ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న బి.ఎస్సి అగ్రికల్చర్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్స్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 18వ తేదీన కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జిఈసిహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు. విశ్వవిద్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు. వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీ మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలు అందిస్తున్న ఈ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్‌ రాజేంద్రనగర్‌లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, ఆడిటోరియంలో 18వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు.