విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ఖరీఫ్‌ సీజన్‌లో వరి విత్తనాలతో పాటు ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రపురంలోని గ్లోబల్‌ విశ్రాంతి భవనంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. రైతులంతా ఒకేరకమైన పంటలు వేయడంతో ధరల్లో తేడాలు వస్తున్నాయన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సాగు చేయాలని సూచించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, నాయకులు సి. చిన్నమ్మ తల్లి, వి. సన్యాసినాయుడు, ఆర్‌. ఈశ్వరరావు, పి. మహేష్‌ తదితరులు మంత్రిని సన్మానించారు.

Read More

మిర్చి మరియు కందుల కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

మిర్చి మరియు కందుల కొనుగోళ్లపై ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌లతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌ యార్డులలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర పొందేలా జిల్లాలలో రిజనల్‌ మరియు సీనియర్‌ ఆఫీసర్లను పంపించాలని అధికారులను ఆదేశించారు.

Read More