దారిద్య్ర రేఖకు (బీపీఎల్‌) దిగువనున్న సన్నకారు, పాడి రైతులకు రబీ కరవు సమయంలో 50 శాతం రాయితీపై పశుగ్రాసాన్ని సరఫరా చేసేందుకు రూ. 25.16 కోట్ల మంజూరుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలనాపరమైన అనుమతినిచ్చింది. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన నిబంధనలను అనుసరించి ఈ పంపిణీ చేయాలని సూచించారు.