ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు నియామకం

ఏపీ ప్రభుత్వం మరో సలహాదారును నియమించింది. కొమ్మెర అంకారావు అలియాస్‌ కొమ్మెర జాజిని అడవుల పెంపకం సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లమల అడవిలో ప్లాస్టిక్‌ ఏరివేత ఒక యజ్ఞంలా నిర్వహించిన చరిత్ర ఈయనకి ఉంది. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు.

Read More

29, 30 తేదీల్లో ఆంగ్రూ వజ్రోత్సవాలు

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) వజ్రోత్సవాల (1962-2024)ను గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌. శారద జయలక్ష్మీ దేవి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథులుగా గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హాజరవుతారని పేర్కొన్నారు. 29న వ్యవసాయం, అనుబంధ విభాగాల్లో అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న మార్పులపై సదస్సు జరుగుతుందన్నారు. 30న వర్సిటీ రూపొందించిన వంగడాలతో రైతులకు కలిగిన ప్రయోజనాలపై చర్చిస్తారని వెల్లడించారు.

Read More