కుందేళ్ళ పెంపకం

యాజమాన్య పద్ధతులు

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన కుందేళ్ళ పెంపకం, ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో అడుగిడుతుంది. ప్రారంభ థలో కుందేళ్ళ పెంపకం అలంకార ప్రాయంగా కొందరు పెంచుకోగా, ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక స్థాయి అనుసరించి ప్రజలు విలువ కలిగిన ఆహార ఉత్పత్తులవైపు ఖర్చు చేయుటకు మొగ్గు చూపుతున్నారు. అధిక పోషక విలువలు కలిగిన మాంసాన్ని అందించే కుందేళ్ల పెంపకంకు రాబోయే రోజుల్లో మరింత డిమాండ్‌ పెరిగే అవకాశముంది. మాంసం కొరకే కాకుండా ఉన్ని కొరకు చాలామంది పెంచుటచే ఈ పరిశ్రమ లాభసాటి పరిశ్రమ అయి వాటి నుండి తయారైన వస్తువులను ఎగుమతి చేసి తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా రూపొందుతుంది. మన రాష్ట్రంలో కుందేళ్ళ మాంసానికి మంచి గిరాకి ఉన్నది. కాబట్టి తక్కువ ఖర్చులో కుందేళ్ళ పెంపకాన్ని చేపట్టి మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. కుందేళ్ల పెంపకాన్ని చేపట్టేవారు ముందుగా ఏ ప్రాంతములో మాంసానికి గిరాకి ఎక్కువ ఉందో తెలుసుకుని ఆ ఆప్రాంతంలో కుందేళ్ళ పెంపకాన్ని చేపట్టడం మంచిది.

కుందేళ్ళ పెంపకంతో లాభాలు

దీ కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, ఆసక్తిగలవారెవరైనా కూడా కుందేళ్లు పెంపకాన్ని చేపట్టవచ్చు.

దీ కుందేళ్ళ పెంపకానికి అవసరమైన స్థలం చాలా తక్కువ.

దీ ఇవి ప్రకృతికి ఎటువంటి నష్టాన్ని కలిగించవు.

దీ ఈ కుందేళ్లు సాధు స్వభావం కలిగినవి. ఇంటిలోని మనుషులు సులభంగా కుందేళ్ల పెంపకంలో పాల్గొనవచ్చు. కాబట్టి అదనపు కూలీ ఖర్చులు అవసరం ఉండదు.

దీ కుందేళ్లు వంట ఇంట్లో మిగిలిన కూరగాయలు మొదలైన వాటిపై ఆధారపడి జీవిస్తాయి. కావున వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే.

దీ ఇతర జంతువులు వినియోగించుకోలేని ఆకులను ఇవి సమర్ధవంతంగా వినియోగించుకోగలవు. కావున ఇది రైతులకు వరం లాంటిది.

దీ కుందేళ్లలో వ్యాధులకు గురికావడం తక్కువగా ఉండడం చేత మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది.

దీ కుందేళ్లకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే అవసరం కూడా ఉండదు.

దీ కుందేళ్లు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాన్ని మాంసంగా మార్చుకోగలవు. కోళ్ల తర్వాత కుందేళ్లకు ఈ సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది.

దీ కుందేళ్ల మాంసంలో 22 శాతం వరకు మాంసకృత్తులు ఉండడం మరియు కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు కలిగిన వారు ఈ మాంసాన్ని స్వీకరించవచ్చు. 

దీ ఒక కిలో ఉన్ని ఉత్పత్తికి అంగోరా జాతి కుందేళ్లు తీసుకునే ఆహారం గొర్రెల కంటే చాలా తక్కువగా ఉంటుంది.

దీ కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా కుందేలు మాంసంలో సోడియం, పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది.

దీ కుందేళ్ల పేడలో అధిక పాళ్లలో నత్రజని, భాస్వరం ఉండటం వల్ల పెరటి తోటల్లో పూలు, పండ్లు, కూరగాయలను పెంచడానికి సేంద్రియ ఎరువుగా వాడవచ్చును.

దీ కోళ్ళ పరిశ్రమలో దాణా ఖర్చు ఎక్కువగా అవుట చేత, అది అంత లాభసాటిగా లేదు. కాని కుందేళ్లు ఎక్కువగా గడ్డిపైన ఆధారపడి యుండుట చేత దీనిపై ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయమును రైతు సోదరులు గమనించగలరు.

దీ మన రాష్ట్రంలోని రాజేంద్రనగర్‌ మరియు కోరుట్ల వెటర్నరి కళాశాల యందు కుందేళ్లను చాలా రోజుల నుండి పెంచుతున్నారు. కావున ఈ కేంద్రముల నుండి ఆసక్తి గల రైతులు కుందేళ్లను పొందవచ్చును.

మన దేశంలో కుందేళ్ల జాతులు

దీ మన దేశంలో కుందేళ్లను రెండు రకాలుగా పెంచుతారు.

1) ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లు అంటారు.

2) మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్‌ కుందేళ్లు అంటారు.

దీ మన దేశంలో హిల్‌ మరియు చలి ప్రాంతాలు అయిన జమ్ము కాశ్మీర్‌ మరియు సిక్కిం తదితర ప్రాంతంలో అంగొరా కుందేళ్లను పెంచుతున్నారు. 

దీ అంగోరా జాతి కుందేళ్లకు ఉదాహరణ బ్రిటీష్‌ అంగోరా, జెర్మన్‌ అంగోరా, రష్యన్‌ అంగోరా మొదలగునవి.

దీ ఈ కుందేళ్ల పెంపకం వల్ల మాంసంతో పాటు చర్మంతో గార్మెంట్స్‌, బొమ్మలు తదితర వస్తువులు తయారు కాగా ఉన్నితో బట్టలు, కార్పెట్లు మొదలగునవి తయారు చేస్తున్నారు.

దీ బ్రాయిలర్‌ కుందేళ్ల జాతులకు ఉదాహరణ న్యూజిలాండ్‌ వైట్‌, సోవియట్‌ చించిల్లా, ఫ్లెమిష్‌ జైంట్‌, గ్రేజైంట్‌ మరియు కాలిఫోర్నియన్‌ వైట్‌ జాతికి చెందిన కుందేళ్లు మన వాతావరణంలో పెంచుకోవడానికి అనువైనవి.

గృహ వసతి

దీ కుందేళ్ల షెడ్‌ ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టవలెను.

దీ షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో గాలి ధారాళముగా వచ్చు చోట, నీరు ఇంకని చోట కట్టవలెను.

దీ షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టవలెను.

దీ షెడ్‌ పరిసరాలలో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి. శబ్దం ఎక్కువగా ఉన్నట్లయితే కుందేళ్లు భయపడటమే కాకుండా ఒత్తిడికి గురి అవుతూ ఉత్పాదక సామర్ధ్యం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి షెడ్‌ను నిర్మించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

దీ షెడ్‌ను ప్రతిరోజు శుభ్రంగా కడగాలి. మలమూత్రాలను తీసివేయాలి. మరియు తేమ బూజులు లేకుండా జాగ్రత్త వహించాలి.

కుందేళ్లను రెండు పద్ధతులలో పెంచుతారు.

1) డీప్‌ లిట్టర్‌ పద్ధతి; 2) కేజ్‌ పద్ధతి

డీప్‌ లిట్టర్‌ పద్ధతి: 

దీ ఈ పద్ధతిలో కుందేళ్లను లిట్టరుపై పెంచుతారు.

దీ ఈ పద్ధతిలో కుందేళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.

దీ ఈ పద్ధతిలో యుక్త వయసు వచ్చిన తరువాత ఒకదానితో మరొకటి పొట్లాడుకుంటాయి. మరియు పరాన్నజీవుల బారినపడే అవకాశం ఉన్నందున ఈ పద్ధతి అంత మంచిది కాదు.

కేజ్‌ పద్ధతి:

దీ ప్రతి ఆడ కుందేలుకు 2.5 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు మరియు 1.5 అడుగుల ఎత్తు గల కేజ్‌లు అవసరం.

దీ ప్రతి మగ కుందేలుకు 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు మరియు 1.5 అడుగుల ఎత్తు గల కేజ్‌లు అవసరం.

దీ ఈ కేజ్‌లను కాలిఫోర్నియన్‌ టైప్‌గా అమర్చినట్లయితే తక్కువ స్థలంలో ఎక్కువ కుందేళ్లను పెంచవచ్చు. ఈ పద్ధతి కుందేళ్ళ పెంపకానికి ఎంతో అనువైనది.

దీ కేజ్‌లను భూమి నుండి 2 అడుగుల ఎత్తులో ఉండునట్లు చూడవలెను.

దీ కుందేళ్ల కేజ్‌లలో అమర్చిన నీటి మరియు దాణా తొట్లను ప్రతి రోజు శుభ్రం చేయాలి.

దీ కుందేళ్ల కేజ్‌లను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేయవలెను. దీనికి బదులు కొందరు కర్రలతో కేజ్‌లను తయారు చేసెదరు. కానీ అట్టి వాటిని పరిశుభ్రం చేయుట కష్టం. ఎప్పుడైనా జబ్బు వచ్చినప్పుడు కేజ్‌లను బ్లో లాంపుతో కాల్చవలెను. కర్రలతో చేసిన ఎడల వాటిని కాల్చడం వీలుకాదు.

దీ అడుగు భాగమున 1/2” þ 1/2” సైజు వెల్డుమెష్‌ను తప్పనిసరిగా వాడవలెను. లేనిచో పుట్టిన పిల్లల సందుల నుండి జారి క్రింద పడిపోవుటకు ఆస్కారము ఉన్నది.

దీ ఒక్కొక్క కేజిలో ఒక ఎదిగిన ఆడ కుందేలు లేదా ఒక ఎదిగిన మగ కుందేలు పెంచవచ్చు. ఒకే కేజ్‌లో 3-4 పెరిగే పిల్లలు 4 మాసములు వయస్సు వరకు పెంచవచ్చు. 4 మాసముల తరువాత వీటిని విడిగా ఒక్కొక్క కేజ్‌లో వేయాలి.

దీ ఒక్కొక్కప్పుడు మగ కుందేళ్లు 3 మాసములు తరువాత పొట్లాడుకొనును. అట్టి పరిస్థితిలో వాటిని వేరు చేయాలి.

కుందేళ్ల పిల్లల యాజమాన్యం

దీ    బన్నీల బరువు పుట్టినపుడు 40-50 గ్రా. మరియు పాలు మరచే సమయానికి సుమారు 300 నుండి 350 గ్రా. ఉంటాయి.

దీ ఆడ కుందేలు రోజుకు ఒకసారి నెస్ట్‌ బాక్స్‌లోకి వెళ్లి పిల్లలకు పాలనిస్తుంది.

దీ పిల్లలు త్రాగిన ప్రతి 2 గ్రా. పాలకు 1 గ్రా. బరువు పెరుగుతాయి.

దీ కుందేళ్ల పిల్లలు కళ్లు తెరవడానికి 14 రోజుల సమయం పడుతుంది.

దీ ప్రతి రోజు తల్లి కుందేలు పిల్లలకు పాలు ఇస్తుందో లేదో గమనించాలి.

కుందేళ్ల పోషణ

దీ సాధారణంగా పుట్టినప్పటి నుండి 12 రోజుల తరువాత పిల్లలు ఆహారం తినడం మొదలు పెడతాయి.

దీ కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండేటట్లు చూడాలి. ఆహారంలో పీచు పదార్థం శాతం తగ్గినట్లయితే జీర్ణవ్యవస్థ పాడవుతుంది. కొన్నిసార్లు కుందేళ్ళు పారుకోవడం జరుగుతుంది. కాబట్టి కుందేళ్ళకు ఇచ్చే ఆహారంలో 14% పీచు పదార్థాలు ఉండేలా చూడాలి.

దీ కుందేళ్లను ‘హెర్బిదొరస్‌’ (శాకాహారిగా) పరిగణించాలి. పశువుల్లో లాగా నెమరు వేసే జంతువులా కాకుండా కుందేలు ఒకే పొట్టతో ఉంటుంది. 

దీ కుందేళ్లకు ఇచ్చే దాణాలో పలు పోషక పదార్థాలుండాలి. మాంసకృత్తులు 15-17 శాతం ఉండునట్లు చూసుకోవాలి. పిండిపదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు సమపాళ్లలో ఉండాలి.

దీ కుందేళ్లకు ఇచ్చే దాణాలో ఏ విధమైన విష పదార్థాలు లేకుండా జాగ్రత్త పడాలి.

దీ సాధారణంగా తమ తమ ప్రాంతాల్లో లభ్యమయ్యే దాణా దినుసులను ధరలను బట్టి పాళ్లను నిర్ణయించుకొని దాణా తయారు చేసుకోవచ్చు.

దీ ఉదాహరణకు 100 కిలోల దాణా మిశ్రమమును ఈ విధముగా తయారు చేసుకోవచ్చు.

దాణా పదార్థాలు పరిమాణం (పాళ్లు)

మొక్కజొన్న గింజలు/జొన్నలు/నూకలు 50 కిలోలు

వేరుశనగ చెక్క / సోయాబీన్‌ చెక్క 22 కిలోలు

గోధుమ తవుడు / వరితవుడు 25 కిలోలు

ఖనిజ లవణ మిశ్రమం 2 కిలోలు

ఉప్పు 1 కిలో

మొత్తం 100 కిలోలు

దీ ప్రతి కుందేలుకు సుమారు 1 లీటరు త్రాగు నీటిని 200-300 గ్రా. దాణా, 200 గ్రా. పచ్చిమేత అవసరము.

దీ కుందేళ్ల పరిశ్రమ లాభదాయకంగా ఉండాలుంటే, అవి ఆరోగ్యంగా ఎదగాలి అంటే పుష్టికరమైన పచ్చి మేత పెట్టవలెను.

దీ రైతులు తమ భూములలో పచ్చి గడ్డిని పెంచి మేత పెట్టవలెను.

దీ రైతులు తమ భూములలో పచ్చి గడ్డిని పెంచి ఇచ్చినచో మేతపై అగు ఖర్చు తగ్గుతుంది. 

దీ కుందేళ్లకు పప్పుజాతి పశుగ్రాసాలైన లూసర్న్‌, బర్సీమ్‌ తప్పకుండా ఇవ్వవలెను.

కుందేళ్లలో పునరుత్పత్తి

దీ సుమారు 6 నెలల వయస్సులో కుందేళ్ళు సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి.

దీ ఐదు నుండి ఆరు ఆడ కుందేళ్లను దాటించడానికి ఒక మగ కుందేలు సరిపోతుంది.

దీ జత కట్టించడానికి ముందు కుందేళ్లకు తగినంత ఆహారం అందేటట్లు చూడాలి.

దీ మగ కుందేలు కేజ్‌లో ఆడ కుందేలును ఉంచి జత కట్టించాలి.

దీ వారానికి 3-4 సార్లు మగ కుందేలుతో క్రాసింగ్‌ చేయించాలి.

దీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విత్తనపు మగ కుందేలు మరియు ఆడ కుందేళ్లను వేరే ఫారాల నుండి తెచ్చినట్లయితే పుట్టే పిల్లలో మరణాల శాతాన్ని తగ్గించడమే కాకుండా ఎదుగుదల బాగా ఉంటుంది.

దీ వేసవిలో ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాటిస్తే మగ కుందేలు వీర్యోత్పత్తి తాత్కాలికంగా తగ్గిపోతుంది. కావున ఏప్రిల్‌ మరియు మే నెలలో జతకట్టించకూడదు.

దీ ఆడ కుందేలు నిర్దిష్టమైన ఎదలక్షణములు చూపదు, కానీ అది ఎదలో ఉన్నది లేనిది తెలుసుకొనుట కష్టము, జాగ్రత్తగా పరిశీలించినటచో ఆడ కుందేలు మానము ఎర్రగా తేమగా ఉండును.

దీ ఆడ కుందేలు ఎదలో ఉన్నచో వెంటనే మగ కుందేలును దాటుటకు అనువుగా కూర్చొనును. ఒకవేళ ఎదలో లేనిచో కేజ్‌లో పరుగెత్తుచుండును. లేదా తోక ముడుచుకొని ఒక మూలన కూర్చొనును.

దీ ఆడ కుందేలు జత కలిసిన రోజు నుండి 30-31 రోజుల్లో ఈనుతుంది.

దీ ఆడ కుందేలు ఈనిన రోజు కూడా దాటించుటకు సిద్ధమైయుండును. కానీ వెంటనే దాటించరాదు, ఎందుకనగా దాని గర్భం తిరిగి మామూలు స్థితికి వచ్చుటకు 15 రోజులు పట్టును. మరియు దాటించిన వెంటనే పాలు రాకుండటచేత పుట్టిన పిల్లలు పాలు దొరకక చనిపోవును. కావున ఆడ కుందేళ్లు ఈనిన నెల తర్వాత బన్నిలను వేరుచేసి మగకుందేళ్లతో జత కట్టించాలి.

దీ ఆడ కుందేళ్లు ఈనే 3 రోజుల ముందు చెక్కతో తయారు చేసిన నెస్ట్‌ బాక్సులను కేజ్‌లలో అమర్చాలి.

దీ చూడి నిర్ధారణ, ఆడ కుందేలును జత కట్టించిన 14 రోజుల తర్వాత చేయవచ్చు.

దీ ఆడ కుందేళ్లు ఈనడానికి ముందు తన చర్మంపై ఉన్న ఉన్నిని లాక్కొని నెస్ట్‌ బాక్స్‌ యందు ఉంచును.

దీ ఆడ కుందేలు ఎక్కువగా రాత్రులు లేక తెల్లవారుఝామున ఈనుతాయి.

దీ ఆడ కుందేలు ఈనుటకు ముందు దాణా, మేత తక్కువగా తినును.

దీ ఆడ కుందేలుకు సరిపోను నీరు అందుబాటులో ఉండునట్లు చేసుకోవాలి.

దీ ఆడ కుందేలును కదిలించుట మరియు బెదరకొట్టుట మంచిది కాదు.

దీ ఒక్కొక్క ఈతలో 4 నుండి 10 బన్నిలను కంటాయి.

దీ మాయ ఒక రక్తపు ముద్దలా పడును, దానిని వెంటనే తీసివేయాలి. మరియు దానిని తినకుండా ఉండునట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

దీ ఈనిన తరువాత చనిపోయిన పిల్లలను తీసివేయవలెను.

దీ ఒక్కొక్కప్పుడు తల్లి పిల్లలను కేజ్‌లోనే ఈనుతాయి. అటువంటి పరిస్థితిలో వాటిని వెంటనే తీసి నెస్టు బాక్సులో పెట్టవలెను. ఈనునప్పుడు ఎక్కువమంది ఉన్న, కుక్కలు, పిల్లులు, ఎలుకలు ఉన్నచో అది భయపడి పిల్లలను త్రొక్కుట వలన పిల్లలు చనిపోవును. కావున అది ఈనునపుడు చాలా జాగ్రత్తగా ఉండవలెను.

మాంసోత్పత్తి

దీ ప్రతి కుందేలు 12 నుండి 16 వారాల వయసులో సుమారు 2 కిలోల బరువు తూగి, 1 కిలో మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది.

దీ కుందేలు మాంసం తెల్లగా, రుచిగా మరియు మృదువుగా ఉంటుంది.

దీ ఒక్కొక్క బన్ని 2 కిలోల బరువు పెరిగేవరకు, ప్రతి కిలో బరువు పెరుగుదలకు సుమారు 3కిలోల దాణా అవసరం ఉంటుంది.

దీ తమ దేహ బరువులో సుమారు 55 శాతం వండుకోవడానికి వీలైన మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి.

డా. సి.హెచ్‌. శివప్రసాద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, పశుగణ క్షేత్ర సముదాయము, పశువైద్య కళాశాల, కోరుట్ల

Read More

అక్షర సైనికుడి ఆదర్శ సేద్యం 

ప్రణాళికతో ముందుకు సాగితే ఏ రంగంలో అయినా మంచి ఫలితాలు రాబట్టవచ్చు. మట్టి, నీరు, శ్రమతో సాగే వ్యవసాయంలోను ఎక్కువ రాబడి సాధించాలంటే సమగ్ర ప్రణాళిక, ఆచరణ కీలకం. ఈ సూత్రాల ఆధారంగానే.. పంటల సాగులో వైవిధ్యాన్ని, క్రమ పద్ధతిని పాటిస్తూ ఆదాయ సిరులు అందుకుంటున్నారు… రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం, లాలపేట్‌ గ్రామానికి చెందిన నేమూరి విష్ణువర్దన్‌ రెడ్డి. పాత్రికేయుడిగా సమాజాన్ని చైతన్యం పరుస్తూనే సహజ సేద్యం చేస్తూ తోటి కర్షకులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. 18 ఎకరాల వ్యవసాయంలో ఇప్పటి వరకు అనేక రకాల పంటలు పండించారు. దేశీయ వరి సాగులో అధిగ దిగుబడులు సాధించారు. కొర్రలు, అండు కొర్రలు, పచ్చ జొన్నలు వంటి చిరుధాన్యాలను వైవిధ్యంగా సాగుచేశారు. కూరగాయలు పండించారు. ఇలా ప్రకృతి సేద్య విధానాలు, భిన్న పంటలు, స్వీయ మార్కెటింగ్‌ తో సేద్యంలోనే ఏటా రూ. 10 లక్షల ఆదాయం ఆర్జించవచ్చని నిరూపించారు. బహుళ పంటలపై ఆసక్తితో ఇదే వ్యవసాయ క్షేత్రంలో 5 లేయర్‌ సాగు విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారీ.. కలం పట్టిన హలం శ్రామికుడు.

విష్ణువర్దన్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. పదో తరగతి పూర్తయ్యాక వ్యవసాయంలో తండ్రికి తోడయ్యారు. సేద్యపు పనులు చేస్తూనే షాద్‌ నగర్‌ లో ఇంటర్మీడియెట్‌ చదివారు. దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే.. పాత్రికేయంపై ఇష్టంతో కలం పట్టారు. ప్రింట్‌ మీడియా జర్నలిస్టుగా అక్షర సేద్యం మొదలుపెట్టారు. ఇలా ఏకకాలంలో అటు రైతుగా, ఇటు పాత్రికేయుడిగా రాణించారు. వ్యవసాయం, లాభసాటి విధానాలు, పంటల యాజమాన్యంలో మేలైన పద్ధతులపై అనేక ఆర్టికల్స్‌ రాశారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో విష్ణు వర్దన్‌ తండ్రి క్యాన్సర్‌ బారిన పడి కన్నుమూశారు. పాత్రికేయుడిగా ఆహారం – ఆరోగ్యంపై ఉన్న అవగాహనతో తన తండ్రి అనారోగ్యానికి రసాయన వ్యవసాయమే కారణమని తెలుసుకున్నారు. తన తండ్రిని తమ నుంచి దూరం చేసిన క్యాన్సర్‌ భూతం.. మరొక కుటుంబంలో విషాదం నింపకుండా అడ్డుకోవాలని సంకల్పించారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ విధానమని తెలుసుకుని.. శ్రీ సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యారు. అలా తెలుసుకున్న విషయాలతో సహజ సేద్యం ప్రారంభించారు. 2017లో ముచ్చింతల్‌ లో జరిగిన పాలేకర్‌ 9 రోజుల శిక్షణా తరగతులకు హాజరై.. ప్రకృతి వ్యవసాయంలో సమగ్ర విషయాలను అవగతం చేసుకున్నారు. రెండు దేశీయ జాతి ఆవులను పోషిస్తూ 18 ఎకరాల్లో అన్ని పంటలను రసాయన రహితంగా, పూర్తి సహజంగా పండించడం మొదలు పెట్టారు. ఇందులో 9 ఎకరాల్లో ఏడాదికి 3 పంటలు తీసే సాగు విధానాలను పాటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కేవలం ఒక పంటకు కట్టుబడి ఉంటే , మార్కెట్‌ ఒడిదుడుకులు.. ప్రకృతి ప్రతికూలతలను తట్టుకోవడం రైతుకి కష్టంగా మారుతుంది అంటారు.. రైతు విష్ణు వర్దన్‌ రెడ్డి. ప్రధాన పంటకు తోడుగా అంతర పంటలు సాగు చేస్తే .. ఒకదాంట్లో నష్టపోయినా, ఇంకొక్కటి గట్టెక్కిస్తుందని చెబుతారు. రైతు అంటే నష్టాలు, ఆత్మహత్యలు అనే మాటలు వినిపిస్తోన్న తరుణంలో వ్యవసాయ విధానంలో మార్పుతోనే ఆ పరిస్థితులను అధిగమించవచ్చని అంటున్నారు… ఈ ప్రకృతి రైతు.

పంటల సాగులో వైవిధ్యం ..

ముత్తాతలు, తాతలు వ్యవసాయం చేసే రోజుల్లో నేలలు సారవంతంగా ఉండేవి. వారు పాటించిన వ్యవసాయ పద్ధతులు అలాంటివి మరి. హరిత విప్లవం తర్వాత వచ్చిన మార్పులతో రసాయన ఎరువులు వినియోగం పెరిగింది. దిగుబడులపైనే దృష్టితో భూసారం తగ్గింది. అలాంటి నేలల్లో తిరిగి మళ్లీ పూర్వ వ్యవసాయ విధానాలు పాటించాలంటే.. ముందుగా నేలలో కర్బణ శాతం పెంచాలని నిర్ణయించుకున్నారు విష్ణు వర్దన్‌ రెడ్డి. పశువులు, గొర్రెలు – మేకల ఎరువు పోశారు. పచ్చిరొట్ట పైర్లు పెంచి కలియదున్నారు. సొంతంగా ఆవులు పెంచి వాటి ద్వారా వచ్చే మూత్రం, పేడతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి నేలకు అందించారు. ఇలా నెమ్మదిగా భూసారం పెంచి.. తర్వాత పంటలపై దృష్టి సారించారు. ఉన్నది ఒకే బోరు. నిత్యం తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి మొదటికే మోసం వస్తుంది. అందుకే… కేవలం ఒక్క వరి పంటకే పరిమితం కాకుండా పంటల వైవిధ్యాన్ని పాటిస్తున్నారు. దేశవాలి వరి రకాలైన కృష్ణవ్రీహి, బ్లాక్‌ రైస్‌ సాగు చేస్తున్నారు. తెలంగాణ సోనా కూడా పండిస్తున్నారు. వీటితో పాటే అతి తక్కువ నీరు అవసరమైన చిరుధాన్య పంటలు కొర్రలు, అండు కొర్రలు, పచ్చ జొన్నలు… అంతర పంటలుగా కందులు, పప్పు శనగలు సాగు చేస్తున్నారు. 

”చిరుధాన్యాలు 6 ఎకరాల్లో సాగు చేస్తాను. కొర్రలు రెండు రకాలు పండిస్తాను. ఎకరాకు మూడున్నర కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వెదజల్లే పద్ధతిలో కలుపు తీయడం సమస్యగా ఉంటుందని, సాళ్ల పద్ధతిలో హై డెన్సిటీ విధానంలో విత్తుతాము. సాలుకి సాలుకి మధ్య ఫీటు దూరం పాటిస్తాము. తద్వారా అంతర కృషి చేసుకోవడానికి వీలవుతుంది. కొర్రలు, అండు కొర్రల్లో.. ఆరు సాళ్ల మధ్య ఒక సాలు కంది సాగు చేస్తాను. ఇది ఆరు నెలల పంట. చిరుధాన్య పంటలు 3 నెలల్లో కోతకు వస్తాయి. ఆ తర్వాత వాటి స్థానంలో పప్పు శనగ సాగు చేస్తాను. ఇది స్వల్పికాలిక పంటే కాబట్టి, కంది.. శనగ రెండు ఒకేసారి చేతికొస్తాయి. ఆ తర్వాత వేసవిలో కూరగాయలు పండిస్తుంటాను. ఇలా ఏడాదికి 3 పంటల సాగులో సాగుతుంటాను. కొర్రలు, అండు కొర్రల పంటలకు పిచ్చుకలు ఎక్కువగా వస్తాయి. డాక్టర్‌ ఖాదర్‌ వలి చెప్పినట్లుగానే మేము ఆ పిచ్చకులను తరమలేదు. అవి వచ్చి పంటపై ఏమైనా పురుగులు ఉంటే ముందు వాటిని తింటాయి. అలాగే పొలాల్లోనే రెట్ట వేస్తాయి. కంకుల మీద కొన్ని గింజలు తిన్నా.. పకక్షులు రావడం ద్వారా వచ్చే నష్టం కంటే కలిగే మేలే ఎక్కువ అని నేను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాను. ఎకరానికి గరిష్ఠంగా కొర్రలు 8 క్వింటాళ్లు, అండుకొర్రలు 12 క్వింటాళ్లు వచ్చాయి. పచ్చ జొన్న ఎకరానికి 10 క్వింటాళ్లు వచ్చాయి. జొన్నలను ప్రాసెస్‌ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి… ఈ పంట కోయక ముందే ఊరి వాళ్లే కొనుగోలు చేస్తారు. కొర్రలు, అండు కొర్రలు మార్కెట్‌లో మంచి ధరకే అమ్మాను. ఇక 3 ఎకరాల్లో దేశవాలి వరి పండించి, మార్కెట్‌లో మంచి ధరకే విక్రయిస్తుంటాను. ఉన్న కొద్ది పాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటు.. ఏడాదికి 3 పంటలు పండిస్తు వ్యవసాయంలో మంచి లాభాలు పొందుతున్నానని” సగర్వంగా చెబుతున్నారు ప్రాకృతిక వ్యవసాయ రైతు విష్ణువర్ధన్‌రెడ్డి.

కాలానికి అనుగుణంగా మార్పు అవసరం. వ్యవసాయానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒకప్పుడు ఒక మోడల్‌ మంచి ఆదాయం ఇచ్చింది కదా అని ఎప్పుడూ విధానాన్ని పాటించలేం. పద్ధతుల్లో కొద్దిగా మార్పులు చేసుకుని, అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటే లాభాలు ఢోకా ఉండదంటారీ ప్రకృతి రైతు. ఇన్నాళ్లూ చిరుధాన్యాలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, వరి, ఉల్లిగడ్డ ఎక్కువగా సాగు చేసిన ఈ రైతు.. ఇప్పుడు సుభాష్‌ పాలేకర్‌ 5 లేయర్‌ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఎన్నో విజయాలను అందుకుని తోటి రైతులకి స్ఫూర్తిగా నిలిచిన విష్ణవర్ధన్‌ 5 లేయర్‌ సాగులోను అద్భుత ఫలితాలు సాధిస్తారని రైతునేస్తం ఆశిస్తోంది. మరిన్ని వివరాలకు విష్ణువర్థన్‌రెడ్డిని ఫోన్‌ 95025 53483 ద్వారా సంప్రదించగలరు.

ఏడాదికి రూ. 10 లక్షల నికర ఆదాయం : విష్ణు వర్దన్‌ రెడ్డి

రసాయన ఎరువులు, పురుగు మందులతో వ్యవసాయం చేసిన రోజుల్లో ఎంత పంట పండినా లాభం మిగిలేది కాదు. పెట్టుబడి అలా ఉండేది. ప్రకృతి వ్యవసాయంలోకి దిగాక, నావరకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెట్టుబడి ఎకరానికి రూ. 20 వేలు మించడం లేదు. నేను పండించిన వరి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలకు మార్కెట్‌లో మంచి రేటు వస్తోంది. పంటల సాగులో వైవిధ్యం పాటించడం ద్వారా ఏడాదికి ఖర్చులన్నీ పోను రూ. 10 లక్షల వరకు నికర ఆదాయం అందుకోగలిగాను. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతోనే నా ఇద్దరు కొడుకులని అమెరికాలో చదివించగలిగాను. ఇప్పుడు వారిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికాలోనే స్థిరపడ్డారు. ఒక రైతుగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది. ఈ పదేళ్ల ప్రకృతి వ్యవసాయంలో అనేక పంటలు పండించాను. వరి, ఉల్లిగడ్డ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు సాగు చేశాను. పంటల ఎంపికలో నిత్యం మార్పులు చేస్తూనే ఉంటాను. రైతులు ఎప్పుడు ఒకే పంట వేయకూడదు. ప్రధాన పంటకు తోడుగా అంతర పంటలు సాగు చేయాలి. ఉన్న వ్యవసాయ భూమి ద్వారా ప్రతి నెలా ఆదాయం వచ్చేలా ప్రణాళికబద్దంగా ముందుకు సాగాలి. ఆవులు పెంచాలి. గో మూత్రం, పేడ వ్యవసాయంలో ఉపయోగించాలి. ముఖ్యంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగానికి స్వస్తిపలకాలి. సొంతంగా కషాయాలు, మిశ్రమాలు తయారు చేసుకోవాలి. చీడ పీడల నివారణకు ప్రకృతిలోనే అనే పరిష్కారాలు ఉన్నాయి. వాటిపై అవగాహన పెంచుకొని, క్రమంగా పాటస్తే వ్యవసాయంలో పెట్టుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. మన పంటలు తిన్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. వెరసి, రైతుగా మనకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యాన్ని పంచామన్న ఆత్మ సంతృప్తి దక్కుతాయి.

Read More

కోళ్ళలో రాణికేట్‌ వ్యాధి (కొక్కెర వ్యాధి)

ప్రస్తుతం లేయర్‌, బ్రాయిలర్‌, దేశవాళి కోళ్ళ ఫారాలలో తరచూ కనబడుతున్న రాణికేట్‌ వ్యాధిని వ్యవహారిక భాషలో కొక్కెర వ్యాధిగా పిలుస్తారు. కొక్కెర వ్యాధి పారమిక్సో తరగతి వైరస్‌ వలన సంక్రమిస్తుంది. అన్ని వయస్సుల కోళ్లకు, అన్ని రకాల కోళ్లలో (అనగా లేయర్స్‌, బ్రాయిలర్స్‌, దేశీ కోళ్లలో) ఈ వ్యాధి వలన అధికంగా మరణాలు సంభవించడమే కాకుండా గుడ్ల ఉత్పత్తి, మాంస ఉత్పత్తులు తగ్గి కోళ్ళ రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఈ కొక్కెర వ్యాధిని తీవ్రస్థాయి వ్యాధిగా గుర్తించడం జరిగింది.

వ్యాధి వ్యాప్తి

1. ఈ వ్యాధి గాలి ద్వారా ఒక కోడి నుండి మరొక కోడికి సంక్రమిస్తుంది. వ్యాధిగ్రస్తమైన కోళ్ల ఫారాల నుండి మరొక కోళ్ల ఫారంకు గాలి ద్వారా వ్యాప్తి చెంది, కోళ్ల ముక్కు రంధ్రాల ద్వారా కాని, నోటి ద్వారా కాని కంటి ద్వారా కానీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. 

2. క్రితం బ్యాచ్‌లలో వ్యాధి సోకినట్లయితే వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3. వ్యాధిగ్రస్తమైన ఫారాల నుండి వచ్చే మనుషులు, వాహనాలు, గుడ్ల పెట్టెలు, గోనె సంచుల వల్ల కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. 

4. వ్యాధిగ్రస్తమైన కోళ్ళ ఫారాల నుండి తొలగించిన కోడి ఎరువు నుండి కూడా వేరొక ఫారం కోళ్లకు సోకుతుంది.

5. దాణా మరియు త్రాగు నీరు కోడి ఎరువుతో కలుషితం అవడం వల్ల కూడా సంక్రమిస్తుంది. 

6. ఫారం పరిసరాలలో దేశీ కోళ్ళు పెంచడం వల్ల, కొంగలు, కాకుల వంటి పకక్షులు ఫారం పరిసరాలలో తిరగడం వల్ల సంక్రమిస్తుంది.

7. ఈ వ్యాధితో మరణించిన కోళ్లను సరిగ్గా నిర్మూలించకపోవడం వల్ల మరొక ఫారంకు సంక్రమిస్తుంది.

వ్యాధి లక్షణాలు

1. వ్యాధిగ్రస్తమైన కోళ్లు నీరసిస్తాయి, దాణా వినియోగం తగ్గుతుంది. నరాల బలహీనతను, ఆకుపచ్చని రెట్టను ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు.

2. కాళ్ల మరియు రెప్పల పక్షవాతం లేదా మెడ ఒకవైపుకు తిరిగినట్టు ఉండే లక్షణాలను ఈ వ్యాధిలో చూడవచ్చు.

3. బ్రాయిలర్‌ కోళ్లు నీరసించి బరువు తగ్గుతాయి.

4. లేయర్‌ కోళ్లలో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గి, తోలు గుడ్లు మరియు పలుచని పెంకు గల గుడ్లను ఎక్కువగా పెడతాయి.

5. తీవ్ర స్థాయి గురక లాంటి శబ్దాలు కూడా ప్రారంభమవుతాయి.

6. వ్యాధి సోకిన కోళ్లలో వాటి మొఖము ఉబ్బి ముక్కు రంధ్రాల గుండా నీరు వలే కారడం మనము గమనించవచ్చు.

7. వ్యాధి తీవ్రతరం అయితే కోళ్లలో మరణాల రేటు అధికంగా ఉంటుంది.

8. చనిపోయిన కోళ్లను కోసి పరిశీలించినట్లయితే ప్రోవెంట్రిక్యులస్‌ నుంచి రక్తపు మరకలను చూడవచ్చు. పేగులో పుళ్ళు ఏర్పడతాయి. గుడ్ల తిత్తులలో కూడా రక్తపు మరకలు/చారికలు చూడవచ్చు.

చికిత్స

1. ఈ వ్యాధి వైరల్‌ వ్యాధి కావడం వల్ల చికిత్స లేనప్పటికీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే లసోటా వ్యాక్సిన్‌ను డ్రాప్‌గా కానీ నీటి ద్వారా కానీ, ఇంజక్షన్‌ రూపంలో కానీ ఇవ్వవలసి ఉంటుంది. దానితో పాటు ఎ, డి3, ఇ, కె విటమిన్లను ఇవ్వాలి.

2. వ్యాధి వ్యాప్తిని వ్యాధి తీవ్రతను తగ్గించడానికి పైరుసిడల్‌ ఏజెంట్లు అయిన బయోబస్టర్‌, బి-904 వంటి మందులను కోళ్ల మీద మరియు ఫారం చుట్టూ పరిసరాలలో పిచికారీ చేసి వైరస్‌ను నిర్మూలించవచ్చు.

నివారణ చర్యలు

1. ఫారంలో క్రితం బ్యాచ్‌లకు వ్యాధి సోకిన సందర్భాలలో ఖచ్చితమైన వ్యాక్సినేషన్‌ విధానాలను అవలంభించాలి.

2. వ్యాధి సోకిన కోళ్లను తీసివేసిన తరువాత తప్పనిసరిగా 6 లేదా 8 వారాల వ్యవధినిచ్చి, పూర్తి స్థాయిలో శుభ్రపరచి, తిరిగి కోళ్ళను కాని, కోడి పిల్లలను గానీ వేయాలి. ఖాళీ షెడ్లను ఫ్యూమిగేషన్‌ విధానంలో శుభ్రపరచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

3. ఫారం పరిసరాలలో వ్యాధి సోకిన సందర్భాలలో నివారణగా ముందస్తు వ్యాక్సిన్లు ఇవ్వాలి (లసోటా వ్యాక్సిన్‌)

4. అవసరాన్ని బట్టి రక్త పరీక్ష చేయడం వల్ల వ్యాధి సంక్రమించక ముందే వ్యాక్సిన్లు ఇవ్వవచ్చు. దాని మూలాన వ్యాధి నివారణ సాధ్యమవుతుంది.

5. కొంగలు, కాకులు వంటి ఇతర పకక్షులు షెడ్లలోనికి ప్రవేశించకుండా షెడ్ల సైడు జాలీల ఖాళీలను సరిచేసుకోవాలి. 

6. లేయర్‌ కోళ్లకు ప్రతీ 5 లేదా 6 వారాలకొకసారి లసోటా వ్యాక్సిన్‌ ఇవ్వాలి. బ్రాయిలర్‌ కోళ్లకు 20 రోజుల వయస్సులో రెండవసారి లసోటా వ్యాక్సిన్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. 

7. కోళ్లలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడి వల్ల వ్యాక్సిన్‌ టైటర్స్‌ తగ్గి వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది.

8. క్రమం తప్పకుండా విటమిన్లు ఇవ్వడంవల్ల టైటర్స్‌ తగ్గకుండా ఉంచవచ్చు.

9. దాణాలో ఉన్న టాక్సిన్‌ల వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధి సంక్రమించవచ్చు కావున క్రమం తప్పకుండా దాణాలో టాక్సిన్‌ బైండర్లను వాడాలి.

10. వ్యాధి సోకి మరణించిన కోళ్ళ నిర్మూలన అత్యంత ముఖ్యమైనది. ఈ వ్యాధి వలన మరణించిన కోళ్ళను కాల్చివేయాలి లేదా కనీసం పూడ్చి వేయాలి.

11. ఫారంలోకి బయటి నుండి వచ్చే మనుషులు, వాహనాల రాకపోకలను నియంత్రించాలి.

12. గుడ్లు, కోళ్ళ వ్యాన్‌లను ఫారంలోకి అనుమతించకూడదు.

13. షెడ్లు లోపల కోళ్లపై క్రమం తప్పకుండా వైరు సిడిల్‌ ఏజెంట్లు అయిన బయోబస్టర్‌ వంటి వాటిని స్ప్రే చేయాలి. షెడ్లు బయటి పరిసరాలలో 10% ఫార్మాలిన్‌ను స్ప్రే చేయడం వల్ల వ్యాధి సోకకుండా నిర్మూలించవచ్చు.

14. వ్యాధిగ్రస్తమైన షెడ్లలోని పీడర్స్‌, డ్రింకర్స్‌, బ్రూడర్స్‌లను వాడేటప్పుడు కాస్టిక్‌ సోడాతో మరియు 10% ఫార్మాలిన్‌తో శుభ్రపరచి వాడుకోవాలి.

15. వ్యాధి సంక్రమించిన షెడ్లలోని లిట్టరుపై 10% ఫార్మాలిన్‌ స్ప్రే చేసి సంచుల్లోకి ఎత్తి ఫారానికి దూరంగా పారబోయాలి.

డా. ఎన్‌. వేణుమాధవ్‌, టీచింగ్‌ ఫ్యాకల్టీ, డా. ఎన్‌. రమ్య, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఎల్‌.ఎఫ్‌.సి), కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌, కోరుట్ల, జగిత్యాల జిల్లా. ఫోన్‌ : 7989846261, 9490448540

Read More

ఖరీఫ్‌లో పంటలనాశించే పురుగుల నివారణకువేసవిలో చేపట్టవలసిన ముందస్తు సస్యరక్షణ చర్యలు

మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కువగా వర్షంపై ఆధారపడి ఉంటుంది. అందువలన రైతులు ఖరీఫ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తారు. ఖరీఫ్‌లో సాగు చేసినప్పుడు, వివిధ చీడ పురుగులు పంటలని ఆశించి నష్టం కలుగచేస్తాయి. వీటి నివారణకి కేవలం పంటకాలంలో రసాయనిక మందులపైనే ఆధారపడకుండా, ముందు జాగ్రత్తగా కొన్ని సస్యరక్షణ చర్యలు వేసవిలో చేపట్టినట్లయితే ఖరీఫ్‌లో వచ్చే చీడపురుగులు కొంతవరకు అదుపులో ఉంచవచ్చు.

పంటల అవశేషాలను తొలగించాలి: ఇంతకు ముందు సాగు చేసిన పంట అవశేషాలను పూర్తిగా తొలగించడం వలన కొన్ని పురుగులు కోశస్థథలను నాశనం చేసి, తర్వాత సాగు చేసే పంటకి ఈ పురుగులు ఆశించకుండా చేయవచ్చు. ప్రత్తిలో చివరిసారి ప్రత్తిని ఏరిన తర్వాత మిగిలిపోయిన, గులాబిరంగు కాయతొలుచు పురుగు ఆశించిన పచ్చికాయలను తినడానికి మేకలను / గొర్రెలను చేలల్లో మేపాలి.

ఉదా: వరిలో ప్రధానమైన కాండము తొలిచే పురుగును, ప్రత్తిలో గులాబిరంగు కాయతొలచు పురుగును పంటల అవశేషాలను తొలగించడం వలన నియంత్రించవచ్చు.

వేసవి దుక్కులు: పంటలను కోసిన తర్వాత మే నెలలో వర్షాలు పడగానే లేదా జూన్‌లో తొలకరి వర్షాలు పడగానే లోతుగా పొలాన్ని  దున్నాలి. లోతుగా దుక్కులు చేసుకున్నట్లయితే ముఖ్యంగా భూమిలోపల ఉండే పురుగుల కోశస్థథలు, కొన్నింటి పిల్లపురుగు థలు బయటపడి ఎండతాకిడికి/పకక్షులతాకిడికి గురై చనిపోతాయి. దీనివలన తర్వాత పంట కాలంలో వీటి ఉధృతి తక్కువగా ఉండేటట్లు చేయవచ్చు.

ఉదా:

  • వరిలో కాండంతొలుచు, రెల్ల రాల్చు, లద్దె పురుగులు
  • ప్రత్తిలో పొగాకు లద్దె, శనగపచ్చ, మచ్చల కాయ తొలుచు పురుగులు
  •  మిరప, టమాట, బెండలో కాయతొలుచు పురుగులు
  • వేరుశనగ పంటలో ఎర్రగొంగళి, శనగపచ్చ, పొగాకు లద్దె పురుగులు
  • గుమ్మడి, బీర, దొండ, కాకర, పొట్లకాయ పంటలలో పండు ఈగ

కలుపు మొక్కలను తొలగించుట: చాలా రకాల పురుగులు ఒకే పంటపైనే కాకుండా ఇతర మొక్కలపైన (కలుపు మొక్కలు) కూడా ఉంటూ వాటి మనుగడ సాగిస్తాయి. ముఖ్యంగా కలుపు మొక్కలను ఆశించి, పురుగులు పంటలు విత్తుకోగానే వాటిని ఆశించి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. అందువలన వేసవిలో ముఖ్యంగా పంటలు విత్తుకునే ముందే కలుపు మొక్కలు లేకుండా చూడాలి.

ఉదా:

  • వరి పంటను సాగు చేసే ముందు గరిక, తుంగ మొదలగు కలుపు మొక్కలను లేకుండా చేయడం ద్వారా వరిలో ప్రధానమైన ఉల్లికోడు, ఆకు ముడత, కంకినల్లి మొదలగు పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు.
  • ప్రత్తిలో వయ్యారిభామ, తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చేయడం ద్వారా పిండినల్లి సమస్యను తగ్గించవచ్చు.
  • పొలం గట్ల మీద, గట్ల ప్రక్కన కలుపు మొక్కలు లేకుండా చేయడం ద్వారా ఎలుకల సమస్యను తగ్గించవచ్చు. ఎలుకల నివారణకి రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఫలితం ఉంటుంది.

పంటకాలాన్ని పొడిగించుట: నీటివసతి సౌకర్యం ఉన్నప్పటికీ, కొన్ని రకాల పంటలను కాలపరిమితికి మించి సాగు చేయకూడదు. ఉదాహరణకి ప్రత్తిలో పంటకాలాన్ని పొడిగించినట్లయితే లేదా కార్శి పంటగా సాగు చేసినట్లయితే, ప్రత్తిలో ప్రధానమైన గులాబిరంగు, కాయతొలిచే పురుగు సమస్య తర్వాత పంటలో చాలా తీవ్రంగా ఉండి నష్టం ఎక్కువగా ఉంటుంది.

పంట విత్తే సమయము – ప్రణాళిక తయారీ: చాలా పంటలలో, పంటను ఆలస్యంగా విత్తినట్లయితే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. కావున పంటలను నిర్ధేశించిన సమయంలోనే విత్తుకొనే విధంగా ప్రణాళికను ముందుగానే తయారు చేసుకోవాలి.

పైన చెప్పిన పద్ధతులను రైతులు ముందస్తు చర్యగా వేసవిలో పాటించినట్లయితే, రాబోవు ఖరీఫ్‌ సాగు కాలంలో వివిధ చీడపురుగుల ఉధృతి నష్టపరిమితి స్థాయిలోపు ఉండి, ఉధృతి మరింత పెరగకుండా చేయవచ్చును. తద్వారా రసాయన పురుగు మందుల పిచికారి ఖర్చు తగ్గించి అధిక నికరాదాయం పొందటానికి ఆస్కారం ఉంటుంది.      

వేపగింజల కషాయం తయారీ

వర్షాకాలంలో సాగు చేసే పంటలపై ఆశించే చీడ పురుగుల నివారణకి వాడుకొనుటకు గాను, వేపగింజలను ముందుగానే సమీకరించుకొని ఎండబెట్టుకోవాలి. వీటి నుంచి వేపగింజల కషాయం తయారు చేసుకొని పురుగులు ఆశించిన తొలిథలో పిచికారి చేసుకోవచ్చు. ఆఖరి దుక్కిలో వేప చెక్కను వేసినట్లయితే పసుపులో దుంపఈగ, మిరపలో నులిపురుగులను నియంత్రించవచ్చు.

గుమ్ముడాల యశస్విని, 

డి. సాయిచరణ్‌,

కూసరి సుప్రియ,

ఈర్ల స్రవంతి,

బి. మాధురి,

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,

రాజేంద్రనగర్‌, ఫోన్‌: 8463976019, 8790392212

Read More

పాడిపశువులలో ఎదను గుర్తించటం, కృత్రిమ గర్భధారణ ప్రాముఖ్యత

పాడి పశువుల ఉత్పాదక శక్తి పశువుల పునరుత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పాడి పశువులలో ఎదను సరైన సమయంలో గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయడం అతి ముఖ్యమైనది. ఇలా చేయడం ద్వారా వలన ఈతల మధ్య వ్యవధి తగ్గి పాడి పరిశ్రమ లాభదాయకంగా కొనసాగుతుంది. యుక్త వయస్సు వచ్చిన ఆడ పశువుల్లో అండాశయంలో ఉత్పత్తి అయిన హార్మోన్ల వలన అసహజమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఈ స్థితిని ఎద అని అంటారు.

దేశవాళి పశువులు 3-4 సంవత్సరాల వయస్సులో ఎదకు వచ్చి 4-5 సంవత్సరాలలో మొదటి ఈత ఈనుతాయి. అదే సంకరజాతి పశువులు ఒకటిన్నర సంవత్సరం వయస్సులోపు ఎదకు వచ్చి 2-3 సంవత్సరాల వయస్సులో తొలి ఈత ఈనుతాయి.  సాధారణంగా పశువులు 3 వారాలకొకసారి ఎదకు వస్తాయి. ఎద కాలం ఆవులలో 18-24 గంటలు, గేదల్లో 24-36 గంటలు ఉంటుంది. ఎద కాలంలోనే పశువులు సంపర్కానికి సిద్దంగా ఉండి మగ పశువుల్ని దాటనిస్తాయి.


పశువుల్లో ఎద లక్షణాలు: 

ఎద కాలం సాధారణంగా మూడు థలుగా విభజించవచ్చును. మొదటి థలో మానం నుండి పలుచని తీగలు వేస్తుంది. రెండవ థలో మానం నుండి కోడిగ్రుడ్డు  తెల్ల సొన లాగ చిక్కగా తీగలు వేస్తుంది. మూడవ థలో అండము విడుదలయి, వీర్య కణముతో కలిసి ఫలదీకరణం చెందుతుంది. గేదేలలో కంటే ఆవులలో ఎద లక్షణాలు తేలికగా గుర్తించవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రత్యేకించి గేదేలలో ఎద కాలం 8-12 గంటలు మాత్రమే ఉంటుంది.


గేదేలలో మూగ ఎద: 

ఆవులలో లాగా గేదెలు ఎద లక్షణాలను స్పష్టంగా బహిర్గతం చేయలేక పోవడాన్ని మూగ ఎద అంటారు. గేదె మానం తెరచి చూస్తే లోపలి పొర ఎర్రగా ఉంటుంది. తీగలు తోకను, మానం పై అతుక్కొని ఆరిపోయి ఉంటాయి. గేదె అరుపు తక్కువ స్థాయిలో ఉంటుంది. మూగ ఎదను టీజర్‌ ఆంబోతు ద్వారా గుర్తించవచ్చు.
ఎదకు రాకపోవటం:

 ఇది రెండు రకాలుగా ఉంటుంది. 1. ఆలస్యంగా పొర్లుకు రావటం 2.ఈనిన తరువాత సకాలంలో ఎదకు రాకపోవటం*    బాహ్య పరాన్నజీవులు, అంతర పరాన్నజీవుల బెడద, వ్యాధుల బారిన పడటం మరియు ఎక్కువ కొవ్వుపట్టిన పశువు ఎదకు సరిగా రాదు.*    వేసవిలో అధిక వాతావరణ ఉష్ణోగ్రత, వడగాల్పు, గాలిలో అధిక తేమ శాతం ఉన్నప్పుడు పశువు ఎదకు రావటం కష్టం.*    పశువు శరీరంలో కాపర్‌, కోబాల్ట్‌, మాంగనీస్‌ మొదలైన ముఖ్యమైన ఖనిజాలు లోపించడం*    పుష్టికరమైన ఆహరం లోపించడం, విటమిన్‌ ‘ఎ’ లోపించడం, అండాశయంలో కాయతో పాటు ఇతర లోపాలు ఏర్పడటం, వ్యాధుల బారిన పడటం, పశువు ముసలిది కావటం, పుట్టుకతోనే కొన్ని లోపాలు సంక్రమించడం, అండాశయం సక్రమంగా వృద్ది చెందకపోవటం.
పశువు సకాలంలో ఎదకు రావాలంటే….

*    పశువులలో పునరుత్పత్తి సామర్థ్యం పెంచుటకు మేపు చాలా ముఖ్యం. పచ్చిగడ్డి కొరత నివారించటానికి సైలేజ్‌ గడ్డిని తయారుచేయడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి.

*    బాహ్య పరాన్నజీవులు,అంతర పరాన్నజీవులను నిర్మూలించాలి.

*    అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల నుండి పశువుల్ని సంరక్షించాలి. పశువు పై నీళ్ళు చల్లుతూ శీతల పరిస్థితిని కల్పించాలి. 

*    పశుపోషకుడు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు (ఈనిన 45 రోజుల తరువాత) పరిశీలిస్తే ఎదలోని పశువుల్ని సులభంగా గుర్తించవచ్చును.

*    మూగ ఎద, బలహీనమైన ఎదల సమస్యలు ఉన్న పశువులకు ప్రతిరోజు 500-1000 గ్రాముల మొలకెత్తిన ఉలవలు, శనగలు, గోధుమలను వంటి ధాన్యాలను 20-30 రోజులు మేపాలి.

*    గర్భకోశ వ్యాధులకు తగిన వైద్యం చేయించి ఫలితాలు పొందాలి వైద్యం చేసిన తరువాత కూడా చూడి కట్టించడం లేకపోయినచో పశువును మంద నుండి తొలగించాలి.

*    విటమిన్‌ ఏ, డి, ఇ లను ఇంజక్షన్‌ రూపంలోనూ, కాపర్‌, భాస్వరం, జింక్‌, సెలీనియం మొదలగు ఖనిజ లవణాలను మినరల్‌ మిక్సర్‌ రూపంలో రోజుకు 50 గ్రాములు అందించాలి.

*    ఎక్కువ కొవ్వు పట్టిన గేదెకు/ఆవుకు సరిపోను వ్యాయామం కల్పిస్తే చాలు చురుకుగా తయారయ్యి పశువులు ఎదకు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.

*    పశువు ఈనడానికి రెండు మాసాలు ముందు నుండి పాలు పితకడం మాని వేసినచో ఈనిన తర్వాత ఎదకు తొందరగా రావచ్చును. సైక్లోమిన్‌ బిల్లలను వారానికి ఒకటి చొప్పున పశువులు ఎదకు వచ్చేంతవరకు ఇవ్వాలి. జెనోవా లేక ప్రజానా మందులను రోజుకు మూడు చొప్పున రెండు రోజులు వాడాలి.

*    పశువు ఈనిన తర్వాత మొదటి సారి 11 నుండి 17 రోజుల్లో ఎదకు వస్తాయి కానీ ఆ రెండవ సారి 35 నుంచి 45 రోజుల్లో ఎదకు వచ్చినప్పుడు చూడి కట్టిస్తే 90% పశువుల్లో చూడి నిలిచే అవకాశాలు ఉంటాయి.

*    పశువులలో హార్మోన్‌ లోపాలు ఉన్నవని గ్రహించినచో  హార్మోన్లు వాడి పశువులను ఎదకు తేవచ్చును.

*    పశు గర్భకోశ ద్వారంలోకి లుగాల్స్‌ అయోడిన్‌ పంపించి అండాశయాన్ని సున్నితంగా మర్దించి చురుకుగా తయారు చేయించినచో పశువు ఎదకు రావచ్చును.

ఎదలో ఉన్నప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

*    రైతులు తమ పశువు ఎద లక్షణాలను గుర్తించి సరైన సమయంలో గర్భధారణ చేయించినచో సకాలంలో గర్భం ధరించి, తిరిగి సకాలంలో పాల ఉత్పత్తి మొదలవుతుంది.

*    పశువు ఈనిన 45 రోజుల తర్వాత వచ్చే మొదటి ఎదలో గర్భధారణ చేయించినచో చూడి నిలిచే శాతం అధికంగా ఉంటుంది. గర్భధారణ చేయించిన తరువాత 17 నుండి 26 రోజుల మధ్య క్రమం తప్పకుండా పశువును జాగ్రత్తగా పరిశీలించి తిరిగి ఎదకు వచ్చినదీ లేనిది నిర్ణయం తీసుకొని, అవసరమైనచో తిరిగి గర్భధారణ చేయించాలి.

*    రైతులు పశువు మొదటి ఎదకాలం జాగ్రత్తగా గమనించి వెంటనే గర్భధారణ చేయించడం మంచిది.*    మూగ ఎదకు వచ్చిన పశువులలో ఎద మామూలు కాలం కన్నా ఎక్కువ కాలం ఉండవచ్చును అందుచేత రెండవసారి ఇన్సెమినేషన్‌ చేయించవలసి వస్తే చేయించాలి.

 *    కొన్ని పశువులలో ఎద36 గంటలు దాటి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉండవచ్చును. కనుక గర్భధారణ చేసిన తర్వాత పశువును మూడు నుంచి నాలుగు రోజులు జాగ్రత్తగా గమనించి అవసరమైనచోతిరిగి గర్భధారణ చేయించాలి.

*    10 నుండి 15 శాతం పశువులు ఎక్కువగా గేదేలలోను, సంకరజాతి పశువులలోను ఎదకు వచ్చిన 7 నుండి 10 రోజుల లోపు మళ్ళీ వస్తాయి (ఐచీజిరిశి నీలిబిశి). కనుక గర్భధారణ చేసిన ఏడవ రోజు నుండి పదవ రోజు వరకూ పశువును జాగ్రత్తగా పరిశీలించి అవసరమైనచో గర్భధారణ చేయించాలి.

*    అరుదైన సందర్భాలలో 4 నుంచి 5 రోజులలో లేక ప్రతి వారం అస్తవ్యస్తంగా పశువులు ఎదకు వస్తాయి.

 *    కొన్ని సందర్భాలలో 3 నుంచి 5 నెలల చూడి కాలంలో పశువులు ఎదకు వస్తాయి. దీనిని చూడి ఎద అని అంటారు. గర్భధారణ చేయించకూడదు. రైతులు పశువుల ఎద లక్షణాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం సకాలంలో చూడి కట్టించుటకు ఇది చాలా అవసరం.

*    గర్భధారణ ఎద మధ్య థ నుండి చివరి థ వరకు చేయించవచ్చు. ఈ థలో చూడి కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

*    పశువు అరవగానే వీర్య దానం చేయించరాదు. ఎద మొదలైన 12 గంటల తర్వాత గర్భధారణ చేయించాలి అనగా ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం గర్భధారణ చేయించాలి. ఆరు గంటల తేడాతో రెండుసార్లు గర్భధారణ చేయిస్తే ఫలితాలు బాగుంటాయి.గేదేలలో ఎద కాలం 24 నుంచి 36 గంటలు ఉంటుంది. అది ఎదకు వచ్చిన 24 గంటల తర్వాత వీర్యదానం చేయించాలి అనగా ఉదయం ఎదకు వచ్చిన మేరకు మరుసటి రోజు ఉదయం సాయంత్రం వరకు వచ్చిన గేదెకు మరుసటి రోజు సాయంత్రం చూడి కట్టించాలి.చూడి కట్టించడం ఆలస్యం చేస్తే కట్టు నిలిచే అవకాశాలు తగ్గిపోతాయి.

*    సరైన సమయంలో గర్భధారణ చేస్తే 70 శాతం పశువులు మొదటి సారే చూడి కడతాయి.

 *    పశువులు ఎదకు రావడానికి వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ తక్కువగా ఉన్న సమయాలు మిక్కిలి అనుకూలంగా ఉంటాయి.

*    సహజ సంపర్కం: ఒక ఆవునుగానీ, గేదెనుగానీ ఎదకు వచ్చినప్పుడు ఆబోతు చేతగాని/ దున్నపోతు చేతగాని దాటించి గర్భధారణ చేయడాన్ని సహజ సంపర్కం అంటారు. ఈ పద్ధతి పూర్వకాలం నుండి ఆచరణలో ఉన్న పద్ధతి.

*    కృత్రిమ గర్భోత్పత్తి : మేలు జాతి ఆబోతు వీర్యాన్ని పరికరాల సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఆడ పశువు గర్భకోశంలో సకాలంలో ప్రవేశపెట్టి గర్భం ధరించేటట్లు చేసే ప్రక్రియనే శాస్త్రీయ గర్భోత్పత్తి లేదా కృత్రిమ గర్భధారణ అంటారు.


కృత్రిమ గర్భధారణ లాభాలు :

*    పాల దిగుబడులు పెంచుటకు అధిక పాల దిగుబడి ఇచ్చే మేలుజాతి పశువులను ఉత్పత్తి చేయడానికి కృత్రిమ గర్భధారణ పద్ధతి అనుసరించాలి.

*    తక్కువ ఖర్చుతో జాతిని మెరుగుపరచి అధిక పాల దిగుబడి పొందవచ్చు.

*    అధిక పాల సార కలిగిన ఆంబోతుల వీర్యాన్ని ప్రపంచంలోని ఏ మూల నుంచైనా తెచ్చుకొనవచ్చు.

*    మినీ డెయిరీలలో ఆబోతు మేపటం ఖర్చుతో కూడుకున్న పని. గర్భధారణ వల్ల తక్కువ ఖర్చుతో చూడి కట్టించుకొనవచ్చు.

*    కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఆబోతులకు ఉండే సుఖవ్యాధులు లేదా ఆవులలోని గర్భకోశ వ్యాధులు, ఆంబోతుల ద్వారా ఇతర పశువులకు సంక్రమించకుండా నిరోధించవచ్చు. 


గర్భధారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు 

*    ఎద లక్షణాలు కనిపించగానే పశువును వేరు చేసి కట్టి ఉంచాలి.

*    తొలిసారి గర్భధారణ చేసే పడ్డలు/పెయ్యలు బాగా బలంగా ఉండి, తగిన ఎత్తు పెరిగి ఉండాలి. సుమారుగా ఆవు దూడలు 200 నుండి 250 కిలోల బరువు, గేదె దూడలు 250 నుంచి 300 కిలోల బరువు ఉంటే మంచిది.*    ఆరోగ్యంగా ఉన్న పశువులకు మాత్రమే గర్భధారణ చేయించాలి. 

*    అనారోగ్యంగా ఉన్న పశువులకు, తగినంత బలంగా లేని పశువులకు, గర్భవాతం ఉన్న పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించరాదు.

*    పాడి పశువులు వేసే తీగలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎద మధ్య థ నుండి చివరి థ వరకు పశువు మానం నుండి తీగలు బాగా వేస్తుంది. తీగలు తొడ పైన, తోకకు అంటుకొని మెరుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో గర్భధారణ చేయించి మంచి ఫలితాలను పొందవచ్చు.

*    ఇన్సెమినేషన్‌ చేసేముందు,  చేసిన తర్వాత పశువుకు విశ్రాంతినిచ్చి బెదరకుండా చూడాలి. పశువును కొట్టడం,  పరిగెత్తించడం చేయ కూడదు. ఉద్రేకానికి గురికాకుండా మూడు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి.

*    కృత్రిమ గర్భధారణ చేసే పశువును ఏకాంతంగా చల్లని ప్రదేశంలో ఉంచటం మంచిది.

 *    వీర్యదానం చేయించగానే చల్లని నీరు శరీరంపై చల్లడం మంచిది.

*    వీర్య దానం చేసిన తర్వాత 3 నుంచి 4 రోజుల వరకూ,15 నుంచి 26 రోజుల మధ్య, 38 నుంచి 48 రోజుల మధ్య పశువు ఎదకు వచ్చుచున్నది లేనిది గమనించాలి. ఎదకు రాకుంటే 60 రోజుల తర్వాత చూడి పరీక్ష చేయించాలి. 

*    కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ, పశువును తిరిగి ఎద గురించి పరిశీలించవలసిన తేదీలు, చూడి పరీక్షకు తీసుకువెళ్ళవలసిన తేదీలు రాసి పెట్టుకోవాలి. 


టి. విజయ నిర్మల, శాస్త్రవేత్త, ఫోన్‌: 8121136184; 

ఎ. దేవివరప్రసాద్‌రెడ్డి, శాస్త్రవేత్త, 

కె. వెంకట సుబ్బయ్య, శాస్త్రవేత్త, 

ఇ.కరుణశ్రీ, ప్రధాన శాస్త్రవేత్త 

బి. శ్రీనివాసులు, విస్తరణ సంచాలకులు, 

కృషి విజ్ఞాన కేంద్రం, డా. వై.ఎస్‌.ఆర్‌, ఉద్యాన విశ్వవిద్యాలయం,

వెంకటరామన్నగూడెం, ప.గో. జిల్లా. 

Read More

ఆఫ్‌ సీజన్‌ కల్టివేషన్‌ (రక్షిత సాగు)

ఆఫ్‌ సీజన్‌లో పంటల సాగును ఎలా చేస్తారు. ఇది ప్రధానంగా వేసవిలో తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు పంట ఉత్పాదకత చాలా కష్టంగా ఉంటుంది. ఫలితంగా, పాలీహౌస్‌ లేదా రక్షిత సాగు  ద్వారా పంటలు పండించవచ్చు. పాలీహౌస్‌ వ్యవసాయం అనేది అధిక-విలువైన, ప్రత్యేకమైన పంటల యొక్క ప్రత్యేక, నియంత్రిత పర్యావరణ సాగు, అధిక మార్కెట్‌ ధరలను పొందవచ్చు (కత్తిరించిన పూలు, ఆఫ్‌-సీజన్‌లో పండించిన కూరగాయలు, తక్కువ-సీజన్‌ ఆకుకూరలు, మైక్రోగ్రీన్‌లు మొదలైనవి). గ్రీన్‌హౌస్‌లో పండించిన పండ్లకు ప్రజలు అధిక ధరలను చెల్లించగలరు కాబట్టి, మీరు అధిక-స్థాయి వినియోగదారులకు ఆరోగ్యకరమైన, పురుగుమందులు లేని తాజా ఉత్పత్తులను పండించి అందించవచ్చు.

భారతదేశంలో, పాలీహౌస్‌ వ్యవసాయం నెమ్మదిగా ప్రజాదరణ పొందుతోంది. పాలీహౌస్‌ వ్యవసాయం రైతుకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే, చాలా మందికి పాలీహౌస్‌ లేదా గ్రీన్‌హౌస్‌ అంటే ఏమిటో తెలియదు, కాబట్టి ఈ ఆర్టికల్‌లో, పాలీహౌస్‌లు మరియు దాని ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని మేము వివరిస్తాము.
పాలీహౌస్‌ అంటే ఏమిటి?

పాలీహౌస్‌, తరచుగా గ్రీన్‌హౌస్‌ అని పిలుస్తారు, ఇది గాజు లేదా పాలిథిలిన్‌ వంటి పదార్థాలతో నిర్మించిన భవనం లేదా నిర్మాణం, దీనిలో మొక్కలు నియంత్రిత పర్యావరణ పరిస్థితులలో పెరుగుతాయి మరియు అభివృద్ధి చెందుతాయి. నిర్మాణం యొక్క పరిమాణం డిమాండ్‌ను బట్టి చిన్న గుడిసెల నుండి పెద్ద నిర్మాణాల వరకు ఉంటుంది. అన్నింటికంటే మించి, గ్రీన్‌హౌస్‌ అనేది ఒక గాజు నిర్మాణం, దీని ఇంటీరియర్‌లు సూర్యరశ్మికి గురైనప్పుడు వేడెక్కుతాయి, ఎందుకంటే నిర్మాణం గ్రీన్‌హౌస్‌ వాయువు బయటకు రాకుండా చేస్తుంది. బయట గడ్డకట్టే సమయంలో, మొక్కలు జీవించడానికి లోపల ఉష్ణోగ్రత తగినంత వెచ్చగా ఉంటుంది.
గ్రీన్‌హౌస్‌, పాలీహౌస్‌ ఫార్మింగ్‌ మధ్య వ్యత్యాసం:

పాలీహౌస్‌ అనేది ఒక రకమైన గ్రీన్‌హౌస్‌ లేదా మరొక విధంగా చెప్పాలంటే, పాలిథిలిన్‌ కవర్‌తో కూడిన గ్రీన్‌హౌస్‌ యొక్క చిన్న వెర్షన్‌. చవకైన నిర్మాణ ఖర్చులు మరియు నిర్వహణ సౌలభ్యం కారణంగా పాలీహౌస్‌ వ్యవసాయం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక ప్రముఖ గ్రీన్‌హౌస్‌ పద్ధతి. 
పాలీహౌస్‌లో పండే పంటలు:

*    పండించదగిన పండ్లు స్ట్రాబెర్రీ మొదలైనవి.

*    క్యాబేజీ, బిట్టర్‌ గోర్డ్‌, క్యాప్సికమ్‌, ముల్లంగి, క్యాలీఫ్లవర్‌, మిరపకాయ, కొత్తిమీర, బచ్చలికూర, టొమాటో, దోసకాయ మొదలైనవి పండించదగిన కూరగాయలు.

*    కార్నేషన్‌, జెర్బెరా మరియు ఆర్చిడ్‌ వంటి పువ్వులను కూడా సులభంగా పెంచవచ్చు
పాలీహౌస్‌ వ్యవసాయం యొక్క ప్రయోజనాలు:

ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ఇష్టపడే రైతులకు పాలీహౌస్‌ ఎంతో మేలు చేస్తుంది. పాలీహౌస్‌ యొక్క కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:

*    మొక్కలను నియంత్రిత ఉష్ణోగ్రతలో పెంచడం వల్ల పంట నష్టం లేదా నష్టం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

*    మీరు ఏడాది పొడవునా పంటలను పండించవచ్చు మరియు ఏదైనా నిర్దిష్ట సీజన్‌ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

*    పాలీహౌస్‌లో తెగుళ్లు మరియు కీటకాలు తక్కువగా ఉంటాయి.

*    బాహ్య వాతావరణం పంటల పెరుగుదలపై ఎలాంటి ప్రభావం చూపదు.

*    పాలీహౌస్‌లో ఉత్పత్తి యొక్క నాణ్యత స్పష్టంగా ఎక్కువగా ఉంటుంది.

*    పాలీహౌస్‌లో అలంకారమైన పంటల ప్రచారం కూడా అప్రయత్నంగా చేయవచ్చు.

*    పాలీ హౌస్‌ ఏ సీజన్‌లోనైనా మీ మొక్కలకు సరైన పర్యావరణ సౌకర్యాలను అందిస్తుంది.

*    ఇది దాదాపు 5 నుండి 10 రెట్లు దిగుబడిని కూడా పెంచుతుంది.

*    తక్కువ పంట కాలం

*    ఎరువులు వేయడం సులభం మరియు బిందు సేద్యం సహాయంతో స్వయంచాలకంగా నియంత్రించబడుతుంది.


పాలీహౌస్‌ రకాలు: 

పర్యావరణ నియంత్రణ వ్యవస్థల ఆధారంగా పాలీహౌస్‌లు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి:

*    సహజంగా వెంటిలేషన్‌ చేయబడిన పాలీహౌస్‌ – ఈ రకమైన పాలీహౌస్‌ లేదా గ్రీన్‌హౌస్‌లో ప్రతికూల వాతావరణం మరియు సహజ తెగుళ్లు మరియు అనారోగ్యాల నుండి పంటలను రక్షించడానికి తగిన వెంటిలేషన్‌ మరియు ఫాగర్‌ సిస్టమ్‌ మినహా పర్యావరణ నియంత్రణలు లేవు.

*    పర్యావరణపరంగా నిర్వహించబడే పాలీహౌస్‌లు – ఈ నిర్మాణాలు కాంతి, ఉష్ణోగ్రత, తేమ మరియు ఇతర కారకాలను నియంత్రించడం ద్వారా పంటల పెరుగుతున్న సీజన్‌ను విస్తరించడానికి లేదా ఆఫ్‌-సీజన్‌ దిగుబడిని పెంచడానికి రూపొందించబడ్డాయి.


ముగింపు: 

ఓపెన్‌ ఫీల్డ్‌ ఫార్మింగ్‌తో పోలిస్తే పాలీహౌస్‌ లేదా గ్రీన్‌హౌస్‌ ఫార్మింగ్‌లో దిగుబడి 4-8 రెట్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఫలితంగా, రైతులు బహిరంగ పొలాల్లో పని చేయకుండా, పాలీహౌస్‌ నిర్మించడాన్ని పరిగణించవచ్చు. ఉదాహరణకు సంగారెడ్డి ప్రాంతంలోని రైతులు, వర్షపాతం మరియు ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పుడు మే నుండి ఆగస్టు వరకు పాలీ హౌస్‌లలో టమోటాలు పండించడం ద్వారా అధిక రాబడిని సాధించారు. 

ఎం. భార్గవ్‌ రెడ్డి, యంగ్‌ ప్రొఫెషనల్‌-2,

నేషనల్‌ అకాడమి ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌,

ఫోన్‌: 9550821522;

బి. గౌతమి, పి.హెచ్‌.డి. స్కాలర్‌,

ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IARI), న్యూఢిల్లీ, ఇండియా. 

Read More

వేసవి అపరాల సాగుకు అనువైన రకాలు మెలకువలు

మన తెలుగు రాష్ట్రాల్లో పండించే అపరాల్లో పెసర, మినుము ముఖ్యమైనవి. సుమారుగా 65-80 రోజుల్లో కోతకు వచ్చే ఈ పంటలు 1.5 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతున్నది. సాగు నీటి లభ్యత ఎక్కువగా ఉండటం వలన రైతులు వేసవి పప్పుధాన్యాల సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటలు తక్కువ కాల పరిమితి కల్గి ఉంటం వల్ల మరియు తక్కువ నీటి వసతి ఉన్నచోట కూడా పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని కాలాల్లో పండించే ఈ పప్పు దినుసులు మన ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.


మానవ శరీరానికి అవసరమైన మాంసకృత్తులు, ఖనిజ లవణాలను అందించడమేకాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పుదినుసులు తలసరిగా రోజుకు 80 గ్రా. తీసుకోవలసి ఉండగా ప్రస్తుతం కేవలం 31 గ్రా. మాత్రమే అందుబాటులో వున్నాయి. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రస్తుతం మన భారతదేశం 3 మిలియన్‌ టన్నుల అపరాలను దిగుమతి చేసుకుంటుంది. పెసర, మినుము మనకు కావాల్సిన మాంసకృత్తులు అందించడమే కాకుండా పంట మార్పిడి జరిగి భూసారం పెరిగి ప్రధాన పంటల్లో స్థిరమైన దిగుబడి సాధించుటకు దోహదపడుతుంది.

మినుము, పెసర సాగులో సమస్యలు:

*    అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోకపోవడం నిస్సారమైన భూముల్లో వర్షాధారంగా సాగుచేయడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, చౌడు విస్తీర్ణం పెరగటం

*    సరైన సమయంలో కలుపు నివారణ చేయకపోవటం వరి మాగాణుల్లో ఊద మరియు బంగారు తీగ ప్రధాన సమస్య

*    తెగుళ్ళకు, పురుగులకు లొంగిపోవటం- తెగుళ్ళల్లో పల్లాకు, మొవ్వుకుళ్ళు, ఆకుముడత, ఎండు తెగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు మరియు పురుగుల్లో మారుకా మచ్చల పురుగు, రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు ప్రధాన నష్టాన్ని కలుగజేస్తున్నాయి.

*    పండించిన పంటకు సరైన ధర రాకపోవడం. కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తే, వాణిజ్య పంటలతో పోటీగా ఆదాయాన్ని పొందవచ్చు.
వేసవి పెసర/మినుము సాగు అవకాశాలు: 

ఈ అపరాల సాగుకు సుమారు 300 మి.మీ. నీరు అవసరం ఉంటుంది. కొద్దిపాటి నీటిసదుపాయం ఉన్న రైతులు కీలక థల్లో 3-4 నీటితడులు ఇచ్చినట్లయితే ఈ పంటలను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. వాణిజ్య పంటలైనటువంటి ప్రత్తి, మిరప, పసుపు అలాగే యాసంగి మొక్కజొన్న, వేరుశనగ, వరి తీసిన తరువాత ఖాళీగా ఉన్న భూముల్లో పెసర, మినుము సాగుచేయవచ్చు. వేసవిలో సాగుచేసే పెసర, మినుము పంటల్లో చీడపీడల బెడద తక్కువగా ఉండటం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు.
నేలలు: 

నీటి వసతి కలిగిన ఎర్ర నేలలు, సారవంతమైన మురుగు నీరుపోయే సౌకర్యం గల నల్ల నేలలు కూడా అనుకూలం. నీరు బాగా ఇంకి తేమను పట్టి ఉంచే మధ్యస్థ బరువైన నేలలు అనుకూలమైనవి. సమస్యాత్మక భూములు ముఖ్యంగా చౌడు భూములు ఈ పంటల సాగుకి పనికిరావు.

అనువైన రకాలు: 

పెసర: యంజిజి-295, యంజిజి-347, యంజిజి-348, యంజిజి-351, యంజిజి-385, డబ్ల్యుజిజి-37, డబ్ల్యుజిజి-42, ఐపియం-2-14, టియం-96-2.; మినుము: యంబిజి-207, డబ్ల్యుబిజి-26, పియు-31, ఎలిబిజి-752, ఎల్బిజి-787, టిబిజి-104, జిబిజి-1
వేసవికి అనుకూలమైన పెసర రకాలు – లక్షణాలు :

యంజిజి-295: కాపు పైభాగాన గుత్తులుగా వస్తుంది. గింజ మధ్యస్థ లావుగా ఉండి, సాదాగా ఉంటుంది. మొవ్వుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. పంట కాలం 65-70 రోజులు, దిగుబడి: 5-6 క్వి/ ఎకరానికి.

యంజిజి-347: కాపు పైభాగాన ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. ముదురు ఆకుపచ్చ మరియు సాదా గింజలు. పల్లాకు తెగులు మరియు బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి : 5-6 క్వి/ఎకరం.

యంజీజీ-348: గింజ మధ్యస్థ లావుగా ఉండి, లేత ఆకుపచ్చలో సాదాగా ఉంటుంది. బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం : 65-70 రోజులు. దిగుబడి: 5-6 క్వి/ఎకరం.

యంజిజి-351: లేత ఆకుపచ్చ, సాదా, మధ్యస్థ లావు గింజ ఉండి, పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 70 రోజులు. దిగుబడి 6-6.5 క్వి/ఎకరం.

యంజిజి-385: మొక్కలు నిటారుగా, గుబురుగా పెరిగి కాయలు గుత్తులుగా వ్యాపించి ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. గింజలు మధ్యస్థ లావుగా, ముదురు ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటాయి. మొవ్వుకుళ్ళును, ఆకుముడతను సమర్ధవంతంగా తట్టుకుంటుంది. పంట కాలం : 70-76 రోజులు. దిగుబడి 6-6.4 క్వి/ఎకరం.

డబ్ల్యుజిజి-37: గింజ మెరుస్తూ మధ్యస్థ లావుగా ఉండి, ఒకేసారి కాపుకు వచ్చి పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.

డబ్ల్యుజిజి -42: పొడవైన కాయలు, లావు పాటి మెరుపు గింజలు కలిగి, పల్లాకు తెగులును సమర్ధవంతంగా తట్టుకునే రకం. పంట కాలం 55-60 రోజులు. దిగుబడి 4-5 క్వి/ఎకరం.

టీయం-96-2: గింజలు లావుగా ఉండి, బూడిద తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. వరి మాగాణుల్లోకి అనువైనది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.

ఐపియం-2-14: మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వచ్చి, మధ్యస్థ లావు గింజలు కలిగి, పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి : 5-6క్వి/ఎకరం.
వేసవికి అనుకూలమైన మినుము రకాలు – లక్షణాలు

యంబిజి-207: పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 7.2-8 క్వి/ఎకరం. వరి మాగాణులకు అనువైన రకం.

డబ్ల్యుబిజి-26: అన్ని కాలాలకు అనువైన సాదా రకం. కణుపుల మధ్య దూరం తక్కువ. గుత్తుల కాడ చిన్నగా ఉండి, కాయలు ఎక్కువ. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. దిగుబడి 4-4.8 క్వి/ఎకరం.

పియు-31: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకునే సాదా రకం. కాయల మీద నూగు ఉంటుంది. తక్కువ కాల పరిమితి గల రకం. పంటకాలం 65-70 రోజులు. దిగుబడి 6-6.8 క్వి/ఎకరం.

యల్బిజి-752: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొనే పాలిష్‌ రకం. వరి మాగాణుల్లో ఆలస్యంగా విత్తుకొనుటకు అనువైన రకం. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 8-8.5 క్వి/ఎకరం.

ఎల్బిజి-787: అన్ని కాలాలకు అనువైన, మధ్యస్థ కాల పరిమితి కలిగి పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. కాయలు ప్రధాన కాండం మీద కణుపుల వద్ద కూడా కాస్తాయి. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 8.0-8.8 క్వి/ఎకరం.

టిబిజి-104: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకొనే పాలిష్‌ రకం. కాయలపై నూగు ఉంటుంది. పంట కాలం 70-75 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.

జిబిజి-1: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకం. కాయలపై నూగు ఉంటుంది. పంట కాలం 70-75 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.
నేల తయారీ: యాసంగి పంట తీసేసిన తరువాత కలుపు మొక్కలు, పంట అవశేషాలు లేకుండా నేల విత్తుటకు సిద్ధం చేయాలి. భూమిని 2-3 సార్లు బాగా దున్ని, 2 సార్లు గుంటక తోలి, చదును చేయాలి. వీలైతే ఒక నీటి తడి ఇచ్చి కూడా విత్తనాన్ని విత్తుకోవచ్చు.

విత్తనం/విత్తే పద్ధతి: ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసర ముంటుంది. గొర్రుతో సాళ్ళ మధ్య 22.5-25 సెం.మీ. (9-10 అంగుళాలు), మొక్కల మధ్య 10 సెం.మీ. (4 అంగుళాలు) ఉండేలా వరుసల్లో విత్తుకోవాలి.
విత్తే సమయం: వేసవిలో సాగుచేయడానికి ఫిబ్రవరి నుండి మార్చి మొదటి పక్షం వరకు పెసర, మినుము పంటలు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పూత, కాయ థల్లో ఉష్ణోగ్రత పూత రాలటం, గింజ కట్టడం వంటి సమస్యల దిగుబడి తగ్గే ప్రమాదముంది. 19

కలుపు యాజమాన్యం:  విత్తిన 25 రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.

అంతరకృషి: విత్తనం ఎద బెట్టిన పంటల్లో సాళ్ళ మధ్య గొర్రుతో కాని, గుంటకతోగాని 20-25 రోజుల సమయంలో అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపు నివారించబడి పంట ఏపుగా పెరుగుతుంది. అదే విధంగా బెట్ట పరిస్థితుల నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు. 

కసనబోయిన క్రిష్ణ, పిహెచ్‌.డి. స్కాలర్‌,

ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

 జి. పరిమళ, బాదవత్‌ కిషోర్‌, పిహెచ్‌.డి. స్కాలర్‌,

బిధాన్‌ చంద్ర కృషి విద్యాలయం, మోహన్‌పూర్‌, వెస్ట్‌ బెంగాల్‌; 

నందిగాం స్వాతిరేఖ, పిహెచ్‌.డి. స్కాలర్‌,

ఆచార్య ఎన్‌.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌

Read More

విత్తుకొద్దీ పంట… సారంకొద్దీ ఆరోగ్యం

పంటల సాగులో విత్తనాలది ప్రముఖ పాత్ర అనే విషయం అందరికీ తెలిసిందే. పంటల సాగుకు సంబంధించి మిగతా అన్ని అంశాలు సక్రమంగా ఉండి విత్తనాలు నాణ్యమయినవి ఉపయోగించకుంటే ఫలితాలు సక్రమంగా రావు. భూమిలో ఉండే పోషకాలను గ్రహించే శక్తి ఆ విత్తనాలకు ఉండాలి. సహజంగా ప్రకృతి సిద్ధంగా పెరిగిన విత్తనాలకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి రోడ్ల వెంబడి, పొలం గట్ల మీద, పొలంలో మొలిచే కలుపు మొక్కలు, కొండలమీద, అడవులలో పెరిగే మొక్కలు… ఇలాంటివి అన్నీ పరిశీలిస్తే…. ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి పోషక లోపం లేకుండా, ఎలాంటి చీడపీడలు ఆశించకుండా వాటి పరిధిలో అవి పెరుగుతూ తగినంత దిగుబడిని లేదా ఫలసాయాన్ని అందిస్తుంటాయి. కాని మనం రైతు స్థాయిలో వేసే విత్తనాలకి మాత్రం బయట నుంచి అన్నీ అందించవలసిన పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి అని రాజు ఆలోచించసాగాడు.

ఇందుకు ప్రధాన కారణం ఏమిటి? రైతులు మొదటి నుండి ఈ సమస్యలు ఎదుర్కొన్నారా? లేక ఇటీవలే ఈ పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందా? అనే విషయాలు అధ్యయనం చేస్తే.. వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలు ప్రవేశపెట్టకమునుపు చాలావరకు విత్తనాలు రైతుస్థాయిలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే రైతుల ద్వారా చేతులు మారుతుండేవి. అప్పుడు అందుబాటులో ఉన్న విత్తనాలు అన్నీ నాటురకాలే. అవి చీడపీడలను తట్టుకుంటూ, వాటి పరిధిలో అవి దిగుబడులను ఇస్తూ ఉండేవి. కానీ పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలను తీర్చే లక్ష్యంతో అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలను అభివృద్ధి చేసి వాటిని ఉపయోగించటం మొదలయ్యింది. అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలను సాగు చేసినట్లయితే అందుకు అవసరమైన పోషకాలను కూడా అందించగలిగినపుడే సరైన దిగుబడి వచ్చేది. లేనట్లయితే సరైన దిగుబడి వచ్చేది కాదు. ఆవిధంగా విత్తనాల స్వచ్ఛతను కోల్పోయాము కాబట్టే రైతులు తమ సాగుని లాభాల బాటలో నడిపించలేకపోతున్నారు.

పంటలసాగు లాభాల బాటలో నడిపించాలంటే రసాయనాలను దూరం పెట్టడముతో పాటు విత్తనాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించి సూటి రకాలు లేదా నాటు రకాలు ఉపయోగించగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు, అధికారులు, అనుభవజ్ఞులు ప్రచారం చేస్తుండగా రైతులు నెమ్మదినెమ్మదిగా నాటు విత్తనాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇదే కోవకు చెందుతారు నాగర్‌కర్నూలు జిల్లా, గుమ్మకొండకు చెందిన బైరిపాగ రాజు.రాజుది వ్యవసాయ నేపథ్యం. తోటి రైతుల లాగానే రాజు కూడా తన పంటల సాగులో వివిధ రకాల హైబ్రిడ్‌ విత్తనాలను, రసాయనాలను వినియోగిస్తూ తన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండడం లేదు, పంటల సాగులో పెట్టుబడులు పెరిగి కొన్నిసార్లు నష్టాలను చవిచూడవలసి వస్తుంది. నష్టాల సాగుని కొనసాగించలేక పరిష్కార మార్గాలవైపు ఆలోచిస్తుండగా ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసింది. అదే సమయంలో అంటే 2014 వ సంవత్సరం సుభాష్‌ పాలేకర్‌ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ సదస్సుకు హాజరయ్యి అక్కడ తెలుసుకున్న విషయాలతో తన రసాయనిక సేద్యాన్ని ప్రకృతి సేద్య విధానంలోకి మార్చాలని నిర్ణయం తీసుకుని అటువైపు అడుగులు వేసి 2014వ సంవత్సరం నుండి తన సాగులో రసాయనాలు ఆపివేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించడం మొదలు పెట్టారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో ప్రధానమయినవి నాటు విత్తనాలు మరియు ఆవు వ్యర్థాలు కాబట్టి వీటిని తప్పకుండా ఉపయోగిస్తూ వస్తున్నారు.మొత్తం 8 ఎకరాలలో వివిధ రకాల పంటలు ప్రకృతిసేద్య విధానంలో సాగు చేస్తూ వస్తున్నారు.

ఇందుకుగాను ఒక దేశీయ ఆవును పోషిస్తూ వాటి వ్యర్థాలతో వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుంటూ తన సాగులో వినియోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కనుక తప్పనిసరిగా నాటు విత్తనాలు వినియోగిస్తున్నారు. నాటు విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి సేకరించి వివిధ రకాల కూరగాయలు, పురాతన వరి రకాలు, వేరుశనగ, కంది, పెసర, పుచ్చ మొదలగు పంటలు సాగు చేస్తూ తన పంట నుంచి విత్తనాలను సేకరించి తోటి రైతులకు అందిస్తూ వస్తున్నారు. 2021వ సంవత్సరం రబీలో వేరుశనగ, పుచ్చ, టమాట మొదలగు పంటలు సాగు చేశారు.
టమాట: 

448 రకం విత్తనాలకు సంబంధించిన 25 రోజులు పెరిగిన నారుని నాటించారు. దుక్కిలో ఘనజీవామృతంతో పాటు పశువుల ఎరువు అందించారు. మొక్క నాటిన రోజు నుంచి క్రమం తప్పకుండా జీవామృతాన్ని భూమికి అందిస్తూ రావడంతో పాటు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, థపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, ఫిష్‌ ఎమినో యాసిడ్‌, ఉపయోగిస్తూ వస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతూ వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్‌ చేసుకుంటూ మంచి ఆదాయం గడిస్తున్నారు.
పుచ్చ: 

ఒక ఎకరంలో పుచ్చ పంటను సాగు చేశారు. ఇందుకుగాను నల్ల రకం నాటు విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుని ఉపయోగించారు. ఎకరానికి 500 గ్రాముల విత్తనం అవసరం పడింది. దుక్కిలో ఘనజీవామృతంతో పాటు, పశువుల ఎరువు కూడా అందించారు. క్రమం తప్పకుండా జీవామృతాన్ని భూమికి అందించడంతో పాటు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, పేడ+ఇంగువ ద్రావణం, సివిఆర్‌ గారి మట్టి ద్రావణం పంటపై పిచికారీ చేస్తూ వచ్చారు. ఎకరానికి సుమారు 20,000/- వరకు ఖర్చు చేశారు. 15 టన్నుల వరకు దిగుబడి తీసి టన్ను 10000/-లకు అమ్మకం చేశారు. కొన్ని కాయల నుంచి విత్తనాలను సేకరించి తరువాత తన సాగుకి ఉపయోగించడానికి, తోటి రైతులకు అందించాలనుకుంటున్నారు.
వేరుశనగ: 

మూడు ఎకరాలలో వేరుశనగను సాగు చేశారు. ఇందుకుగాను కదిరి లేపాక్షి 1812 రకం సొంత విత్తనాన్ని వినియోగించారు. ఎకరానికి 60 కిలోల విత్తనం అవసరం పడింది. విత్తనం నాటిన తరువాత ప్రతి 15 రోజులకు స్ప్రింక్లర్స్‌ సహాయంతో నీటిని అందిస్తూ జీవామృతాన్ని పొలంపై చల్లించారు. ఈ విధంగా 5 సార్లు అంటే పంట కాలంలో ఎకరానికి 1000 లీటర్ల జీవామృతాన్ని భూమికి అందించారు. విత్తనం నాటిన 25-30 రోజుల మధ్యలో కూలీల సహాయంతో కలుపును నివారించారు. అవసరమయితే ఎద్దులతో కూడా అంతరకృషి చేస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి ఫిష్‌ ఎమినోయాసిడ్‌, పుల్లటి మజ్జిగ, నూనెలను పంటపై పిచికారి చేస్తూ చీడపీడలను నివారించారు. తన వేరుశనగ సాగు అనుభవంలో ఎకరానికి 12 క్వింటాళ్ళు కాయలు అధిక దిగుబడి పొందారు. చుట్టు ప్రక్క రసాయన పద్ధతులు పాటించే రైతులకంటే 2 లేదా 3 క్వింటాళ్ళు కాయలు అధికంగా పొందుతున్నారు. వేరుశనగ కాయలను అదేవిధంగా అమ్మకుండా విత్తనాలను తీసి తోటి రైతులకు విత్తనాల కొరకు మంచి ధరకు అమ్ముతుంటారు.
అడవి పందుల నుంచి పంటను రక్షించడం: 

వేరుశనగ పంటకు అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొలం చుట్టూ చీరలు కట్టి లేదా వివిధ రకాల శబ్దాలు చేసే మైకు ఏర్పాటు చేసి తన వేరుశనగ పంటని అడవి పందుల బారి నుంచి రక్షించుకుంటున్నారు.కంది, బీర, సొర, 5 రకాల వంగ, పురాతన వరి రకాలు, పుచ్చ, వేరుశనగ మొదలగు విత్తనాలను సొంతంగా ఉపయోగించుకుంటూ తోటి రైతులకు మంచి ధరకు అమ్ముతూ తన సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నారు.

మరిన్ని వివరాలకు బైరిపాగ రాజును 81868 86807 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించగలరు. 

Read More

మెరుగైన వ్యవసాయ పద్ధతుల పరిశోధనలో జిట్టా బాల్‌రెడ్డి

అనాదిగా మన ప్రధాన వృత్తి వ్యవసాయం. ఎప్పటి నుంచో మన రైతులు వివిధ రకాల పంటలు పండిస్తూ ప్రజల ఆకలిని తీరుస్తూ తమ సాగుని కొనసాగిస్తూ వస్తున్నారు. వివిధ రకాల పద్ధతులు పాటిస్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ స్వేదం చిందించి సేద్యం చేస్తూ అందరి ఆకలిని తీర్చుతున్నారు గాని తమ ఆకలిని సక్రమంగా తీర్చుకోలేకపోతున్నారు. ఎక్కువమంది రైతులు పంటల సాగులో నష్టాలను చవిచూస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతూ పెళ్ళాం పుస్తెలను తెగనమ్ముతూ సాగుని కొనసాగిస్తున్నారు. అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మన ఆకలిని తీర్చే అన్నదాతలు లోకాన్ని విడిచి, కుటుంబ సభ్యులను అనాధలను చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులకు కారణాలు ఏమిటి? రైతుల సమస్యలకు పరిష్కారాలు దొరకవా? అని ఆలోచించి ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు కావాలంటే వ్యవసాయంలో మెరుగయిన పద్ధతుల గురించి కక్షుణ్ణంగా అధ్యయనం చేసి పరీక్షించి క్షేత్రస్థాయిలో విజయం సాధించే అంశాలను రైతు లోగిళ్ళకు చేర్చగలగాలి. ఆవిధంగా చేసినపుడే మన రైతు మనుగడ సాగించగలడు. లేనట్లయితే మన భవిష్యత్తు అంధకారమే అనే విషయం అక్షర సత్యం. ఈ విషయాన్ని గ్రహించి రైతుబిడ్డగా తనవంతు బాధ్యత నిర్వర్తించాలనే తలంపుతో మెరుగయిన వ్యవసాయ పద్ధతుల పరిశోధనలో ముందుకు సాగుతున్నారు మన రైతునేస్తం జిట్టా బాల్‌రెడ్డి.

బాల్‌రెడ్డిది వ్యవసాయ నేపథ్యం. పరిస్థితుల ప్రభావం మరియు వివిధ రకాల కారణాల వలన బాల్‌రెడ్డి జీవితం అనేక మలుపులు తిరిగి ప్రస్తుతానికి వ్యవసాయ పరిశోధనలో స్థిరపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరిలోని ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి తన పరిశోధనలకు వేదిక అయ్యింది. ఈ క్షేత్రానికి అమేయ కృషి వికాస కేంద్రం అని నామకరణం చేసి, అనేక ప్రయోగాలకు వేదిక చేసుకుని వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఈ యజ్ఞంలో తన అర్ధాంగి జ్యోతిరెడ్డిని కూడా భాగస్వామిని చేసి మహిళలు తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు, మనం ఏరంగంలో ఉన్నా కూడా కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అని తెలియచెబుతున్నారు. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయంలో అదీను సేంద్రియ వ్యవసాయంలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. కుటుంబ సభ్యుల సహకారం లేనిదే సేంద్రియ వ్యవసాయం ముందుకు సాగదని బాల్‌రెడ్డి వివరించారు. 


ప్రస్తుతం మన రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పెట్టుబడులు పెరగడం. పెట్టుబడులు పెరగటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు వ్యవసాయం చేసే ప్రతి రైతూ పాడి పశువులను పోషిస్తూ పాడి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతూ పశువ్యర్థాలను పంటలకు అందిస్తూ నాణ్యమైన దిగుబడి పొందుతూ ఉండేవారు. కాని రాను రాను వివిధ రకాల కారణాలు, వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టడం వలన రైతులు పాడిపశువులకు దూరం జరిగి పూర్తిగా రసాయనాలమీదనే ఆధారపడి పంటలు సాగు చేయటానికి అలవాటు పడ్డారు. విచక్షణా రహితంగా రసాయనాలు ఉపయోగించడం వలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగింది. వీటి నివారణకు తిరిగి రసాయన పురుగు మందులు లాంటి వాటి కోసం మరలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ విధంగా పంటల సాగు ఖర్చు ఏఏటికాయేడు పెరుగుతూ వస్తుంది. దీనికి పరిష్కారం రైతులు రసాయనాలకు దూరం జరిగి తిరిగి పశుపోషణ చేపట్టి పశువ్యర్థాలను మరియు వివిధ రకాల సేంద్రియ పద్ధతులను ఉపయోగిస్తూ పంటల సాగు కొనసాగించడమే కాబట్టి బాల్‌రెడ్డి ఆ దారిలో నడుస్తూ గత 10 సంవత్సరాలకు పైగా ఈ క్షేత్రంలో ఏ విధమైన రసాయనాలు వినియోగించకుండా పూర్తి ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను పాడి పశువులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తూ వస్తున్నారు. ఈ పద్ధతిలో రసాయనాలకు దూరం జరగడం జరిగింది కానీ పశువుల ఎరువు మరియు జీవామృతం లాంటి వాటిని మొక్కలకు అందించాలంటే కూలీలపై ఆధారపడవలసి వస్తుంది. కూలీ రేట్లు పెరగటంతో పాటు కొంతమంది కూలీలు గోవు వ్యర్థాలతో తయారు చేసిన జీవామృతం లాంటి వాటి వాసన భరించలేక పనికి దూరంగా ఉంటున్నారు. దానికి పరిష్కారంగా మానవ వనరుల వినియోగం లేకుండా జీవామృతం లేక ద్రవ సేంద్రియ ఎరువులను భూమికి అందించటానికి సులువైన పద్ధతిని పరిశోధించి అమలు పరుస్తున్నారు. ఈ పద్ధతి వలన ఒక దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు కూలీల ఖర్చు తగ్గడముతో పాటు, కూలీల అవసరం లేకుండా చేయడం మరియు ఎరువుల యొక్క వృథాని తగ్గించడం జరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరగడం బాల్‌రెడ్డి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ పద్ధతికిగాను వారు 12000 లీటర్ల సామర్ధ్యం గల కుంటను తవ్వించి ఆ కుంటలో నీరు ఇంకకుండా నల్లరంగు ప్లాస్టిక్‌ పట్టాను పరచారు. ఆవు మూత్రం, ఆవుల పాక కడిగిన నీటిని ఒక పంపు సహాయంతో ఈ కుంటలోకి వచ్చేలా ఏర్పాటు చేసుకుని అందులో నీటిని, పేడను మరియు ఇతర పదార్థాలను కలిపి పంటలకు అందిస్తుంటారు. పంటలకు అందించటానికి కూడా మానవ వనరుల వినియోగం లేకుండా మాములుగా పంటలకు నీటిని అందించే పైపుకి అనుసంధానం అయ్యి జీవామృతం మరియు నీరు కలిసి వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకున్నారు. (ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు బాక్స్‌ చూడగలరు), మానవ వనరులతో పాటు ప్రస్తుతం రైతులు ఉపయోగించే రసాయనిక పురుగు మందులు కూడా సాగు పెట్టుబడులను పెంచుతున్నాయి. విచక్షణా రహితంగా రసాయనాలు ఉపయోగించడంతో పాటు సారం లేని నేలలో పెరిగిన మొక్కలో రోగనిరోధక శక్తి లోపించడం వలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగి రసాయనాలు ఉపయోగించే కొలది చీడపీడలు నిరోధక శక్తిని పెంచుకుని ఎంత ఖర్చు పెట్టి రసాయనాలు ఉపయోగించినా కూడా చీడపీడలు నివారించలేకపోవడం లాంటి పరిస్థితులు రైతులకు ఎదురవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇటీవల మిరప రైతులు ఎదుర్కొన్న నల్ల తామర పురుగు. మిరప రైతులను నల్ల తామర పురుగు విపరీతంగా ఇబ్బందులకు గురి చేసింది. కొంతమంది రైతులు వీటిని నివారించలేక పంటను వదలి వేసుకున్నారు. ఇలాంటి సమస్యలకు హోమియో మందులు పనిచేస్తాయి అని గ్రహించి తాను సాగు చేసే పంటలపై హోమియో మందులు పరీక్షించి విజయం సాధించిన తరువాత తోటి రైతులకు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం అనేకమంది మిరపతో పాటు ఇతర పంటల సాగు చేసే రైతులు బాల్‌రెడ్డి సలహాల మేరకు హోమియోమందులు ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తమ పంటలను చీడపీడల నుండి రక్షించుకున్నారు అని బాల్‌రెడ్డి వివరించారు. ఈ హోమియో మందులు రైతులు ఎవరికి వారు వారికి అందుబాటులో ఉన్న హోమియో దుకాణాల నుంచి నాణ్యమైనవి కొనుగోలు చేసుకుని ఉపయోగించవచ్చు. కాని మోతాదు మాత్రం తప్పనిసరిగా పరిమితులకు లోబడే వినియోగించాలి. మోతాదు పెంచినట్లయితే పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి హోమియో మందుల వివరాలు మరియు మోతాదు వివరాలు ఆయనను సంప్రదించి నిర్ధారించుకోవాలని బాల్‌రెడ్డి రైతులను కోరుతున్నారు


రైతులు పెట్టుబడులు తగ్గించడంతో పాటు సంవత్సరం పొడవునా పంట దిగుబడులు అందుబాటులో ఉన్నట్లయితే రైతులకు ఆదాయం పెరుగుతందని గ్రహించారు బాల్‌రెడ్డి. అటువైపు ఆలోచించి పండ్ల మొక్కలను ఉదాహరణగా తీసుకుంటే మామిడి, బత్తాయి లాంటి పండ్లు సంవత్సరములో కొన్ని నెలలు మాత్రమే పంట దిగుబడి వచ్చే రకాలు ప్రస్తుత మన రైతులు సాగు చేస్తున్నారు. దానికి పరిష్కారంగా వియత్నాం, మలేషియా, ఫిలిప్పెయిన్స్‌ మొదలగు దేశాలలో అందుబాటులో ఉండే పండ్ల మొక్కలు సంవత్సరం పొడవునా పంట దిగుబడిని ఇచ్చే వాటిని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తెప్పించి తమ పరిశోధనా క్షేత్రంలో పరిశీలిస్తున్నారు. పరిశోధించి అన్ని అంశాలు అనగా దిగుబడి, రుచి, నేల అనుకూలత, చీడపీడలను తట్టుకునే గుణం లాంటి వాటిని ప్రత్యక్షంగా తమ క్షేత్రంలో పరిశీలించి అన్నీ అనుకూలంగా ఉంటేనే రైతులకు అందచేస్తూ ఏ అంశంలోనైనా తనకు నమ్మకం కుదరకపోతే ఆ రకాన్ని తన క్షేత్రానికే పరిమితం చేస్తూ రైతులకు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని బాల్‌రెడ్డి వివరించారు. కుటుంబ సభ్యుల సహకారంతో పంటలసాగు, పశుపోషణని కొనసాగిస్తూ మెరుగయిన వ్యవసాయ పద్ధతుల పరిశోధనలో చిత్తశుద్ధితో బాల్‌రెడ్డి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరిన్ని వివరాలు 8978221966 కి ఫోను చేసి తెలుసుకోగలరు.    
ఖర్చు లేకుండా జీవామృతాన్ని పంటలకు అందించే పద్ధతి

ప్రకృతి వ్యవసాయంలో మన దేశీయ గోవులు, ఆగోవుల వ్యర్థాలతో తయారు చేసుకొనే జీవామృతం లాంటివి ప్రముఖపాత్రను పోషిస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ జీవామృతంలో పిండి, ఆవుపేడ మొదలగునవి కలుపుతారు, కాబట్టి వడకట్టడం ఇబ్బందులతో కూడుకుని ఉంది. కాబట్టి జీవామృతాన్ని పంటలకు అందించాలంటే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రైతులు కూలీల సహాయంతో మొక్కల పాదులలో పోయిస్తున్నారు. కాలువల ద్వారా నీటిని అందించే రైతులుకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాని రెయిన్‌గన్‌, స్ప్రింక్లర్స్‌, డ్రిప్పు ద్వారా పంటలకు నీటిని అందించే రైతులు జీవామృతం మొక్కలకు అందించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి రైతులు మరియు తన సౌకర్యార్థం బాల్‌రెడ్డి ఒక పద్ధతిని అమలు పరుస్తున్నారు. తాను కూడా పంటలకు నీరు అందించటానికి డ్రిప్పు వ్యవస్థని ఉపయోగిస్తున్నారు కాబట్టి కొత్త పద్ధతి గురించి శోధించి ఏలాంటి ఇబ్బంది లేకుండా జీవామృతం పంటలకు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకుగాను సుమారు 6 అడుగుల లోతులో 12000 లీటర్ల సామర్థ్యం గల చిన్న కుంటను తవ్వించి ఆ కుంటలో అడుగు భాగాన నీరు ఇంకకుండా ప్లాస్టిక్‌ షీట్‌ పరిచారు. మాములుగానే బాల్‌రెడ్డి పంటలకు నీటిని అందించడానికి ఫారమ్‌ పాండు తవ్వుకున్నారు. ఈ ప్రాతంలో నీటి లభ్యత సక్రమంగా ఉండదు కాబట్టి బోరు నుంచి నేరుగా డ్రిప్పుద్వారా పంటకు అందించడంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫారమ్‌పాండు తవ్వించి అందులో ప్లాసిక్‌ షీటు పరచి బోర్ల నుండి ఫారమ్‌ పాండ్‌లోకి నీటిని నింపి ఫారమ్‌ పాండులోని నీటిని మోటారు సహాయంతో పంటలకు డ్రిప్పు ద్వారా పంపిస్తుంటారు. జీవామృతం టాంకులో అందుకు అవసరమయిన పదార్థాలను కలిపి జీవామృతం తయారు చేసుకుంటారు. ఈ జీవామృతం ఫిల్టరు అవటానికి వీలుగా 4 లేదా 5 వరుసల నైలాన్‌ మెష్‌ను ఫుట్‌వాల్‌కి చుట్టి ఆ ఫుట్‌వాల్‌ని జీవామృతం టాంకులో వదులుతారు. ఈ ఫుట్‌వాల్‌ జీవామృతం ట్యాంకులో అడుగువరకు వెళ్ళకుండా ఎంతలోతులో ఫుట్‌వాల్‌ ఉండాలో అంత పొడవు తాడు కట్టి ఆ తాడు చివర రెండు ప్లాసిటక్‌ డబ్బాలను కట్టి ఫుట్‌వాల్‌ని జీవామృతం ట్యాంకులో వదులుతారు. ఆ ఫుట్‌వాల్‌కి కట్టిన ప్లాస్టిక్‌ డబ్బాలు జీవామృతం ట్యాంకులో పైన తేలుతూ ఫుట్‌ వాల్‌ను అడుగు వరకు చేరకుండా ఆపుతాయి కాబట్టి అడుగున పేరుకున్న మడ్డి (దీనిని తరువాత మొక్కల పాదులలో లేదా నేలకు అందిస్తుంటారు) అలానే ఉంటూ పైన ఉన్న జీవామృతం మాత్రమే ఫుట్‌వాల్‌కి అమర్చిన పైపు ద్వారా పంటలకు నీరు అందించే ట్యాంకులో అమర్చబడిన పైపుకు అనుసంధానం చేయబడుతుంది. ఈ మధ్యలో ఒక వాల్‌ని కూడా అమర్చి అవసరము లేకుంటే వాల్‌ని మూసివేస్తే జీవామృతం వెళ్ళకుండా కేవలం నీరు మాత్రమే వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకున్నారు. పంటకు నీటిని అందించే సమయంలో నీటితో కలిసి పీడనశక్తి ద్వారా జీవామృతం కూడా వెళుతుంది కాబట్టి జీవామృతం యొక్క వినియోగ శక్తి మెరుగవడంతో పంటలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. జీవామృతంతో పాటు కోడి ఎరువు మరియు ఏవిధమైన సేంద్రియ లేదా ప్రకృతిసిద్ధమైన ఎరువులను మనుషుల సహాయం అవసరం లేకుండా ఈ పద్ధతి ద్వారా పంటలకు పంపించడం వలన ఖర్చు తగ్గిస్తున్నాయని, ఈ పద్ధతిని చాలామంది రైతులు అనుసరిస్తూ తమ సాగు ఖర్చు తగ్గించుకుంటున్నారని బాల్‌రెడ్డి వివరించారు. 

Read More

జీవాల్లో చిటుకు వ్యాధి 

చిటుకు వ్యాధి బాగా మేసి బలిష్టంగా ఉన్న గొర్రెల్లో, మేకల్లో వస్తుంది. క్లాస్ట్రీడియం పెర్‌ఫ్రింజెన్స్‌(టైప్‌-డి) అనబడే సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉన్న జంతువుల పేగులలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఆహారంలో పిండి పదార్థాల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెంది విష పదార్థాలను విడుదల చేస్తాయి. అతిగా తినడం వల్ల వస్తుంది కాబట్టి దీనిని తినే వ్యాధి అంటారు. ఈ వ్యాధి సోకిన కొద్ది సమయంలోనే తీవ్రరూపం దాల్చడం వల్ల గొర్రెలు చిటికెలో మరణిస్తా యి. అందువల్ల దీనిని చిటుకు రోగంగా పిలుస్తారు. ఈ రోగం వస్తే జీవాలను రక్షించడం చాలా కష్టం. అందువలన గొర్రెల కాపలదారులు జాగ్రత్త వహించాలి. 

వ్యాధి ఎలా వస్తుందంటే?: 

గొర్రె లేదా మేక పిల్లలు చాలా ఎక్కువగా పాల ను తాగినప్పుడు, ఎక్కువగా దాణా మేసినప్పుడు, ఇతర వ్యాధులు సోకినప్పుడు, జీవాల్లో సహజ వ్యాధి నిరోధకశక్తి క్షీణించడం వల్ల, పరాన్నజీవులు జీవాల కడుపులో ఎక్కువగా ఉన్నప్పుడు, ఇతర ఏవైనా కారణాల వల్ల పేవుల కదలిక తగ్గినప్పుడు ఈ వ్యాధి ప్రబలుతుంది.


లక్షణాలు: 

ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాతుగా మేత మేయడం మానేస్తాయి. పొట్ట భాగాన్ని కాళ్లతో కొట్టుకోవడం, తరచు కిందికి పైకి లేవడం, పక్కలకి తిరిగి పడుకోవడం వంటివి చేస్తాయి.సూక్ష్మజీవులు విడుదల చేసిన విష ప్రభావం మెదడుపై ప్రభావం చూపడం వల్ల కాళ్లు చాపి తల మెడ భాగం వెనక్కి విరుచుకోవడం చేస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే జీవాలు చనిపోతాయి. సూక్ష్మజీవులు విడుదల చేసిన విషపదార్ధల వలన కొన్నిసార్లు, జీవాలు విడుదల చేసిన విషపదార్థాల వల్ల కొన్నిసార్లు జీవాల్లో పారుడు, విరేచనాల లక్షణాలు కనబడతాయి. వ్యాధితో మరణించిన గొర్రెలలో మూత్రపిండాలు లావుగా, మెత్తగా మారిపోతాయి. సూక్ష్మజీవుల విషపదార్ధాల వల్ల పేగులు నల్లగా మారిపోతాయి.


చికిత్స: 

తీవ్రమైన థలో ఈ వ్యాధి చికిత్సకు నయం కాదు. గొర్రె లేదా మేక పిల్లలకు 5మి.లీ యాంటి టాక్సిన్‌ను చర్మం కింది పొరల్లో ఇవ్వాలి. తద్వారా మనం వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాధి తీవ్రతను తక్కువగా ఉన్నప్పుడు పెన్సిలిన్‌ గొర్రె బరువును బట్టి ఇవ్వాలి. యాంటిసిడ్‌ యాంటి బ్లోట్‌ మందులను తాగించాలి. థయామిన్‌(బి1) విటమిన్‌ను కండకు ఇంజక్షన్‌ చేయాలి. విష పదార్థాల ప్రభావం తగ్గించడానికి కార్టికోస్టిరాయిడ్స్‌ రక్తము ద్వారా ఇవ్వాలి.


నివారణ చర్యలు: 

జీవాలకు పిండి పదార్థాలు దాణా ఎక్కువ మోతాదులో పెట్టకూడదు.గొర్రె, మేక పిల్లలకు దాణాలో ఇచ్చే పెల్లెట్ల మోతాదును 3-4 బాగాలుగా విభచించి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం పశు సంవర్ధక శాఖ వారు ఏప్రిల్‌, మే నెలలలో చిటుకు వ్యాది నివారణ టీకాలు పంపిణీ చేస్తుంది. ఈ టీకా మందుని మొదటిసారి ఆరు వారాల పైబడిన పిల్లలన్నింటికి ఇచ్చి ఆ తర్వాత మూడు వారాల లోపు రెండవ డోస్‌ ఇప్పించాలి.అంతే కాకుండా ప్రతి సంవత్సరం ఈ టీకాలును క్రమం తప్పకుండా చేయించాలి.గర్భంతో ఉన్న జీవాలకు ఈనటానికి 2-3వారాల ముందు ఈ టీకా మందు ఇస్తే పుట్టే పిల్లలకు 8 వారాల వరకు ఈ వ్యాధినుంచి రక్షణ కలుగుతుంది.   
డా. జి. రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప. ఫోన్‌: 9618499184

Read More