ఆంధ్రప్రదేశ్లో రబీలో 3.25 లక్షల హెక్టార్లలో శనగ సాగైందని.. సుమారు 3.77 లక్షల టన్నుల ఉత్పత్తి రావచ్చని, ఈరోజు నుంచి మద్దతు ధరకు శనగలు కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ‘2025-26 రబీ పంటకు సంబంధించి ధరల మద్దతు పథకం కింద 94,500 టన్నుల శనగ కొనుగోలుకు కేంద్రం నుంచి మంగళవారం ఆదేశాలు అందాయి. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో సీఎం యాప్ పేర్లు నమోదు చేసుకుని పంట విక్రయించుకోవచ్చు కొనుగోలు చేసిన శనగలకు 15 రోజుల్లో నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి వివరించారు.పూర్తి సమాచారం కోసం

18 Feb, 2026
