నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎనఆరఎస్సీ), ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మధ్య పిడుగుపాటు మరణాల్ని తగ్గించే దిశగా ఒప్పందం కుదిరింది. ఇందులోభాగంగా రాష్ట్రంలో పిడుగులు ఎక్కువగా పడే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాన్ని అంచనా వేయడంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఆచరణీయమైన నివారణ వ్యూహాలను రూపొందిస్తారు. పిడుగుపాటు సంబంధిత ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించడంలో, కమ్యూనిటీల సంసిద్ధతను మెరుగుపరచడం, ప్రతిస్పందన యంత్రాంగాలను బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖరైజైన్ వివరించారు. కార్యక్రమంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ఈడీ కె. కౌసర్‌బానో, శాస్త్రవేత్త వెంకటరమణ, అలోక్ తౌరి, సత్యనారాయణ, వెంకటేశ్, విపత్తుల సంస్థ అధికారులు పాల్గొన్నారు.