తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఆదర్శ రైతు వ్యవస్థను తెస్తున్నామని, వ్యవసాయాధికారులు ప్రతి గ్రామానికి ఒక ఆదర్శరైతును త్వరలో ఎంపిక చేయనున్నారని రైతుసంక్షేమ కమీషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి చెప్పారు. వారికి వేతనాలు ఉండవని, గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు వారి ద్వారా అమలు జరుగుతాయన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో సభ్యులతో కలిసి మాట్లాడారు. ”ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తిలో జరిగిన మోసాలు తెలిసిన వెంటనే కమిషన్‌ విచారణ జరిపి 671 మంది గిరిజన రైతులకు నష్టపరిహారం కింద రూ.4 కోట్లు పంపిణీ చేయించింది. తెలంగాణలో ఏ రైతుకు కష్టం వచ్చినా రైతు కమిషన్‌ అందుబాటులో ఉంటుంది” అని కోదండ రెడ్డి చెప్పారు.