ఔషధ మొక్క… చామంతిపూలు

కలెండ్యులా ఒక తక్కువ కాలం జీవించే, సువాసన గల బహువార్షిక హెర్బల్ మొక్క. 80 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. నిటారుగా పెరిగే కొమ్మలు కలిగి ఉంటుంది. ఆకులు కోడిగుడ్డు ఆకారంబల్లెం ఆకారంలో, 5-17 సెం.మీ. పొడవుండి, రెండువైపులా నూగు కలిగి ఉంటాయి. పూలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఇన్‌ఫ్లోరెసెన్స్ పసుపు రంగులో ఉంటుంది. పూగుత్తి 4-7 సెంమీ. వ్యాసం కలిగి ఉంటుంది. కాయలు ముళ్ళు కలిగి ఉండి వంగిన ఏకిన్.

సాధారణ నామం : కలెండ్యులా శాస్త్రీయ నామం : కలెండ్యులా అఫిసినాలిస్ కుటుంబం: కాంపోజిటె

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కలెండ్యులాని గొంతునొప్పి, నోటివాపు చికిత్సలో ఉపయోగిస్తారు. క్యాన్సర్, కడుపులోని డుయోడినల్ అల్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు.
  • నొప్పులు తగ్గడానికి కలెండ్యులా పేస్టుని చర్మంపై పూస్తారు. గాయాలు, కాలిపుండ్లు మానడానికి ఉపయోగిస్తారు.
  • కలెండ్యులా టింక్చర్లు, ఆయింట్‌మెంట్లను కాలిన ప్రదేశాలు, గాయాలు, తెగినచోట త్వరగా మానడానికి ఉపయోగిస్తారు. ఇవి గాయమున్న చోటికి రక్తాన్ని ప్రసరింపజేసి చర్మం కొత్త కణాలేర్పరుచుకోవడానికి దోహదపడతాయి. పిల్లల్లో చెవి ఇన్‌ఫెక్షన్స్ మానడానికి కలెండ్యులా చుక్కలను చెవిలో వేస్తారు. డెర్మటైటిస్ నివారణలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కల్యెండ్యులా ఇథనాల్ ద్రావణం (30 మైక్రోమీటర్లు/మి.లీ.) లోని రసాయనాలు తామర పురుగులు, త్రిప్స్‌టబాసిపై అత్యధిక విషచర్యను ప్రదర్శించాయి. (నజ్‌మిజాడే, అతని అనుచరులు, 2013).
  • క్యలెండ్యులా ద్రావణం పిచికారి చేసిన ట్రీట్‌మెంట్‌లో వెస్టర్న్‌ఫ్లవర్ త్రిప్స్ పిల్ల పురుగులు అరికట్టబడ్డాయి (రజావి అండ్ అహ్మరి, 2016) కిచెన్ గార్డెన్‌లో ఆకులు తినే పురుగులను, ఆస్పరాగస్ బీటిల్స్, టమాట కొమ్ము పురుగులను నివారించడానికి పురుగు మందు తయారు చేసుకుని వాడవచ్చు.

పురుగు మందు తయారు చేసే విధానం :

  • ఒక కప్పు (225 గ్రా.) కలెండ్యులా ఆకులను నూరి 500 మి.లీ. నీటితో కలపాలి. 24 గంటలు నానబెట్టాలి. పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి. దీనికి 1.5 లీ. నీటిని కలిపి తర్వాత 5 మి.లీ. (1/4 చెంచా) లిక్విడ్‌సోప్ కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
  • కలెండ్యులా ఆకులు, పూల ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర పోషక ఫిజియాలజీని మార్పు చేసి చంపుతాయి. అందువలన కలెండ్యులా ద్రావణాన్ని వృక్ష సంబంధ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (మెథిని, ఆమె అనుచరులు, 2012).
  • కలెండ్యులా ఇథనాల్ ద్రావణం ఆల్బినో ఎలుక, రాటస్ నార్‌జికస్‌పై అధిక విషప్రభావాన్ని చూపింది (అబూహషెమ్, 2012).
  • కలెండ్యులా మొక్క పైభాగాల ద్రావణం క్యాబేజి బటర్‌ఫ్లెå, పొటాటో బీటిల్ పై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (వార్ౙినియాక్, 2002).
  • కలెండ్యులా మొక్కలో సెస్కిటెర్పిన్లు, ఫ్లావనాయిడ్స్, ట్రైటెర్పినాయిడ్ సపోనిన్±్స, ట్రైటెర్పిన్ ఆల్కహాల్స్ ఉంటాయి (అహ్మద్, అతని అనుచరులు, 1993).
  • కలెండ్యులా ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర పెరుగుదల, ఫిజియాలజీపై అనేక ప్రభావాలను చూపుతాయి. అధిక గాఢత వద్ద లార్వాల పెరుగుదల, ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. బహుశ టెర్పిన్లు లార్వాలు తిన్న ఆహారం జీర్ణమయి, గ్రహించకుండా జోక్యం కలిగించుకుని ఉంటాయి (మెథిని, ఆమె అనుచరులు, 2009).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

రానున్న సంవత్సరాలలో ప్రకృతి వ్యవసాయానికి తెలంగాణలో అధిక ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యవసాయశాఖా మంత్రి తెలిపారు. సెక్రటేరియట్‌లో ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్‌ విజయ కుమార్‌, ఇతరులు, పక్క రాష్ట్రాలలో, వివిధ దేశాలలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను మరియు వారి అనుభవాలు ప్రకృతి వ్యవసాయం ఆచరించి అధిక ఆదాయం పొందుతున్న రైతుల విజయ గాధలు, ప్రకృతి వ్యవసాయంలో మెరుగైన నేల ఆరోగ్యం మరియు ఆరోగ్యకర ఉత్పత్తులను మంత్రికి వివరించి తాము తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు.
సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌, వ్యవసాయ శాఖా సంచాలకులు డా. గోపి ఈ సంవత్సరం నుండి ఆరంభించిన ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రగతిని వివరించి ఇప్పటికే రాష్ట్రంలో 489 క్లస్టర్లు ఏర్పాటు చేసి 61,125 రైతులను ఎంపిక చేసినట్లు (50 హెక్టార్లు ప్రతి క్లస్టర్లు), దీనికి గాను కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 42.07 కోట్లు కేటాయించిందని రిసోర్స్‌ పర్సన్‌లకు వాలంతరి ఆధ్వర్యంలో శిక్షణను పూర్తి చేశామని తెలియచేసారు. ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు సూచించిన విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసారు.
తరువాత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటిదాకా రైతులలో ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయని ఒక అపోహ ఉందని, కానీ ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధుల అనుభవాలు మరియు నా అనుభవం, తోటి రైతుల అనుభవాలు ఇది తప్పని నిరూపించాయని, రైతుల నికరాదాయం, మొదటి సంవత్సరం నుండి పెరగడం ఆరంభమైందని తెలియజేసారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకర ఉత్పత్తులు తీసి మార్కెటింగ్‌ అవకాశాలను పెంచుకొనే అవకాశం కలదని, వర్షాధార ప్రాంతాలలో కూడా 3 పంటలు తీసే అవకాశం కలదని, అలాగే కలుపు, చీడపీడల సమస్య కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత కర్తవ్యం నేల ఆరోగ్యాన్ని కాపాడడం తద్వారా మానవాళి ఆరోగ్యం కాపాడడమే కాకుండా రైతుకు నికర ఆదాయం పెంచడమని, ఇది ఒక్క ప్రకృతి వ్యవసాయంతోనే సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More