తెలంగాణా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు వివరాలను తేడాలు లేకుండా పక్కాగా అందజేయాలని చీఫ్‌ ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ సూచించింది. జిల్లా కలెక్టర్లు, సీఈలు ఇస్తున్న డేటాకు మధ్య పొంతన ఉండటం లేదని, పలు అనుమతులకు కేంద్రానికి ఆయకట్టు వివరాలు సమర్పించే సమయంలో ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయకట్టు అభివృద్ధి, సాగునీటి విభాగం సీఈ రఘునాథరావు శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు పలు సూచనలు చేశారు.