ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ఉద్యాన హబ్‌ ప్రణాళిక రూపొందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి పాల్గొని దేశంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం. మధ్య తరగతి పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు పప్పులు, కూరగాయలు, పండ్లు అవసరం. సీఎం ఈ అవసరాన్ని గుర్తించి రాయలసీమలోని 9 జిల్లాల్లో కూరగాయలు, పండ్లు పండించి ఎగుమతి చేస్తామంటున్నారు. ఎక్కడ మార్కెట్‌ ఉంటే అక్కడికి రవాణా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తేనే రైతులకు తక్షణ ప్రయోజనాలు అందుతాయి. రాయలసీమ హబ్‌కు అవసరమైన ఇన్ఫ్రా ఏర్పాటుకు బ్యాంకులు సాయం చేయాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్యాకేజి యూనిట్లు, రవాణా వ్యవస్థ, కోల్డ్‌ స్టోరేజి యూనిట్ల ఏర్పాటుకు, ఉత్తమ విత్తనాల సరఫరాకు బ్యాంకులు తోడ్పాటు అందించాలి. ఈ హబ్‌ ప్రభావం కేవలం సీమ జిల్లాలకే పరిమితం కాదు. రాష్ట్రం యావత్తూ ఉంటుంది. తమిళనాడు నుంచి కొబ్బరి, మహారాష్ట్ర నుంచి అరటి ముంబయి, దిల్లీ వంటి నగరాలకు రవాణా చేసేందుకు కేంద్రం వారానికి 2, 3 సార్లు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అలా రాయలసీమ నుంచీ పంపాలి’ అని నిర్మలా సీతారామన్‌ సూచించారు.