ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) వజ్రోత్సవాల (1962-2024)ను గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీ దేవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథులుగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరవుతారని పేర్కొన్నారు. 29న వ్యవసాయం, అనుబంధ విభాగాల్లో అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న మార్పులపై సదస్సు జరుగుతుందన్నారు. 30న వర్సిటీ రూపొందించిన వంగడాలతో రైతులకు కలిగిన ప్రయోజనాలపై చర్చిస్తారని వెల్లడించారు.

24 Apr, 2025
