మిర్చి మరియు కందుల కొనుగోళ్లపై ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్లతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డులలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర పొందేలా జిల్లాలలో రిజనల్ మరియు సీనియర్ ఆఫీసర్లను పంపించాలని అధికారులను ఆదేశించారు.

10 Feb, 2025
