ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కేవీఎన్రెడ్డి, రాంరెడ్డి గోపాల్రెడ్డి, భవానీ, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మీన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

21 Jan, 2025
