మొక్కజొన్న, జొన్న పంటలను పిఎసఎస్ స్కీంలో చేర్చాలని, 2026-27 ఆర్థిక సంవత్సరానికి పిఎంఆర్‌కేవివై-పిడియంసి మరియు యంఐడిహెచ్ పథకాల కింద ఉద్యానశాఖకు నిధుల కేటాయింపులు పెంచాలని, ఈ రబీ సీజన్‌కు సంబంధించిన పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 మెట్రిక్ టన్నుల నుండి 15,262 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఐసిఏఆర్ఐ-ఐయంఆర్ రాజేంద్రనగర్‌లో ఆయనను కలిసి పామాయిల్‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచేలా సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని కూడా కేంద్ర మంత్రిని తుమ్మల కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమగ్ర సమీక్ష నిర్వహించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.