ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి చేపట్టబోయే వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ దరఖాస్తు గడువు ఈ నెల 18 వరకు పొడిగింపు — రిజిస్ట్రార్ డాక్టర్. జి .ఈ .సిహెచ్. విద్యాసాగర్.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టబోయే వ్యవసాయ, వెటర్నరీ మరియు ఉద్యాన వర్సిటీల డిగ్రీ కోర్సులలో 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి ఈ సి హెచ్ విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున, ఆయా కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు వివరాల కొరకు వర్సిటీ వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించాలని సూచించారు.




