గతేడాది పడిపోయిన మిర్చి ధరలు ప్రస్తుతం నాణ్యతను బట్టి ఒక్కో రకం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు పెరిగింది. కర్ణాటకలోని బ్యాడిగ అంతర్జాతీయ మార్కెట్‌లో డబ్బి బ్యాడిగ రకం మిర్చి క్వింటాలు గరిష్ఠంగా రూ.71,199 అమ్ముడుపోయింది. బ్యాడిగ కడ్డీ రకం రూ. 54 వేలు పలికింది. బ్యాడిగ రకాల్లో నాణ్యతను బట్టి సగటున రూ. రూ.55 వేల నుంచి రూ.65 వేలకు వరకు ధర పలుకుతుండటంతో రైతులు లాభాలు చూస్తున్నారు. విత్తన రకాలైన తేజ, 5531, 2043, 273 ధరలు గతేడాది క్వింటాలు రూ.11 వేల లోపు ఉండగా ఈసారి రూ.16 వేల నుంచి రూ.22 వేల వరకు పలుకుతున్నాయి. జూన్‌లో పంట సాగు చేసిన రైతులకు ఈ నెల తొలి వారంలో మొదటి కోత చేతికొచ్చింది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో రైతులు తీసుకొచ్చిన పంటను వ్యాపారులు వెంటనే కొనుగోలు చేస్తున్నారు.