• మరో 905.89 కోట్లు విడుదల – మంత్రి తుమ్మల

9 రోజుల్లో వానాకాలం రైతుభరోసా సహాయానికి పూర్తి నిధులు విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా 5 వ రోజు 7 ఎకరాల వరకు రైతుభరోసా నిధులను విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ రోజు మరో 905.89 కోట్లు రైతుభరోసా కోసం విడుదల చేసామని, దీని ద్వారా 2.64 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి పేర్కొన్నారు. కేవలం 5 రోజుల లోనే 7310.59 కోట్లు విడుదల చేసామని, ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని అన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు కూడా రైతుభరోసా సహాయాన్ని అందచేస్తామని ఈ సందర్భముగా మంత్రి తెలిపారు.