తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ఒక ఎకరం వరకు, సాగులో ఉన్న భూములకు రైతుభరోసా నిధులు 17.03 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ అయ్యాయని, రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉన్నదని మంత్రి తుమ్మల అన్నారు. ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం1126.54 కోట్లు రైతుభరోసా నిధులు జమ అయ్యాయని తెలిపారు. ఇప్పటికే రైతుబంధుకు 7625 కోట్లు, రుణమాఫీకి 20,616.89 కోట్లు, రైతు భీమాకు 3000 కోట్లు, పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదన్నారు. ఎన్నడూలేని విధంగా రూ. 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్ధతుధరకు సేకరించారని, ప్రత్తిపంటను పూర్తిగా సేకరించడానికి గడువుకోరారు మంత్రి తుమ్మల. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులను మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్దనుండి మద్ధతు ధరకు ప్రభుత్వం కోనుగోలు చేసిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు పెరిగాయని, వరిపంటను మద్ధతు ధరకు ప్రభుత్వం కోనుగోలు చేస్తుందన్నారు యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, 10,547 కోట్లు, ఖరీఫ్లో 52.51 లక్షల మెట్రిక్ టన్నులు, 12,178.97 కోట్లు, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చి కొన్నదన్నారు. అందుకు 1154 కోట్లు ఖర్చు అయిందని, ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగింపు ఉందని, పసుపు, మిరప పంటలకు మద్ధతు ధర నిర్ణయించడానికి కేంద్రప్రభుత్వానికి విజప్తి చేశామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్భంది చర్యలు ప్రభుత్వం తీసుకున్నది అని, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఎరువుల కేటాయింపుల కోసం విజ్ఞప్తి చేశారు. మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతే అని మంత్రి తుమ్మల అన్నారు.

6 Feb, 2025
