ సంపర్కం లేదా కృత్రిమ గర్భధారణలకు ముందు – ఆ తర్వాత పశువును ప్రశాంతంగా ఉంచి, కనీసం 15-20 నిముషాలు విశ్రాంతినివ్వాలి.
* పశువుల ప్రవర్తనను, ఉత్పత్తి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వత్తిడి లక్షణాలను, వ్యాధుల్ని గుర్తించి సకాలంలో చికిత్సను అందించాలి. ఇందుకు వీలైతే నిరంతర పరిశీలన-పర్యవేక్షణలకు సి.సి. కెమేరాల వంటి సాంకేతిక ఏర్పాట్లు చేసుకోగల్గితే మంచిది.
* నిర్వాహకులను పదేపదే మార్చరాదు. వీలైతే ప్రత్యామ్నాయ నిర్వాహకుల్ని ముందు నుంచీ పశువులకు అలవాటు చేయగల్గితే మంచిది.
* విభిన్న వాతావరణ పరిస్థితులు కలిగిన ప్రాంతాల మధ్య పశువుల్ని రవాణా చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆకస్మిక తీవ్ర వాతావరణ వత్తిళ్లకు పశువులు గురికాకుండా జాగ్రత్తవహించాలి. ఉదాహరణకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఉత్తరాది ప్రాంతాల నుండి పశువుల్ని వేసవి రోజులలో కంటే చలికాలంలో మన తెలుగు రాష్ట్రాలలోకి దిగుమతి చేసుకుంటే మంచిది.
* ప్రకృతిసిద్ధమైన లైంగిక అవసరాలను గుర్తించి, సకాలంలో లైంగిక సంపర్క అవసరాలను తీర్చే ఏర్పాట్లు చేయాలి.
* తీవ్రమైన ఎండలు, గాడ్పులు, చలులు, ముసురు రోజులలో ఎంతో అవసరమైతే తప్ప టీకాలు వేయించటం, డివర్మింగ్ చేయించటం వంటి అదనపు వత్తిళ్ళు కలిగించే చర్యలు చేపట్టుట మంచిది కాదు.
* వైద్య అవసరాలకు వాడే మందుల వినియోగం విషయంలో కూడా శాస్త్రీయతను తప్పక పాటించాలి. అవసరానికి మించి వినియోగించే మందులు కూడా రోగుల మీద వత్తిడిని పెంచుతాయని తెలుసుకోవాలి. ప్రతి వ్యాధి చికిత్సలో విశ్రాంతి కూడా ఒక కీలక అంశమేఅని కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా పశువుల పట్ల ప్రేమ, ఆదరణ, కరుణతో వ్యవహరించటం ద్వారా వాటిలో వత్తిళ్ల ప్రభావాన్ని చాలా వరకు నివారించవచ్చు. డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611
మామిడి సాగులో మన దేశంది అగ్రస్థానం, బంగారు వర్ణంలో నోరూరించే మామిడి రుచిలో మధురంగా, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది, అందుకే మామిడిని ”ఫల రాజు” అని పిలుస్తారు. మన దేశం ఉత్పత్తిలో మొదటి స్థానములో ఉన్నప్పటికీ ఎగుమతిలో మాత్రం వెనకబడే ఉంది. దీనికి గల ప్రధాన కారణం పండు ఈగ ప్రభావం. మన తెలుగు రాష్ట్రాలలో కూడా విస్తారంగా సాగు అవుతున్న ముఖ్యమైన వాణిజ్య పంటలలో మామిడి ఒకటి. సుమారుగా 7.7 లక్షల ఎకరాలలో సాగు చేయబడి, ఏటా 25 నుండి 30 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. మన మామిడికి ఇతర దేశాలలో మంచి గిరాకీ ఉంది, కానీ పండు ఈగ ఆశించడం వల్ల మామిడి ఎగుమతి నిరాకరించబడుతుంది, అలాగే వివిధ దేశాల ప్రమాణాలను అందుకోలేకపోవడం మూలంగా ఆయా దేశాలు దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పండు ఈగ ద్వారా నష్టం మామిడి, జామ, సపోటా, అరటి, బొప్పాయి మరియు సీతాఫలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ పండు ఈగ ఆశించుట వలన కనీసముగా 25 శాతం, ఒకవేళ ఉదృతి ఎక్కువగా ఉన్నట్లైతే 100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. ‘మేడి పండు చూడు మేలిమైయుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అనే నానుడి ఇప్పుడు మామిడికి కూడా వర్తిస్తుంది. ఈ పండు ఈగలు కాయ అభివృద్ధి చెందేటప్పుడు ఆశించి పక్వానికి వచ్చే వరకు ఈ నష్టం మనకి బయటికి ఏ మాత్రం కనబడదు, కాని తీరా పండ్లు కోసి చూస్తే అందులో తెల్లని పిల్ల పురుగులు గుజ్జును తింటూ ఉంటాయి. ఇలాంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు, ఎగుమతిదార్లు ముందుకు రాక రైతులు నష్టపోతున్నారు.రైతు సంవత్సరం పొడువునా కష్టపడి మామిడి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్నో ఆశలతో ఎదురుచూసే సమయంలో పండు ఈగ ఆశించడం వలన రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. రైతులు పండు ఈగ నుండి పంటను కాపాడుకోవడానికి విపరీతమైన రసాయనిక మందులు వాడుతున్నారు, దీని వలన పండ్ల పై పురుగు మందు అవశేషాలు ఎక్కువవుతున్నాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రసాయనిక మందులు వాడినా ప్రయోజం ఏ మాత్రం ఉండదు, ఎందుకంటే తల్లి ఈగలు కాయ చర్మాన్ని గుచ్చి లోపల గుడ్లు పెట్టి అందులోనే పొదగబడి గుజ్జుని తింటాయి. ఇక కోశస్థ థ భూమి లోపల జరుగుతుంది. ఎక్కడా మనం ఈ పండు ఈగ నష్టాన్ని గుర్తించలేము, ఇలాంటప్పుడు రసాయనిక మందులు పిచికారీ చేసినా పండు లోపల ఉన్న లార్వాను చేరలేవు. ఈ పండు ఈగను ఏ రసాయన మందులు గాని సమర్ధవంతంగా నివారించలేవు. కావున ఈ పండు ఈగ రాకుండా ముందస్తుగానే ఎలాంటి చర్యలు సకాలంలో చేపట్టాలి మరియు రసాయనిక మందులకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్దతులు అనుసరించాలి లేదా ఇంకా ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానాలు ఏమైనా ఉన్నాయా అని రైతులు ఈ కోణంలో ఒక్కసారి ఆలోచిస్తే మంచి నాణ్యమైన దిగుబడులు సాధించగలరు. ఇప్పుడు పండు ఈగ నష్టపరుచు విధానము మరియు సమగ్ర సస్య రక్షణ చర్యలు మరియు అధునాతన పద్ధతులు ఏం ఉన్నాయో తెలుసుకుందాం.
పండు ఈగ రకాలు:
ఈ పండు ఈగలు ముఖ్యంగా మామిడి, జామ, అరటి, బొప్పాయి, సపోటా మరియు సీతాఫలంను ఆశించి నష్టపరుస్తాయి.
పండు ఈగ వృద్ధికి అనుకూల సమయం, వాతావరణం:
* పండు ఈగ ఉదృతి మార్చి, ఏప్రిల్ మాసంలో ప్రారంభమై సంతతిని వృద్ధి చేసుకుని జూన్ మరియు జులై మాసంలో విజృంభిస్తుంది.
* కాయ అభివృద్ధి చెందే థలో లోపల ఉన్న గుడ్లు వేడికి పొదగబడి పిల్ల పురుగులుగా మారి లోపల కణజాలాన్ని తింటూ ఉంటాయి
* వాతావరణంలో అధిక వేడి, చలి ఉన్నప్పుడు ఈ పండు ఈగలు తట్టుకోలేవు
పండు ఈగ జీవిత చక్రం, నష్టపరుచు విధానం:
* ఆడ పండు ఈగలు లేత గోధుమ రంగులో ఉండి పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటాయి. వీటి వెనుక భాగం లో గుడ్లు పెట్టడానికి వీలుగా సూది లాంటి అండోత్సర్గంను కలిగి ఉంటాయి
* పండు ఈగ జీవిత చక్రం నాలుగు థలను కలిగి ఉంటుంది. గుడ్డు థ, లార్వా (మాగ్గోట్) థ, కోశస్థ థ మరియు తల్లి పురుగు థ. ఈ నాలుగు థల్లో లార్వా థ ప్రత్యక్షంగా అధికంగా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.
* ఈ పండు ఈగలు 50 కిలో మీటర్ల వరకు కూడా వ్యాప్తి చెంది వేరే పంటలను ఆశ్రయించి దాని జీవిత చక్రం పూర్తి చేసుకుంటాయి. కింద రాలి కుళ్లిపోయిన పండ్లలో కూడా తన జీవిత చక్రాన్ని కొనసాగిస్తాయి. ఈ రెండు పద్ధతుల ద్వారా పండు ఈగలు తోటల్లో ఆశించే అవకాశం కలదు.
* ఆడ తల్లి ఈగ కాయలు అభివృద్ధి చెందే థలో అనువుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని కాయ యొక్క చర్మం లోపలికి అండోత్సర్గంతో గుచ్చి రంద్రం చేసి సుమారుగా 100-500 గుడ్లను పెడుతుంది. తల్లి ఈగ తన జీవిత కాలంలో 1000 గుడ్లు పెడ్తుంది.
* ఈ గుడ్లు 2 నుండి 3 రోజులలో పిల్ల పురుగులుగా మారి లోపల ఉన్న కణజాలాన్ని తింటాయి. కాయలపై గుడ్లు పెట్టడానికి చేసిన రంద్రాల ద్వారా ఇతర శిలింద్రాలు మరియు బాక్టీరియా ఆశించి కాయలు మెత్తబడి కుళ్లిపోతాయి.
* ఈ లార్వా థ అంతా పండులోనే జరుగుతుంది, కావున నష్టాన్ని మనం పండు కోసే వరకు గుర్తించలేము. * తదుపరి పిల్ల పురుగులు బాగా ఎదిగి కోశస్థ థకు చేరే ముందు పండ్ల నుండి ఎగిరిపడి భూమిలో కోశస్థ థను గడుపుతాయి. పిల్ల పురుగుల వలన తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుంది.
* కోశస్థ థ 10 – 40 రోజులలో వాతావరణ పరిస్థితులను బట్టి తల్లి ఈగలుగా మారుతాయి.
* ఈ ఆడ మరియు మగ ఈగలు సంపర్కం జరిపి గుడ్లను పెట్టి వాటి జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి. ఇలా పండు ఈగలు సుమారుగా 40 నుండి 50 రోజులలో తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఒక్కో పండు ఈగ వేల ఈగలను సృష్టించి తన సంతతిని పెంచుకుంటూ మన పంటకు నష్టాన్ని కలుగజేస్తాయి. కావున వీలైనంత త్వరగా సరైన యాజమాన్య పద్దతులను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
* పండు ఈగ ఆశించిన పండ్లు నాణ్యతను కోల్పోయి తినడానికి కాని, స్థానిక మార్కెట్లలో అమ్మడానికి కాని ఎగుమతికి గాని పనికిరావు.
సమగ్ర సస్యరక్షణ చర్యలు
* పండు ఈగ కోశస్థ థ భూమిలో గడుపుతుంది, కావున వేసవి లో చెట్ల పాదులలో 10 సెం. మీ. లోతు వరకు దున్నుకుని మిథైల్ పారథియాన్ పొడిని 50 – 100 గ్రాముల చొప్పున చల్లుకోవాలి.
* పండు ఈగలు ఆశించి రాలిన పండ్లను ఏరి నాశనం చేయాలి. ఎండు కొమ్మలను తీసి వేయాలి మరియు కోత అనంతరం కొమ్మ కత్తిరింపులు చేసుకుంటే గాలి వెలుతురు బాగా ప్రసరిస్తాయి.
* పండ్ల తోటల్లో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి మరియు పండ్ల తోటలకు దగ్గరగా జామ, బొప్పాయి, సీతాఫలం మరియు తీగ జాతి కూరగాయలు ఉన్నట్లైతే వాటిపై సరైన సస్య రక్షణ చర్యలు చేపట్టాలి, లేదంటే అవి వీటికి ప్రత్యామ్న్యాయ పంటలుగా తోడ్పడి వాటి జీవిత చక్రాన్ని సాగించడానికి మరియు సంతతిని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.
* పిందె కట్టిన 40 రోజుల తర్వాత కాయలకు బ్యాగులను తొడగాలి కొంత వరకు పండు ఈగ ఆశించే అవకాశం తగ్గుతుంది, కాని అన్ని కాయలకు కట్టడం సాధ్యం కాని పని మరియు ఖర్చుతో కూడుకున్న పని.
* లింగాకర్షక బుట్టలు (మిథైల్ యూజినల్ ఎరలు), ఎకరానికి 6 నుండి 10 ఎర బుట్టలను పెట్టుకోవాలి. ఈ ఎర బుట్టలు పండు ఈగ ఉదృతిని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. 20 నుండి 30 బుట్టలను పెట్టుకున్నట్లైతే కొంత వరకు పురుగు ఉదృతిని తగ్గించవచ్చు, కాని ఈ మాస్ ట్రాప్పింగ్ ద్వారా కూడా పురుగు ఉదృతిని ఆర్థికంగా నష్టపరిచే స్థాయి లోపల ఉంచడం సాధ్యం కాదు. వివిధ రకాల చెక్కతో చేసిన లింగాకర్షక ఎరలు మార్కెట్లలో లభిస్తున్నాయి. వీటిని 30 నుండి 40 రోజులకొకసారి ఎరలని మార్చాల్సి ఉంటుంది మరియు పురుగు ఉదృతి బట్టి 3 నుండి 7 రోజులలో బుట్టలలో నీటిని మార్చాల్సి ఉంటుంది. ఈ ఎరల వలన పురుగు ఉదృతి మాత్రమే తెలుస్తుంది, కానీ అప్పటికే పండ్ల తోటల్లో జరగాల్సిన నష్టం జరిగి ఉంటుంది. పైగా ఈ చెక్క ఎరలు వాతావరణంలో జరిగే మార్పులను బట్టి సరిగ్గా పనిచేయవు. వర్షం పడిన రోజులలో పండు ఈగలను ఆకర్షించలేవు.
* ఈ చెక్క ఎరల యొక్క లోపాలను మరియు పరిమితులను అధిగమించడానికి వినూత్నంగా పండు ఈగ ఉదృతి తెలుసుకోవడం కోసం ATGC బయోటెక్ సంస్థ ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా నానో టెక్నాలజీతో స్వీయ నియంత్రణ పద్దతిలో విడుదల చేసే టాబ్లెట్ ఎరను MANTRA ME అనే పేరుతో మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది. ఈ టాబ్లెట్ను లింగాకర్షక బుట్టల్లో ఉంచి పండ్ల తోటల్లో పెట్టినట్లయితే సమర్ధవంతంగా 120 రోజుల వరకు మగ ఈగలను ఆకర్షించి బుట్టలలో పడేటట్లు చేస్తుంది. ఈ టాబ్లెట్ పనితనం చెక్క ఎరల కన్నా సమర్ధవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎరలు పురుగు ఉదృతిని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి.
* పండు ఈగలను ఆకర్షింపజేసి సమర్ధవంతంగా నివారించడానికి ఆకర్ష్ ME పేస్టును ఉపయోగించినట్లైతే మంచి ఫలితాలు సాధించవచ్చు. దీన్ని ఉపయోగించే విధానం మరియు ప్రయోజనాలు వివరముగా వినూత్న పద్దతులలో తెలుసుకుందాం.
* ఒక లీటరు నీటికి 5 శాతం వేప గింజల కాషాయం కలిపి మొదటి థగా కాయలు గోలి సైజులో ఉన్నప్పుడు మరియు రెండో విడత 15 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేసుకుంటే పురుగు ఉదృతిని తగ్గించవచ్చు
* ఇక ఇవన్నీ చేసాక మాత్రమే రసాయనిక మందులను వాడాలి, కానీ ఈ మందులు పండు ఈగ ఉదృతిని తగ్గించడంలో అంతగా ప్రభావం చూపవు. వీటిలో ప్రోఫినోఫోస్ (50 ఇ. సి.) 1.5 మి. లీ. లేదా డైమిథోయేట్ 2 మి. లీ. లేదా డెకామేత్రిన్ (2.8 ఇ. సి.) 0.5 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పండు ఈగను సమర్ధవంతంగా అరికట్టుటలో వినూత్న పద్దతి: ఆకర్ష్ ME
* ATGC బయోటెక్ సంస్థ ప్రపంచంలోనే మొట్ట మొదటి సరిగా CREMIT అనే వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సహజసిద్ధంగా రూపొందించిన ఉత్పత్తి Akarsh ME
* దీనికి మగ, ఆడ ఈగలను సైతం ఆకర్షింపగల సామర్థ్యం కలదు.
* దీనిలో ఏ రకమైన హానికరమైన పురుగు మందులు లేవు. ఇది అత్యంత సమర్థవంతంగా పండు ఈగను ఆకర్షించి చంపే జెల్ ఎర.
* ఆకర్ష్ ME పేస్టు మామిడి. జామ, బొప్పాయి, సపోటా సీతాఫలం మరియు దానిమ్మ వంటి పండ్ల తోటల్లో వచ్చు వివిధ రకాల పండు ఈగ జాతులను ఆకర్షించి వాటిని నివారించడంలో సమర్ధవంతమైనది.
* ఈ ఆకర్ష్ ME పేస్టు (250 గ్రా.) ను ఏదేని ఆమోదించబడిన పురుగు మందులను (స్పైనోసాడ్ లేదా ఫిప్రూనిల్) 7.5 – 10 మి. లీ./250 గ్రా పేస్టు తో కలిపి మిశ్రమాన్ని చేయాలి.
* ఈ ఆకర్ష్ ME పేస్టుని పిందె నుంచి మొదలు పెట్టి ప్రతి 30-45 రోజులకొకసారి 2 పర్యాయాలు వాడినట్లైతే పండు ఈగను సంతతిని ముందునుంచే అరికట్టి వాటి సంతతి వృద్ధి పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టవచ్చని వివిధ పరిశోధనలు నిర్ధారించాయి.
* ఈ పేస్టును చెట్టు వయసుని బట్టి 1 నుండి 4 ప్రదేశాలలో కాండం లేదా కొమ్మ పైభాగంలో 1 – 2 గ్రా. మిశ్రమాన్ని చిన్న ముద్దలాగా చేసి పెట్టాలి.
* ఈ పేస్టుకు మగ మరియు ఆడ ఈగలు కూడా ఆకర్షింపబడతాయి, తద్వారా వాటి సంతతిని మొదటి నుండే మన పండ్ల తోటల్లో ఉదృతిని సమర్ధవంతంగా నివారించవచ్చు.
* సామూహికంగా తోటి రైతులందరితో కలిసి వాడినట్లైతే పండు ఈగ ఉదృతిని పూర్తిగా నివారించవచ్చు.* పక్క పొలాల్లో పండు ఈగ ఉదృతి ఎక్కువగా ఉన్నట్లైతే ఈ ఆకర్ష్ ఖజూ పేస్టును మన పండ్ల తోటల చుట్టూ ఉన్న చెట్లపై ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది.
* ఈ ఆకర్ష్ ME పేస్టును పలు భారతీయ ఉద్యానవన పరిశోధన కేంద్రాలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ద్వారా పరీక్షించబడి ఆమోదించబడినది.
* దీన్ని పండు పరిపక్వము థలోనే కాకుండా పిందె థ నుండి వాడినట్లైతే మంచి ఫలితాలు వస్తాయని వివిధ మామిడి రకాలలో పరీక్షింపజేసి నిరూపించబడినది.
* శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు సెంటర్ అఫ్ ఎక్స్లెన్స్, ములుగు లో ఆకర్ష్ ME ని ఉపయోగించి పండు ఈగ ఉధృతిని సమర్ధవంతంగా అరికట్టే పద్దతిని క్షేత్ర స్థాయిలో రైతులకు ప్రదర్శన చేయడం జరిగింది.
* వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు జరిగిన దీని పనితనంలో ఎలాంటి మార్పు ఉండదు. వర్షానికి రాలిపోదు మరియు ఎండకి కరిగిపోదు.
* ఇతర రసాయనిక పురుగు మందులు వాడినా దీని ప్రభావం తగ్గదు.
* ఆకర్ష్ ME వలన క్షేత్రంలోని మిత్ర పురుగులకు ఎటువంటి హాని జరగదు మరియు, ఇది సహజసిద్ధ ఉత్పాదన కావున పండ్లపై ఎటువంటి పురుగు మందుల అవశేషాలు ఉండవు. పండు ఈగ ఉదృతి తెలుసుకునేందుకు: Mantra ME
* ATGC బయోటెక్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నానో టెక్నాలజీతో స్వీయ నియంత్రణ పద్దతిలో విడుదల చేసే టాబ్లెట్ ఎర MANTRA ME. పండు ఈగ ఉదృతి తెలుసుకోవడం కోసం, చెక్క ఎరల యొక్క లోపాలను మరియు పరిమితులను అధిగమించడానికి వినూత్నంగా ఆవిష్కరించబడిన సరికొత్త ఉత్పాదన.
* పండు ఈగ ఉదృతిని గమనించడానికి ఎకరాకు 5 ఎర (MANTRA ME) బుట్టలను పెట్టుకోవాలి. 25 -30 ఎర బుట్టలు (MANTRA ME) పెట్టుకున్నట్లైతే పురుగు ఉదృతిని మాస్ ట్రాప్పింగ్ పద్దతి ద్వారా తగ్గించవచ్చు. ఈ MANTRA ME ఒక్కో టాబ్లెట్ను ఒక్కో McPhail ట్రాప్లలో ఉంచి పంట పొలాల్లో చెట్టు కొమ్మలకు వేలాడదీయాలి.
* పంటల్లో ఉన్న పండు ఈగలు ఈ టాబ్లెట్ ఎరకు ఆకర్షింపబడి బుట్టలల్లో పడిపోతాయి.
* ఈ MANTRA ME టాబ్లెట్ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సమర్ధవంతంగా 60-90 రోజులు పనిచేయగలదు మరియు నీటిలో కూడా కరగదు. అదే చెక్కతో చేసిన లింగాకర్షక ఎరలు 30 నుండి 40 రోజులకొకసారి వాటిలోని ఎరలని మార్చాల్సి ఉంటుంది మరియు పురుగు ఉధృతి బట్టి 3 నుండి 7 రోజులలో బుట్టలలో నీటిని మార్చాల్సి ఉంటుంది.
ఇలా సమగ్ర సస్యరక్షణ చర్యలు సరైన సమయంలో పాటిస్తే మాత్రం పురుగు ఉదృతిని తగ్గించుకుని మంచి దిగుబడులు సాధించవచ్చు. రసాయనిక పురుగు మందులు వాడటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది, ప్రజల ఆరోగ్యానికి హాని, మిత్ర పురుగులు నశిస్తాయి, పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా పండ్లపై చేరతాయి.
ఇవన్నీ మామిడి మార్కెటింగ్ మరియు ఎగుమతిని దెబ్బతీస్తాయి. ఇక వివిధ రకాల ఎర బుట్టలను వాడటం వల్ల పురుగు ఉనికిని మాత్రమే పసికట్టగలం కానీ ఉదృతి తగ్గించలేము. బ్యాగింగ్ చేయడం ఖర్చుతో కూడిన పని. ఎన్ని రసాయనిక మందులు వాడినా లేని ప్రయోజనం ఆకర్ష్ ME పేస్టు వల్లే సాధ్యం మరియు పండు ఈగ బారి నుండి పంటకు రక్షణ కల్పిస్తుంది. ఈ ఉత్పాదనను మామిడిలోనే కాక వివిధ పండ్ల తోటల్లో వాడినప్పుడు ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని పండు ఈగను 45 రోజుల వరకు సమర్ధవంతంగా నివారించడంలో సత్తా చూపించిందని వివిధ పరిశోధనలలో తేలింది. నూతన టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన ఆకర్ష్ ME పేస్టు వలన పర్యావరణ కాలుష్యం జరగదు, కూలీల ఖర్చు తక్కువ, మందులు పిచికారీ చేయాల్సిన పని లేదు, పేస్టు పెట్టడానికి ఏ పంపులు కూడా అవసరం లేదు. శ్రమ మరియు ఖర్చు కూడా తక్కువే అయినప్పటికీ పండు ఈగను సమర్ధవంతంగా ఎదుర్కోగలదు. కావున రైతులు అన్ని సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తూ, రసాయనిక మందుల వాడకం తగ్గించి ఇటువంటి నూతన పద్ధతుల పట్ల అవగాహన పెంచుకుని సేంద్రియ ఉత్పాదనలు వాడినట్లైతే మంచి నాణ్యమైన దిగుబడులు మీ సొంతం చేసుకోవచ్చు. ఇతర యాజమాన్య పద్దతులతో పాటు ఆకర్ష్ ME వాడినట్లైతే పురుగు మందుల అవశేషాలు ఉండవు కావున ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది.
డా. సౌజన్య బత్తుల, డా. శశిధర్ బూర్ల, డా. విజయ్ రెడ్డి, ATGC బయోటెక్, ఇన్నోవేషన్ స్క్వేర్, బయోటెక్ పార్క్, శామీర్ పేట్, హైదరాబాద్, తెలంగాణ 500 078. ఫోన్: 8977632842
రోషానికి, రౌద్రానికి, రణానికి ప్రపంచంలోనే పేరు గాంచిన మన అసీల్ జాతి పందెం కోడి మన దేశానికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ఆంధ్ర-తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోనే కాక థాయిలాండ్ తదితర కొన్ని విదేశాలలో కూడా ఈ పందెంకోడి పుంజుల కూత లేనిదే గ్రామాలు నిద్రలేవవని ప్రతీతి. పెట్టలు సంవత్సరంలో కేవలం 50-60 గుడ్లు మాత్రమే ఉత్పత్తి చేయగల్గినప్పటికీ, వీటి మాంసం పరిమాణంలోనే కాక రుచి, నాణ్యతలలో కూడా అత్యంత గిరాకీ కలిగి ఉండుట, ముఖ్యంగా వీటి మాంసం మరియు గుడ్లలోని మాంసకృత్తులు, విటమిన్లు, ఇతర పోషకాల వల్ల కరోనా వంటి ప్రమాదకరమైన వైరస్ వ్యాధులబారి నుండి తట్టుకోగల శక్తి పెరుగుతుందనీ, ప్రకృతిసిద్ధమైన పెరటి వాతావరణాలలో పెరిగే ఈ కోళ్ల మాంసాన్ని, గ్రుడ్లను వినియోగదారులు ఆర్గానిక్ ఉత్పత్తులుగా భావించి ఆదరించడం వంటి కారణాల వల్ల దేశీ కోళ్లలో అసీల్ (అసలైన కోడి అని అర్థం) కోడి మాంసానికి, గ్రుడ్ల ధరలు పెంపకందారులకు లాభాల పంటను పండిస్తున్నాయి. ఇందుకు ఈ జాతికి సహజంగా ఎక్కువగా వుండే వ్యాధి నిరోధక శక్తి వాతావరణ తీవ్రతలను తట్టుకోగల శక్తులే మరో ముఖ్య కారణం. వేల సంవత్సరాల చరిత్రలో పల్నాటి యుద్ధం – బొబ్బిలి యుద్ధం వంటి చరిత్రాత్మక గాధలలో కూడా మన అసీల్ జాతి పుంజులు కీలక పాత్ర పోషించాయి. అయితే జీవహింసా నివారణ చట్టం వల్ల ప్రస్తుతం అనేక రాష్ట్రాలలో కోడి పందాలు నిషేధించబడ్డాయి.
మంచి సహజ సిద్ధమైన పరిస్థితులు – పోషణలో పుంజులు 3-4 కిలోలు, పెట్టలు 1.5-2.0 కిలోలు శరీర తూకం కలిగి తెలుగు రాష్ట్రాలలో లైవ్ కోళ్లకు కిలోలకు 250 నుండి 300 రూపాయల ధర పలుకుతున్నాయి. ఇందులో ఉత్పత్తి ఖర్చు గ్రామీణ ఫారాలలో కిలోకు 150 నుండి 180 వరకు ఉంటుంది. పెరళ్లలో పెరిగే కోళ్ళ మీద ఖర్చు ఇంకా చాలా తక్కువగానే ఉంటుంది.
పందెం పుంజుల ధర సగటున 6000 నుండి 7000 మధ్య ఉండగా ప్రత్యేక గుర్తింపు పొందిన పుంజుల ధరలు లక్షకు పైగా కూడా ఉంటున్నాయి. ప్రస్తుతం కేవలం హైదరాబాదు నగరంలోనే ప్రతివారం 20,000 కు పైగా అసీల్ కోళ్లు మాంసం కోసం విక్రయించబడ్తున్నాయని ఒక అంచనా. అసీల్ కోడిపుంజు లక్షణాలు:
పొడవైన సన్నని తల, చురుకైన కళ్లు, కండపట్టిన ఎర్రని శిఖ, పొడవైన మెడ, గంభీరమైన కూత, దృఢమైన ముక్కు, చిన్న తోక, ముఖ్యంగా బలిష్టమైన పొడవైన నిటారైన కాళ్లు, కాళ్ల వెనుక దృఢమైన ఆరి, కలిగిన ఈ పుంజులు ఎరుపు, పసుపు, నలుపు, బంగారు మిశ్రమ వర్ణాలలో కనిపిస్తాయి. బలమైన కాళ్లు రెక్కలు పటిష్టమైన వేళ్లు, ఆరి, చురుకైన కళ్లు, వాటిని మంచి పోరాట పకక్షులుగా గుర్తింపు నిచ్చాయి. శతృజీవాల నుండి తప్పించుకొనడానికి ఇవి సులువుగా చెట్లమీదకు, ఎత్తైన ప్రాంతానికి ఎగిరి తమను తాము ఆత్మరక్షణ చేసుకోగలవు. పందాల రంగంలో ఈ పుంజుల్ని వివిధ స్థానిక పేర్లతో వర్గీకరించారు.
పుట్టినప్పుడు 35-40 గ్రాములు, 14వ వారంలో ఒక కిలో, 20 వ వారానికి 1.5 కిలో సంవత్సరానికి 2.5 నుండి 3.0 కిలోలకు పుంజులు పెరిగితే పెట్టల పెరుగుదల ఇందులో 75-80 శాతానికే పరిమితం అవుతుంది. పెట్టలు 22-25 వారాల వయస్సులో గ్రుడ్ల ఉత్పత్తిని ప్రారంభిస్తే పుంజులు కూడా అదే వయస్సుకు బ్రీడింగుకు సిద్ధమౌతాయి. అసీల్ కోళ్లలో వ్యాధినిరోధక శక్తి, వైరి జంతువులను ధీటుగా ఎదుర్కోగల శక్తి, ఎగిరే శక్తి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగల శక్తి ఎక్కువే అయినప్పటికీ, వాణిజ్యపరంగా అసీల్ జాతి కోళ్ల పెంపకాన్ని చేపట్టదలచిన వారు వివిధ అంటురోగాల నివారణకు టీకాలు వేయించే అవసరాన్ని ఇతర జాగ్రత్తలను విస్మరించకూడదు.
టీకాల ప్రణాళిక:
పుట్టిన వెంటనే మారెక్ టీకా, 7వ రోజు – రాణికెట్ టీకా (లసోటా) (కొక్కెర తెగులు) 14-16 రోజుల మధ్య – ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్ వాక్సిన్ (ఇబిడి) 5వ వారం – పౌల్ట్రీపాక్స్ (అమ్మవారు) 8వ వారం – రాణికెట్ వాక్సిన్ హాచరీస్ నుండి పిల్లల్ని 5-6 వారాల వయస్సులో కొనుగోలు చేస్తే అప్పటికే వాటన్నింటికీ హాచరీస్ స్థాయిలోనే దాదాపు అన్ని వాక్సినేషన్లు పూర్తి శాస్త్రీయంగా, సంతృప్తికరంగా, సులువుగా పూర్తి అవుతాయి.
గ్రామీణ సంక్షేమ పథకాలన్నింటిలో పేదలకు చాలా అనువైన అనుబంధ పరిశ్రమ అసీల్ జాతి కోళ్ల పెంపకం. దీనిని ప్రభుత్వం వారు శాస్త్రీయంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేస్తే సుస్థిరమైన ఆదాయాలు, సంక్షేమం, అభివృద్ది అతి తక్కువ ఖర్చుతో అత్యధిక నిరుపేద – మధ్య తరగతి రైతాంగానికి అందించవచ్చును.
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇండ్బ్రో పౌల్ట్రీ పరిశోధన బ్రీడింగ్, హాచరీ సంస్థ వంటి సంస్థలు అసీల్ జాతి కోడి పుంజుల్ని అధిక మాంసంతో పాటు అధికంగా గ్రుడ్లను కూడా ఉత్పత్తి చేసే రోజ్ఐలాండ్ రెడ్ పెట్టలతో క్రాస్ చేసి ఉత్పత్తి చేసే సంతతి నాణ్యమైన ఎక్కువ మాంసంతో పాటు ఏటా 150-160 ఆర్గానిక్ కోడిగ్రుడ్లను ఇస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో అత్యంత లాభదాయకమైన ఈ అసీల్-క్రాస్ కోళ్లను పెరళ్లలోనే కాక చిన్న చిన్న గ్రామీణ పౌల్ట్రీ ఫారాలలో పెంచడాన్ని తెలుగు రాష్ట్రాలు ఆర్ధిక-సాంకేతికంగా ప్రోత్సహిస్తున్నాయి.
గ్రామీణ స్థాయిలో ప్రత్యేక కాలనీలలో కేంద్రీయ కోడిపిల్లలు-కోళ్ల ఫారాలను (నర్సరీ తరహాలో) ఏర్పాటు చేసి, వీటి ద్వారా వివిధ లబ్దిదారులకు వివిధ కాలవ్యవధుల మధ్య ఎదిగే కోళ్లను పెంపకానికి పంపిణీ చేయవచ్చును. అముల్ పాల సహకార సంఘాల పంధాలలో అసీల్ (ఆర్గానిక్) కోళ్ల పెంపకాన్ని, మేతల సరఫరాను, వైద్య సేవల్ని, సాంకేతిక సహకారాలతో పాటు శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్లో మాంసాన్ని విక్రయించి, తద్వారా లభించే ఆదాయాలను అందరికీ ఆమోదయోగ్యమైన, సహకార చట్టాలు, నిబంధనావళులకు లోబడి పెంచుకుంటూ లబ్ది పొందవచ్చు. అయితే అశాస్త్రీయంగా, రాజకీయ ప్రయోజనాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించే ఏ సహకార సంస్థ బ్రతికి బట్ట కట్టిన దాఖలాలు లేవనే వాస్తవాన్ని పాలకులు, అధికారులతో లబ్దిదారులందరూ గుర్తించినప్పుడు మాత్రమే ఇటువంటి పథకాలు విజయవంతం కాగలవు.
వేసవిలో పశువుల సంరక్షణ చాలా అవసరం. ప్రస్తుతం రోజురోజుకీ వేసవి తాపం పెరిగిపోతున్నది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివలన పశువులు వడదెబ్బకు గురవుతున్నాయి. దీనివలన పాల దిగుబడి తగ్గిపోతుంది. రొప్పుతూ మేత మేయక, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగి, రోగ నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనివలన రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, దేశ ఆర్థిక ప్రగతికి నష్టం వాటిల్లుతోంది. అందుకు వేసవిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పశువులను సంరక్షించుకోవటంతో పాటు, పాడికి రక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం.
వేడి ఒత్తిడి – ప్రభావం: పశువులు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ముఖ్యంగా ఆవుల కంటే గేదెలు ఉష్ణ తాపానికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెల్లో నల్లని శరీరం వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది మరియు చెమట గ్రంధులు తక్కువగా ఉంటాయి. దేశీయ ఆవులు, సంకర జాతి ఆవులు మరియు విదేశీ జాతి ఆవులు కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలవు. ఎందుకంటే దేశీ ఆవులు తక్కువ వేడి ఉత్పత్తి చేస్తాయి మరియు వేడి కోల్పోయే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 110 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పెరగటం, వాతావరణ ఉష్ణోగ్రత (అనుకూల ఉష్ణోగ్రతలు 24-260బీ సంకరజాతి ఆవులకు, 330బీ దేశి ఆవులకు మరియు 360బీ గేదెలు) పెరగడం వలన అంతర్గత ఉష్ణోగ్రత సరిగ్గా సమతుల్యంలో ఉండక పెరుగుతుంది. దీనివలన చెమటలు, నోటి నుండి చొంగ ధారాళంగా కారుతుంది. నోటిద్వారా శాసించటం (పాంటింగ్). విశ్రాంతి లేకపోవడం. ముట్టె ఎండిపోతుంది. ఎక్కువ దాహానికి గురవుతాయి. మరీ ముఖ్యంగా మేతను సరిగా తినకపోవడం జరుగుతుంది. దీని వలన శరీరంలో గ్లూకోజు నిల్వలు తరిగిపోయి పశువులు క్రమంగా నీరసించి, బలహీనపడతాయి. ఒక్కొక్కసారి అపస్మారక స్థితికి చేరుకొని మరణిస్తాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో (కోస్తా జిల్లాలు) ఉష్ణోగ్రత ప్రభావానికి పశువులకు వడదెబ్బ తగులుతుంది. దీనివలన ఆవులు మరియు గేదెలు ఎండ తీవ్రతకు గురై పాల దిగుబడి తగ్గిపోతుంది. పాలలో వెన్న శాతం, మాంసకృత్తులు శాతం తగ్గుతుంది. పశువులు త్వరగా పొదుగు వాపు లాంటి వ్యాధుల బారిన పడతాయి. పునరుత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతాయి. పెరుగుతున్న పశువులలో బరువు పెరుగుదల తగ్గుతుంది. ఎద లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి క్షీణించి పోయి, ట్రీపనోసో మీయాసిస్, ఫైలేరియాసిస్ మరియు మైక్రోఫైలేరియా వంటి వ్యాధులకు గురవుతాయి. కొన్ని సందర్భాల్లో పశువుని కోల్పోవలసి వస్తుంది. దీని ప్రభావం రైతు ఆర్థిక పరిస్థితిపై పడుతుంది.హార్మోన్ల సమతుల్యత కోల్పోయి సరైన సమయంలో ఎదకు రాక పోవడం జరుగుతుంది మరియు ఈతల మధ్య వ్యవధి పెరిగి రైతులకు నష్టం వాటిల్లుతుంది. యాజమాన్య పద్ధతులు:
దేశవాళి ఆవులు వేసవిని, ఎండలను తట్టుకుంటాయి. కాబట్టి గేదెలకు మరియు సంకరజాతి ఆవులకు వేసవి నుండి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పశువులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం.
గృహవసతి – సంరక్షణ:
ఎండ నుండి పశువులను రక్షించాలంటే వాటిని ఎల్లప్పుడూ చల్లగా చెట్ల నీడలో కట్టి పెట్టాలి. పశువుల షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచడం చాలా మంచిది ఎందుకంటే పశుగ్రాసాల్లా ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో చెట్ల నీడ అందుబాటులో లేని పరిస్థితుల్లో పశువులను పై కప్పు గల పాకలో పెట్టటం మంచిది. గృహ వసతి అనేది ఎండ తీవ్రత నుండి రక్షణ కల్పించే విధంగా అనువుగా ఉండాలి. పశువుల పాకలు ఎత్తయిన ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఉండాలి. పాకల ఎత్తు 9-15 అడుగుల ఎత్తు ఉండేలా చూసుకోవాలి. పశువుల షెడ్లలో పైకప్పు రేకులతో ఉంటే దానిని వరిగడ్డి తో గాని తాటాకులతో గాని కప్పడం మంచిది. దాన్ని తరచుగా నీటితో తడుపుతూ ఉంటే మంచిది. పశువుల షెడ్ల చుట్టూ చాపలు మరియు గోతాములతో కప్పి మధ్యాహ్న సమయంలో నీటితో తడపడం వలన పాకలు, షెడ్లు చల్లగా ఉంటాయి మరియు సూర్యరశ్మి నేరుగా పడకుండా చేస్తూ చల్లని వాతావరణ పరిస్థితులను సమకూరుస్తాయి. షెడ్లలో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఫ్యాన్లు షెడ్లలోని తేమ మరియు వేడిని సమతుల్యం చేస్తాయి. షెడ్లలో ఎల్లప్పుడూ నీటిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే నీరు ఎక్కువగా తాగిన కొద్ది శరీరంలో వేడి తగ్గిపోతుంది. పగటిపూట గేదెలను రెండు మూడుసార్లు నీటితో కడగటం మంచిది. అదేవిధంగా గేదెలను మధ్యాహ్నం 2-3 గంటలు చెరువులో ఉండటం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల పశువులను వేడి తాపం నుండి కాపాడుకుని, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్థ్యాన్ని సక్రమంగా ఉంచుకోవచ్చు.
అధిక వేడి తాపం వలన పశువులు వేసవికాలంలో ఎక్కువగా ఆహారం మరియు మేతను తీసుకోలేవు మరియు జీర్ణ వ్యవస్థ సన్నగిల్లుతుంది. దీనివల్ల పాల దిగుబడి మరియు పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అందువలన వేసవిలో పశువుల పోషణ ఎంతైనా అవసరం.
పశువులను ఉదయం 10 గంటల లోపు మరియు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మేతకు పంపడం అనువైన సమయం. మిట్టమధ్యాహ్నం 11 నుంచి 3 గంటల లోపు మేపుకు పంపినట్లయితే, వేసవి తాపానికి గురై వడదెబ్బ తగిలే ఆస్కారం ఉంది. ముఖ్యంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. పశువులు వేసవిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా జీర్ణించుకోలేవు. కాబట్టి వాటిని తగ్గించి, శక్తినిచ్చే పిండి పదార్థాలు అయినటువంటి గంజి, జావ లాంటి పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం మంచిది. ఇది గేదెలలో మరీ ముఖ్యం. అధిక వేడి వలన శరీరంలో జీర్ణక్రియ సరిగ్గా జరగదు. దీని వల్ల జీర్ణరసాలు తగిన మోతాదులో ఉత్పత్తి కావు. అందువల్ల పశువులను రోజుకు రెండు మూడు సార్లు నీటితో కడిగి నట్లయితే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా జావ, మినరల్ మిక్చర్, ఉప్పుకలిపిన ద్రావణం తగిన మోతాదులో మిశ్రమ దాణతో కలిపి ఇవ్వటం మంచిది.
విటమిన్ ఏ సరైన మోతాదులో శరీరంలో ఉన్నట్లయితే, పశువులు వేసవిలో ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. విటమిన్ ఎ, ఒక పశువుకి ఒక రోజుకి 1 గ్రాము చొప్పున అందించాలి. ఈ విధంగా ఎనిమిది నుంచి పది రోజులు నెలకి అందించాలి. వేసవిలో పొటాషియం లవణాలు ఎక్కువగా అవసరమవుతాయి. అందువలన పొటాషియం క్లోరైట్ లవణాన్ని అందించాలి.
వేసవిలో పశువులు పచ్చిమేతను మాత్రమే తింటాయి. ముఖ్యంగా సంకరజాతి ఆవులు, విదేశీ ఆవులు పచ్చిమేత లేనిదే వేడిని తట్టుకోలేవు. పాల దిగుబడిని బట్టి దాణాను పశువులకు ఇవ్వాలి. పశుగ్రాసాలను చాప్ కట్టర్తో అంగుళం సైజులో కత్తిరించి మేపాలి. దీని వలన మేత వృధా కాకుండా ఉంటుంది. పచ్చిమేతను పగటిపూట, ఎండు గడ్డిని రాత్రిపూట ఇవ్వడం మంచిది. కొన్ని సందర్భాల్లో పచ్చిమేత లేనప్పుడు, ఖనిజ లవణాలు, మిశ్రమ దాణాలను ఇచ్చి అధికంగా మేపాలి. ఈవిధంగా సమృద్ధిగా వేసవిలో పోషణ ఇవ్వడం వలన పశువులు ఆరోగ్యంగా ఉండి, పాల దిగుబడి సాఫీగా సాగుతుంది. ఆరోగ్య సంరక్షణ:
ఎండ తాపానికి గురైన వెంటనే పశువులను నీడలో చెట్టు కింద ఉంచటం మంచిది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు చూసుకోవాలి. శరీరంపై చల్లని నీటిని చల్లాలి. గ్లూకోజ్ సెలైన్, సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ఎక్కించాలి. వేసవిలో ఎండ వేడికి రోగనిరోధక శక్తిని కోల్పోతాయి. దీని వలన జబ్బ వాపు వ్యాధి, గొంతువాపు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అందువలన వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వటం మంచిది. రెండు 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అలాగే అంతర పరాన్నజీవుల కోసం నట్టల నివారణ మందులు వేయించాలి. పరిశుభ్రమైన నీటిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. దాహానికి బురద నీరు, అపరిశుభ్రమైన నీరు త్రాగి పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులకు ఆస్కారం ఉంది. అందువలన మనమే మంచినీటి కుంటలను పశువులకు అందుబాటులో ఉంచాలి. ఎప్పటికప్పుడు పాకలను శుభ్రం చేస్తూ ఉండాలి.
వేసవి కాలంలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు వీచడం వలన పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి, అసౌకర్యానికి లోనుకావడం జరుగుతుంది. దీనివలన వాటి ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కావున మన రైతాంగం పైన ఉదహరించిన యాజమాన్య పద్ధతులను వేసవిలో చేపట్టినట్లయితే పశువులను సంరంక్షించడమే కాకుండా, పాడికి రక్షణ కల్పించి, దేశం ఆర్థికంగా మెరుగుపడుతుంది. డా. యు. వినోద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. జి. సుష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్; డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్, పశు వైద్య కళాశాల, తిరుపతి. ఫోన్: 9492298321
కౌంజు పిట్టలనే ‘క్వయిల్’, ‘పరిఘ’ పకక్షులు అని అంటారు. ఇవి చూడడానికి చిన్నగా, మన పిచుకుల మాదిరిగా/కొంచెం పెద్దవిగా ఉండి, కరెంటు తీగల మీద అలా తారసపడుతూ ఉంటాయి. అయితే అవి అడవి జాతికి చెందినవి. అయితే షెడ్డులో పెంచుకోవడానికి అనువైన రకం ఒకటి జపనీస్ క్వయిలు.
ఈ జపనీస్ క్వయిలును మాంసం మరియు గ్రుడ్ల ఉత్పాదన / రెండింటి కొరకు పెంచుకొనవచ్చును. మిగతా కోళ్ళ రకాలతో పోల్చినట్లయితే క్వయిల్/కౌంజు పిట్టలకు వ్యాధి నిరోధక చాలా ఎక్కువ, ఎటువంటి టీకాలు అవసరం లేదు. ఈ పిట్టలు 5 వారాల వయస్సుకే మాంసం కొరకు అమ్మవచ్చును. ఆరవ వారం నుండి ఇవి గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి.
ఐదు వారాల వయస్సులో ఇవి 180-220 గ్రా. వరకు బరువు తూగుతాయి. మరియు వీటి మాంసంలో మాంసకృత్తులు మిగతా కోళ్ల మాంసం కంటే అధిక మోతాదులో లభిస్తాయి. దేశంలో మొత్తం పౌల్ట్రీ పాపులేషన్లో 1.8% కౌంజు పిట్టలు ఉన్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన తలసరి ఆదాయం కలిగిన అవగాహనల మూలాన నేడు రైతులు ప్రత్యామ్నాయ కోళ్ల పెంపకం పట్ల మక్కువ చూపిస్తున్నారు. అటువంటి వాటిలో కౌంజు పిట్టల పెంపకం ఒకటి.
కౌంజు పిల్లల పెంపకం :
కౌంజు పిట్టలు ఉదర భాగం బూడిద రంగు కలిగి శరీరం మొత్తం ముదురు నుండి లేత గోధుమ రంగులో ఉంటుంది. బయట మార్కెట్ నందు ఒక రోజు వారి పిల్లలు లభ్యం అవుతాయి. పిల్లలు 7-9 గ్రా. బరువు ఉండి సున్నితంగా ఉంటాయి. వీటికి మొదటి వారంలో 95-99 ఫారెన్హీట్ వరకు వేడిని అందించాలి. మొదటి వారంలో తీసుకునే జాగ్రత్తలు దాదాపు ఫారం కోడి పిల్లల బ్రూడింగ్ మాదిరిగానే చేసుకోవాలి. కాకపోతే కౌంజు పిట్టల యొక్క చిన్నపాటి శరీరం వలన వాటికీ మాములు ఇతర కోడి పిల్లల కంటే అధిక ఉష్ణోగ్రతను అందించాలి.
ఒక్కొక్క బ్రూడర్ 100-150 అంగుళాలు వెడల్పుగా ఉన్నట్లయితే దానితో 250-300 వరకు పిల్లలను ఉంచవచ్చును. మొదటి వారం తరువాత నుండి ఉష్ణోగ్రతను 5 ఫారెన్హీట్ చొప్పున తగ్గిస్తూ అది 70, 75 ఫారెన్హీట్ వచ్చే వరకు బ్రూడింగ్ చేయాలి. దాదాపు 3 వారాల వయస్సు వచ్చేసరికి ఈకలు బాగా పెరిగి మగ, ఆడ కౌంజులను వేరుచేయుటకు అవుతుంది (లింగబేధం తెలుస్తుంది).
సాధారణంగా ఆడ పకక్షులు ఉదర భాగంలో ఉండే ఈకలపైన నల్లటి మచ్చలు ఉండి మగ వాటి కంటే అధిక బరువు తూగుతాయి. మగ పకక్షులు ఉదర భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. 5 వారాల వయస్సు వచ్చేసరికి ఆడ కౌంజులు 220 గ్రా.ల వరకు, మగవి దాదాపు 180-190 గ్రా. వరకు బరువు తూగుతాయి. వీటిని 4/5 వారాల వయస్సులో మాంసం కొరకు వినియోగించవచ్చు. 5 వారాల వరకు ఇవ్వవలసిన దాణాలో దాదాపు 26-28% వరకు మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. ఒక బ్రాయిలర్ కోడిని పెంచేటటువంటి స్థలం (1 చ. అడుగు) దాదాపు 5 కౌంజు పిట్టలను పెంచడానికి సరిపోతుంది.
గ్రుడ్లు పెట్టే కోళ్ల పెంపకం:
కౌంజు పిట్టలు ఆరవ వారం నుండే గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. అవి 13 నుండి 14 వారాలు వచ్చే సరికి గ్రుడ్లు ఉత్పత్తి 90-95% నికి చేరుతుంది. సంవత్సరానికి దాదాపు 250-270 గ్రుడ్లను ఉత్పత్తి చేస్తాయి. గుడ్లు 10 నుండి 12 గ్రా. బరువు ఉండి, పెంకు కొంచెం దళసరిగా, నల్లని మచ్చతో కూడి ఉంటుంది.
పోషకాల పరంగా చూసుకొన్నట్లయితే కోడి గ్రుడ్లు కంటే 2% మాంసకృత్తులు కౌంజు పిట్టల గుడ్ల నుండి లభ్యమవుతాయి. ఈ గ్రుడ్లను బోండాలు వంటివి వేసుకోవడానికి వినియోగిస్తారు. వీటి యొక& చిన్నసైజు వలన పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. కౌంజు పిట్టలు 3 వారాల వయస్సు నిండిన తరువాత నుండి ఎగరడం మొదలు పెడతాయి. కనుక కౌంజులను తప్పనిసరిగా గృహవసతి కల్పించాలి. బ్రాయిలర్ కోళ్లకు ఉపయోగించునటువంటి షెడ్డును కౌంజు పిట్టల పెంపకానికి వాడుకొనవచ్చు. గ్రుడ్లను తినడానికి మాత్రమే వినియోగించేటట్లు అయితే మగ కౌంజులను 5వ వారంలో మాంసం కొరకు అమ్మివేయవచ్చును.
లేదా గ్రుడ్లను పొదగవేయాలి అనుకునేవారు ఒక మగ కౌంజుకు, 1 లేదా 2 ఆడ కౌంజులు ఉండునట్లుగా చూసుకోవాలి. ఈ థలో కౌంజులను డీప్లిట్టర్ పద్ధతిలో గని లేదా కేజెస్ నందు గని పెంచుకోవచ్చు.
కౌంజు గుడ్డు నుండి పిల్ల రావడానికి 18 రోజుల సమయం పడుతుంది. ప్రత్యుత్పత్తికి వినియోగించే కౌంజులకు ఇతర కౌంజుల కంటే ఎక్కువ ఖనిజ లవణాలు, విటమిన్లను అందించాలి.
ఇంక్యూబేటర్ నందు గ్రుడ్లను పొదగా వేసేటప్పుడు మొదటి 15 రోజుల వరకు 99-99.5 డిగ్రీ ఫారెన్మీట్ ఉష్ణోగ్రత, 70-75% తేమ, 2/3 తెరిచిన వెంటిలేటర్స్ మరియు గ్రుడ్లను నిలువుగా ఉంచి, రోజుకు 7-8 సార్లు విడిగా త్రిప్పాలి. చివరి 3 రోజులలో 99.8-99 డిగ్రీ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత, 88-90′ తేమ, 1/3 తెరిచినా వెంటిలేటర్స్, మరియు గ్రుడ్లను అడ్డంగా హాచరీట్రేల నందు ఉంచాలి. 18వ రోజు తదుపరి పిల్లలు గ్రుడ్ల పెంకును పగుల గొట్టుకుని బయటకు వస్తాయి. వాటిలో చిన్నగా, బలహీనంగా, కాళ్ళు పడిపోయిన పిల్లలను వేరుచేయాలి. మిగిలిన పిల్లలను రైతులకు అమ్మడం కానీ లేదా వేరే ఇంకొక బ్యాచ్ను కానీ మొదలు పెట్టవచ్చు. సాధారణంగా కౌంజు పిట్టలలో వ్యాధులు తక్కువ. కౌంజుల పెంపకం చేపట్టినపుడు అక్కడ లభించు నీటి వసతి, నాణ్యత పరిశీలించుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిలో తగు మోతాదులో శానిటైజర్స్ వాడాలి. నెలలో విడిగా 3 రోజులు బి-కాంప్లెక్స్ను నీటి ద్వారా అందించుట మేలు. ప్రతి 3 నెలలకు ఒకసారి డి-వార్మింగ్ చేస్తే మేలు.
కౌంజు పిట్టల పోషణ :
కౌంజు పిట్టలకు మిగతా కోళ్ల కంటే కొంచెం అధిక మోతాదులో మాంసకృత్తులు అవసరం అవుతాయి. బయట మార్కెట్ నందు ప్రత్యేకంగా కౌంజు పిట్టల దాణా లభించునట్లయితే దొరికిన దాణాకి కొద్ది మోతాదులో అవసరం మేరకు సోయా చెక్కను కలిపి వాడుకోవాలి.
సాధారణంగా కౌంజులు మొదటి 5 వారాల వయస్సు వరకు 550-600 గ్రా. వరకు దాణా తింటాయి. కోడి ఒకటికి ఆ తదుపరి అనగా గ్రుడ్లు పెట్టు థలో దాదాపు రోజుకు కోడికి సగటున 25 గ్రా. దాణా అవసరం అవుతుంది. దాదాపు సగటున కౌంజు పెట్టకు గుడ్ల థలో 10 నుండి 11 కిలోల దాణా అవసరం అవుతుంది.
కౌంజు పిట్టల దాణా :
తరాలు అనగా: లైసిన్, మిథియోనిన్, బికాంప్లెక్స్, విటమిన్లు, ఫాట్ సాల్యుబుల్ విటమిన్లు, కోలిన్ క్లోరైడ్, ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ఉంటాయి. దాణా ఖర్చు మొత్తం పెట్టుబడిలో 70-75% వరకు ఉంటుంది. కనుక దాణా తయారీ విధానంలోను, దాణా అందించే విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మేత తొట్లలో 2/3 వంతు వరకు మాత్రమే దాణా నింపాలి. రోజుకు 3 సార్లుగా దాణా అందించాలి. షెడ్డు నందు తగినంత గాలి, వెలుతురు ఉండునట్లు చేసుకోవాలి. గ్రుడ్లు పెట్టు కౌంజులకు రోజు మొత్తం మీద 16 గంటలు వెలుతురు ఉండునట్లు చూడాలి. కౌంజు పిట్టల పెంపకం ఆదాయ వ్యయాలు: 10000 కౌంజులకు
షెడ్డు నిర్మాణానికి: 10000 కౌంజులకు: 40,000.00 నీటి వసతి కరెంటు వసతి.
నికర ఖర్చులు :
ఒక రోజు వయస్సు గల కౌంజు ధర: 8.00 þ 10000 = 80,000.00 దాణా ఖర్చు 5 వారాల వరకు 550 గ్రా. þ 10000þ30/1000 = 1,65,000.00 ఇతర ఖర్చులు (లిట్టర్, కరెంటు చార్జీలు, బికాంప్లెక్స్) రూ.2 / కోడికి = 20,000.00
మొత్తం ఖర్చు = 2,65,000
ఆదాయం: 10,000 కౌంజులకు 5% మరణాలు అయినా మార్కెట్కు తరలించే సంఖ్య 9,500 ఒక్కొక్క కౌంజు రూ. 35/- చొప్పున = 3,32,500 అనగా 10,000 కౌంజులను పెంచుకున్నట్లు అయితే వాటిని 5 వారాలకు అమ్మడం ద్వారా దాదాపు రూ. 67,500/- (3,32,500 – 2,65,000) ఆదాయాన్ని 5 వారాలలో పొందవచ్చు. పైన తెలిపిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో మార్కెట్ చేసుకున్నట్లయితే కౌంజులు పెంపకాన్ని ఒక ఉపాధిగా చేపట్టి లాభాలు గడించవచ్చు. డా. నాగరాజ కుమారి కళ్ళం,
భారతదేశంలో ప్రత్తి పైరు 1300 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్తి సాగు 6.50 లక్షల హెక్టార్లలో, కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం, ప్రకాశం జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ప్రత్తిని ఆశించే అనేక రకాలైన పురుగులలో గులాబి రంగు పురుగు ముఖ్యమైనది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉద్ధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన 75-80 రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఈ పురుగు యాజమాన్యంకు కేవలం ఒక రసాయిన పురుగుమందులపై ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టుట వలన గులాబి రంగు పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.
ప్రత్తి తీసిన తర్వాత అవశేషాలను పంట చేలోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల గులాబి రంగు పురుగు పంట పొలంలో ఆశ్రయం పొంది దాని ఉధృతి పెరుగుతోంది. కొంత మంది రైతులు ప్రత్తి తీత మరియు తర్వాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు ప్రత్తి కట్టెలను కాల్చేస్తారు. కానీ అలా కాల్చడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ప్రత్తి అవశేషాలను కాల్చడం వల్ల నష్టాలు
1. పంట తీసుకున్న అనంతరం ఎండిన మొక్కలను పంట చేలోనే కాల్చేయడం వల్ల భూమిలోని సారం దెబ్బతింటుంది.
2. నేలలో ఉండే మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది.
3. కాల్చడం వల్ల భవిష్యత్తులో ఉద్గార వాయువుల పరిమాణం పెరిగి వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.
4. భారత దేశంలో ప్రత్తి సాగు చేయడం ద్వారా సుమారు 25-30 మిలియన్ టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి కాగా, వాటిలో 48.9 శాతం అవశేషాలను కాల్చివేయడం జరుగుతోంది. ప్రత్తి పంట తీసిన తర్వాత ఏర్పడే అవశేషాలను మెలకువగా ఉపయోగిస్తే లాభదాయకంగా ఉంటుంది మరియు గులాబీ రంగు పురుగు నివారణకు కూడా లాభం చేకూరుస్తుంది. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాల వినియోగం
1. ప్రత్తి తీతల తర్వాత వచ్చే కాండాలు, ఆకులు మరియు పండిన కాయలను చేలో మేకలను, గొర్రెలను మరియు పశువులను తోలి మేపవచ్చు. లేదా ఇంటికి తీసుకెళ్లి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి శీతాకాలపు మేతగా కూడా వాడవచ్చు.అయితే మొక్కల్లో పురుగుమందుల అవశేషాల స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని పశువులకు తినిపించరాదు.
2. ప్రత్తి మోళ్ళను ట్రాక్టరు ష్రెడ్డర్ తో భూమిలో కలియ దున్నుకోవచ్చు. ఇలా చేయడం వల్ల…
* భూసారం పెంచడంతో పాటు తేమను సంరక్షించుకోవచ్చు. పత్తి పంట వల్ల ఒక హెక్టారుకు సుమారుగా 2 టన్నుల కాండాలను ష్రెడ్డింగ్ చేసి భూమిలో కలియ దున్నటం వలన భూమికి 12.4-20.0 కిలోల నత్రజని, 1.6 కిలోల భాస్వరం మరియు 12.2-13.6 కిలోల పొటాష్ లభ్యమవుతుంది.
* అధికవర్షాలప్పుడు భూమి కోతకు గురికాకుండా ఉంచుతూ అలాగే వేసవి కాలంలో భూమి యొక్క ఉష్ణోగ్రతను మితంగా ఉంటుంది.
* మెరుగైన వేరు వ్యాప్తి, అధిక సూక్ష్మజీవుల కార్యకలాపాలు ఉంటాయి.
3. ఎండిన ప్రత్తి కట్టెను పొడి చేసి వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగించవచ్చు.
4. పోడి చేసి చేలో చల్లితే కలుపు మొక్కలు పెరగకుండా కొంత వరకు అరికడుతుంది.
5. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాలతో కంపోస్టుని కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ప్రత్తి కాండాలలో ఎక్కువ ్పు/శ్రీ నిష్పత్తి మరియు అధిక లిగ్నోసెల్యులోజ్ శాతం ఉండటం వలన అవి సూక్ష్మజీవుల దాడికి నిరోధకంగా ఉండి కంపోస్ట్ తయారీకి 4-6 నెలల సమయం పడుతుంది.
అలా కాకుండా యాక్సిలరేటెడ్ కంపోస్టింగ్ ప్రక్రియలో డీకంపోజర్ను ఉపయోగించి తడి ప్రత్తి కట్టెలని అయితే 45 రోజుల్లో, ఎండిన ప్రత్తి కట్టెలని అయితే 60 రోజుల్లో పూర్తి చేయవచ్చు. ఈ విధంగా తయారైన కంపోస్టులో ఉన్న పోషక విలువలు (1.43:0.78:0.82 శాతం ఎన్పికె), పశువుల పేడ యొక్క పోషక విలువలు (0.5:0.2-0.4:3-5 శాతం ఎన్పికె) కంటే అధికంగా ఉంటుంది.
6. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాలు ఆచ్ఛాదనగా ఉపయోగించుకోవచ్చు.
7. పుట్టగొడుగుల పెంపకంలో మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ కోసం ప్రత్తి కర్రను వినియోగించుకోవచ్చు.
8. ఎండిన ప్రత్తి కట్టెలను ప్యాకింగ్ మెటీరియల్, పార్టీకల్ బోర్డులు, హార్డ్ బోర్డులు, కరుగేటెడ్ బోర్డులు, బాక్స్లు, పేపర్ పల్ప్ మరియు ప్లైవుడ్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వీటి తయారీ కోసం రైతులు ప్రత్తి కట్టెలను ఫ్యాక్టరీలకు అమ్మటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీ యజమానులు తొలగించిన ప్రత్తి కట్టెలను టన్నుకు 300-400/- రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన మన రైతులు కూడా ప్రత్తి కట్టెలను ఈ విధంగా సద్వినియోగం చేస్తే కేవలం ప్రతి కట్టె అమ్మకం ద్వారా ప్రతి రైతుకు హెక్టారుకు 1200-1600/- రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.
9. ప్రత్తి కట్టెతో పిడకలు తయారుచేసి ఫ్యాక్టరీల్లో, బ్రాయిలర్లలో బొగ్గుకు బదులుగా కూడా వాడవచ్చు.
10. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ అయిన కేంద్ర ప్రత్తి సాంకేతిక పరిశోధనా సంస్థ వారి గణాంకాల ప్రకారం ప్రత్తి అవశేషాలలో 58.5 శాతం సెల్లులోజ్, 14.4 శాతం హెమి సెల్యులోజ్ మరియు 21.4 శాతం లిగ్నిన్ ఉంటాయి. వీటి వలన ఈ అవశేషాలను జీవ శక్తిగా మార్చి బయోచార్, బయోగ్యాస్, ఇతనాల్ లాంటి జీవ ఇంధన తయారీకి ఉపయోగించడానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం రైతులు దూది సేకరణ తర్వాత మొక్కలను తొలగించడానికి ఎకరానికి 600/- దాకా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు కారణంగా ప్రత్తి సాగు రైతులకు భారంగా మారుతోంది. సాగుదారులు పెట్టుబడి ఖర్చు పెరిగి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకతను తొలగించడం రైతుకు అదనపు భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యేకతలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు యువతకు చేయూతనిస్తూ గులాబిరంగు పురుగు నివారణకు తోడ్పాటు అందించాలి.
మనుషులందరూ ఎవరికి వారుగా ఉంటే వ్యక్తులౌతారు, సంఘటితమైతే శక్తి అవుతారుఅందుకే పెద్దలు ”సంఘటన్ మే శక్తి హై” అని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరికి వారుగా ఉన్న రైతు సోదరులు అందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి సహకార రైతు సంఘాలు, ఖజ్పుఐ, రైతు సేవ సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పిఓ) ఏర్పాటు చేయడం ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న రైతులు అందరినీ సంఘటిత రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా 2023-24 నాటికి సుమారు 10,000 ఎఫ్పిఓల ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ రైతు సంఘలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వాటికి నాబార్డు, యన్.సి.డి.సి., నాబ్ కిసాన్ వంటి సంస్థల తరఫున ఆర్థిక సహాయ సహకారాలను అందజేస్తున్నారు.
రైతు సంఘాల ఏర్పాటుతో ప్రయోజనాలు:
1. రైతు ఉత్పత్తిదారుల సంస్థ: రైతులు ఎఫ్పిఓలుగా సంఘటితం అవ్వడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సంవత్సరానికి సుమారు 18 లక్షల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాల వరకు ఆర్థిక సహకారాన్ని పొందే అవకాశం ఉంది. ఇట్టి డబ్బును సంఘాలు తమ సంఘంలో వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించుకోవచ్చు మరియు ఈ ఆర్థిక సహకారాన్ని సంఘాలు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండదు.
2. ఈ సంఘాలకు వ్యాపారాభివృద్ధికి కావలసిన నైపుణ్యం పెంపుదల శిక్షణలను మరియు అవగాహన కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చేపడతాయి.
3. రైతులు సంఘాలుగా ఏర్పడడం వల్ల తమకు కావల్సిన ఎరువులు పురుగు మందులు, విత్తనాలు వంటి వ్యవసాయ ఇన్పుట్లను టోకుగా అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది.
4. కస్టం హైరింగ్ సెంటర్: వ్యవసాయ అవసరాలకు కావలసిన పనిముట్లను ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఈ సంఘాలు కస్టం హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యంత్రాల ద్వారా సంఘంలోని సభ్యులు అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను అనుకున్న సమయానికి, అతి తక్కువ ధరలో వినియోగించుకునే అవకాశం ఉంది. అలాగే సంఘానికి కూడా ఆదాయం సమకూరుతుంది.
5. NABARD : నాబార్డ్ వంటి జాతీయ వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు ప్రత్యేకంగా ఈ రైతు సంఘాల నిర్వహణ కొరకు ”నాబ్ కిసాన్” అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసి అతి తక్కువ వడ్డీ రేటుతో అత్యధిక రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అలాగే ‘గ్రామీణ బండారన్ యోజన’లో భాగంగా ఈ సంఘాలు కమ్యూనిటీ గోదాములు నిర్మించుకోవడానికి 25 శాతం సబ్సిడీ లేదా గరిష్ఠంగా రూ. 2.25 కోట్లు సబ్సిడీ మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్’లో భాగంగా ఈ సంఘాలు బయటి బ్యాంకులలో తీసుకునే రుణాలకు నాబార్డ్ పూచీకత్తు అందిస్తుంది.
6. NCDEX: నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ అనే జాతీయ సంస్థ ఈ రైతు సంఘాలకు ఆన్-లైన్ వేదికగా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో తమ పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా పంట కోత, పంట శుద్ధి మరియు రవాణా కొరకు అయ్యే ఖర్చులో 50-75 శాతం ఖర్చును ఈ సంస్థ రైతుకు అదనంగా చెల్లిస్తుంది.
7. Spice Board : జాతీయ సుగంధద్రవ్యాల బోర్డు వారు పసుపు ఉత్పత్తిదారుల సంస్థలకు బాయిలర్లు, పాలిష్ మిషిన్, పసుపు తీసే యంత్రాలు, టార్పాలిన్లు మొదలగు పరికరాలను 50 శాతం సబ్సిడీతో అందించడమే కాకుండా నాణ్యమైన పసుపు ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా అమ్ముకునే అవకాశాలను రైతులకు కల్పిస్తున్నాయి.
8. e-NAM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ”ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్)” అనే జాతీయ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థలో రిజిస్టర్ అయిన సంఘాలకు తమ పంట ఉత్పత్తులను జాతీయ మార్కెట్లో అనుకున్న రేటుకి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.9. ఈ రైతు సంఘాలకు సుమారు 100 కోట్ల టర్నోవర్ వరకు కూడా ఆదాయపు న్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరిగినది.10. పంటల ఉత్పత్తి, కోతలు, సేకరణ, గ్రేడింగ్, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఈ రైతు సంఘాలకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. రైతు సోదరులందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ చేయూతను వినియోగించుకొని రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మరియు సహకార సంఘాలుగా ఏర్పడి సమిష్టి కృషితో ఉమ్మడి విజయం సాధించి సహకార వ్యవస్థ యొక్క సత్ఫలితాలను ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
బి. రాజ్కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి, నిర్మల్ జిల్లా. ఫోన్: 9014205493
రాష్ట్రంలో ప్రతి రైతు తొలకరి వర్షాలు పండటంతోటే వ్యవసాయం సాగు పనులు ప్రారంభిస్తారు. ఇలా ఖరీఫ్, రబీ (యాసంగి) మరియు నీటి వసతి కల్గిన చోట వేసవి పంటలను కూడా వేస్తారు. ఇలా పండించినటువంటి పంటల కోతల అనంతరం మళ్ళీ ఖరీఫ్ పంటలు వేసుకోవడం ప్రారంభమై వర్షాలు మొదలయ్యే నాటికి భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. దీని ద్వారా కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు భూమిలో పెరిగి పురుగు మందుల అవశేషాలు కూడా భూమి లోపల ఉండిపోతాయి. ఈ కారణాల ద్వారా మనం (రైతన్న) వేసుకొనే వివిధ పంటలకు కావల్సిన లోతైన బీజపీఠం ఏర్పడదు, తద్వారా దిగుబడి తగ్గుతుంది.
వేసవి దుక్కుల ప్రాముఖ్యత:
యాసంగి, వేసవి పంటలకు చేసేటటువంటి లోతు దుక్కులను వేసవి దుక్కులు అంటారు. ఎంత లోతుగా దుక్కి దున్నుకోవాలనేది మనం వేయబోయే పంటనుబట్టి కూడా ఉంటుంది. లోతు వేర్లు పంటలకైతే (కంది, ఆముదం, పత్తి మొ||) లోతుగా దున్నుకోవాలి. మొక్కజొన్న, జొన్న, వేరుశనగ మొదలగు పంటల వేర్లు మధ్యరకంగా లోతు ఉంటే 15-20 సెం.మీ. లోతు సరిపోతుంది. ముఖ్యంగా దున్నే విధానాన్ని, నేల స్వభావాన్ని బట్టి ఎంచుకోవాలి. లోతుగా నేలను తిరగబడేటట్టుగా దున్నాలనుకుంటే మోల్డుబోర్డు నాగలితో దున్నుకోవాలి. దుక్కిలో పశువుల ఎరువును భూమిలో కలిసేటట్లుగా మోల్డ్బోర్డ్ నాగలి ద్వారా చేసుకోవచ్చు. అలాగే డిస్క్లను వాడి కూడా గడ్డి, గరికను భూమిలో కలియదున్నవచ్చును. నేల లోపలి పొరలు గట్టిపడి మురుగు నీటి సౌకర్యం లేనపుడు, గాలి, నీటి శాతం తగ్గుతుంది. దీని ద్వారా మొక్కల వేర్లు పెరుగుదల పోషకాల లభ్యత, శ్వాసక్రియ (మొక్కలకు) లాంటి చర్యలు తగ్గి మొక్క చనిపోతుంది. లోతుగా దున్నినప్పుడు గట్టిపొర విచ్ఛిన్నమై నేల గుల్లగా తయారవడమే కాకుండా నేలలో గాలి శాతం మరియు నీటిని పీల్చుకునే లక్షణాలు పెరుగుతాయి. తద్వారా సూక్ష్మజీవుల సంతతి, చర్యలు పెరుగుతాయి. దీని వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు త్వరగా విచ్ఛిన్నమై పోషకాలుగా విడుదల అవుతాయి. మరియు కలుపు మొక్కల వేర్లు, పురుగు మందుల అవశేషాలు నేలలో ఉంటాయి. వీటిని లోతు దుక్కుల ద్వారా విష పదార్థాలు విచ్ఛిన్నమై పంటల దిగుబడి పెరుగుతుంది. మరియు వర్షపు నీరు లోపలి పొరలలోకి ఇంకి భూమి సారాన్ని పెంచుతుంది. వేసవి దుక్కి దున్నటం ద్వారా కలుపు మొక్కలన్నీ వేర్లతో పెకిలించి నేల లోపలి పొరల్లోకి చేరతాయి. దీని వలన సూర్యరశ్మి సోకి కలుపు మొక్కల విత్తనములు నిర్వీర్యం అవుతాయి. వేసవి దుక్కి దున్ని నేలను తిరగవేయడం వలన నేలలోని చీడపురుగు థలన్ని నేలపైకి రావడం వలన పకక్షులు వాటిని తిని చంపి వేస్తాయి. మరియు వేసవిలోని అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక చనిపోతాయి.
వేసవి దుక్కుల ద్వారా లాభాలు:
నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. తద్వారా వివిధ పంటలకు కావలసిన లోతైన బీజ పీఠం ఏర్పడుతుంది. వేసవిలో దున్నే ముందు నేలలో పశువుల ఎరువుగాని, కంపోస్టుగాని మరియు చెరువులోని నల్లమట్టిని గాని వెదజల్లడం వలన నేల సారవంతమౌతుంది. దుక్కి (ఒండ్రుమట్టి) చేయడం కంటే ముందు పశువుల మందను గాని, గొఱ్ఱెలు లేదా మేకల మందను గాని ఉంచడం వల్ల వాటి ఎరువు నేలకు చేరి సేంద్రియ పదార్థం పెరిగి భూసారం పెరుగుతుంది. చెరువు మట్టిలో మనకు నత్రజని-0.3 శాతం, భాస్వరం – 0.2 శాతం మరియు పొటాష్-0.4 శాతం లభిస్తాయి. ఈ సారవంతమైన చెరువులోని ఒండ్రుమట్టిని పొలంలో వేసుకొని భూసారం పెంచుకోవచ్చు. వేసవిలో లోతు దుక్కులు చేయడం ద్వారా కలుపు మొక్కలు వాటి విత్తనాలు నశింపబడతాయి. మొండి జాతికి చెందిన తుంగ వంటి కలుపు మొక్కలు అన్ని రకాల నేలల్లో సమస్యాత్మకంగా మారుతున్నవి. ఇలాంటి కలుపు మొక్కల దుంపలు లోతు దుక్కులు చేయడం వలన సూర్యరశ్మికి బహిర్గతమై చనిపోతాయి. మంచి నేలల్లో మట్టి రేణువులు 50 శాతం, నీరు 25 శాతం, గాలి 25 శాతం ఉంటుంది. ఇవి ఏ కారణం చేతనైనా నేల లోపలి పొరలు గట్టిపడి, మురుగునీరు పోవు మార్గం లేనపుడు గాలి మరియు నీటి శాతం మొక్కకు తగు మోతాదులో తగ్గుతుంది. దీని ద్వారా పంటల మొక్కల వేర్లు పెరుగుదల, పోషకాల లభ్యత తగ్గి, శ్వాసక్రియ లాంటి చర్యలు తగ్గుతాయి. వీటి ద్వారా పంట మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి వేసవి దుక్కులు చేయడం ద్వారా భూమిలోని గట్టి పొరలు విచ్ఛిన్నమై నేల గుల్లబారుతుంది. మరియు నేలలో గాలి శాతం, నీటిని పీల్చుకొనే లక్షణాలు పెరుగుతాయి. వీటి ద్వారా సూక్ష్మజీవుల సంతతి చర్యలు పెరుగుతాయి. కావున వేసవి దుక్కులు దున్నుకొని, నేల సారవంతత కాపాడుతూ అధిక దిగుబడులు పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయాచిక్కుడు మరియు వేరుశనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులను గమనించి రైతాంగం వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ, ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. పంటలలో గింజలు, అవశేషాలు ఉత్పత్తవుతున్నాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉపఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర లాభం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్ళు, గొర్రెల పెంపకం మంచి అనుబంధ వ్యాపకాలు, సమగ్ర వ్యవసాయం చేపట్టి, పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులతో విలువలు జోడించిన మేతగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏదీ వృథా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను క్రింది విధంగా సద్వినియోగ పరచుకోవాలి.
వరి : ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంట్ మరియు ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడతారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ, నూడుల్స్ తయారు చేస్తారు.
వరిగడ్డి: హెక్టారుకు 6-7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రంలో వరిగడ్డిని తగులబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుంది. తగులబెట్టకుండా యూరియాతో మాగబెట్టి, పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోవాలి. పొలంలో కలియదున్నినప్పుడు కర్బన/నత్రజని నిష్పత్తి ఎక్కువవడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కావున సిఫారసు చేసిన నత్రజనికి 25% అధిక నత్రజని వాడవలెను. ఈ క్రియవల్ల దీర్ఘకాలంలో నేల సేంద్రియ కర్బనం పెరుగుతుంది. జింక్, కాపర్, ఇనుము మరియు మాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలంలో గడ్డి తొలగించకుండానే ”హ్యాపీసీడ్ డ్రిల్లర్” యంత్రంతో మొక్కజొన్న, జొన్న మరియు ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుదుత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకం మరియు పశువుల పాకలలో పాన్పుగా వాడటం ద్వారా పశువు ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని గడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు.
మొక్కజొన్న: మొక్కజొన్న కోత తర్వాత కాండం, ఆకులు, గింజలు ఒలిచిన కంకి మిగులుతాయి. పిండిపదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేస్తారు. గుజ్జు చేసి కాగితం తయారు చేయవచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి, సాంద్రీకృత దాణాతో 75:25 నిష్పత్తిలో కలిపి ఎండు టి.యం.ఆర్. (టోటల్ మినరల్ రేషన్) దాణాను తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్ మరియు కృత్రిమ తోళ్ళ తయారీలో పూరకంగా వాడుతారు. పనికి రాని చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పాన్పుగా లేదా వానపాముల ఎరువుగా వాడుకోవచ్చు. పంట పూతథలో బెట్టకొచ్చి లేదా ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే, అటువంటి చొప్పను ”సైలేజ్”గా మార్చుకొని వాడుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ములల్లో సైలేజ్ చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృథా కాకుండా సమర్ధవంతంగా పశువులకు మేపుకోవచ్చును.
ప్రత్తి: దూదిపోగా మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టారుకు 3 టన్నులు వస్తుంది. దూది తీసి వెంటనే నవంబరు నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు, గొర్రెలకు మేపుకోవాలి. తర్వాత మొదళ్ళను తొలగించి ”గులాబి రంగు” పురుగు ఉత్పత్తిని తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో పంట చెరకుగా వాడి, పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డ్ పరిశ్రమకు, కాగితం, పరిశ్రమకు వాడవచ్చును. ప్రత్తి కట్టెలో 68% సెల్యులోస్, 26% లిగ్నిన్ మరియు 7% బూడిద ఉంటుంది. 1000 టన్నుల ప్రత్తి కట్టెతో 100 కె.వి. సామర్థ్యపు 5 విద్యుత్తు కేంద్రాలను ఒక సంవత్సరం నిర్వహించుటకు సరిపోతుంది. పత్తి కట్టెను ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రాక్టరుతో నడిచే మల్టీక్రాప్ బయోష్రడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. ఒక ఎకరం పత్తి కెట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందించబడుతుంది. ప్రత్తి పంటను నేలలో కలియదున్నటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి.
పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు, రైతులతో అనుసంధానమై ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రైతు సోదరులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆచరించి పశువులను, కోళ్ళను పెంచి పంటల అవశేషాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత. రైతుసోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాధారణంగా కొబ్బరి అనగానే గోదావరి జిల్లాలు, సముద్రతీర ప్రాంతాలు, కేరళ లాంటి ప్రాంతాలలోనే పండుతుందంటుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం కాదు. కొబ్బరిని రాయలసీమలో కూడా పండించి విజయం సాధించి కొబ్బరి నుంచి ఆదాయం పొందవచ్చు అని నిరూపిస్తున్నారు కడప జిల్లా రాజంపేటకు చెందిన వెంకట నరసారెడ్డి.
వెంకట నరసారెడ్డిది వ్యవసాయ కుటుంబం. వీరి పూర్వీకుల నుంచి వ్యవసాయమే వీరి ప్రధాన వృత్తి. డిగ్రీ వరకు చదివిన నరసారెడ్డి ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అందరిలాగానే వ్యవసాయంలో వస్తున్న మార్పులను తన సాగులో కూడా అమలు పరుస్తూ అన్నిరకాల పద్ధతులు పాటిస్తూ వస్తున్న నరసారెడ్డి ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని తన పంటల సాగుని ప్రకృతి వ్యవసాయ విధానంలోకి 2011వ సంవత్సరంలో మార్చి అప్పటినుండి ఎలాంటి రసాయానాలు అందించకుండా కేవలం ప్రకృతి సేద్య విధానాలను అవలంభిస్తూ తన సాగును కొనసాగిస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతి గోవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటలసాగుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆవులు, ఎద్దులు కలిపి మొత్తం 14 పశువులను పోషిస్తున్నారు. ఇందులో ఒంగోలు, సాహివాల్, కాంగ్రెజ్, గిర్ రకాలైన మన దేశీయ జాతులు ఉన్నాయి. వీటికి అవసరమైన పశుగ్రాసాలను పూర్తి ప్రకృతి సేద్య విధానాలను సాగు చేస్తూ పశువులకు అందిస్తూ వస్తున్నారు.
మొత్తం వీరు 15 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. అందులో కొబ్బరి 31/2 ఎకరాలలో, 13/4 ఎకరాలలో మామిడి, 33/4 ఎకరాలలో నిమ్మ, 2 ఎకరాలలో అరటి, 11/2 ఎకరాలలో ఆముదం, మునగ పంటలు సాగు చేస్తూ మిగతా పొలంలో పశువులకుగాకు కో-4, సూపర్ నేపియర్, థరథ గడ్డి లాంటి పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. ఈ 15 ఎకరాలలో 2011వ సంవత్సరంనుండి ఎలాంటి రసాయానాలు ఉపయోగించకుండా కేవలం ప్రకృతి సేద్య పద్ధతులనే పాటిస్తు న్నారు. ప్రతి పంటకు క్రమం తప్ప కుండా పశువుల ఎరువు అందించడంతోపాటు జీవామృతం, వానాపాముల ఎరువులను అందిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో బెల్లం ధర పెరగటం మరియు బెల్లం సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో జీవామృతాన్ని ఉపయోగించడం ఆపి వేసి ఆవు మూత్రాన్ని భూమికి అందిస్తున్నారు. వీరు సాగు చేసే పంటలకు చీడపీడల ప్రభావంగా తక్కువగా ఉంటుంది కాబట్టి కషాయాలు మరియు ద్రావాణాల అవసరం పెద్దగా ఉండటం లేదు. తప్పనిసరి పరిస్థితులలో అవసరమైతే చీడపీడల నివారణకు వివిధ రకాలు ఆకులు, ఆవుమూత్రం, పేడల లాంటి వాటితో కషాయాలు తయారు చేయించి పంటలకు ఉపయోగించి చీడపీడలను నివారిస్తున్నారు.
కొబ్బరి:1985వ సంవత్సరంలో 31/2 ఎకరాలలో కొబ్బరి మొక్కలు నాటించారు. ఇందుకుగాను రాజంపేట నర్సరీ నుంచి ఈస్ట్కోస్టు రకం కొబ్బరి మొక్కలు తెప్పించి లైనుకి లైనుకి మరియు మొక్కకు మొక్కకు 18 అడుగుల దూరం పాటించి నాటించారు. ప్రస్తుతం 31/2 ఎకరాలకుగాను 375 కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరిలో అంతరపంటగా అవకాశాన్నిబట్టి అరటి సాగు చేస్తుంటారు. కొబ్బరి లైన్ల మధ్యలో ట్రెంచ్ తీసి ఆ ట్రెంచ్లోనే కొబ్బరి మొక్కల వ్యర్థాలను వేసి అక్కడే వీటిని అందింస్తుంటారు. కొబ్బరి మొక్కల పాదుల దగ్గర నీటిని అందించరు. ఈ పద్ధతిని గుజరాత్కి చెందిన ప్రముఖ ప్రాకృతిక రైతు కీ||శే|| భాస్కర్ సావే గారు పాటించారు. అదే పద్ధతిని నరసారెడ్డి గారు తెలుసుకుని తమ పొలంలో అమలు చేస్తూ తక్కువ శ్రమతో మంచి దిగుబడిని తీస్తున్నారు. ప్రస్తుతానికి సగటున ఒక్కొక్క చెట్టునుంచి సంవత్సరానికి సుమారు 200 కాయలవరకు పొందుతూ ఒక్కొక్క కొబ్బరి కాయను రూ. 15/- నుంచి 20/- ల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. దిగుబడిని కొయ్యకుండా ఎండి రాలి పడిపోయిన కొబ్బరికాయలను టెంకాయలుగా అమ్ముతున్నారు.
మామిడి: 1990వ సంవత్సరంలో మామిడి మొక్కలు నాటించారు. ప్రస్తుతం 90 చెట్లు ఉన్నాయి. వీటిలో తోతాపూరి, నీలం, బంగినపల్లి మొ||లగు రకాలు ఉన్నాయి. అన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడిని పొందుతున్నారు.
నిమ్మ: మొత్తం 33/4 ఎకరాలలో నిమ్మసాగులో ఉంది. ఇందులో 13/4 ఎకరాలలో హైడెన్సిటీలో 650 నిమ్మ మొలకలు 2015లో నాటించారు. నిమ్మలో అంతరపంటగా 100 అరటి మొక్కలు సాగు చేస్తున్నారు. 2 ఎకరాలలో మామూలు పద్ధతిలో నిమ్మ మరియు అంతరపంటగా అరటి సాగుచేస్తున్నారు. 2021లో కురిసిన అధిక వర్షాలకు నిమ్మపంట దెబ్బతింది. పూత సక్రమంగా రాలేదు. కాబట్టి 2022 ఏప్రిల్ నేలలో నిమ్మకు గిరాయికి బాగా పెరిగింది. ఎపుడు లేనంత రేటు నిమ్మ రైతులకు దక్కుతుంది. 50 కిలోల బస్తా రూ. 3,500/- నుంచి 4,000/- వరకు నడుస్తుంది. కర్నూల్ ప్రాంతంలో వ్యాపారస్తులు రైతుల దగ్గరనుంచి ఒక్కొక్క నిమ్మకాయ రూ. 6/-ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నిమ్మ పంట రైతులకు మంచి ఆదాయం వస్తుంది. కానీ వీరివద్ద ప్రసుత్తం పంట లేదు. పంట రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని నరసారెడ్డి అన్నారు.
అరటి: 2 ఎకరాలలో ఎలకి, అమృతపాణి రకాల అరటిని సాగుచేస్తున్నారు. అన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ఆరోగ్యకరమైన అరటి పంటను పండించి మంచి ధరకు అమ్ముతూ వస్తున్నారు.
ఆముదం, మునగ, పశుగ్రాసాలు: 11/2 ఎకరాలలో ఆముదం మరియు మునగ, మిగతా పొలంలో పశువులకు గాను పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. 2021 సం||లో కురిసిన అధిక వర్షాలకు ఆముదం, మునగ పంటలు దెబ్బతిన్నాయి. పశుగ్రాసాల విషయానికి వస్తే పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి ధాన్యపు జాతి, పప్పుజాతి పశుగ్రాసాలను తప్పనిసరిగా అందించాలి. కాబట్టి ఈ రెండు రకాలలో బహువార్షిక పంటలు ఎన్నుకున్నారు. ధాన్యాపు జాతి బహువార్షిక పశుగ్రాసం కో.4, సూపర్నేపియర్, పంటలు మరియు పప్పుజాతి బహువార్షిక పశుగ్రాస పంట అయిన థశరథగడ్డి (హెడ్జ్ లూసర్న్)లను పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆవులకు మరియు ఎద్దులకు అందిస్తూ వస్తున్నారు.
ఉన్నత చదువులు చదివిన నరసారెడ్డి వారి ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంలో స్థిరపడి 15 ఎకరాల వ్యవసాయ భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ తన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని మరియు కలుషితంకాని గాలిని అందించడంతోపాటు ప్రస్తుత సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారానికి సేంద్రీయ సాగే శరణ్యం అని ఆ దారిలో నడుస్తూ అందుకు అవసరమైన పశువులను పోషిస్తూ వీటన్నింటి ద్వారా సంవత్సరానికి 8 లక్షలకు తగ్గకుండా ఆదాయం పొందుతూ కుటుంబ సభ్యుల సహకారాంతో పంటల సాగు చేస్తూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.