విదేశాలకు ఎగుమతికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
రూ.35 కోట్లతో యంత్రాల కొనుగోలుకు ఉద్యానశాఖ ప్రతిపాదనలు
రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను శుద్ధి చేసి తెలంగాణ బ్రాండ్ పేరిట రైతుల ద్వారానే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఉద్యానశాఖ రూ.35 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. తెలంగాణ మామిడికి విదేశాల్లో ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో ఏటా ఆరు వేల టన్నుల మామిడి కాయలు కాస్తుండగా.. అందులో వేయి టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి మామిడి పండ్లను ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేసి ముంబయి, బెంగళూరులకు తీసుకెళ్లి శుద్ధి చేసి, విదేశాలకు పంపి లాభాలను ఆర్జిస్తున్నాయి. ఎగుమతులకు అవసరమైన శుద్ధి సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించడంతో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ల పేరిట యంత్ర పరికరాల కొనుగోలుకు ఉద్యాన అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ఏర్పాటు
మామిడిపై ఉండే పురుగులను తొలగించేందుకు వీలుగా రేడియేషన్ ప్రక్రియ(ఎరాడికేషన్)ను నిర్వహించేందుకు రూ.24 కోట్లతో అటామిక్ రీసెర్చ్ ఎనర్జీ యంత్రం, మామిడిని మెరిసేలా చేసేందుకు రూ.5 కోట్లతో వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్, మామిడిని మగ్గబెట్టేందుకు రూ.3 కోట్లతో హాట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రూ.4 కోట్లతో కోల్డ్ రూమ్స్ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్కు రూ. 2 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ల కింద బాటసింగారం పండ్ల మార్కెట్తో పాటు పలుచోట్ల మౌలిక వసతుల కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కోహెడలో అంతర్జాతీయ మార్కెట్

