ఆయిల్‌ పాం రైతులకు శుభవార్త – మంత్రి తుమ్మల

ఆయిల్‌ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. టన్ను ఆయిల్‌ పాం గెలల ధర రూ. 21000లకి చేరిందని, దీని ద్వారా 64,582 మంది ఆయిల్‌ పాం రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి వివిధ పథకాలను రైతులకు అందిచడం ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలను లాభదాయకంగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత మరియు వంటనూనెల డిమాండును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ సందర్భంగా ఆయన తెలియజేశారు.


రాష్ట్రంలోని (31) జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ఇప్పటివరకు సుమారు 2.43 లక్షల ఎకరాలను ఆయిల్‌ పామ్‌ సాగులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ తోటల యాజమాన్యం మరియు అంతర పంటల సాగు కొరకు 45,548 మంది రైతుల ఖాతాలలోకి రు.72 కోట్లను ప్రభుత్వం జమ చేసిందని, రైతులకు అధిక ధరలను అందించి, ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని అన్నారు.


ముడి పామ్‌ ఆయిల్‌ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్‌ ఆయిల్‌ రైతులను ప్రోత్సహించుటకు చర్యలను తీసుకోవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముడి పామ్‌ ఆయిల్‌ దిగుమతిపై సుంకాన్ని 27.5%కు పెంచింది. 2023 మార్చిలో టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.14,174/- గా ఉండగా, ఈ నెల టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.21,000/- కు పెరిగిందని అన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని పెద్ద మొత్తంలో రైతులు ముందుకు వచ్చి ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.

Read More

మిర్చి మరియు కందుల కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

మిర్చి మరియు కందుల కొనుగోళ్లపై ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌లతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌ యార్డులలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర పొందేలా జిల్లాలలో రిజనల్‌ మరియు సీనియర్‌ ఆఫీసర్లను పంపించాలని అధికారులను ఆదేశించారు.

Read More

ఆశలు రేపుతున్న ఆయిల్‌పాం

రెండేళ్ల తర్వాత మళ్లీ టన్ను ధర రూ. 20 వేలపైకిదిగుమతి సుంకం పెంపుతో రైతులకు కలిసి వస్తున్న ధర తెలంగాణా రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇదే సమయంలో ఆయిల్‌పాం గెలల ధరల్లో పెరుగుదలతో రైతుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. గతేడాది నవంబరులో రూ. 12,440 పలికిన టన్ను గెలల ధర.. ప్రస్తుతం రూ. 20,400కు చేరింది. అంటే రూ. 8 వేల వరకూ పెరిగింది. 2022 జూన్‌లో టన్ను గెలల ధర రూ. 23,400 పలకగా.. ఆ తరువాత క్రమేపీ పతనమైంది. 2023లో టన్ను ధర రూ. 14,205 కు మించలేదు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పాత ధరలు వస్తుండడంతో.. సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.దిగుమతి సుంకం ఆధారంగా ధరలు ఆరేళ్ల క్రితం పామాయిల్‌పై దిగుమతి సుంకం 42 శాతం ఉండగా క్రమేపీ సున్నాకు తగ్గించారు. దీంతో దిగుమతులు పెరిగి దేశంలో ఆయిల్‌పాం గెలల ధరలు పడిపోయాయి. తాజాగా కేంద్రం దిగుమతి సుంకాన్ని 27 శాతానికి పెంచడంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలకు చేరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 19.40 శాతం ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌ (ఓఈఆర్‌) అమలు చేస్తున్నారు. ఓఈఆర్‌ పెరుగుదలకు అనుగుణంగా రైతులకు ధర వస్తుంది.ఆయిల్‌పామ్‌ గెలల ధరలో మార్పులు ఇలా.. సమయం టన్ను ధర (రూ.) 2022 నవంబరు 13,741 డిసెంబరు 13,881 2023 నవంబరు 12,440 డిసెంబరు 12,448 2024 నవంబరు 20,413శుభపరిణామం టన్ను ఆయిల్‌పాం గెలల ధర రూ. 20 వేల స్థాయిని దాటడం శుభపరిణామం అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పంట సాగును పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఏటా సుమారు లక్ష ఎకరాల సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు స్థిరీకరణ ధర కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Read More

తెలంగాణలో పత్తి జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె

తెలంగాణలో పత్తి జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సీఎండీ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్‌ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా, కష్టాలు పడకుండా మరియు పత్తిని తక్కువ ధరలకు విక్రయించవలసిన అవసరం లేకుండా చర్యలు వెంటనే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకమని మంత్రి తెలిపారు.

Read More