రైతునేస్తం కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై రైతులతో తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి చర్చించారు. రైతువేదికల ద్వారా అనేక జిల్లాల నుండి అధికసంఖ్యలో రైతులు హజరైనారు. ఎన్.ఎఫ్.ఎస్.ఎం పథకంలో భాగంగా విత్తనాల సరఫరా మరియు పంట అవశేషాలు కాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు వివరించిచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి, తెలంగాణ సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.


