రైతులకు కిసాన్ డ్రోన్ సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ డ్రోన్ సేవలను అద్దె ప్రాతిపదికన సమకూరుస్తోందని వ్యవసాయశాఖ సంచాలకులు మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. యాప్‌లో క్యాబ్, వాహనాల సేవలు అందుకున్నట్లే కిసాన్ డ్రోన్ ఊబరైజేషన్ మొబైల్ యాప్ ద్వారా డ్రోన్ పిచికారీ సేవలు పొందవచ్ౘ్ునని వెల్లడించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుందని, క్యూఆర్ కోడ్ సాయంతోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్ౘ్ని పేర్కొన్నారు. ఈ యాప్ పురోగతిపై ఆయన మంగళవారం జిల్లాల వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘ప్రారంభమైన రెండు వారాల్లో 10,342 మంది రైతులు ఈ యాప్‌లో నమోదు చేసుకున్నారు. 2,654 మంది డ్రోన్ పిచికారీ సేవల కోసం అభ్యర్థనలు పంపారు. ఇప్పటి వరకు 356 ఎకరాల్లో 155 మంది రైతులు డ్రోన్ సేవలను వినియోగించుకున్నారు’ అని సంచాలకులు వివరించారు.

Read More

షుగర్ ఫ్రీ బంగాళాదుంపలు

మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారి కోసం మార్కెట్లోకి ‘లేడీ రోసెట్టా’ రకం బంగాళాదుంపలు రాబోతున్నాయి. వీటి సాగు ప్రపంచంలోనే తొలిసారిగా నెదర్లాండ్స్‌లో జరిగింది. ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న రాజమాత విజయరాజె సింధియా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఏరోపోనిక్స్ ల్యాబ్‌లో ఈ లేడీ రోసెట్టా రకం ఆలుగడ్డలు సాగు చేస్తున్నారు. ఇందులో మట్టి లేకుండా మొక్కలను తీగలపై వేలాడదీసి పెంచుతారు. మరో రెండేళ్లలో ఈ విత్తనాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని ఏరోపోనిక్స్ ప్రాజెక్ట్ హెడ్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుష్మా తివారీ తెలిపారు. ఈ రకం ఆలుగడ్డల్లో పిండిపదార్థం (స్టార్ౘ్్) చాలా తక్కువ, యాంటీఆక్సిడెంట్స్ మోతాదు ఎక్కువ. చక్కెర మోతాదు అతితక్కువ. గుండ్రంగా, లేత గులాబీ రంగులో ఉండే ఈ బంగాళాదుంపలు త్వరగా ఉడకవు. గట్టిగా ఉంటాయి.

Read More

తెలంగాణా సీఎంవో సెక్రెటరీ శేషాద్రితో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి భేటీ

తెలంగాణా రాష్ట్ర సచివాలయంలోని సీఎంవో సెక్రెటరీ శేషాద్రితో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమావేశమయ్యారు. రైతు కమిషన్ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చేసిన పర్యటనలు, అక్కడ అమలవుతున్న వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలపై కమిషన్ తయారు చేసిన నివేదికలను ఆయనకు అందించారు. ప్రధానంగా ఎఫ్‌పీవోల విషయంలో తెలంగాణ రాష్ట్రం వెనుకంజలో ఉందని, ఇతర రాష్ట్రాల్లో ఎఫ్పీవోలు బలంగా పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు ఆర్ధికంగా బలోపేతం కావడంలో ఎఫ్‌పీవోలు కీలకంగా పనిచేస్తున్నాయని చెప్పుకొచ్ౘ్ారు. రైతు కమిషన్ కేరళ, మహారాష్ట్రలోని నాసిక్‌లో పర్యటించిన సమయంలో ఎఫ్‌పీవోల ప్రభావం స్పష్టంగా కనిపించిందన్నారు. కేంద్రం కూడా ఎఫ్‌పీవోల ఏర్పాటుకు సానుకూలంగా వున్న విషయాన్ని కూడా సీఎంవో సెక్రెటరీ శేషాద్రికి కోదండరెడ్డి గుర్తుచేశారు. నాసిక్ లోని సహ్యాద్రి ఎఫ్ పీవో దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తుందని వివరించారు. తెలంగాణలో కూడా ఎఫ్‌పీవోల ఏర్పాటులో ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటాదన్నారు. అదేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థ, కౌలు రైతు విధానాలపై కేరళ రాష్ట్రంలో అమలవుతున్న పాలసీలపై కమిషన్ రూపొందించిన నివేదికలను సైతం సీఎంవో సెక్రెటరీకి అందించారు.

Read More

మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాలపై రైతు కమిషన్ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల సీడ్ ఫార్మ్ వున్నాయని, 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్ లో వివిధ రకాల విత్తనాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి చేస్తున్నట్లు అధికారులు కమిషన్కు వివరించారు. ప్రధానంగా వరి, పెసర, జనుము, కందులు విత్తనోత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఐతే నకిలీ విత్తనాలను అరికట్టాలంటే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. అంతేకాదు విత్తనోత్పత్తి ని పెంచాలని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక విత్తనోత్పత్తి క్షేత్రాల భూములు అన్యాక్రాంతం కాకుండా హద్దులను ఏర్పాటు చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేయాలనీ కోరారు. ఎక్కడైనా భూ సమస్యలు వున్న చోట.. ఆ విషయాలను అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి , సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్ తోపాటు వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ నర్సింగరావు, జాయింట్ డైరెక్టర్ సుచరిత, డీడీఏ నాగమల్లీశ్వరీ, ఏడీఏ ఉషారాణి, సీడ్ ఫార్మ్ కు చెందిన అగ్రికల్చర్ అధికారులు వైద్యనాధ్, సక్రియ నాయక్, ఇంద్రసేన్, అనిల్ కుమార్, వాసు తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More

మత్స్యరంగాన్ని బలోపేతం చేయాలి

చేపపిల్లల పంపిణీ, పెంపకంలో అక్రమాలను అరికట్టాలని, తెలంగాణా రాష్ట్రంలో మత్స్య రంగాన్ని బలోపేతం చేయాలని, రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు హైదరాబాద్ రాంనగర్‌లోని చేపల మార్కెట్‌ను ఆజామాబాద్‌కు మార్చాలని ఆదేశించారు. సోమవారం ఆయన మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. “చేపలు, రొయ్యల పెంపకం, అమ్మకాలతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. మత్స్య శాఖ అధికారులు ఈ రంగం అభివృద్ధికి కృషి చేయాలి” అని కోదండరెడ్డి సూచించారు. మత్స్యశాఖ కమిషనర్ నిఖిల మాట్లాడుతూ పంపిణీ పకడ్బందీగా నిర్వహించాం అని తెలిపారు.

Read More

ఇద్దరు ప్రకృతి వ్యవసాయ రైతులు యూరప్ పర్యటన

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా.. ప్రకృతి వ్యవసాయం చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా దురుబిలికి చెందిన ఆరిక నరసమ్మ, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సంతపాలేనికి చెందిన లాలం జ్యోతి అనే ఇద్దరు మహిళా రైతులకు యూరప్‌లో పర్యటించే అరుదైన అవకాశం దక్కింది. వీరు జర్మనీ, స్విట్ౙర్లాండ్, నెదర్లాండ్స్, పోలండ్, బెల్ౙియం సహా ఏడు దేశాల్లో 30 రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయా దేశాల్లోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆర్గానిక్ ట్రేడ్ ఫెయిర్లను సందర్శిస్తారు. అక్కడ అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించడానికి ఈ ఇద్దరు రైతులను ఎంపిక చేసినట్లు రైతు సాధికార సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైతులతో పాటు అధికారులు యర్రకొండ సుధాకర్, స్వాతి మంగళవారం యూరప్ బయల్దేరనున్నారు. బెర్లిన్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఫార్మింగ్ సంస్థ ఈ పర్యటన నిర్వహిస్తోంది.

Read More

శత వసంతాలకు చేరుకున్న పశుపరిశోధన కేంద్రం

గుంటూరు సమీపంలోని లాంఫామ్ కేంద్రంగా ఏర్పడిన పరిశోధన కేంద్రం శత వసంతాలకు చేరుకుంది. ఒంగోలు జాతి పశువుల సంరక్షణ, విస్తరణ, వ్యాధుల నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణకు విశేష కృషిచేస్తున్న ఈ సంస్థ 1926లో ఏర్పాటైంది. ఈ కేంద్రం కృషితో.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒంగోలు జాతి పశువులు సంఖ్య పెరిగింది. పాలు, వెన్న, కోడెదూడల అమ్మకంతో రైతులు ఆదాయం గడించేవారు. ఈ ప్రభావంతో తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని హోసూరు ప్రాంతాల్లోనూ ఒంగోలు గిత్తల సంఖ్య పెరిగింది.

*ప్రభుత్వాల చేయూత..*

లామ్ ఫామ్‌లోని పశు పరిశోధన కేంద్రం అనేక పరిశోధనలతో అన్నదాతలకు చేరువ అవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేక పథకాలు, నిధులను కేటాయించాయి. పరిశోధనల్లో భాగంగా విదేశీ ఆంబోతుల జన్యువులను చొప్పించి అధిక దిగుబడి ఇచ్ౘ్ే కొత్త సంకర జాతిని తయారు చేశారు. విదేశీ జాతులైన హెచ్.ఎఫ్, బ్రౌన్ స్విస్, జెర్సీ ఆంబోతుల సంకరంతో ఏళ్లుగా జరిపిన ప్రయోగాల వల్ల 50-50 శాతం లక్షణాలు కలిగిన ఒంగోలు- హెచ్.ఎఫ్. సంకరజాతి రూపొందింది. మన దేశ ఉష్ణ మండల శీతోష్ణ స్థితిని తట్టుకుని అధిక ఉత్పాదక శక్తిని ఈ జాతి నమోదు చేసింది. స్వదేశీ జాతులైన ఒంగోలు, గిర్, హరియాణా, థార్‌పార్కర్ గోవులను పరిరక్షించి.. జన్యుపరంగా అభివృద్ధిపై ఈ కేంద్రం దృష్టి సారించింది. పశువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో మేలైన ఆవులు, ఆంబోతులను అనేక ప్రాంతాల నుంచి సేకరించి అభివృద్ధి పరిచారు. దిగజారుతున్న పాల ఉత్పాదక శక్తిని తిరిగి పెంపొందించే పరిశోధనలు చేశారు. ఒంగోలు జాతి పరిరక్షణలో భాగంగా పిండోత్పత్తి, పిండ మార్పిడి జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్తమ జన్యు సంతతిని పెంచేలా కృషి చేస్తున్నారు. పిండ మార్పిడి దూడ సైతం ఇక్కడ జన్మించడం విశేషం. ప్రస్తుతం లామ్ ఫామ్‌లో ఉన్న పిండ మార్పిడి ప్రయోగశాలను జాతీయ స్థాయి ప్రయోగశాలగా గుర్తించారు. ఈ సందర్భంగా లాంఫామ్ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య యం. ముత్తారావు మాట్లాడుతూ.. ఒంగోలు జాతికి పునర్వైభవ దీప్తి, ఆధునిక జీవ సాంకేతిక పశు పరిశోధనలతో రైతు సేవలో శత వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమని వ్యాఖ్యానించారు.

Read More

చేపల పెంపకంతో మంచి ఆదాయం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కి చెందిన భవాని 2007లో ఐటీ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్‌లో రెండేళ్లు ఉద్యోగం చేశారు. ! పెళ్లయ్యాక జబల్‌పుర్‌కు తిరిగివెళ్లి కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. కొవిడ్ విజృంభణతో కోచింగ్ సెంటర్ మూతపడటంతో.. చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. ఏమాత్రం అనుభవం లేకున్నా.. సవాలుగా స్వీకరించి పని మొదలు పెట్టారు. జబల్‌పుర్‌కి 15 కిలోమీటర్ల దూరంలోని హినోటియా గ్రామంలో 4.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పాలిథీన్ షీట్‌తో లైనింగ్ వేసే విధానాన్ని అనుసరిస్తూ.. పంగాసియస్ చేపల పెంపకం ప్రారంభించారు. ప్రస్తుతం ఏటా 20-30 టన్నుల చేపలను విక్రయిస్తూ రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు.

Read More

నిజామాబాద్ జిల్లాలో రేపు కొత్త వ్యవసాయ కళాశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యను మరింత విస్తరించి, రైతు సంక్షేమం-వ్యవసాయ అభివృద్ధికి బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని సుద్దపల్లి మరియు నడపల్లి గ్రామాల పరిధిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్వే నంబర్లు 265/1, 277 మరియు 334లో మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధునిక వ్యవసాయ కళాశాల నిర్మించబడనుంది. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధన, శిక్షణ మరియు రైతు సేవలను ఒకేచోట అందించేందుకు ఈ కళాశాల రూపుదిద్దుకోనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఈ కళాశాల రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక ముఖ్య మైలురాయిగా నిలవనుంది. విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ విద్యను అందించడంతో పాటు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించబడ్డాయని మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ముఖ్య సౌకర్యాలు:

  • 5 ఎకరాలలో ఆధునిక అకడమిక్ బ్లాక్ మరియు పరిపాలన భవనాలు
  • 2 ఎకరాలలో అత్యాధునిక 10 ప్రయోగశాలలు
  • 2 ఎకరాలలో 1000 మంది విద్యార్థులకు వసతి కలిగిన హాస్టళ్లు
  • 1 ఎకరంలో లైబ్రరీ
  • 50 ఎకరాలలో విస్తృత పరిశోధన ఫార్మ్‌లు మరియు సీడ్ ఫార్మ్‌లు
  • 20 ఎకరాలలో విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ కోసం ప్రత్యేక ఫార్మ్‌లు
  • 10 ఎకరాలలో మోడల్ ఫార్మ్ మరియు రైతు శిక్షణ బ్లాక్
  • 10 ఎకరాలలో సైన్స్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్
  • 8 ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఇండోర్ స్టేడియం
  • 3 ఎకరాలలో ఆడిటోరియం, గ్యాలరీ మరియు సెమినార్ హాళ్లు
  • 3 ఎకరాలలో అధ్యాపకులు మరియు సిబ్బందికి నివాస వసతులు
  • 1 ఎకరంలో ఆరోగ్య కేంద్రం మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఈ సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాటవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ, ఆధునిక పరిశోధన, రైతులకు ప్రత్యక్ష శిక్షణ మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుందని మంత్రిగారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కళాశాల ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత స్థాయి వ్యవసాయ విద్య అందుబాటులోకి రానుండగా, రైతులకు నూతన పంట విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాల అభివృద్ధి మరియు సాగు విధానాలపై శిక్షణలు అందించి వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు దోహదం చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యువతను వ్యవసాయ రంగంలో ఆకర్షించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణాన్ని చేపట్టిందని, ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కళాశాల ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసి, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ రంగంలో విశేష అనుభవంతో ఆధునిక సాగు పద్ధతులతో మార్గదర్శి గా నిలిచిన మంత్రి తుమ్మల వ్యవసాయ విద్యకు మూడు దశాబ్దాల క్రితమే బాటలు వేశారు. అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాల స్థాపనకు రూపకల్పన చేసిన తుమ్మల నాటి అనుభవాలతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ విద్య విస్తరణ ప్రాధాన్యంపై ప్రతిపాదనలు చేయగా, వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ కళాశాల స్థాపనకు సంతోషంగా ఆమోదం తెలిపారు. వ్యవసాయ కళాశాల స్థాపనలో మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేస్తున్నారని వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్లు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగనున్న వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల కోరారు.
Read More

త్వరలో పశు ఔషధి కేంద్రాలు

జాతీయ పశు వ్యాధుల నియంత్రణ పథకం కింద పశు ఔషధి కేంద్రాలను కేంద్ర పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు బుధవారం ప్రకటించారు. వీటితో నాణ్యమైన జనరిక్ పశు ఔషధాలు చౌక ధరలకే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కేంద్రాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు(పీఎం-కేఎస్‌కేలు), సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తారని, జిల్లా, మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు https://pashuaushadhi.dahd.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చు లేదా, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఈ కేంద్రాలకు ఆపరేటింగ్ మార్ౙిన్‌గా 20శాతం ఇస్తారని తెలిపారు.

Read More