తెలంగాణ రాష్ట్రంలో 2025-26లో 40 శాతం రాయితీతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తున్నామని, దీన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్‌ బాషా కోరారు. పండ్లు, పూలతోటలు, సుగంధ ద్రవ్యాలు, అల్లం, పసుపు, వెల్లుల్లి, పుట్టగొడుగుల పెంపకానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఆసక్తి గల రైతులు స్థానిక ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు.