ఎర్ర కందిపప్పుపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి సుంకం లేకుండా బఠానీలు (ఎల్లో పీస్‌) దిగుమతి చేసుకోవడానికి ఇచ్చిన వెసులుబాటును మే 31 వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.