ఏజెన్సీ ప్రాంత మండలాల్లోని గిరిజన రైతులకు ఖరీఫ్లో 90% రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ, ఇతర జిల్లాల్లోని రైతులకు 40% రాయితీపై వీటిని అందించనుంది. ఒక్కో రైతుకు సాగు విస్తీర్ణానికి అనుగుణంగా గరిష్ఠంగా మూడు బస్తాలు (బస్తా 30 కిలోలు) రాయితీపై అందిస్తారు. కే6, టీసీజీఎస్ 1694, టీఏజీ 24 రకాలు క్వింటాలుకు రూ.9,300, నారాయణి రకం క్వింటాలుకు రూ. 9,500, కదిరి లేపాక్షి రకం క్వింటాలుకు రూ.8,200 చొప్పున ధరలు నిర్ణయించారు. డి-కృషి యాప్ ద్వారా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అరెకరా వరకు ఒకటి, ఎకరా విస్తీర్ణానికి రెండు, అంతకు పైన మూడు బస్తాలు చొప్పున అందజేస్తారు.

26 May, 2025
