తెలంగాణా నుంచి పెరగనున్న బియ్యం ఎగుమతులు పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర

బియ్యం ఎగుమతులను తెలంగాణ నుంచి విదేశాలకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన భారత్‌ ఇంటర్నేషనల్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పౌరసరఫరాల శాఖలు తెలంగాణ బియ్యం స్టాల్‌ను ఏర్పాటు చేశాయి. దీనిని రవీంద్ర ప్రారంభించారు. ఎంటీయూ 1010, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, బీపీటీ 5204, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 118, జై శ్రీరాం, హెచ్‌ఎంటీ సోనా, చిట్టిముత్యాలు వంటి ప్రీమియం రకాల బియ్యాన్ని ఈ స్టాల్‌లో ప్రదర్శించారు. ఇప్పటికే ఫిలిప్పీన్సుకు ఎగుమతి చేస్తున్నామని, త్వరలోనే ఆఫ్రికా తదితర దేశాలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని రవీంద్ర చెప్పారు. కువైట్‌ తదితర దేశాల ప్రతినిధులు, ఇండియన్‌ రైస్‌ ఎక్స్పోర్టర్స్‌ ఫెడరేషన్‌ అధ్యకక్షుడు ప్రేమ్‌ గార్గ్‌ స్టాల్‌ను సందర్శించారు.

Read More

ధాన్యం సేకరణపై పౌరసరఫరాల సంస్థ కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లాలవారీగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రాల సంఖ్యనూ ఖరారు చేసింది. 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ లక్ష్యంలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ మినహా మిగతా 32 జిల్లాల్లో 39.08 లక్షల టన్నుల సన్నాలు, 35.91 లక్షల టన్నుల దొడ్డు రకాలు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
సన్నాలు, దొడ్డు రకాలు కలిపి- ఖమ్మం జిల్లాలో 2,78,892 టన్నులు కొనాలని అంచనా. 326 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్లలో 2,44,522 టన్నులు, 244 కేంద్రాలు, నారాయణపేట 2,35,917 -117, మహబూబ్‌గర్‌ 2,26,418 – 190, భువనగిరి 2,26,410- 325, కొత్తగూడెం 2,23,272-193, మహబూబాబాద్‌ 2,18,373 – 237 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో పశుసంపద పెంచాలని ప్రభుత్వానికి విజయ డెయిరీ ప్రతిపాదనలు

తెలంగాణలో రాష్ట్రంలో రోజుకు కేవలం 4 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తవుతున్నాయి, 26 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇక్కడ పశుసంపద వృద్ధి చెందకపోవడమే. గేదెలు, ఆవుల సంఖ్య తగ్గడంతో.. పాడి, దాని అనుబంధ ఉత్పత్తులపై ప్రభావం పడింది. పాడి రైతులు పోసే పాలు రోజువారీ 50 వేల లీటర్ల మేరకు తగ్గాయి. సమస్య తీవ్రత, ప్రజావసరాల దృష్ట్యా పాడి రంగాన్ని ఆదుకునేందుకు పాడిపశువుల సంఖ్య పెంపుదల, ఇతర చర్యలు చేపట్టాలని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019తో పోలిస్తే తాజాగా జరిగిన పశుగణనలో పాలిచ్చే గేదెలు, ఆవులు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గింది.

పశువుల సంఖ్య తగ్గింది: 2019లో ఆవులు 42,32,383 ఉండగా.. తాజాగా వాటి సంఖ్య 30,69,524 (27.48%)కి తగ్గింది. గేదెల సంఖ్య 42,26,603 నుంచి 3052102 (27.78%) కి తగ్గింది. మేకలు 49,34,673 నుంచి 45,48,999 (7.82%) కి తగ్గాయి.
సూర్యాపేట జిల్లాలో ఆవులు 62.65%, సంగారెడ్డి 50.74%, మెదక్‌ 45.26%, మహబూబాబాద్‌లో 43.64% తగ్గాయి. గేదెలు సంగారెడ్డి జిల్లాలో 46.14%, కామారెడ్డి 45.92%, మెదక్‌ 45,32%, మహబూబాబాద్‌ లో 43.23% తగ్గాయి. మేకలు హైదరాబాద్‌లో 40.87%, రంగారెడ్డి జిల్లాలో 25.83 % క్షీణించాయి.

పాడిపరిశ్రమకు ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్రంలోని గ్రామీణ రైతు కుటుంబాల్లో 0.87% మాత్రమే పాడిపశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నాయని జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశువుల పంపిణీ పథకాన్ని చేపట్టి, లబ్దిదారులకు వాటిని పంపిణీ చేయాలని విజయ డెయిరీ ప్రభుత్వాన్ని కోరింది.
Read More

మార్కెట్‌ యార్డుల్లో వినియోగం కంటే అధిక సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్లాంట్లు

తెలంగాణా రాష్ట్రంలోని మార్కెట్‌ యార్డుల్లో సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సౌరవిద్యుత్‌ సంస్థ ద్వారా దీనిని అమలు చేయనుంది. తొలిథలో పైలట్‌ ప్రాజెక్టుగా వరంగల్‌, నిజామాబాద్‌, గద్వాల, సూర్యాపేట మార్కెట్‌ యార్డులను ఎంపిక చేసింది. శుక్రవారం వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థ అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సంస్థ అధికారులు ఈ వారంలోనే ఆయా యార్డులను సందర్శించి ముందుగా ప్లాంటు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తిస్తారు. ఆయా యార్డుల్లో విద్యుత్‌ వినియోగాన్ని గుర్తించి దానికంటే అధిక సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. యార్డు అవసరాలు పోనూ మిగిలిన విద్యుత్‌ను విద్యుత్‌ పంపిణీ సంస్థలకు విక్రయించనున్నారు.

Read More

ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న నర్మెట్ట ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ

రూ.300 కోట్ల వ్యయంతో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్‌ పరిశ్రమను ఆగస్టు నెలాఖరుకు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం అశ్వారావుపేటలో మాత్రమే ఆయిల్‌పామ్‌ శుద్ధి పరిశ్రమ ఉంది. ఆ తర్వాత మరో 14 పరిశ్రమలు ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నర్మెట్టలో రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 62 ఎకరాల్లో చేపట్టిన పనులు తుది థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పరిశ్రమ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.

Read More

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఈ రోజు వికారాబాద్‌ జిల్లా కోత్రేపల్లి గ్రామంలో నిర్వహించిన మేగా ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ సాగు ప్రాధాన్యత, దీని ద్వారా లభించే ఆర్థిక లాభాలు, మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు.

Read More

81 గ్రామాలలో అన్ని ఇళ్లపై, వ్యవసాయ బోర్లకు సౌర ఫలకాలు

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో పూర్తిగా సౌర విద్యుత్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇళ్ల పైకప్పుపై, వ్యవసాయ బోర్లకు, ఇతర కరెంటు కనెక్షన్లన్నింటికీ సౌరవిద్యుత్‌ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.1,273 కోట్లతో సౌర ఫలకాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తూ రెడ్కో ప్రకటన జారీచేసింది. ఇందులో రూ.400 కోట్లను రాయితీగా కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. మిగిలిన రూ. 873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ నెల 24లోగా టెండర్లను దాఖలు చేయాలని సూచించింది. ఈ గ్రామాల్లో 16,840 బోర్లు ఉన్నాయి. ఒక్కో బోరుకు 7.5 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యం గల ఫలకాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సౌర విద్యుత్‌ ఏర్పాటు అనంతరం అక్కడ వచ్చే కరెంటును బోరుకు వాడుకోగా మిగిలింది సాధారణ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. అలా సరఫరా చేసినందుకు బోరు యజమానికి యూనిట్‌కు రూ.3.13 చొప్పున డిస్కంలు చెల్లిస్తాయి. దీనివల్ల వారికి పంటల సాగుతోనే కాకుండా అదనంగా ఆదాయం కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ధరల్లో 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో ఫలకాలను ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.4.50 లక్షల వరకూ వ్యయమవుతుందని అంచనా. ఇందులో 30 శాతం కేంద్రం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సొమ్మునంతా రైతుల తరఫున ఈ 81 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సౌర కంపెనీలకు చెల్లించనుంది.

Read More
  • 1
  • 2