పశుగణన కార్యక్రమాన్ని మార్చి 31 లోగా పూర్తి చేయాలని కేంద్ర పశు సంవర్ధక, మత్స్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఫిబ్రవరి 28 నాటికి ఈ ప్రక్రియను ముగించాలని గతంలో ఆదేశాలు ఇవ్వగా, తాజాగా మరో నెల పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే పశుగణన పూర్తి కావొచ్చింది. మార్చి నుంచి సేకరించిన లెక్కలు, సమాచారాన్ని ధ్రువీకరించుకొని అవసరమైన దిద్దుబాట్లు చేయనున్నారు.