రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

విదేశీ పప్పులు, నూనెల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని తెలగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి, మక్కలు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు, ఆదాయం, డిమాండుకు అనుగుణంగా పప్పులు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు సాగుచేయాలని కర్షకులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రణాళికపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మన మామిడిపండ్లకు జపాన్ లో డిమాండ్ ఉన్నా.. రసాయన అవశేషాల పేరిట ఆ దేశం తిరస్కరించింది. ఇకనైనా రైతులు అధిక రసాయనాల వాడకం తగ్గించాలి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపాలి’ అని పేర్కొన్నారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

Read More

జిల్లాలవారీగా జొన్నకొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలోరూ.1,100 కోట్లతో జిల్లాలవారీగా జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తామని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మరో రూ.1,800 కోట్లతో అదనంగా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. “యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు 16.13 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం ఉత్పత్తి 42.87 లక్షల టన్నులకు చేరింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే రూ.4,172.94 కోట్లతో 12.85 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. మరో 6.53 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో 4.03 లక్షల ఎకరాల్లో 4.03 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి అయింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లతో కొనుగోళ్లు చేపడతాం. ఆదిలాబాద్ జిల్లాలో 26, సంగారెడ్డి జిల్లాలో 10, కామారెడ్డి జిల్లాలో 43, మెదక్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. దీంతోపాటు 10,175 టన్నుల పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తాం” అని వెల్లడించారు.

Read More

సజ్జాపూర్ చామదుంప భౌగోళిక గుర్తింపునకు దరఖాస్తు

తెలంగాణా రాష్ట్రంలో కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో పండించే ప్రసిద్ధి పొందిన సజ్జాపూర్ చామగడ్డకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ఇవ్వాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయంలో మంగళవారం దరఖాస్తు చేసుకుంది. ఈ చేమ దుంప ప్రపంచంలోనే అరుదైందని, అత్యంత పోషకవిలువలతో సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగి ఉందని వివరించింది. జీఐ కోసం దరఖాస్తు చేసిన మొట్ట మొదటి దుంప రకంగా ఇది నమోదైంది. సజ్జాపూర్ చామదుంప విశిష్టతను గుర్తించిన ఉద్యానవర్సిటీ శాస్త్రవేత్త పిడిగం సైదయ్య దీనిపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు టీజీవోఎస్‌టీ సహకారం అందించింది. ఈక్రమంలో చామదుంప పుట్టుక, దాని రకపు లక్షణాలు, జీవరసాయన ప్రొఫైలింగ్, సాగు పద్దతులు, డీఎనఏ, ఇతర విశిష్ట లక్షణాలకు భౌగోళిక సంబంధాలు వంటి కీలక సమాచారాన్ని సేకరించారు. సంకర లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రకాల మాదిరిగా కాకుండా.. సజ్జాపూర్ చామదుంపను స్థానిక రైతులు శతాబ్దానికి పైగా సంప్రదాయ శాఖీయ పద్ధతుల ద్వారా సంరక్షించి, వ్యాప్తి చేస్తున్నారు. ఈ వివరాల నివేదికతో జీఐ నిపుణుడు శుభజీత్ సాహా ద్వారా జీఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేశారు. దరఖాస్తును ఆమోదించిన రిజిస్ట్రీ.. పరిశీలనకు స్వీకరించినట్లు వెల్లడించింది.

Read More

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల

తెలంగాణలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2206 కోట్లు రైతు భరోసా రెండో విడత కింద మంగళవారం జమయ్యాయి. గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న 68,89,955 మందికి, తాజాగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో సీఎం రెండో విడతలో రెండు ఎకరాల వరకు భరోసా నిధులను విడుదల చేశారు. గత రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు రైతు భరోసా కోసం రూ.5,653 కోట్లు విడుదల కాగా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ది పొందారని మంత్రి వివరించారు. రైతు భరోసాలో ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 5,40,693 మంది రైతులకు రూ.448.09 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,45,142 మందికి రూ. 271.52 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,66,343 మందికి రూ.271.05 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 3,28,818 మందికి రూ.246.30 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,98,352 మందికి రూ.236.49 కోట్లు జమయ్యాయి.

Read More

గుడ్లు తలసరి వినియోగం 103 నుంచి 106కి పెరిగింది

మన దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది. 2023-24తో పోలిస్తే 4.44% వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో భారత్ (చైనా తర్వాత) రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి (2024-25 లో) తలసరి వినియోగం 106 గుడ్లకు చేరింది. అంతకుముందు ఏడాది తలసరి వినియోగం 103 గుడ్లుగా ఉంది. ప్రధానంగా 2024-25 లో రెండు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర పశు సంవర్ధకశాఖ సోమవారం ప్రాథమిక గణాంకాల నివేదిక-2025ను విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు…
2018-19 నుంచి 2024-25 వరకు దేశంలో గుడ్ల ఉత్పత్తి 10,380 కోట్ల నుంచి 14,911 కోట్లకు పెరిగింది. 2024-25లో వాణిజ్య కోళ్ల ఫారాలు 12,598 కోట్ల గుడ్లు, నాటుకోళ్ల పెంపకం ద్వారా 2,313 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. గుడ్ల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (18.37%), తమిళనాడు (15.63%), తెలంగాణ (12.98%), పశ్చిమ బెంగాల్ (10.72%), కర్ణాటక (6.67%) నిలిచాయి. ఈ 5 రాష్ట్రాలే 64.37% వాటాను కలిగి ఉన్నాయి. 4 దక్షిణాది రాష్ట్రాల్లోనే సగానికి (50 శాతానికి పైగా ఉత్పత్తి అవుతుండటం విశేషం.
2018-19 నుంచి 2024-25 వరకు తలసరి వినియోగం ఏడాదికి 79 నుంచి 106 గుడ్లకు పెరిగింది. గుడ్ల తలసరి వినియోగంలో జాతీయ సగటు (106) ను మించిన రాష్ట్రాలు 8 మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (516), తెలంగాణ (510), తమిళనాడు (302), హరియాణా (299), పంజాబ్ (164) తలసరి వినియోగంలో ముందున్నాయి.

పురోగతికి దోహదపడిన అంశాలు..
దేశంలో పౌష్ఠికాహారం పై అవగాహన పెరగడంతో పాటు ఆధునిక కోళ్ల ఫారాల్లో శాస్త్రీయ విధానాలు, మెరుగైన దాణా, వ్యాధి నిరోధక టీకాలను వినియోగించడం వల్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
మాంసం, ఇతర ప్రొటీన్ ఆహారాలతో పోలిస్తే, గుడ్డు సామాన్యులకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. గుడ్లలోని అద్భుత పోషక విలువల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు గుర్తిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో అందించడం... అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, పిల్లలకు పంపిణీ చేయడం గుడ్ల వినియోగం పెరగడానికి దోహదపడుతున్నాయి.
Read More

90 లక్షల టన్నుల ధాన్యం ఈ యాసంగిలో ఉత్పత్తి అవుతుంది

“తెలంగాణలో యాసంగి పంటలో వచ్చే ధాన్యం ఉప్పుడు బియ్యం మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డితో కేంద్ర మంత్రిని దిల్లీలో కలిసి ఈ అంశంపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఈ బియ్యానికి డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం (10% నూకతో) సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని, దీని కారణంగా పౌర సరఫరాలశాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయించాలని విన్నవించారు. ఉప్పుడు బియ్యం సరఫరాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read More

నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం

భూమి ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ దిగుబడిని పొందడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. కాబట్టి తెలంగాణలోని రైతులందరికీ నేల ఆరోగ్య కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. బుధవారం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేల ఆరోగ్య వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లను నియమించాం, ఒక్కో వాలంటీరు 10 మంది రైతులకు నేల ఆరోగ్యంపై అవగాహన కల్పించి భూసార పరీక్షలు చేస్తారు’ అని తెలిపారు. సమావేశానికి అగ్రివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అధ్యక్షత వహించగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి పాల్గొన్నారు.

Read More

తెలంగాణాలో సబ్సిడీపై పంట పొలాలకు సౌర విద్యుత్ కంచెలు

తెలంగాణలో అడవి జంతువుల వల్ల ఏటా 5 లక్షల ఎకరాల మేరకు పంట నష్టం వాటిల్లుతోంది. పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నించే రైతుల పైనా అడవి పందులు, కోతులు దాడిచేసి గాయపరుస్తున్నాయి. గత పదేళ్లలో 40 మందికి పైగా మరణించగా.. వందల మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా వంటి పథకాల్లోనూ జంతువుల ద్వారా జరిగే పంట నష్టాలకు పరిహారం లేదు. ఈ నేపథ్యంలో సౌరవిద్యుత్ కంచెల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. 50% సబ్సిడీతో పరికరాల కొనుగోలు సాయం అందించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. జిల్లాల వారీగా సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వ్యవసాయ మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌లో అధ్యయనం చేసింది. ఆ రాష్ట్రంలో ఐదువేల గ్రామాల్లో సౌరవిద్యుత్ కంచెలను ఏర్పాటు చేయించగా సత్ఫలితాలువచ్చాయి. దీంతో తెలంగాణ లోనూ సౌరవిద్యుత్ కంచెలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. కంచె వేయాల్సిన ప్రాంతం, పరిమాణాన్ని బట్టి ఖర్చు ఉంటుంది.

Read More

తెలంగాణాలో సన్నరకం వడ్లు విక్రయించిన రైతులకు బోనస్‌ విడుదల

క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ కింద సన్నరకం వడ్లు విక్రయించిన రైతులకు మరో రూ.500 కోట్లను పౌరసరఫరాల శాఖ సోమవారం విడుదల చేసింది. వీటిని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటనలో తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు రైతులకు విడుదల చేసిన బోనస్‌ రూ.1,425.91 కోట్లకు చేరింది.

Read More

‘సైలో’ పద్ధతిలో పంట ఉత్పత్తులను రెండేళ్ళ వరకు నిల్వ చేయవచ్చు

‘సైలో’ పద్ధతిలో పంటలను రెండేళ్ల వరకు సురక్షతంగా నిల్వ చేసుకునే వీలుందని, తెలంగాణా రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ లోని రాష్ట్ర సచివాలయంలో భారత ఆహార సంస్థ, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇంటిగ్రేటెడ్‌ క్లీనర్లు, డ్రయర్ల సాయంతో మక్కలు, వరి, సోయాబీన్‌ లాంటి పంట ఉత్పత్తుల్లోని తేమను ఆధునిక పద్ధతిలో తొలగించడంతో ఎక్కువ కాలం నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుంది. రైతులకు భరోసా ఇచ్చేందుకు, ధాన్యాన్ని పరిరక్షంచేందుకు దీన్ని అమలు చేయనున్నాం. ఎక్కువ కాలం నిల్వ ఉన్న ధాన్యం, పాత బియ్యానికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read More
  • 1
  • 2