‘వండని వంటలు’ ఓ అద్భుతం‘వంద వండని వంటలు’ పుస్తకావిష్కరణలో పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఈరోజు హైదరాబాద్‌లోని వారి నివాసంలో ‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకాన్ని పూర్వ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించి… రచయిత, సంకలన కర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డిని అభినందించారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో బయటి ఆహారం మీద ఆధారపడకుండా, అప్పటికప్పుడు చేసుకుని తినేవిధంగా పలువురు అందించిన ఈ వండని వంటలు ఈతరానికి ఓ ఆరోగ్య దిక్సూచి. ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించడమే గాక, సమయాన్ని ఆదాచేసే ఈ పుస్తకం ప్రత్యేకించి బ్రహ్మచారులకు, ఉద్యోగాలు చేసుకునే జంటలకు మరింత ప్రయోజనకారి కాగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం నేపథ్యంలో పలు పుస్తకాలను అందిస్తున్న ‘రైతునేస్తం’ వ్యవస్థాపకులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి చొరవ ఇదే విధంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ డా॥ యడ్లపల్లి వేంకటేశ్వర రావు, రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ‘మిసిమి’ పత్రిక సంపాదకులు అశ్వినీ కుమార్, వలేటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777 కు సంప్రదించండి.

Read More

వండని వంట… అల్లం కారం

అల్లం కారం… వేపకుండా, వేడిచెయ్యకుండా తయారు చేసుకోగల వంటకం…

మామూలుగా అందరి ఇండ్లలో నెలకు సరిపడా అల్లమెల్లిగడ్డ రుబ్బుకునే అలవాటు ఉంటది.

జనరల్‌గా అల్లం ఎల్లిగడ్డ రుబ్బుకున్న మొదటి రోజు నుంచి, పది రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కారం చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటది. నోటికి రుచి లేకుండా ఉన్నపుడు, జ్వరంగా అనిపించినప్పుడు, ఏమి తినాలనిపియ్యనప్పుడు అల్లంకారం చేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం లాగా, అల్లంకారంతో తింటే, కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటది. ఇన్‌స్టంట్‌గా అయిపోతది.

ఈ కారం ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కలిసిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రుబ్బుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టు నుంచి మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం సమపాళ్లలో కలుపుకోవాలి. అయితే అల్లమెల్లిగడ్డ పేస్టు రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. పేస్టు, ఉప్పు, కారం మంచిగా కలిపి, దాంట్లోకి సరిపడా పచ్చడి నూనె వేసుకోవాలి. అంతే అల్లం కారం రెడీ అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినపుడు కూడా దీన్ని ఒక డిష్‌గా పెట్టొచ్చు.

రచన : శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిపాయ పచ్చి పులుసు

తక్కువ దినుసులతో అతి తక్కువ వ్యవధిలో చేసుకోదగిన వండని వంట ఈ పచ్చి పులుసు.

ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గుప్పెడంత తాజా కొత్తిమీరను శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు ఈనెలు గింజలు లేకుండా చూసి, ఒకసారి కడిగి అరకప్పు నీళ్లలో నానబెట్టాలి.

రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మకాయంత బెల్లం పొడిగా అంటే నలగగొట్టి పెట్టుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు దగ్గర పెట్టుకోండి.

ఇపుడు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి, దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తమీర, బెల్లం, పపచ్చిమిర్చి, ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. అంతే ఉల్లిపాయ పచ్చి పులుసు తయారైపోయింది.

దీనికి కంది పచ్చడి మంచి జోడీ. పుల్ల పుల్లగా కొంచెం తీయగా, తక్కువ కారంగా, వేడి వేడి అన్నంతో తింటుంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తమీర పంటికి తగులుతూ ఉంటే…. రుచి మీరే చెప్పాలి.

రచన : మంచికంటి సుబ్బల

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

రోజుకు 400 గ్రాములు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి

ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల వినియోగం తగ్గుతోంది. హైదరాబాదు నగరంలో చాలామంది రోజుకు 250 గ్రాములకు మించి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి తినడం లేదని నిపుణులు చెబుతున్నారు. అది కూడా రోజూ ఏదో ఒక రకం పండు లేదంటే ఆకుకూరకు పరిమితమవుతున్నారు. రోజూ 250 గ్రాములు ఆకుకూరలు, కూరగాయలుంటే మరో 150 గ్రాముల వరకు పండ్ల శాతం ఉండాలంటున్నారు.
ప్రయోజనాలు..
పండ్లు, కూరల్లో మేలు చేసే విటమిన్లు, పోషకాలు, ఫోలిక్ యాసిడ్, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయల్లో పీచు ఎక్కువ. పండ్లలోని సాల్యుబుల్ పీచు వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తాయి. పీచు ఆలస్యంగా జీర్ణం అవుతుంది. కడుపు నిండుగా ఉన్న భావనతో చిరుతిళ్ల జోలికి పోరు. ఫలితంగా ఊబకాయం రాదు. పండ్లు, ఆకుకూరల్లో ఉన్న పీచు వల్ల మలబద్దకం దరిచేరదు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. పండ్లు, కూరల్లో పొటాషియం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. వీటిలోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని కణజాలాన్ని ఉత్తేజితం చేస్తాయి. జుట్టు రాలటం, చర్మం ముడతలు, వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తాయి.
మంచి బ్యాక్టీరియా పెరుగుతంది : డాIIలక్ష్మయ్య మాజీ శాస్త్రవేత్త, జాతీయ పోషకాహార సంస్థ
నగరంలో జంక్ ఫుడ్స్ వినియోగం పెరిగి చాలామంది పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం లేదు. వివిధ అనారోగ్య సమస్యలకు ఆహారపుటలవాట్లే కారణం. పండ్లు, ఆకుకూరలు విరివిగా తీసుకుంటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. జబ్బులకు అడ్డుకట్ట వేయవచ్చు. నిత్యం పెద్దలు 400 గ్రాములు, 18 ఏళ్లలోపు పిల్లలు 250 గ్రాముల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో మిళితం చేసుకోవాలి.

Read More

సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపైసర్టిఫికేషన్‌ కోర్సు

మనుషుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలను నిరోధించుకోవాలంటే సేంద్రియ సాగు విధానంపై అవగాహన పెంచుకోవాలని, సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులను తినాలని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, మైలవరం, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప ప్రిన్సిపల్‌ పి. రంగారావు పేర్కొన్నారు. కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపై సర్టిఫికేషన్‌ కోర్సును శుక్రవారం ప్రారంభించారు. పూల మొక్కల నుంచి పండ్లు, కూరగాయలను ఇళ్లల్లోనే పెంచుకోవచ్చని విభాగాధిపతి జె. రాముడు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు హరిబాబు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Read More