వ్యవసాయం వాటి అనుబంధరంగాల పరిశోధనలు రైతులకు ఉపయోగపడాలని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌)లో సోమవారం వ్యవసాయ పరిశోధన సర్వీసు (ఏఆర్‌ఎస్‌) 115వ ఫౌండేషన్‌ కోర్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ సభ్యుడు, ఐకార్‌ మాజీ కార్యదర్శి చబిలేంద్రరౌల్‌ అన్నారు. పోషకాహార భద్రత, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధానాలు, సహజ వనరుల పరిరక్షణ తదితర కోణాల్లో నూతన ఆవిష్కరణలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జయకృష్ణజెనా, మిసైల్‌ సైంటిస్ట్‌ అరుణ్‌ తివారి, నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌లాల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 మంది ఏఆర్‌ఎస్‌ ప్రొబేషనర్లకు మూడు నెలల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది.