పురుగుల నివారణకు సహవాస పంటగా… వెల్లుల్లి

వెల్లుల్లితో మానవుల అనుబంధం 7000 సంవత్సరాలు. ఇది ఒక ఔషధ గడ్డ మొక్క. సులభంగా సాగు చేయవచ్చు. వెల్లుల్లిని పాయల ద్వారా ప్రవర్థనం చేస్తారు. సేంద్రియ పదార్థమెక్కువగా ఉన్న భూముల్లో వెల్లుల్లి బాగా పెరుగుతుంది. ఇది 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. 0.75 నుండి 1.0 అడుగు వరకు విస్తరిస్తుంది. ఏప్రిల్-మేలో పుష్పిస్తుంది. పూత ఎరుపు తెలుపు రంగులో ఉంటుంది. పూలు అందంగా ఉంటాయి. సీతాకోక చిలుకల నాకర్షిస్తాయి. వెల్లుల్లి వార్షిక, హెర్బల్ మొక్క. ఆకులు సువాసన కలిగి ఉంటాయి. ఆకులు ఆకుపచ్ౘ్ రంగులో సన్నగా గడ్డిలాగా ఉంటాయి..

సాధారణ నామం : గార్లిక్ శాస్త్రీయ నామం : అల్లియం సెటైవం కుటుంబం: అమరిల్లిడేసి

ఉపయోగాలు : ఆరోగ్యరంగంలో … ఆయుర్వేద రంగంలో

  • వెల్లుల్లి చాలా శక్తివంతమైన ఔషధ మొక్క. అనేక వ్యాధుల చికిత్సలో దీనిని 5000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నారు. అనేక శాస్త్రీయ అధ్యయనాల తర్వాత వెల్లుల్లి తన ప్రాశస్త్యాన్ని తిరిగి సంతరించుకుంది.
  • ట్యూమర్, క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. ఉదర, కోలన్, ఊపిరితిత్తులు, రెక్టం క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. శక్తివంతమైన సహజ ఆంటిబయాటిక్, యాంటిసెప్టిక్, యాంటివైరల్, యాంటిఇన్‌ఫెక్షన్, జీర్ణాశయ, ఉదర పారసైట్లపై పోరాడుతుంది.
  • శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధులు, బ్రోంకైటిస్ నుండి కాపాడుతుంది. పసుపుతో కలిసి వాతావరణ కాలుష్యం, పొగాకు పొగ నుండి, జలుబు, జ్వరం నుండి రక్షిస్తుంది. కొలెస్టరాల్‌ని అధికంగా తగ్గిస్తుంది. నోటి పుళ్ళు, గొంతునొప్పి, అలసట, ప్లేగ్, కలరా, రాబీస్ నుండి కాపాడుతుంది.
  • హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించి తగ్గిస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది.
  • తగ్గిన శక్తి, ధైర్యాన్ని తిరిగి తెస్తుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. శరీరావయవాలను చలి నుండి కాపాడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

వ్యవసాయరంగంలో
పురుగుల నివారణ :

  • వెల్లుల్లి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించి నష్టం కలిగించే ట్రెబోలియం కాస్టేనియంని అతితక్కువ గాఢతలో వికర్షించింది. పెద్ద పురుగులు, లార్వాలపై ఫ్యూమిగెంట్, కాంటాక్టు చర్యలను ప్రదర్శించి, పెద్ద పురుగులలో గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించింది. అభివృద్ధి ప్రక్రియలలో జోక్యం చేసుకుని లార్వాలు ప్యూపాలుగా, ప్యూపాలు పెద్ద పురుగులుగా మారడాన్ని నిరోధించింది. యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. (ముఖేష్‌కుమార్ బేబే, 2013)
  • వెల్లుల్లి నీరు మరియు మిథనాల్ ద్రావణాలు (1000 పిపియం) పొగాకులద్దె పురుగు లార్వాలను 81% మరియు 64% చంపాయి (మెరిగ, అతని అనుచరులు, 2012)
  • వెల్లుల్లిని అనేక సంవత్సరాలుగా ప్రధాన పంటగా పురుగుల నివారణకు సహవాస పంటగా సాగు చేస్తున్నారు.
  • క్యాబేజి వరుసల మధ్య వెల్లుల్లి లేదా ఉల్లి అంతర పంటగా నాటితే పురుగులను వికర్షిస్తాయి. కనుక చిన్న కమతాల రైతులు వెల్లుల్లి లేదా ఉల్లిని క్యాబేజి పంటలో అంతర పంటగా వేసి పురుగుల తాకిడిని తగ్గించవచ్చు. (దేబ్రా, మిషెక్, 2014)
  • వెల్లుల్లి పొడి, వెల్లుల్లి ద్రావణం, వెల్లుల్లి నూనె పిచికారి పురుగులను నివారిస్తుంది. గార్లిక్ నూనె యాంటి బాక్టీరియల్, యాంటిఫంగల్, కీటకనాశన లక్షణాలు కలిగి ఉంది. గార్లిక్ నూనెని మినరల్ ఆయిల్, సబ్బు ద్రావణంతో కలిపితే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది (లేరాగోమెజ్, సైంటిస్ట్, సియంపిఆర్, కేరళ)

వెల్లుల్లి గడ్డ ద్రావణం :
కావలసిన పదార్థాలు : తరిగిన వెల్లుల్లి 85 గ్రా., మినరల్ ఆయిల్ (కిరోసిన్ లేదా వెజిటబుల్ ఆయిల్) 50 మి.లీ., సబ్బు ద్రావణం 10 మి.లీ., నీరు 950 మి.లీ., ప్లాస్టిక్ బాటిల్ 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని వెజిటబుల్ ఆయిల్‌కి కలపాలి. ఈ మిశ్రమాన్ని 24 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత దీనికి నీరు, సబ్బు ద్రావణం కలిపి కలియత్రిప్పి బాటిల్‌లో నిల్వ ఉంచాలి.

ఉపయోగించే విధానం : ఒక భాగం ఎమల్షన్‌ని 19 భాగాల నీటికి కలపాలి (50 మి.లీ. ఎమల్షన్‌ని 950 మి.లీ. నీరు కలపాలి. పిచికారి చేసే ముందు బాగా కదిపి ఉదయం వేళ పంటపై పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : ప్రత్తి బోల్‌వర్మ్, ఆర్మీవర్మ్, కాటన్ స్టెయినర్, ఉల్లి, తామర పురుగులు, పొటాటో మాత్, రూట్ నాట్ నెమటోడ్, చెరకు కాండం తొలుచు పురుగు, బాక్టీరియా తెగుళ్ళు, ఆంత్రాక్నోస్, బూజు తెగులు, వరి అగ్గితెగులు, కాయకుళ్ళు తెగుళ్ళు, బూడిద తెగులు, త్రుప్పు తెగుళ్ళు.

వెల్లుల్లి నూనె :
కావలసిన పదార్థాలు : వెల్లుల్లి 100 గ్రా., మినరల్ ఆయిల్ 2 చెంచాలు, నీరు 10.5 లీటర్లు, సబ్బు ద్రావణం 10 మి.లీ., మూత ఉన్న పాత్ర 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఈ ముక్కలను మినరల్ ఆయిల్‌లో ఒక రోజు నానబెట్టాలి. అరలీటరు నీరు, సబ్బుద్రావణం కలిపి బాగా కలియ త్రిప్పాలి.
ఉపయోగించే విధానం : వడపోసిన ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలపాలి. స్ప్రేయర్లో నింపి నూనె నీటిపై తేలకుండా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. మొక్క పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు : క్యాబేజి వర్మ్, పచ్చదీపపు పురుగులు, స్క్వాష్ బగ్స్, తెల్లదోమలు (ప్రకాష్, రావు ;1997)

గార్లిక్ ఆయిల్ ఎమల్షన్ :
కావలసిన పదార్థాలు : గార్లిక్ ఆయిల్ 50 మి.లీ., నీరు 950 మి.లీ., సబ్బు ద్రావణం 1 మి.లీ.

తయారు చేసే విధానం : సబ్బు ద్రావణాన్ని నూనెకి కలిపి బాగా కలపాలి. నీరు కలిపి బాగా కలియ త్రిప్పాలి.

ఉపయోగించే విధానం : నూనె నీటిపై తేలకుండా తయారు చేసిన వెంటనే పిచికారి చేయాలి. ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : బోల్‌వర్మ్, పొటాటోట్యూబర్‌మాత్, వరి అగ్గి తెగులు, వరి గోధుమ మచ్చ తెగులు, రూట్‌నాట్ నెమటోడ్ (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1999)

వెల్లుల్లి ద్రావణం నివారించే పురుగులు, తెగుళ్ళు

  • వేరుశనగలో నులి పురుగులు, స్ట్రాబెర్రీ వెస్ట్రన్ ఫ్లవర్ తామర పురుగులు
  • వెల్లుల్లి ద్రావణం ఆల్టర్నేరియా, బోట్రైటిస్, మాగ్నపోర్థె, ఫ్యుజేరియం శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది.
  • వరిలో అగ్గితెగులు, ఫైటోఫ్తోరా ఇన్‌ఫెస్టాన్స్ (పొటాటోలేట్ బ్లెåట్)
  • దోస పంటలో బూడిద తెగులు, బూజుతెగుళ్ళను నివారించింది.
  • టమాటలో ఆకుతొలుచు పురుగు, కందిలో ఎర్రనల్లి, నులి పురుగులు
  • వెల్లుల్లి, మిరప ఆకు ద్రావణాలు క్యాబేజి పంటనాశించే ప్లుటెల్లా క్ౙెలోస్టెల్లా, బ్రెవికారినెబ్రాసికె, హెలుల్లా అండాలిస్, ట్రైకోప్లూసియాని పురుగులను రసాయన పురుగుమందు “అటాక” కన్నా తక్కువ ఖర్చులో నివారించాయి. గార్లిక్ ద్రావణం అత్యధిక ఖర్చు : లాభం నిష్పత్తి (1:16)ని నమోదు చేసింది. అటాక్ పిచికారి చేసిన ప్లాట్లలో ఖర్చు : లాభం నిష్పత్తి 1:9.2 మాత్రమే. అందువలన వెల్లుల్లి ద్రావణాన్ని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. (బైడు, మోచయ్య, 2016).
  • గోధుమ గింజల నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని వెల్లుల్లి, పసుపు ద్రావణాలు సమర్ధవంతంగా నివారించాయి (సజ్ౙద్ ఆలీ, అతని అనుచరులు, 2014)
  • వెల్లుల్లి పొడి, ద్రావణం, నూనె నిల్వ ఉంచిన అలసంద గింజలను కాల్లొసోబ్రూకస్ మాక్యులేటస్ కల్గించే నష్టం నుండి కాపాడాయి (డెన్లోమె, 2010)
  • గార్లిక్ ద్రావణం {+1% సబ్బు ద్రావణం పీచ్ పొటాటో పేనుబంక, మైజస్ పెర్సికెని నివారించింది (డాన్స్‌విక్ౙ్, అతని అనుచరులు, 2011)
  • వెల్లుల్లి, వేప, పొగాకు, కలబంద ద్రావణాలు పురుగుల నివారణకుపయోగిస్తాయి. వీ\న్నింటిలో వెల్లుల్లి ద్రావణం అతి సమర్ధవంతంగా పనిచేస్తుంది (మెలెస్, అతని అనుచరులు, 2012)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడల్లం పచ్చడి

ప్రకృతి మానవాళికి ప్రసాదించిన ఒక మంచి ఆహారం ‘మామిడి అల్లం’ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది అల్లం జాతికి చెందిన దుంప. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చూడ్డానికి అల్లం దుంపలా వున్నా, గిచ్చి చూస్తే పచ్చి లేత మామిడికాయ వాసనతో చిన్న పాటి వగరుతో వుంటుంది.

మామిడి అల్లాన్ని ఉపయోగించి ‘వండనివంట’గా రోజువారీగా ఉపయోగపడే రోటి పచ్చడి చేసుకోవచ్చు.
కొన్ని రోజులు నిల్వ వుండే ఆవకాయ పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు.

మామిడల్లంతో రోటి పచ్చడి తయారీ…
మామిడల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చేర్చి చింత పండు లేదా నిమ్మ రసం కలిపి కచ్చాపచ్చాగా నూరుకుని, అన్నంలోకి లేదా రోటీలోకి తింటే చాలా బావుంటుంది.. (అవసరం అనుకున్న వారు ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే మరింత రుచి.. )
ఈ పచ్చడి ఏరోజుకారోజు చేసుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ వుండదు.

రెండవ పద్దతి ‘మామిడి అల్లం – ఆవకాయ’
మామిడల్లాన్ని కడిగి తేమ లేకుండా ఆరబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కోసుకున్న ముక్కలకు కొద్దిగ ఆవపిండి, కొద్దిగ కారం, సరిపడ ఉప్పు కలిపి, నువ్వుల నూనె కూడా సరిపడా కలిపి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలపాలి. తరువాత నిమ్మ రసం కలిపి వూరనివ్వాలి. ఇది అచ్చు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిలా వుంటుంది. కొన్ని రోజులు ఫ్రిజ్ సహాయం లేకుండా నిల్వ వుంటుంది. ఫ్రిజ్‌లో దాస్తే మరింత తాజాగా వుంటుంది. అభిరుచినిబట్టి తాలింపు అదనం. గింజలు తీసిన పచ్చిమిర్చి ముక్కలు, కారెట్ ముక్కలు, మామిడి పొడి కూడా కలిపి మిక్సెడ్ పచ్చడి చేయవచ్చు.

  • రచన : సుబ్బారెడ్డి మేడపాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వరల్డ్‌ జూనోసిస్‌ డే

జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా. అని ఓ మహాకవి తన గీతంలో పేర్కొన్నట్లు పెంపుడు జంతువులకు ఉండే విశ్వాసం కన్న కొడుకులకు కూడా ఉండదనే నానుడి ఏనాటి నుంచో వినిపిస్తుంది. పెంపుడు జంతువు కనబరిచే విశ్వాసం దాని పట్ల మనం ఏర్పర్చుకొనే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. మనిషి జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమను పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం. ఆప్యాయతలోనూ అప్రమత్తత! పెంపుడుజంతువుల పెంపకంలో జాగ్రత్తలు అవసరం . ముఖ్యంగా జంతులన్నింటిలో ఇళ్ళ దగ్గర ప్రత్యేకంగా మక్కువగా పెంచి పోషించడం తరతరాలుగా ఒక సంప్రదాయంగా వస్తుంది. జమిందారుల నుంచి రైతు కూలి వరకు తనకు సహాయంగా కుక్క ఉంటుందని పెంచుకుంటారు. కొన్ని చోట్ల యజమాని ఇంటి వద్ద లేనప్పుడు ఇంటికి కాపలా కాయడం మనకు తెలిసిందే. దొంగలను తరిమికొట్టడం దగ్గర నుంచి నాగుపాములను సైతం ఇంట్లోకి చొరబడకుండా అడ్డుకునే సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి చోట పెంపుడు జంతువులన్నిటికన్నా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ వాటి వల్ల వచ్చే రేబిస్‌ వ్యాధి కూడా అంతటి భయంకరమైనదే.

రేబిస్‌ వ్యాధినివారణకు సకాలంలో వ్యాక్సిన్‌ తీసుకోకపోతే ప్రాణానికే నష్టం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కుక్కకాటు మరణాలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఆస్పత్రుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్‌ నివారణ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండక ఎన్నో ప్రాణాలు హరించుకుపోతున్నాయి.

వ్యాక్సిన్‌ ఉత్పత్తి అంతంత మాత్రంగా ఉండడంతో కొరత చాలా ఎక్కువగా కన్పిస్తుంది. ఒక్క మనదేశంలోనే కాదు ఎన్నో దేశాల్లో ఇది తీవ్రమైన సమస్యగా ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 95 శాతం మానవ మరణాల్లో రేబిస్‌ వ్యాధి వల్ల మృతులైనవారే ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. 5 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కుక్కకాటు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సిన్‌ధర 40 డాలర్లు ఉంటే ఆసియా దేశాల్లో 49 డాలర్ల వరకు వ్యాక్సిన్‌కు ఖర్చుపెడితే కానీ దొరకడం లేదు. సామాన్యుని సగటు సంపాదన రెండు డాలర్లకు మించి లేనప్పుడు ఈ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి వినియోగించడం అనేది తన శక్తికి మించిన పని. అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి రేబిస్‌ రహిత ప్రపంచంగా మార్చాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఏటా పదిహేను మిలియన్‌ ప్రజలు కుక్కకాటు వల్ల రేబిస్‌ వ్యాధికి గురవుతున్నారు. పెంపుడు జంతువుల నుంచి సహజ సిద్ధంగా సంక్రమించే వ్యాధులను జునోసెస్‌ అంటారు. ఇలాంటి జూనోటిక్‌ వ్యాధులు దాదాపు200వరకు ఉన్నాయి.

అసలు జూనోసిస్‌ అంటే..

జూనోటిక్‌ అనే ఇటాలియన్‌ పదం నుంచి పుట్టిందే జూనోసిస్‌. ‘జూ’ అంటే జంతువులకు సంబంధించిన అంశం. మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్నే జూనోటిక్‌ వ్యాధులంటారు. ఇలాంటి వాటిని ఇప్పటి వరకు 253 వరకు గుర్తించారు.

వీటిలో ‘ర్యాబిస్‌’ (పిచ్చికుక్క వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకరమైనది, ప్రాణాంతకరమైన వ్యాధి. లూయిస్‌పాశ్చర్‌ అనే వ్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై ఆరు 1885 వ సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా యాంటీర్యాబిస్‌ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. ఆ రోజును అంటే జూలై ఆరో తేదీని ఆనాటి నుంచి వ్రతి సంవత్సరం ‘వరల్డ్‌ జూనోసిస్‌ డే’గా నిర్వహిరచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జూనెటిక్‌ వ్యాధుల గురించి వ్రజలను అవ్రమత్తర చేసి, రోగాల బారిన వడకుండా చేయటమే వరల్డ్‌ జూనోసిస్‌ డే ప్రధానోద్దేశ్యము . జంతువులు, వక్షులకు సంభంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సరక్రమించి సాధారణ సమస్యలతోపాటు ప్రాణహాని కలిగేంతటి వ్రమాద పరిస్థితులెదురవుతున్నాయి. ఈ కారణముగా జంతువులు, కోళ్లు, పక్షులను పెంచేవారు, ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో వనిచేసేవారు, వశువుల ఆస్పత్రుల సిబ్బంది, చర్మము , తోళ్ల వరిశ్రమల కార్మికులు ఈ జూనోటిక్‌ ప్యాధుల వట్ల ఆప్రమత్తముగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఇలాంటి జూనోటిక్‌ వ్యాధులు దాదాపు200వరకు ఉన్నాయి. వీటిలో ర్యాబిస్‌ (పిచ్చి కుక్క వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకర మైన, ప్రాణాంతకమైన వ్యాధి. లూయీస్‌ పాశ్చర్‌ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, పిచ్చికుక్క కాటుకు గురి అయిన వ్యక్తికి జూలై 6, 1885 వ తేదీన మొట్టమొదటిసారిగా ఏంటీ ర్యాబిస్‌ టీకాను విజయవంతంగా చేశారు.చారిత్రకంగా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపో యే ఆ రోజును అంటే జూలై 6వ తేదీని ఆనాటి నుండి ప్రతి సంవ త్సరం వరల్డ్‌ జూనోసిస్‌ డే (ప్ర పంచ జూనోసిస్‌ దినోత్సవం)గా నిర్వహించుకోవటం ఆనవాయితీగావస్తోంది.

జంతువుల నుండి మ నుషులకు,మనుషుల నుండి జంతువులకు సంక్రమించే ఈ జూనో టిక్‌ వ్యాధుల గురించి ప్రజలకు, రైతులకు, పశువైద్య సిబ్బందికి అవగాహనను కల్పించడం ద్వారా, వారిని అప్రమత్తం చేసి, రోగాల బారిన పడకుండా చేయడం వరల్డ్‌ జూనోసిస్‌ డే ప్రధాన ఉద్దేశ్యం. జంతువులు, పక్షులను పెంచుకునేవారు వాటితో సన్నిహితంగా ఉంటారు. పాలను, పాలఉత్పత్తులను,మాంసం, జంతు ఉత్పత్తుల ను ఉపయోగించనివారు బహుశా ఎవరూ ఉండరు. ఆ క్రమంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జూనోటిక్‌ వ్యాధి బారినపడేఅవకాశం ప్రతి ఒకరికి ఉంటుంది. కాబట్టి వినియోగదారుల దృష్టిని ఆకర్షించి, ఈ వ్యాధులపట్ల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ తెలుసుకునేలా, ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించడానికి వరల్డ్‌ జూనోసిస్‌ డే నాడు పశు సంవర్థక శాఖ, పశు వైద్య కళాశాలలు, సంబంధిత సంస్థలు వివిధ కార్యక్రమాలను నిర్వహించటం జరుగు తుంది.

జూనోటిక్‌ వ్యాధులు మనుషులకు రావటానికి ఎన్నో మార్గాలున్నాయి. అవేంటంటే..మనిషి తన జీవనోపాధికి, పశువుల పెంపకం, గొర్రెల, మేకల పెంపకం, కోళ్లపెంపకం వంటి వృత్తుల పైన ఆధారపడటం సర్వసాధారణం. మరికొందరు వృత్తిగా కాకపోయినా,అవసరార్థం ఆసక్తితో,ఆకర్షణతో కొన్ని రకాల జంతువ్ఞలు, పక్షులను, పెంచుతూ ఉంటారు. వృత్తిగా చేపట్టినవారు ఆదాయాన్ని పొందుతున్నారు. దాంతో పాటే పాలు, గ్రుడ్లు,మాంసం వంటి పౌష్టి కాహారాన్ని తద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఒక ఆసక్తితో పెంచేవారు ఆనందాన్ని, వినోదాన్ని పొందుతున్నారు.ఆదాయాన్ని ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే ఈ జంతువులు, పక్షుల పెంపకంలో కొన్ని సమస్యలు, ప్రమాదాలు కూడా పొంచిఉంటాయి.వృత్తిగా చేపట్టినా, ఆసక్తితో పెంచినా, యజమానులు, పనిచేసే వారు ఆయా జంతువులు, పక్షులకు అత్యంత సన్నిహితంగా మెలు గుతూఉంటారు.అలాంటప్పుడు ఆ జంతువులు,పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి, సాధారణ సమస్యల నుండి ప్రాణ హానిని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులు, జంతువులు, కోళ్ళు, పక్షులను పెంచేవారు, జంతు ప్రయోగశాలలు, వ్యాధినిర్ధారణా కేంద్రాలలో పనిచేసేవారు, పశు వైద్యశాల సిబ్బంది, చర్మం, తోళ్ల పరిశ్రమలలో పనిచేసేవారు, ధాన్యపు గిడ్డంగుల్లో పనిచేసేవారు ఈ జూనోటిక్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌,ప్రోటోజోవా, ఫంగస్‌, క్లామిడే వంటి జీవుల వలన ఈ జూనోటిక్‌ వ్యాధులు వస్తాయి. 

వ్యక్తుల వయసు, ఆరోగ్య పరిస్థితి, శరీరంలోని వ్యాధినిరోధకశక్తి వంటి అంశాలను అనుసరించి ఈ వ్యాధులు సోకటం,వాటి తీవ్రత అవి కలిగించేహానీ ఆధారపడి ఉంటాయి. అలాగే వ్యాధి కారకం మనిషికి ఎంత వరకు హాని కలిగించగలుగుతుంది అనేది ఆ వ్యాధి కారకం రకం. జాతిపైన ఆధారపడి ఉంటుంది. గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించటం ద్వారా వ్యాధి సంక్రమణ జరుగుతుంది.

  • వైరస్‌ ద్వారా వ్యాపించే జూనోటిక్‌ వ్యాధులు ర్యాబిస్‌, మెదడు వాపు, మ్యాడ్‌కౌ.
  • బాక్టీరియావల్ల వ్యాపించే జూనో టిక్‌ వ్యాధులు బ్రూసెల్లోసిస్‌, క్షయ, సాల్మొనెల్లోసిస్‌, ఆంత్రాక్స్‌, గ్లాండర్స్‌,
  • పరాన్న జీవుల వలన వ్యాపించే జూనోటిక్‌ వ్యాధులు ఏంకైలో, స్టోమియాసిస్‌, హైడాటియోసిస్‌, అలర్జీ, ఎగ్జిమా(గజ్జి) అమీబియాసిస్‌, బాలంటీడియోసిస్‌, టాక్సోప్లాస్మా.

ఏయే వృత్తుల లో ఉన్న వారికి ఏయే జూనోటిక్‌ వ్యాధులు రాగల అవకాశం ఉందో పరిశీలిద్దాం. పిచ్చి కుక్క కాటు వలన ర్యాబిస్‌, కుక్కపిల్లలతో ఆడే వారికి టాక్సోకారియాసిస్‌, కుక్కులను, లేగదూడలను తాకినప్పుడు గజ్జి, చర్మవ్యాధులు,పందులు, దోమలవలన మెదడువాపు వ్యాధి, అపరిశుభ్రమైన పాలు, గ్రుడ్లు,మాంసం వల్ల బ్రూసెల్లోసిస్‌, ఎలుకల వలన ప్లేగు, పశువులతో సన్నిహితంగా మెలగటం వల్ల క్షయవ్యాధి, ఉన్ని, తోళ్ల పరిశ్రమలలో పనిచేసేవారికి దొమ్మరోగం ( ఆంత్రాక్స్‌), సరిగా వుడకని గ్రుడ్లు, మాంసం వలన సాల్మొనెల్లోసిస్‌, పంది మాంసం వలన టినియా సోలియం, కర్ర కోత పనిచేసేవారికి సాల్మ నెల్లోసిస్‌, గొర్రెలు, మేకల కాపరులకు గజ్జి దురద, కోళ్ల ద్వారా రాణికెట్‌, సిట్టకోసిస్‌, మాంసపు పరిశ్రమలలోని కూలీలకు క్యూఫీవర్‌ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.

ప్రపంచాన్ని వణికించిన ముఖ్యమయిన జూనోటిక్‌ వ్యాధులు:

ర్యాబిస్‌ : పిచ్చికుక్క కాటు వలన ఈ వ్యాధి కలుగుతుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 30వేల మంది ఈ వ్యాధి వలన చని పోతున్నట్లు ఒక అంచనా. మూగజీవాల ద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రాబిస్‌. తోడేళ్లు, నక్కలు, ముంగిసల్లో ఈవ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి.
ఆంత్రాక్స్‌: జూనోటిక్‌ వ్యాధుల్లో , ఆంత్రాక్స్‌ ప్రాణాంతకమైనవి. ఈవ్యాధి స్పోర్స్ ఉన్న పచ్చగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తుంది. గాలి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. వ్యాధి నివారించాలంటే ఆంత్రాక్స్‌ వ్యాధి గుర్తించిన ఆరు కిలోమీటర్ల పరిధిలో ఐదేళ్లపాటు నిర్ణీతగడువులో వ్యాధినిరోధకటీకాలు చేయించాలి. మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే పరీక్షలు చేయించి అత్యవసర చికిత్స అందించాలి.

మెదడువాపు : మెదడు వాపు ని ఆంగ్ల భాషలో ఎన్‌సెఫలైటిస్ అని పిలుస్తారు. మెదడులోని కణజాలం ఒరుపుని (ఇన్‌ఫ్లమేషన్) మెదడు వాపు అని పిలుస్తారు. ఇది సాధారణంగా వైరస్‌ల వల్ల వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిలో అనేక రకాలను గుర్తించారు. భారతదేశంలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల మెదడు వాపు వస్తుంది. ఈ వైరస్ లు పక్షులు, పందులు, ఎలుకల్లాంటి వాటిలో ఉంటాయి. ఈ జీవులు వైరస్ లకు ఆశ్రయంగా పనిచేస్తాయి. వీటి నుంచి క్యూలెక్స్ దోమకాటు ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తాయి.ఈ వ్యాధి పందుల శరీరంపైన ఉండే దోమలు కాటు వేయటం ద్వారా సోకుతుంది. ఎందరో చిన్న పిల్లలు ఈ వ్యాధి వలన మరణిస్తున్నారు. తలనొప్పి, జ్వరం, మెదడు సక్రమంగా పనిచేయక ఒకవైపు పక్షవాతం కలగడం, మూర్ఛ రావడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు.

మ్యాడ్‌ కౌ వ్యాధి : ఆహారం వలన కలిగే వ్యాధి (దీనిని ఆహారం వలన కలిగే రోగము మరియు వ్యవహారికంగా విషాహార వ్యాధి అంటారు). కలుషితమైన ఆహారం తినడం వల్ల ఇది సంభవిస్తుంది ఒకప్పుడు ఇంగ్లండ్‌లో ఈ వ్యాధి వలన విప రీతమైన జన నష్టం జరిగింది. మ్యాడ్‌ కౌ డిసీజ్‌ గతంలో యూరప్‌ దేశాలను వణికించిన మహమ్మారి ఇది! గొడ్డు మాంసం(బీఫ్‌) ద్వారా ఈ వ్యాధి మనిషి మెదడుకి వ్యాపిస్తుంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి. వ్యవహార శైలిలో తీవ్రమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఒక రకంగా మానసిక రోగిగా మారిపోతాడు. జ్ఞాపక శక్తి కోల్పోవడం, శారీరకంగా నీరసించిపోవడం, పొంతన లేకుండా మాట్లాడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కారణంగా అప్పట్లో యూరప్‌ ప్రజలు లక్షలాదిగా గోవులను వధించారు. చాలా సంవత్సరాలపాటు గొడ్డు మాంసానికి దూరంగా ఉన్నారు.

బర్డ్‌ప్లూ: ఈ వ్యాధి అవయిన్‌లూప్లెంజా అనే సూక్ష్మక్రిమివల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వచ్చేటప్పుడు కోళ్ళుచాలా ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధితో ఉన్న కోళ్ళ మాంసం, రెట్టల ద్వారా మనుషులకూ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చలి కాలంలో వస్తుంది.
టీబీ: దీనిని ట్యూబోలలోసిస్ అంటారు. ఇది బ్యాక్టిరీయా ద్వారా మనుషులకు, పశువులకు వచ్చి ప్రతీ సంవత్సరం అనే మంది చనిపోతున్నారు. టీబీతో ఉన్న పశువుల పాలు బాగా మరిగించకుండా తాగినట్లైయితే మనుషులకు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వ్యాధి సోకిన జంతువులు, కోళ్ల మాంసం తినకూడదు, పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి,సరిగా ఉడకని గ్రుడ్లను తిన కూడదు.
  • వ్యాధి సోకిన పశువుల పాలను సేవించకూడదు. చెడిపోయిన అపరిశుభ్రమైన పాలు, మాంసం, గ్రుడ్లు తినకూడదు. పాలను బాగా మరగించి తాగాలి.
  • పాడిపశువులను, జంతువులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలాను గుణంగా ఇవ్వాల్సిన వ్యాధినిరోధక టీకాలను తప్పనిసరిగా చేయించాలి.
  • పాలను క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా ప్రాథమికంగా పరీక్షించాలి. పశువులు,జంతువులు, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాలలో డాక్టర్‌ సర్టిఫికేట్‌ తీసుకునే విధానం సక్రమంగా అమలు చేయాలి.
  • పోస్ట్‌మార్టం పరీక్షలు విధిగా నిర్వహించాలి, వధశాలల దగ్గర శుభ్రత, జంతువుల ఆరోగ్యంపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. ర్యాబిస్‌,ఆంత్రాక్‌, గ్లాండర్స్‌ వంటి వ్యాధులగురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి.
  • మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో సున్నం చల్లి వూడ్చివెట్టాలి.
  • జంతు ఆవాసాలను అప్పుడప్పుడు క్రిమిసంహారాకాలతో శుభ్రము చేయాలి
  • పెంపుడుకుక్కలకు తప్పనిసరిగా ఏంటీ ర్యాబిస్‌ టీకాను వేయించాలి. కుక్కలను పెంచేవారు, పశువైద్య సిబ్బంది ఏంటీర్యాబిస్‌ టీకాను ముందుగానే వేయించుకోవాలి.
  • పశువులు, జంతువులకు విధిగా నట్టల నివారణ చేయాలి, పౌల్ట్రీఫారాలు, జంతుప్రదర్శన శాలలు, సర్కస్‌ కంపెనీలలో పనిచేసే వారు, డైరీ ఫారాలలో పనిచేసేవారు, పశుపోషకులు,జంతుప్రేమికుల వ్యక్తి గత పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధచూపాలి. మాస్క్‌ ధరించటం శ్రేయ స్కరం. మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో సున్నంచల్లి పూడ్చిపెట్టాలి.

పాటించాల్సిన జాగ్రత్తలివీ..

  • వీధి కుక్కల నిర్మూలన,
  • ఊరికి దూరంగా 3, 4 కిలోమీటర్ల దూరంలో పరిశుభ్రమైన వాతావరణంలో పందులు పెంచాలి.
  • పశుపెంపకం దారులు పాలఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి.
  • పెంపుడు కుక్కలకు తప్పక రాబిస్‌ నిరోధక టీకాలు వేయించాలి.
  • చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటపుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.

పశుసంవర్థకశాఖ, ఆరోగ్యశాఖ,పంచాయితీ, మున్సిపల్‌ అధికారులు ర్యాబిస్‌ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు, జూనోటిక్‌ వ్యాధుల ప్రచారం, నివారణలో క్రియాశీలక పాత్ర వహించాలి. జూనోసిస్‌ డేను విజయవంతం చేసి ప్రజలలో అవగాహనను పెంచటంలో అందరూ సహకరించాలి.

కుక్క కరిస్తే తప్పక రాబిస్‌ వ్యాధి వస్తుందా?

  • మనుషుల్ని కుక్కలు కరవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇలా కుక్కలు కరవడం వలన మనకు రాబిస్‌ వ్యాధి వచ్చేమాట నిజమే అయినా అది అన్ని కుక్కలకూ వర్తించదు. కేవలం పిచ్చి కుక్క కరిచినప్పుడు మాత్రమే మనకు రాబిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మనల్ని కరిచిన కుక్క పిచ్చిదో కాదో ఎలా తెలుస్తుంది అంటారా? అందుకో చక్కటి ఉపాయం ఉంది.
  • ఏదైనా ఒక కుక్క ఎటుపోవాలో ఎందుకు పోవాలో తెలీకుండా ఎక్కడి కంటే అక్కడికి పోతూ ఉండటం, దాని నోటి నుంచి చొంగ కారుతూ ఉండటం, అది ఎవరినిపడితే వారిని అకారణంగా కరుస్తూ ఉండటం వంటివి చేసినట్లయితే అది నిస్సందేహంగా పిచ్చికుక్కే అయి ఉంటుంది. అలాగే ఏదైనా ఓ కుక్క మనల్ని కరిచిన తరువాత పదిరోజుల్లోగా చనిపోయినా అది పిచ్చికుక్క అని తేలినట్లే.
  • ఏదేమైనా కుక్క కరిచినప్పుడు మన శరీరంపై అయ్యే గాయాలను కనీసం 5 -10 సార్లు సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. దాంతో పాటు స్పిరిట్‌తో గానీ, అయోడిన్‌తోగానీ గాయాలను శుభ్రం చేస్తే కుక్కకాటు వల్ల సంభవించేందుకు అవకాశం ఉన్న ప్రమాదం నుండి మనం 90 శాతం బయటపడినట్లే. అయినాసరే, ఈ ప్రథమచికిత్స చేశాక డాక్టర్ని తప్పక సంప్రదించాలి.
  • ఏదేమైనా మనల్ని కరిచిన కుక్క పిచ్చిదో కాదో తెలుసుకోవడం కొంచెం కష్టమైన వ్యవహారం కాబట్టి, కుక్క కరిచినప్పుడు ముందుజాగ్రత్త చర్యగా టీకాలు వేసుకోవడమే మంచిది.
  • డాక్టర్.జి.రాంబాబు, పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, కడప. Ph: 9494588885
Read More

జంతువులలో గాలికుంటు వ్యాధిని పోలి ఉండే వ్యాధులు మరియు వాటి భేదాత్మక నిర్ధారణ

జంతువులలో కనిపించే అంటువ్యాధులలో గాలికుంటు వ్యాధి ఒక అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది ముఖ్యంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులలో కనిపిస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు నోటిలో పుండ్లు, కాళ్ల వద్ద గాయాలు, జ్వరం మరియు ఆహారం తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే గాలికుంటు వ్యాధి లాంటి లక్షణాలు మరికొన్ని వ్యాధులలో కూడా కనిపిస్తాయి. అందువల్ల సరైన చికిత్స మరియు నియంత్రణ చర్యల కోసం భేదాత్మక నిర్ధారణ చాలా అవసరం.

ఒక నిర్దిష్ట వ్యాధి లేదా పరిస్థితిని, అదే విధమైన లక్షణాలు చూపించే ఇతర వ్యాధుల నుంచి వేరు చేసి గుర్తించడాన్నే భేద నిర్ధారణ లేదా భేదాత్మక నిర్ధారణ అంటారు. ఇందులో మొదట సంభావ్య వ్యాధుల జాబితా తయారు చేసి, తరువాత పరీక్షలు లేదా మూల్యాంకనాలు చేసి ఒక్కో అవకాశాన్ని తొలగిస్తూ చివరికి అత్యంత సంభావ్యమైన నిర్ధారణకు చేరుకుంటారు. జంతువులలో ఒకే విధమైన లక్షణాలు అనేక వ్యాధులలో కనిపిస్తాయి. ఉదాహరణకు గాలికుంటు వ్యాధి, వెసిక్యులర్ స్టొమటైటిస్, నీలినాలుక వ్యాధి వంటి వ్యాధులలో నోటిలో పుండ్లు మరియు కాళ్ల వద్ద గాయాలు కనిపించవచ్చు. అందువల్ల సరైన వ్యాధిని ఖచ్చితంగా గుర్తించడం చాలా అవసరం. 

సాధారణంగా భేదాత్మక నిర్ధారణ కోసం చరిత్ర తెలుసుకోవడం (అంటే ఇతర జంతువులకు వ్యాపించిందా, ఇటీవల కొత్త జంతువులు తీసుకొచ్చారా, టీకాలు వేయించారా), క్లినికల్ పరిశీలన (జంతువులో కనిపించే లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం) మరియు ప్రయోగశాల పరీక్షలు (ఎలైసా & పి.సి.ఆర్)  వంటి పద్ధతులను పాటిస్తారు.

భేదాత్మక నిర్ధారణ యొక్క ప్రాముఖ్యత

  • సరైన వ్యాధి గుర్తింపు – లక్షణాలు ఒకేలా ఉన్నా నిజమైన వ్యాధిని గుర్తించడంలో సహాయపడుతుంది.
  • సరైన చికిత్స అందించడం – వ్యాధిని సరిగ్గా గుర్తిస్తే తగిన మందులు మరియు చికిత్స ఇవ్వవచ్చు.
  • వ్యాధి వ్యాప్తి నియంత్రణ – అంటువ్యాధులను త్వరగా గుర్తించి ఇతర జంతువులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.
  • ఆర్థిక నష్టాన్ని తగ్గించడం – పాల ఉత్పత్తి తగ్గడం, జంతువుల మరణాలు వంటి నష్టాలను తగ్గించవచ్చు. .
  • అనవసర చికిత్స నివారణ – తప్పు నిర్ధారణ వల్ల అవసరం లేని మందులు వాడకుండా ఉంటుంది.
  • టీకాలు మరియు నివారణ చర్యలకు సహాయం – సరైన వ్యాధి తెలిసిన తర్వాత తగిన టీకాలు మరియు నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు.
  • పశుసంపద రక్షణ – రైతుల పశుసంపదను ఆరోగ్యంగా కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  • ప్రయోగశాల పరీక్షల అవసరాన్ని నిర్ణయించడం – ఏ పరీక్షలు చేయాలో నిర్ణయించడానికి సహాయపడుతుంది. ఈ వ్యాసంలో గాలికుంటు వ్యాధిలో ఉండే లక్షణాలు ఏంటి మరియు దానిని పోలిఉండే ఇతర వ్యాధులు, వాటి లక్షణాలు, సరైన వ్యాధిని గుర్తించడం ఎలా అనే వాటి గురించి తెలుసుకుందాము.

గాలికుంటు వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు

  • అధిక జ్వరం
  • నోటిలో పుండ్లు మరియు బుడగలు
  • నాలుకపై గాయాలు
  • కాళ్ల గిట్టల వద్ద పుండ్లు
  • ఎక్కువగా లాలాజలం కారడం
  • కుంటుతూ నడవడం
  • పాల ఉత్పత్తి తగ్గడం వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులు
    గాలికుంటు వ్యాధి ని పోలిఉండే ఇతర వ్యాధులు:
  1. వెసిక్యులర్ స్టొమటైటిస్:
    కారణం : రేబ్డో విరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులో వైరస్ వల్ల వచ్చే వ్యాధి.

లక్షణాలు

  • నోటిలో బుడగలు
  • నాలుకపై గాయాలు
  • కాళ్ల వద్ద పుండ్లు
  • అధిక లాలాజలం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – ఇది ముఖ్యంగా గుర్రాలలో కూడా కనిపిస్తుంది, కానీ గాలికుంటు వ్యాధి గుర్రాలలో సాధారణంగా రాదు.
  1. బోవైన్ వైరల్ డయేరియా:
    కారణం – ఫ్లేవి విరిడే కుటుంబానికి చెందిన పెస్టి వైరస్ వల్ల వచ్చే వ్యాధి

లక్షణాలు

  • నోటిలో గాయాలు
  • విరేచనాలు
  • బలహీనత
  • జ్వరం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద బుడగలు సాధారణంగా ఉండవు మరియు విరేచనాలు ఎక్కువగా కనిపిస్తాయి.
  1. రిండర్పెస్ట్ పశువుల్లో పారుడు వ్యాధి:
    కారణం – పేరామిక్సో విరిడే కుటుంబానికి చెందిన మోర్బిలి వైరస్.
    లక్షణాలు
  • అధిక జ్వరం
  • నోటిలో పుండ్లు
  • విరేచనాలు
  • నీరసం
    వ్యాధికి గురయ్యే జంతువులు ఆవులు, గేదెలు
    గాలికుంటు వ్యాధితో తేడా – తీవ్రమైన విరేచనాలు ప్రధాన లక్షణం. కాళ్ల గాయాలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి ఇండియాలో అధికారికంగా నిర్మూలించబడింది.
  1. నీలినాలుక వ్యాధి :
    కారణం – రియో విరిడే కుటుంబానికి చెందిన ఆర్బి వైరస్
    లక్షణాలు
  • నోటి వాపు
  • నాలుక నీలం రంగులో మారడం
  • జ్వరం
  • కుంటడం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గొర్రెలు, మేకలు, ఆవులు మరియు జింకలు
    గాలికుంటు వ్యాధితో తేడా – గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది మరియు మరియునాలుక నీలం రంగులో ఉండటం ప్రత్యేక లక్షణం.
  1. కాంటాక్ట్ డెర్మటైటిస్:
    కారణం – రసాయనాలు లేదా విషపదార్థాల వల్ల చర్మం దెబ్బతినడం.
    లక్షణాలు
  • కాళ్ల వద్ద గాయాలు
  • చర్మ వాపు
  • నడవడంలో ఇబ్బంది
    వ్యాధికి గురయ్యే జంతువులు – ఏ జంతువైనా రసాయనాలు మరియు విషపూరిత పదార్థాలను తాకడం లేదా తినడం వల్ల
    గాలికుంటు వ్యాధితో తేడా – నోటిలో పుండ్లు ఉండవు. ఇది అంటువ్యాధి కాదు.
  1. ఫుట్ రాట్:
    కారణం – ఫ్యూజోబ్యాక్టీరియం నెక్రోఫోరం మరియు డైకిలోబ్యాక్టార్ నొడోసస్ వంటి బ్యాక్టీరియా.
    లక్షణాలు:
  • కాళ్లలో వాపు
  • నడవడంలో ఇబ్బంది లేదా కుంటడం
  • గిట్టల మధ్య దుర్వాసనతో కూడిన పుండ్లు
  • తీవ్రమైన నొప్పి మరియు ఇన్ఫెక్షన్
    వ్యాధికి గురయ్యే జంతువులు: గొర్రెలు, మేకలు, పశువులు మరియు ఇతర గిట్టలున్న జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – గాలికుంటు వ్యాధి వల్ల నోటిలో మరియు గిట్టలపై బొబ్బలు ఏర్పడతాయి. కాగా ఫుట్రాట్ ప్రధానంగా గిట్టల ప్రాంతానికే పరిమితమై, కుంటడం మరియు గిట్టలు దెబ్బతినడం కలిగిస్తుంది, గిట్టల మధ్య భాగంలో దుర్వాసనతో కూడిన కుళ్లిన కణజాలాన్ని కలిగిస్తుంది. ఇందులో సాధారణంగా నోటిలో పుండ్లు కనిపించవు.
  1. మౌత్ రాట్:
    కారణం – అవకాశవాద బ్యాక్టీరియా లైన ఏరోమోనాస్, సూడోమోనాస్ మరియు సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా
    లక్షణాలు
  • నోటిలో దుర్వాసన
  • పుండ్లు
  • తినకపోవడం
    వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పక్షులు మరియు వేరే ఏ జంతువైనా పైన పేర్కొన్న బ్యాక్టీరియా సోకినప్పుడు
    గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద గాయాలు ఉండవు. ప్రధానంగా నోటిలోనే సమస్య ఉంటుంది.

ముగింపు
గాలికుంటు వ్యాధిని పోలి కనిపించే అనేక వ్యాధులు జంతువులలో కనిపిస్తాయి. భేద నిర్ధారణ అనేది పశువైద్యంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సరైన భేద నిర్ధారణ లేకపోతే తప్పు చికిత్స జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల క్లినికల్ లక్షణాలు, ప్రయోగశాల పరీక్షలు మరియు జంతువు చరిత్ర ఆధారంగా ఖచ్చితమైన నిర్ధారణ చేయాలి. రైతులు మరియు పశువైద్యులు అప్రమత్తంగా ఉండి సమయానికి చర్యలు తీసుకుంటే పశుసంపదను రక్షించవచ్చు. దీని ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడి రైతులకు ఆర్థిక రక్షణ లభిస్తుంది.

డా.తనూజ నాదెళ్ళ, సహాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ గాలికుంటు వ్యాధి సహకార కేంద్రం, వి.బి.ఆర్.ఐ., విజయవాడ. ఫోన్: 9121000747

Read More

తులసి – కలబంద ద్రావణం

తులసి కలబంద ద్రావణం శక్తివంతమైన ద్రావణ ఎరువేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ నిరోధకంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక కూడా. మన పొలంలోనే లభించే తులసి ఆకులు మూడు నాలుగు కిలోలు, కలబంద మూడు నాలుగు కిలోలు సేకిరించి చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి దానికి పది కిలోల కోళ్ల ఎరువు, పది కిలోల పేడ, పదిలీటర్ల మూత్రం కలపాలి. ఈ విశ్రమానికి ఒక కిలో బెల్లం చేర్చాలి. రోజూ కలుపుతూ పోతే వారం రోజుల్లో తులసి, కలబంద నీటిలో పూర్తిగా కలిసి ద్రావణంగా మారుతుంది. దీన్ని పైరుకు పైపాటుగా పిచికారి చేయడంతో పాటు నేల తడిలో కలిపి కూడా ఇవ్వవచ్చు. పై పాటు పిచికారికి లీటరుకు 50 మిల్లీ లీటర్ల ద్రావణం కలుపుకోవాలి. ఈ ద్రావణం శక్తివంతమైన ద్రవ ఎరువే కాకుండా శిలీంద్ర, బ్యాక్టిరియా, వైరల్ సమస్యలను అడ్డుకుంటుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

బహుళ ప్రయోజనాలుగల ఔషధ మొక్క…. ఉల్లి

ఉల్లి ఒక ఏకదళ, ద్వైవార్షిక లేదా బహువార్షిక మొక్క అయినప్పటికీ, సాధారణంగా దీనిని ఏకవార్షిక మొక్కగా సాగు చేస్తారు. ఉల్లి మొక్క అనేక గొట్టంలాంటి నీలిఆకుపచ్చ రంగు నుండి ముదురు ఆకుపచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది. మొక్క క్రింది భాగం చిన్న గడ్డ కలిగి ఉండి ఊరిన తర్వాత ఉల్లిగడ్డగా మారుతుంది. గడ్డలు కురచబడిన, భూమిలోపల అణచబడిన కాండముల చుట్టూ మెత్తని మార్పు చెందిన పొలుసులు (ఆకులు) కాండం చివర మధ్యలో ఉన్న మొగ్గను కప్పి ఉంచుతాయి. వసంతకాలంలో ఆకులు ఎండి చనిపోయి గడ్డ పైపొరలు ఎండి పెళుసుగా మారతాయి. ఉల్లి ప్రతి సంవత్సరం గడ్డలను, రెండు సంవత్సరాలకొకసారి గింజలను ఉత్పత్తి చేస్తుంది. పూలకాడ గట్టిగా, గొట్టంలా ఉండి మైనపు పొరతో 1 మీ. ఎత్తు పెరుగుతుంది. పూగుచ్ఛం గొడుగు ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. పూలు తెల్లని రంగులో ఉంటాయి. కాయ ఒక కాప్సూల్. పునరుత్పత్తి విత్తనాల ద్వారా జరుగుతుంది.

సాధారణ నామం: ఆనియన్ శాస్త్రీయ నామం: అల్లియంసెపా కుటుంబం: అమారిల్లిడేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఉల్లి కాడలు, గడ్డలు, గింజలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
  • ఉల్లి యాంటి ఆక్సిడెంట్, రోగనిరోధకశక్తి, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉండి అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఉల్లిని ఊబకాయం కలిగి ఉన్న వారికి బరువు తగ్గించే చికిత్సలో ఉపయోగిస్తారు.ఆహారంగా ఉల్లి శరీరానికి అనేక పోషకాలనందిస్తుంది.
  • ఔషధంగా ఉల్లి అధిక కొలెస్టరాల్, మధుమేహం, కీళ్ళ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు, ఆకలి మందగించడం, అధిక రక్తపోటు, గొంతు నొప్పి, ఆస్త్మా, బ్రోంకైటిస్, దగ్గు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో నులిపురుగుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఉల్లిలో కీంప్‌ఫెరాల్, మిరిస్టిన్, క్వెర్సెటిన్, క్వెర్సిట్రిన్, అల్లెåల్‌సల్ఫైడ్ అనే రసాయనాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్. ఇది మంచి యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇంకొక ముఖ్య రసాయనం, అల్లెåల్ సల్ఫైడ్, యాంటిఆక్సిడెంట్, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉంటుంది.
  • ఉల్లి యాంటి ఆక్సిడెంట్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటికొలెస్టరాల్, యాంటీహైపర్ సెన్సిటివ్, యాంటిక్యాన్సర్, యాంటిఆర్థ్రెåటిక్, యాంటిబాక్టీరియల్ లేదా యాంటిబయాటిక్, బ్రాంకోడైలేటర్, ఎక్స్‌పెక్టొరెంట్, యాంటిస్పాస్మోడిక్, యాంటిసెప్టిక్, కార్మినేటల్, పైబ్రినోలైటిక్, యాంథెల్మిటిక్, యాంటికోయాగ్యులెంట్ ఔషధ గుణాలు కలిగి ఉంది.
  • ఉల్లి శరీరంపై మచ్చలు తొలగించడానికి, కాల్పులు, గాయాలు, కేశనష్టం, మధుమేహం, అధిక కొలెస్టరాల్, అధిక రక్తపోటు, ఆస్త్మా, సాధారణ జలుబు, పొడి దగ్గు, గొంతునొప్పి, బ్రాంక్రైటిస్, ఆకలి లేకపోవడం, కడుపులో కలవరం, కంటిచూపు, శుక్లాలు, గుండెనొప్పి వంటి సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో …

  • క్యాబేజి పంటలో ఉల్లి, వెల్లుల్లి పంటలను పురుగు నివారణ అంతర పంటలుగా సాగు చేస్తారు. ఈ అంతర పంటలు అల్లిసిన్ ఉత్పత్తి ద్వారా పురుగులను వికర్షిస్తాయి. వీటి వేర్ల నుండి స్రవించే ద్రవాలు వాటి వాసన ద్వారా పురుగులను వికర్షిస్తాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి క్షేత్రంలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాక్ౙెåలోస్టెల్లా లార్వాలు, ప్యూపాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతర పంటలు సాగు చేసిన క్యాబేజి క్షేత్రంలో అధిక సంఖ్యలో క్యాబేజి మొక్కలు బతికి ఉన్నాయి. ఉల్లి, వెల్లుల్లి యాంటిఫీడెంట్ చర్య ద్వారా ఆకుతినే పురుగులను పారదోలాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి పంటలో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. సన్న, చిన్న కారు రైతులు క్యాబేజిలో ఉల్లి, వెల్లుల్లిలను అంతర పంటలుగా సాగు చేసి అధిక దిగుబడులు, అధిక ఆదాయం పొందవచ్చని ఫలితాలు వెల్లడించాయి (దేబ్ర అండ్ మిషెక్, 2014).
  • పైన్ మొక్కల మీద అల్లం, వెల్లుల్లి ద్రావణాలను పిచికారి చేసి మిడతలను వికర్షింపజేశారు. మిడతలు అల్లం, వెల్లుల్లి ద్రావణాల వాసనను అసహ్యించుకుని దూరంగా పారిపోయాయి.
  • ఉల్లి, వెల్లుల్లి, అల్లం ద్రావణాలు ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదల నరికట్టాయి. అందువలన వీటిని సహజ శిలీంద్ర నాశినులుగా ఉపయోగించవచ్చు. (ముడ్యివ, అతని అనుచరులు, 2016).
  • ఉల్లి ద్రావణం నుండి తయారు చేసిన సిల్వర్ నానోపార్టికల్స్ బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లాన్యుమోనియే, ఎస్కరిచియాకోలి, బాసిల్లస్ ఎంటరోబాక్టర్ (బాక్టీరియా), ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ (శిలీంద్రాలు)లపై గణనీయమైన యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ చర్యలను ప్రదర్శించాయి (బాలమణికందన్, అతని అనుచరులు, 2015).
  • ఉల్లిగడ్డను సన్నగా తరిగి రెండు చెంచాల నూనెలో ఒక రోజు నానబెట్టాలి. తర్వాతి -ఒక అర లీటరు సబ్బు నీటిలో కలిపి వడపోయాలి. ఈ ద్రావణాన్ని 1:20 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • నివారించబడే తెగుళ్ళు : సెర్కోస్పొరా ఆకుబూజు, ఆకుమచ్చ, ఎర్లీబ్లెåట్, కప్పకన్ను తెగులు, కొల్లెటోట్రైకం ఆకుమచ్చ, ఆంత్రాక్నోస్, కాయకుళ్ళు, స్మడ్ౙి, కర్వులేరియా ఆకుమచ్చ, ఆకుమాడు
  • ఎరుపు రంగు పొరలున్న ఉల్లిపాయలలో కెటచాల్ అనే ఫినాలిక్ కాంపౌండ్ స్మడ్ౙి తెగులు కలిగించే శిలీంద్రం, కొల్లెటోట్రైకం సిర్సినాన్స్, సోకకుండా వ్యాది నిరోధక శక్తిని సమకూరుస్తుంది (లింక్ అండ్ వాకర్, 1933).
  • ఉల్లి బోట్రైటిస్ సినరియా ఆశించినపుడు సైక్లోపెంటోన్‌క్లాస్‌కి చెందిన సిబ్యులిన్స్ అనే ఫైటోఎలక్సిన్‌ని ఉత్పత్తి చేసి శిలీంద్రబీజం మొలకెత్తడాన్ని, జెర్మ్‌ట్యూబ్ పెరగడాన్ని అరికడుతుంది (డిమత్రీన్, అతని అనుచరులు, 1990).
  • కంద దుంప నిల్వ సమయంలో ఆశించే మాత్ డాసిసెస్ రుగోసెల్లాని మిరప (కాప్సికం యాన్యువమ్, కాప్సికం ఫ్రూటెసెన్స్) పొడులు అతి సమర్ధవంతంగా 24 గంటలలోపే 100% మాత్ పురుగులను చంపాయి. సిడియంగ్వినీన్స్, ఉల్లి, వెల్లుల్లి పొడులనుపయోగించిన 3 రోజులలో సమర్దవంతంగా నివారించాయి (అషామొ, 2010).
  • ఉల్లిని అన్ని పురుగుల (పిండినల్లితో సహా)ను సమర్ధవంతంగా అరికట్టి, మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచి, దిగుబడులను అదికం చేసే గోమూత్ర జంతునాశక ద్రావణం తయారీలో ఉపయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ స్థానికంగా లభిస్తాయి. దీని తయారీ విధానం సులభం. అంతేగాక ఇది పర్యావరణహిత పద్దతి. కూరగాయల పంటలలో దీనినుపయోగిస్తే కూరగాయల రుచి, వాసన పెరుగుతాయి.
  • ఉల్లిలో ఉండే ఆల్కలాయిడ్లు చాలా రకాల తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడతాయి. ఉల్లి కషాయం వ్యాదికారకాల పెరుగుదలను నిలిపివేయడంలోను, తెగులు కారకాల బీజాలు మొలకెత్తడాన్ని నియంత్రించడంలోను ఉపయోగపడుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లి – నిమ్మ పచ్చడి

రెండు ఉల్లిగడ్డలు, రెండు నిమ్మకాయలు, ఉప్పు, కారం, పసుపు ఉంటే చాలు. అయిదే నిమిషాల్లో తయారు చేసుకోగలిగే చతుర్రుచుల (పులుపు, కారం, ఉప్పు, ఉల్లిఘాటు) పచ్చడి రెడీ!

ఉల్లిగడ్డలను సన్నగా తరిగి గిన్నెలో పెట్టుకోవాలి. వీటిలో నిమ్మ రసం పిండుకోవాలి. కొద్దిగ పసుపు కలిపి అన్ని ముక్కలకు పట్టేలా స్పూన్‌తో కలపాలి. ఎవరి రుచిని బట్టి వారికి కావలసినంత కారం, ఉప్పు అదే గిన్నెలో వేసి, స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ‘ముంతకిందిపప్పు’ అని, జాతరలలో కలుపుతారు కద, అలా బాగా కలుపుకోవాలి.

వేడి వేడి అన్నంలో, ఈ ‘ఉల్లి – నిమ్మ’ పచ్చడి వడ్డించుకుని తింటే, వండిన వంటలన్నీ బలాదూర్!

ఉల్లిపాయలలో పీచు, నిమ్మరసంలో ‘సి’ విటమిన్ పసుపులో ఆరోగ్యం అన్ని కలగలిపిన సహజ పచ్చడిది.

వేడి చెయ్యనక్కర లేదు, వేపడం కూడా అవసరం లేదు, వండవలసిన అవసరం అసలే లేదు. నిముషాల వ్యవధిలో తయారు చేసుకోవచ్చు.

వంటలు చేసుకునే స్టూడెంట్స్, సింగిల్‌గా ఉంటున్న ఉద్యోగులు, సమయం తక్కువ ఉన్నవారు, నేచురల్ పద్ధతిలో ఇలా ట్రై చెయ్యడం బెటర్. పోషకాలు, ఫ్లేవర్లు మాత్రమే కాకుండా, చాలా ముఖ్యమైన జీవశక్తి పూరితమైన పచ్చడి ఉల్లి – నిమ్మ పచ్చడి

  • రచన : కావూరి మారుతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

పచ్చని డాబా… ఆరోగ్యానికి బాట

పట్టణ ప్రాంతాలలో, జనాభా పెరుగుదలతో ఎక్కువ భూమి ఇంటి నిర్మాణానికి వినియోగించబడుతుంది. అందువలన కూరగాయలను పండించడానికి భూమి దొరకడం కష్టంగా మారింది. ప్రత్యేకంగా కుండీలను, కంటైనర్లను ఉపయోగించి పండ్ల మొక్కలను, కూరగాయలను ఇంటి ఖాళీస్థలంలో లేదా డాబాపై పెంచుకోవడం ఒక్కటే మార్గం. నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడే కూరగాయలను పండించడానికి 40-50చ.మీ. స్థలం సరిపోతుంది. కంటైనర్లలో మట్టిని సంవత్సరానికొకసారి మార్చాలి. పాటింగ్ మిశ్రమంలో మట్టి, ఇసుక, వేపపిండి, జీవన ఎరువులు సరైన పాళ్ళలో ఉండాలి. పెరటిలోను, ఇంటి పైకప్పుపైనా మొక్కలు సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులతో కూరగాయలు, పండ్లు పండించి ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందంపొందవచ్చు.

ఇంటి మిద్దెపై ఒక సెంటు స్థలం ఉన్నప్పటికీ ఇంటికి సరిపడా కూరగాయలు చాలా సులువుగా సాగు చేసుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేని చక్కని రుచికరమైన కూరగాయలన్నింటినీ స్వయంగా పండించవచ్చు.

మిద్దె తోటలో మొక్కల పెంపకము వల్ల లాభాలు: మిద్దె తోటలో మొక్కల పెంపకం ద్వారా ఏడాది పొడవునా పురుగు మందుల అవశేషాలు లేని తాజా ఉత్పత్తులు లభిస్తాయి. ఆహార, ఆరోగ్య భద్రత పొందవచ్చు. పచ్చదనాన్ని పెంపొందించడంతో ప్రాణవాయువు పెరిగి, గాలిలో హానికర బొగ్గుపులుసు వాయువు తగ్గుతుంది. ఉత్పత్తులు నాణ్యంగా పోషకాలతో నిండి ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంటి పై మిద్దె తోటలో మొక్కల పెంపకం వలన మంచి వ్యాయామం లభిస్తుంది. పండ్ల, కూరగాయల ఖర్చు తగ్గుతుంది. స్థలం, అపార్టుమెంట్ల విలువ పెరుగుతుంది. పైగా ఈ మిద్దె తోటల పెంపకం వలన వేసవిలో ఉష్ణోగ్రతలను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

మిద్దె తోటను ఏర్పాటు చేసుకునే విధానం : పీవీసీ పైపులతో స్టాండ్లు ఏర్పాటు చేసుకొని, వాటిపై ఖాళీ ప్లాస్టిక్‌ డబ్బాలు పెట్టాలి. ఆ ఖాళీ డబ్బాల్లో ఎర్రమట్టి, వర్మీ కంపోస్టు, పశువుల పేడ నింపాలి.

మిద్దెపై వార్షిక కూరగాయల మరియు పండ్ల మొక్కల పెంపకం యొక్క ప్రణాళిక: మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ డాబాపై పెంచుతున్నదైతే ముందుగా ఇంజనీరు చేత డాబా పైకప్పు గట్టిదనాన్ని పరీక్షింపజేయాలి. అంటే మన ప్రణాళిక ప్రకారం కూరగాయలు, పండ్లు మొదలైనవి పెంచడానికి తట్టుకోగలదో లేదో పరీక్షించాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగు నీటి పారుదల సౌకర్యం తప్పని సరిగా ఉండాలి. ప్రణాళికబద్ధంగా మొక్కలను నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు కలిగి ఉండాలి. మొక్కలను పెంచడానికి ఎత్తైన మడులను ఏర్పాటు చేయాలి. ట్రెల్లీస్ ఏర్పాటుచేసి తీగలు పారించాలి. డాబాలపైన, బాల్కనీలలోనూ పెరిగే మొక్కలు ఎక్కువ గాలికి, ఎక్కువ వేడికి గురవుతాయి. ఎత్తులో అమర్చిన కుండీలు ఒకే వరుసలో ఉండాలి. వీటిని తేలికపాటి మట్టి మిశ్రమంతో నింపాలి. మట్టి మిశ్రమంతో నింపక ముందు సరైన మురుగునీటి పారుదల సౌకర్యం ఏర్పాటుచేయాలి. షేడ్ నెట్ కాని, పందిరికాని ఏర్పాటుచేసుకొని ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పూలను కూడా పెంచుకోవచ్చు.

కుండీల ఎంపిక: కుండీలను ఎంచుకునేటప్పుడు మురుగునీరు పోవడానికి రంధ్రాలున్న వాటినే ఎంచుకోవాలి. కుండీలలోపల వైపు మెరుపులేని కుండీలు ఎంచుకోవాలి. మెరుపు ఉంటే సీసం, మట్టి మిశ్రమంలో కలుస్తుంది. కుండీలను బంకమట్టితో, ప్లాస్టిక్, చెక్క లేదా లోహంతో తయారుచేస్తారు. కుండీల ఎంపికలో మొక్కలు పెరిగే ఎత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

తొట్టి/ప్లాస్టిక్ సంచులు: మనకున్న ఖాళీ స్థలాన్ని బట్టి కావలసినంత పొడవు 9-20″ లోతు సిమెంట్ తొట్లు నిర్మించుకొని /ప్లాస్టిక్ సంచులు ఉపయోగించుకొని మట్టి మిశ్రమాన్ని (2 భాగాలు ఎర్రమట్టి + 1 భాగం ఇసుక + 1 భాగం కంపోస్టు) నింపుకొని పండ్లు, కూరగాయల పంటలను పెంచుకోవచ్చు. పై అంచునుండి అంగుళం ఖాళీని నీరు పెట్టడానికి వీలుగా వదలాలి.

మట్టి కుండీలు: కుండీల ప్రక్క నిలువుగాను, పైభాగం వెడల్పుగాను ఉంటుంది. ఇటువంటి కుండీలలో ఎక్కువ మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపవచ్చు.

ప్లాస్టిక్ కుండీలు: గుండ్రంగా, చదరంగా ఉన్న ప్లాస్టిక్ కుండీలను ఇంటిలో పెరిగే మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇవి తేలికగా మరియు రంధ్రాలు కలిగి తిరిగి వాడుకోవడానికి అనువుగా ఉండి తక్కువ స్థలంలో నిల్వచేసుకోవడానికి వీలుగా ఉంటాయి.

కుండీలు నింపే పద్ధతి: మిద్దె తోటల పెంపకంలో మట్టి అతి ముఖ్యమైనది. మంచి మట్టి వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి. మార్కెట్లో అనేక పాటింగ్ మిశ్రమాలు లభిస్తాయి. 3 భాగాల కంపోస్ట్ లేదా కంపోస్టు ఎరువును ఒక భాగం తేలిక బరువున్న పీట్ తో కలిపి పాటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. నాటే కూరగాయలకు నారు మొక్కల పెంపకానికి లోతు తక్కువ పళ్ళాలను /తొట్లను మట్టి, ఇసుక, కంపోస్ట్ (1:1:1) మిశ్రమంతో కలిపి విత్తనాలను చల్లాలి. మట్టి మిశ్రమాన్ని తొట్లు/బారిల్స్/బకెట్లు/ప్లాస్టిక్ సంచుల్లో నింపే ముందు వాటి అడుగున నీరుపోయే రంధ్రాన్ని ఏర్పర్చాలి. తొలుత నీరుపోయే రంధ్రాన్ని చిన్న చిన్న పెంకులతో కప్పాలి. దీని వలన నీరుపోయే రంధ్రం గుండా మట్టి మిశ్రమం జారిపోకుండా అదనపు నీరు మాత్రమే బయటకు పోతుంది. ఆ తర్వాత గరుకు ఇసుక పోసి సమం చేయాలి. దానిపై ఒక అంగుళం మందంతో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టు పరిచి దానిపై మట్టి మిశ్రమాన్ని అంచువరకు నింపాలి. ఇంటి మేడపైన మొక్కలు పెంచే కంటైనర్లను ఒక పద్ధతిలో ఉంచాలి. నీరు పోయడం, కలుపు తీత అంతరకృషి కాయ/ఆకు కోతకు అనువుగా మనిషి నడిచేందుకు వీలుగా దారి వదలాలి. మిద్దెపై చుట్టూ ఉండే పెరాపెట్ గోడపై 6 అడుగుల దూరంలో ఇనుప చువ్వలు నాటి వాటికి ట్రెల్లీస్ లా బైండింగ్ వైర్ అల్లించాలి. వాటిపైకి తీగజాతి కూరగాయల్ని పాకించి, నిలువు స్థలంలోను ఫలసాయం పొందవచ్చు.

ఎరువుగా ఇంటి వ్యర్థాలు: మొక్కల ఎండిన ఆకులను తొలగించి ఓ బకెట్‌లో నిల్వ ఉంచాలి. కూరగాయల వ్యర్థాలను సైతం అందులో వేయాలి. వాటిపై కొద్దిగా మట్టి వేసి ఆవు మూత్రం చల్లితే కంపోస్టు ఎరువు వాటంతట అదే తయారవుతుంది. రోజూ కొంత సమయం కేటాయించగలిగితే కుటుంబానికి అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు డాబా పైనే పండించుకోవచ్చు.

డా. పోతురాజు ప్రదీప్ కుమార్, డా. మీగడ లక్ష్మి కమల, డా. యల్లపు రామ్ మోహన్
డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. Ph: 9160477365

Read More

ఔషధ మొక్క… చెంగల్వకోష్టం

ఐలాంతస్ ఒక ఆకులు రాల్చే వేగంగా పెరిగే చెట్టు. పెద్ద చెట్లు 80 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇది నున్నని కాండం, పాలిపోయిన బూడిద రంగుబెెరడు కలిగి ఉంటుంది. కాడలు లేత చెస్ట్‌నట్ గోధుమ రంగులో వుంటాయి. పెద్ద కాంపౌండ్ ఆకులు 1-4 అడుగుల పొడవుండి, ఒక దాని తర్వాత ఒకటి ఏర్పడుతుంది. ప్రతి పెద్ద ఆకు 10-41 చిన్న అకులు కలిగి వుంటుంది. ప్రతి చిన్న ఆకు అడుగు అంచున ఎక్కువ గ్రంథులు గల పళ్ళను కలిగి ఉంటుంది. ఆకుల అంచులు పూర్తిగా పళ్ళు లేకుండా ఉంటాయి. ఐలాంతస్‌లో మగ, ఆడ పూలు వేర్వేరు చెట్లలో ఏర్పడతాయి. పూలు పెద్ద గుత్తులలో ఏర్పడతాయి. పూలు చిన్నవిగా, పాలిపోయిన పసుపు నుండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బల్లపరుపు, మెలి తిరిగిన రెక్కలున్న కాయలు ఆడ చెట్లపై ఏర్పడతాయి ప్రతి కాయ ఒకే గింజను కలిగి ఉంటుంది. ఇవి చెట్లపై చాలా కాలముంటాయి. కొయ్య మొత్తగా, బలహీనంగా, క్రీంతో కూడిన తెలుపు నుండి లేత గోధుమ రంగులో ఉంటుంది. చెట్టు అన్ని భాగాలు ప్రత్యేకంగా ఆకులు, పూలు కాల్చిన గింజ వాసన కలిగి ఉంటాయి.

సాధారణ నామం : ఐలాంతస్ / గ్రీఆఫ్ హోవెన్ శాస్త్రీయ నామం : ఐలాంతస్ ఆల్టిస్సిమ కుటుంబం: సీమరూబేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • కాండం, వేరు ఎండిన బెరడుని ఔషధంగా ఉపయోగిస్తారు. ఐలాంతస్ చెట్టుని డయేరియా, ఆస్త్మా, మూర్ఛ రోగం, పోట్లు, వేగంగా గుండె కొట్టుకోవడం, గనోరియా, మలేరియా, టేప్ వర్మ్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని టానిక్‌గా కూడా ఉపయోగిస్తారు.
  • చైనాలో ఈచెట్టు బెరడుని డిసెంట్రి, ఇతర కడుపులో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ హెర్బల్ ద్రావణాన్ని త్రాగటం వలన 82 డిసెంట్రిరోగులలో 81 మందిలో డిసెంట్రి నివారించబడింది.
  • వేరు బెరడు టింక్ౘ్రుని కార్డియక్ పాల్పిటేషన్స్, ఆస్త్మా, మూర్ఛరోగం నివారణలో విజయవంతంగా ఉపయోగిస్తారు. ఆకులు, కాండం బెరడు, వేర్లను అల్సర్లు, దురదల చికిత్సలకు ఉపయోగిస్తారు. కొరియాలో వేరు బెరడుని దగ్గు, గ్యాస్ట్రిక్, ప్రేవులలో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు.కాయలను డిసెంట్రి చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఐలాంతస్ నుండి తయారు చేసిన ద్రావణాలు అకారిసైడల్ చర్యలను కలిగి వుండి టెట్రానికస్ టెలోరియస్‌ని సమర్థవంతంగా చంపాయి (కోవ్‌టనెంకో, అతని అనుచరులు)
  • ఐలాంతస్ వేరు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ బఠాణి పంటనాశించే పేనుబంక, అనిర్టోనిఫాస్ పైసంని అత్యధికంగా చంపింది (డిఫియో, అతని అనుచరులు, 2009)
  • ఐలాంతస్ ఆకు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ హెర్బిసైడల్ చర్యను ప్రదర్శించి ఆల్ఫాల్సా (మెడికాగోసటైన) విత్తనాలను మొలకెత్తకుండా చేసింది. భవిష్యత్తులో ఐలాంతోస్‌ని ఒక సహజ ఉత్పత్తి కలుపుమందుగా ఉపయోగించవచ్చు. (బార్బారాస్లాడోంజ, అతని అనుచరులు, 2014).
  • ఐలాంతస్ ద్రావణం నుండి వేరు చేసిన క్వాసినాయిడ్స్ (అలియాంతోన్, చపార్రినోన్, గ్లాకారూబినోన్, 13 (18) డిహైడ్రోగ్లాకారూబినోస్, షినుజాలాక్టోన్ హెచ్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్‌పై తీవ్ర విషప్రభావం, ఆహారాన్ని తీసుకోవడాన్ని అరికట్టడం ద్వారా అధిక సమర్ధవంతంగా చంపాయి. ఐలాంతస్ ఆకుల మిథనాల్ ద్రావణాలను సీతాకోకచిలుక జాతుల లార్వాలను నివారించే వృక్షసంబంధ పురుగుమందులను వృద్ధి చేయడానికి ఉపయోగించవచ్చని ఫలితాలు వెల్లడించాయి (పవేల, అతని అనుచరులు, 2014).
  • ఐలాంతస్ క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్‌పై లార్విసైడల్ ప్రభావాన్ని చూపింది. (పవేల, 2009, జేబ్రి అండ్ బాలియోఅమర్, 2014). ఐలాంతస్ బెరడు నూనె ట్రైబోలియం కాస్టానియం, ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజే, లైపోసెలిస్ పీట పెద్ద పురుగులను గణనీయంగా వికర్షించింది.
  • ఐలాంతస్ బెరడు నూనె సైటోఫిలస్ ఒరైజెపై బలమైన స్పర్శ, విషపూరిత చర్యను కూడా ప్రదర్శించింది. అంతేగాక, ఐలాంతస్ బెరడునూనె ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజెలపై ఫ్యూమిగెంట్ చర్యను కూడా ప్రదర్శించింది (లు అండ్ ఉ, 2009).
  • ఐలాంతస్ ముదిరిన చెట్లు ఒకటి లేదా ఎక్కువ విత్తనాలు మొలకెత్తడం, మొక్కలు పెరగడాన్ని అరికట్టే శక్తివంతమైన కాంపౌండ్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. అరికట్టే చర్య వేర్ల బెరడులో ఎక్కువగాను, ఆకులలో మధ్యమంగాను, కొయ్యలో తక్కువగాను ఉంటుంది. వేరు బెరడులోని అరికట్టే పదార్థాలు మొక్కలు మొలవక ముందు, మొలచిన తర్వాత పిచికారి చేసినపుడు బలమైన హెర్బిసైడల్ ప్రభావాలను చూపాయి. మొక్కలు మొలిచిన తర్వాత పిచికారి చేస్తే ప్రభావాలు గణనీయంగా ఉంటాయి. ఐలాంతస్‌లోని అల్లెలో కెమికల్స్ శక్తివంతమైన సహజ ఉత్పత్తి కలుపు మందులను అభివృద్ధి చేయగల సామర్థ్యమున్నవని ఫలితాలు వెల్లడించాయి (హెల్సె, 1990)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

పశుపోషణలో మునగ ప్రాముఖ్యత

మన దేశంలో ప్రాచీనకాలం నుండి ప్రకృతిలో సహజంగా లభించే అనేక రకాలయిన చెట్లకు, వాటి ఆకులు, కాయలు, వేర్లు మరియు ఇతర భాగాలకు వైద్యపరంగా చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కొన్ని రకాల మొక్కలకు ప్రత్యేక ఔషధ గుణాలు ఉండట, మరికొన్ని రకాల మొక్కల్లో మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉండటం వలన వీటి వినియోగం ఇటు మానవ మనుగడలోనే గాక, అటు పశువైద్యంలో కూడా గణనీయంగా పెరిగింది. నేటి కాలంలో పూల మొక్కల నుండి అటవీ వృక్షాల వరకు, వాటిలో ఉండే ఔషధ విలువలు మరియు ఆరోగ్యానికి అవి చేసే మేలు, వాటి ఇతర భాగాల్లో ఇమిడి ఉండే పోషక పదార్థాల గురించి అన్ని కోణాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషక విలువలు ఉన్న మొక్క ‘మునగ’. ‘పోషకాల గని’గా పేరొందిన మునగ అటు మానవ మనుగడలోనేగాక, పశుపోషణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, విత్తనాలు మరియు ఇతర భాగాల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు మరియు విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.

మునగ సాగు – వివరాలు:
మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జులై మొదటి వారం నుండి అక్టోబర్, చివరి వారం వరకు మునగను విత్తుకోవచ్చు. పి.కే.యం-1, పి.కే.యం.2 వంటి రకాలను పెంచుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. కావున పశువుల మేతకు ఈ రకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మునగ ఏపుగా పెరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువగా పెరగకపోవచ్చు. కావున దిగుబడి అధికంగా ఉన్నప్పుడు మునగ ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని ఎండాకాలంలో ఇతర ప్రశుగ్రాసాలతో కలిపి ఇవ్వవచ్చు.
ప్రత్యేకంగా పశుగ్రాసం కోసం మాత్రమే మునగను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మునగ విత్తనాలను సాళ్ళల్లో 3-5 సెం.మీ. లోతులో నాటుకోవాలి. రెండు సాళ్ల మధ్య దూరం 30 సెం.మీ. మరియు రెండు మొక్కల మధ్య దూరం 20 సెం.మీ. ఉండేవిధంగా చూసుకోవాలి. ఈ విధానంలో ఎకరాకు 25-35 కిలోల విత్తనం సరిపోతుంది. నాటిన రెండు వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలు ఎక్కువగా లేనప్పుడు మునగ కొమ్మలను కత్తిరించి కూడా నాటుకోవచ్చు. నాటిన తరువాత 3 నెలలకు మొదటి కోతను తీసుకోవచ్చు.

పోషక విలువలు:
పచ్చి మునగ ఆకుల్లో 16% మాంసకృత్తులు, 18% పీచుపదార్థాలు ఉంటాయి. ఎండిన ఆకులు లేదా పొడిలో 28% వరకు మాంసకృత్తులు, 15% పీచు పదార్థాలు, 3.65% కాల్షియం, 0.3% ఫాస్ఫరస్, 0.5% మెగ్నీషియం, 1.5% పొటాషియం, 8.25% కాపర్ ఉంటాయి. అంతేగాక జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి మునగ ఆకుల్లో కొద్ది మొత్తంలో ‘సపోనిన’ అనే పదార్థాలు ఉండటం వల్ల కొద్దిగా చేదుగా ఉంటాయి. పచ్చి మునగ ఆకులను పాడి పశువులకు ప్రతీరోజు 5-10 కిలోల వరకు, దూడలకు 1-2 కిలోల వరకు ఇవ్వవచ్చు. ఎండిన మునగ ఆకులను లేదా మునగ పొడిని పాడి పశువులకు రోజుకు 200 గ్రాముల వరకు మరియు దూడలకు 50 గ్రాముల వరకు ఇవ్వవచ్చు.

ప్రయోజనాలు:

  • పశులు జీర్ణవ్యవస్థలో మీథేన్ అనే గ్యాస్ వెలువడుతుంది. పశువుల కడుపులో ఉండే మిథనోజెనిర్ బ్యాక్టీరియా ఈ గ్యాస్‌ని విడుదల చేస్తాయి. ఈ మీథేన్ గ్యాస్ పరిమాణం అనేది పశువులు తీసుకునే ఆహారాన్ని బట్టి విడుదలవుతుంది. పశువుల మేతలో మునగ ఆకును లేదా పొడిని ఇచ్చినట్లయితే ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల వాతావరణంలో కొంతమేర మీథేన్ గ్యాస్ విడుదల తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.
  • పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడమే కాకుండా, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది.
  • పశువులు, దూడల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పాడిపశువులు ఈనిని తరువాత మళ్ళీ త్వరగా ఎదకు రావడం మరియు చూడికట్టడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • కాల్షియం అధికంగా ఉండటం వలన ఎదిగే దూడల్లో ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.
  • అనేక పోషకాలు ఉండటం వల్ల పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉంటాయి.

డా.డి. వెంకటేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశుగణ సముదాయం, పశువైద్య కళాశాల, కోరుట్ల, ఫోన్: 9951534076

Read More